అనువాదం

చివరి పాలస్తీనియన్ గురించి రాండా జర్రర్

బహిరంగ జియోనిస్టు మద్దతుదారుడు మయిమ్ బియాలిక్ ఫిబ్రవరి 2024లో నిర్వహించిన ‘పెన్ అవుట్ లౌడ్’1 సమావేశం నుంచి బయటకు ఈడ్చుకెళ్తుంటే, “ఒక పాలస్తీనీయుడితో పెన్‌లో ఇలా వ్యవహరిస్తున్నారు?” అని రండా జర్రర్ నినదించింది. గాజాపైన ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం గురించి మయిమ్ చాలా మొరటు హాస్యం చేసాడు. నిరసనగా, జర్రర్ తదితరులు అప్పటివరకు గాజాలో ఇజ్రాయెల్ చంపిన 13 మంది పాలస్తీనా రచయితల పేర్లను చదివారు. 2023 అక్టోబరు 7 నుండి ఇప్పటివరకు (సెప్టెంబర్ 2025) గాజాలో 270 మందికి పైగా జర్నలిస్టులు, మీడియా ఉద్యోగులను ఇజ్రాయెల్ చంపింది.  భావప్రకటనా స్వేచ్ఛ, సాహిత్యం, కళల కోసం పనిచేసే లాభాపేక్ష
అనువాదం

జైలులంటే ఆశ నిరాశల కూడలి:  ఒక ప్రొఫెసర్, ఒక గాయని

భీమా-కోరేగావ్ కేసులో నిందితులైన ఇంగ్లీష్ ప్రొఫెసర్ షోమా సేన్ (బెయిలు మీద విడుదల ఆయారు), గాయని, కార్యకర్త జ్యోతి జగతప్‌లు  జైలులో సమస్యల గురించి చర్చించారు.  జైళ్ళలో ఉండే రద్దీ, సరైన ఆరోగ్య సంరక్షణ లేకపోవడం, పేద జీవన పరిస్థితులు, విద్య అందుబాటులో లేకపోవడం, వ్యవస్థాగత అసమానతలు, భారతదేశంలోని జైలు వ్యవస్థలో అట్టడుగున ఉన్న మహిళలు, ఎల్‌జిబిటి+క్యూ వ్యక్తులు ఎదుర్కొంటున్న సవాళ్లను గురించి వివరించారు. వారిద్దరూ స్త్రీల మధ్య సహోదరీత్వం, తట్టుకోగల సమర్థతల  ప్రాముఖ్యత గురించి మాట్లాడారు; మార్పు వస్తుందనే ఆశను వ్యక్తం చేసారు.  భారతదేశంలోని ఐదు రాష్ట్రాలలోని జైళ్లలో నా క్షేత్ర అధ్యయనంలో భాగంగా, జైలులోకి ఎందుకు
అనువాదం

ముట్టడిలో హస్‌దేవ్ – కార్పొరేట్ల  బొగ్గు తవ్వకంపై నిరసనలు  

పర్యావరణపరంగా, సాంస్కృతికపరంగా ముఖ్య ప్రాంఅనువాదం తమైన హస్‌దేవ్ అరండి అటవీ ప్రాంతం బొగ్గు తవ్వకం వల్ల ప్రమాదంలో పడింది. అటవీ భూములను గనుల తవ్వకాలకోసం మళ్ళించాలన్న సిఫారసుతో నిరసనలు ఉధృతమయ్యాయి. ఆదివాసీ సముదాయాలకు చట్టపరమైన రక్షణలను దాటవేసి, పర్యావరణ కట్టుబాట్ల కంటే కార్పొరేట్ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు అటవీ శాఖపై ఆరోపణలు చేసారు. ఛత్తీస్‌గఢ్‌లోని హస్‌దేవ్ అరండ అటవీ ప్రాంతాన్ని తరచుగా "మధ్య భారతదేశపు ఊపిరితిత్తులు" గా గౌరవిస్తారు; జీవవైవిధ్య , సాంస్కృతిక పరంగా ముఖ్యమైన ప్రాంతం; ఇప్పుడు ముట్టడిలో ఉంది. 2025 జులై 7నాడు ఛత్తీస్‌గఢ్ అటవీ విభాగం 1,742.6 హెక్టార్ల దట్టమైన అటవీ భూమిని కెంటే
అనువాదం

బస్తర్ యుద్ధంలో అస్పష్ట  విభజన రేఖ

2024లో ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టుల బలమైన కోట అయిన బస్తర్‌లో 287 మంది మావోయిస్టులను లేదా అంతకుముందు సంవత్సరం కంటే 10 రెట్లు ఎక్కువ మందిని తాము చంపినట్లు భద్రతా బలగాలు తెలిపాయి. ఫిబ్రవరి 9నాడు హత్య చేసిన 31 మందితో సహా 2025 ఫిబ్రవరి 10 వరకు కనీసం 80 మంది మావోయిస్టులను కాల్చి చంపారు. మధ్య భారతదేశంలోని అడవులు, గ్రామాలలో యుద్ధం ఉధృతంగా జరుగుతోంది; దౌర్జన్యాలు, చట్టాతీత హత్యల ఆరోపణలు, ఆత్మీయుల మరణాలకు కావలసింది పరిహారం కాదనీ న్యాయం అనీ డిమాండ్ చేస్తున్న; తమ స్వంత గ్రామాలలోనే జరిగే హింస, మరణాలకు భయపడుతున్న ఆదివాసీలను వెతకడానికి మేం
అనువాదం

ఇస్లామోఫోబియా ఎందుకు?

2024 జూలై లో, ఇంగ్లండ్‌లోని అనేక నగరాల్లో అల్లర్లు, దాడులు జరిగాయి. దీనికి ప్రధాన కారణం తప్పుడు వార్తలు, ప్రజల్లో ఉన్న వలస వ్యతిరేక భావాలు. అల్లర్ల బాధితుల్లో ఎక్కువ మంది ముస్లింలు. మసీదులు, వలసదారులు నివసించే ప్రదేశాలపై దాడులు జరిగాయి. ఈ ఘటనల తర్వాత, భవిష్యత్తులో ఇటువంటి హింసను నిరోధించే లక్ష్యంతో ఇంగ్లాండులోని 'ఆల్-పార్టీ పార్లమెంటరీ గ్రూప్' ఒక నివేదికను విడుదల చేసింది. "ముస్లింలు కత్తి చూపించి ఇస్లాంను వ్యాప్తి చేశారు" అని చెప్పడాన్ని నిషేధించాలని నివేదిక పేర్కొంది. ఈ విశ్వాసం ఇస్లామోఫోబియాకు మూలమైన విషయాలలో ఒకటి. అనేక ఇతర అపోహలు, దురభిప్రాయాలు ప్రజల మనస్సులలో లోతుగా