కవిత్వం

నా నగర మేదీ

** నా నగరం కోసం వెతుకుతున్నా.. ఎక్కడుందది ఎక్కడుండేదది జ్ఞాపకాలు మసక బారుతున్నాయ్ మస్తిస్కం మొద్దుబారి పోతున్నది అది గోద్రా మురికివాడల్లో ఉండే ది నర్మదా లోయలో తచ్చాడుతుండేది కాదు కాదు . అది హాశింపుర కాలువలో శవమై తేలి లోకాన్ని దిగ్భ్రాంతికి లోను చేసింది నెల్లి మారణకాండలో మౌనంగా దుఃఖించింది కాదు ,కాదు.. అది బస్తర్ మారణకాండలో కల్లోల కాలానికి సాక్షిగా నిలిచింది జీలం నది ఒడ్డున గాయాలతో సొమ్మసిల్లింది. అది కూచిబెదార్లో ఉండేది నంది గ్రామ్ లో ఉండేది జఫ్రాభాగ్, చాంద్బాగ్ ఎన్నని చెప్పను మర్చిపోతున్నా అలసిపోతున్నా నన్ను నేను నిలబెట్టుకోవడానికి నాతో నేను నిరంతరం
కవిత్వం

అనిశ్చయం

రాత్రి నేను ప్రార్ధించేసమయంలో తోడెళ్ళు యోనిని గాయపరుస్తాయి లాఠీ చేయకూడని తప్పు చేస్తుంది వైద్యం కరెన్సీ పడక మీద నిద్దురపోతుంది ఆకలి బాధ గడ్డకట్టుకపోయి నిశ్చలమవుతుంది అప్పులనీడ ఊరితాడై కుటుంబాన్ని జనాభా లెక్కల నుంచి వేరుచేస్తుంది పేద , మధ్యతరగతి మనుషులు సగం రాత్రి చచ్చి మిగతా సగం పగలు చావడానికి దేహాల్ని దాచుకుంటారు భద్రత లేని లోకంలో పండుముఖాలు నిరాశ శూన్యాలై లోలోన గొణుక్కుంటూ ఉంటాయి ఎక్కడో పసినిద్ర ఉలిక్కిపడుతుంది భ్రమల్లో బతుకుతోన్న ఆశలు కోడినిద్దురతో కుస్తీ పడుతుంటాయి.
కవిత్వం

ఉదయ్ కిరణ్ కవితలు

1ఓ యుద్ధ ప్రకటన చుట్టూ గోడలపై వున్న అక్షరాలన్నీ ఏకమై మరో కొత్త యుద్ధాన్ని ప్రకటించినట్లు మూలకున్న ముసలవ్వలా ఆ పాత గొంగడి ఎర్రగుడ్డ నా భుజాన్ని తట్టి ముందుకు నడిపినట్లు నాలోని కటిక చీకటికి ఎడిసన్ బల్బులు ప్రపంచాన్ని వెలిగించమని సైగ చేసినట్లు కాలువలై పారుతున్న నా కన్నీళ్ళను తుడవడానికి ఆ పాత పుస్తకాలే కదా! మరో కొత్త మార్గాన్ని చూపించే సన్నిహితులు. మరి ఇంకెందుకు ఆలస్యం? దేశమంతా మతపిచ్చితో మారణహోమంలో మునిగిపోతుంటే మరెంత కాలం.... ఆ నాలుగు గోడల మధ్య స్వప్నపు కాంతులంటూ కలలు కంటావ్? లే.......! ఆ చీకటి ప్రపంచంలో నుండి బయటికి రా....
కవిత్వం

‘గోడలకు నోళ్లున్నాయి’

(కోవిడ్ కాలంలో రాజకీయ ఖైదీ హేమంత్ రాసిన కవిత. కోవిడ్ తగ్గిందేమో గాని ఈ కవితలోని రాజకీయ ప్రాసంగికత అలాగే ఉంది. - వసంత మేఘం టీం ) మా పిల్లల వ్యాక్సిన్లు విదేశాలకు ఎందుకు పంపావు మోడీజీ అని అడుగుతున్నాయి ఆ గోడలు ఏడ్వడానికి, నవ్వడానికి, పాలు తాగడానికి, ఆహారం తీసుకోవడానికి తప్ప అడగడానికి నోరులేని ఆ పిల్లల ఆక్రందనలు ఆ పోస్టర్లు మా ప్రాణౌషధాలు సముద్రాలు ఎట్లా దాటాయని అడుగుతున్నాయి ఫ్రేజర్లు, బిల్‌గేట్స్‌, యురోపియన్‌ యూనియనూ, జర్మనీ పేటెంట్‌ హక్కుల కోసం దేశాన్ని తాకట్టుపెట్టుమని సైనిక స్థావరాలు స్వాధీనం చేయమని కొన్ని దేశాలను అడుగుతున్నాయిగదా మరి
కవిత్వం

బగీచాలో పాట

ఆ పక్షి కావేరీ పుట్టిన దేశంలో రెక్కలొచ్చి జెంషడ్‌పూర్‌ జెసూట్‌ చర్చినావరించిన ఆడవిలోకెగిరిపోయింది జీసస్‌ను సిలువ వేసిన దారుల్లో దేశ దేశాల్లోనూ తిరిగింది సేవా త్యాగం నేర్చుకున్నది చైతన్యంగా మార్చుకున్నది పాడిరది.. జీవకారుణ్యం రాజ్య ధిక్కారం దాకా పోరాటమేనన్నది గాయాలకు నిట్టూర్పు మందు కాదు నిష్కృతి మందుకు అన్వేషించింది విముక్తి తత్వాన్ని గానం చేస్తూ కావేరీ ప్రవహించే దేశానికొచ్చింది పాటేనా ఎంచుకోవాల్సిన బాటకూడ ఉండాలని బాల్యంలో మనసులో ప్రవేశించిన సెలయేళ్లు ప్రవహించే దేశానికొచ్చింది హో అంటే హో అని వాళ్ల భాషలో సంభాషించింది వాళ్ల బాధల్ని పోరాటాల్ని ప్రతిఫలించింది చెట్లు నదులు అడవులు నేల విధ్వంసమయ్యే విశ్వ విపత్తు
కవిత్వం

మార్పుకై సాగిపో…

అవును రాజ్యం ఇప్పుడు బానిసత్వాన్ని కోరుకుంటుంది వర్ణ వ్యవస్థను పునరుద్ధరణ చేస్తుంది మనుధర్మ శాస్త్రాన్ని మళ్లీ వెలికి తీస్తుంది మానవత్వాన్ని చంపుతూ మనిషిని హత్య చేస్తుంది అది కాశ్మీర్ ఫైల్స్ చూడమంటుంది కానీ గుజరాత్ ఫైల్స్ అంటే గజగజా వణుకుతూ కళ్ళెర్ర చేసి చూస్తుంది అది ఒక మతాన్ని ఒక దేవుడిని కలుపుకుపోతుంది ఈ దేశపు ముఖచిత్రంపై అది కాషాయపు జెండాను కప్పుతుంది ఒక నినాదంతో మనిషిలోని మూఢనమ్మకాన్ని బలపరుస్తుంది అది సగటు మనిషి నిత్యవసరాలను పెంచుతుంది రైతుల ఆత్మహత్యలకు కారణం అవుతుంది దళితులు అంటే అది శూద్రులుగా చూస్తుంది వాళ్ళను హత్యలు చేయడానికి కంకణం కట్టుకుంటుంది ప్రశ్నించే
కవిత్వం

రాలిన నక్షత్రాల సాక్షిగా
జనసముద్ర హోరు…

అకాశంలో ఐదు నక్షత్రాలు ఒకదాని తర్వాత ఒకటిగా నేల రాలిన వార్త! నన్ను శోక సముద్రాన ముంచెత్తింది! గుండె పగిలేలా ఏడ్వాలని... కానీ కంటనీరు ఎప్పుడో ఇంకిపోయింది గుండె రాయిలా మారింది! స్పందన లేనట్టు నిశబ్దం నన్ను ఆవరించింది! ఏమీ తోచక అకాశంవైపు చూశాను మేమున్నామంటూ చంద్రుడు మసకచీకటిలో తొంగిచూస్తున్నాడు! పక్కనే ధృవతార మిణుకు మిణుకుమంటుంది! అడవి మళ్లీ అంటుకున్నది అ దావానలం కోటి దీపాల వెలుగై చీకటి దారిని చీలుస్తున్నది! నరేంద్రుడు జనప్రభంజనంలో రవితేజంలా వెలుగుతున్నాడు! నిశబ్ద నిశీధి నుండి బయటపడి సముద్రంవైపు చూశాను! సముద్రంలో అల్లకల్లోలం తుఫాను గాలులు విరుచుకుపడే ఉప్పెన చెట్లు పడిపోతున్నాయి! ఇళ్లు
కవిత్వం

ఒకే పాదంతో నడుద్దాం రండి

నా ప్రశ్నల బాణం నీ మనోభావాన్ని గాయపరిస్తే నీ జవాబు ఈటెను నా మెదట్లో దించిపారేయ్ ఆలోచన అరుగు మీద ఇద్దరం పొట్లాడుకుందాం చర్చల బీళ్ళను సంఘర్షణల నాగళ్ళతో దున్నిపారేద్దాం కొత్తగా మొలకెత్తిన దారులగుండా ఒకే పాదంతో నడుద్దాం రండి మెట్ల కుల కట్టడాల్లో పై మెట్టు మినహా కింది మెట్లన్నీ మనవే మనువు నిన్నూ నన్నూ వైరి గుర్రాలను చేసి తన రథానికి కట్టుకొని రథయాత్ర చేస్తున్నాడు మిత్రమా రాయి రాయి రాజుకొని రగిలి వెలిగినప్పటినుండే కదా చరిత్ర ప్రారంభమైంది రండి మన మెదళ్ళను జ్ఞానం ఆకురాయి మీద సానపెడుదాం నువ్వు, చీకటి గర్భగుడిలో ఆలోచనలని శిలావిగ్రహాన్ని
కవిత్వం

వడ్డెబోయిన శ్రీనివాస్ కవితలు మూడు

1. మృతకాలం-అమృతకాలం అమృతకాలం వచ్చిందహో ఆవుకు ! ఆలోచించినా ఆశాభంగం కౌగిలించుకో కౌగిలించుకో ఆహా. మనిషికంటావా మృతకాలమే. ఆకలితో ఉపాధి లేమితో బాదలతో కన్నీళ్ళతో కరోనా కార్మికచావువో కారోనా ఆకలిచావువో పోపో చప్పట్లు కొట్టుకుంటో దీపాలు వెలిగించుకుంటో అమృతకాలం వచ్చింది ఆవును కొగిలించుకో పోసిటివ్ ఎనిర్జీ వస్తుంది ఆహా మనిషికంటావా మృతకాలమే. పరిశీలకునివో పరిశోధకునివో శాస్త్రీయ సామాజిక వ్యాఖ్యతవో డబోల్కరో గౌరీ లంకేశో చంపబడితేనేం కాల్చబడితేనేం పొండి పొండి సత్యం ఉచ్చరిస్తూనే అమృతకాలం వచ్చింది ఆవును కౌగిలించుకో పాజిటివ్ ఎనర్జి వస్తుంది. ఆహా మనిషి కంటావా మృతకాలమే అపవిత్రమనో దళితనో ఎదురొచ్చాడనో ఎదురునిల్చాడనో పండు కోశాడనో నీల్లుతాగాడనో మీసాలు
కవిత్వం

విప్లవమే ఊపిరిగా

నాన్నా !నీ కమ్మని ,తియ్యని గొంతుప్రేమకు ప్రతి రూపమైన నీ మోముఆదివాసీ త ల్లుల నాన్నల పసిపాపలఅపార ప్రేమ వాత్స్యల్యంనిత్యం నన్ను నిమురుతాయి దోపిడీ అన్యాయం ఫై మాట్లాడకుంటేతిన్న బువ్వ స హించదనినేవు చెప్పిన మాటలునా మనసులో మెదులుతాయి ! కడుపు కట్టుకొని కష్టపడి సాదివిద్యా బుద్ధులు నేర్పిసమాజం జీవనం సంస్కృతినివర్గ దృష్టితో చూసేందు కు ప్రేరణనీ నీతి మాటలే ! కుళ్ళిన భూస్వామ్య సామ్రాజ్యవాద సంస్కృ తిసమాజాన్ని విష తుల్యం చే స్తూవ్యక్తి స్వార్థం, కేరిరిజం తోమానవ విలువలు ధ్వంసమైకుటుంబాలు చితిల మవుతున్న వేళ.. నాన్నావ్యక్తీ స్వార్థాన్ని ,అమ్మానాన్నలని విడిచినిస్వార్థంగా ప్రజలకోసందోపిడ సమాజాన్ని సమూలంగానిర్మూలించే సేద్యంలోదోపిడి పీడన