కవిత్వం

నా నగర మేదీ

** నా నగరం కోసం వెతుకుతున్నా.. ఎక్కడుందది ఎక్కడుండేదది జ్ఞాపకాలు మసక బారుతున్నాయ్ మస్తిస్కం మొద్దుబారి పోతున్నది అది గోద్రా మురికివాడల్లో ఉండే ది నర్మదా లోయలో తచ్చాడుతుండేది కాదు కాదు . అది హాశింపుర కాలువలో శవమై తేలి లోకాన్ని దిగ్భ్రాంతికి లోను చేసింది నెల్లి మారణకాండలో మౌనంగా దుఃఖించింది కాదు ,కాదు.. అది బస్తర్ మారణకాండలో కల్లోల కాలానికి సాక్షిగా నిలిచింది జీలం నది ఒడ్డున గాయాలతో సొమ్మసిల్లింది. అది కూచిబెదార్లో ఉండేది నంది గ్రామ్ లో ఉండేది జఫ్రాభాగ్, చాంద్బాగ్ ఎన్నని చెప్పను మర్చిపోతున్నా అలసిపోతున్నా నన్ను నేను నిలబెట్టుకోవడానికి నాతో నేను నిరంతరం
కవిత్వం

అనిశ్చయం

రాత్రి నేను ప్రార్ధించేసమయంలో తోడెళ్ళు యోనిని గాయపరుస్తాయి లాఠీ చేయకూడని తప్పు చేస్తుంది వైద్యం కరెన్సీ పడక మీద నిద్దురపోతుంది ఆకలి బాధ గడ్డకట్టుకపోయి నిశ్చలమవుతుంది అప్పులనీడ ఊరితాడై కుటుంబాన్ని జనాభా లెక్కల నుంచి వేరుచేస్తుంది పేద , మధ్యతరగతి మనుషులు సగం రాత్రి చచ్చి మిగతా సగం పగలు చావడానికి దేహాల్ని దాచుకుంటారు భద్రత లేని లోకంలో పండుముఖాలు నిరాశ శూన్యాలై లోలోన గొణుక్కుంటూ ఉంటాయి ఎక్కడో పసినిద్ర ఉలిక్కిపడుతుంది భ్రమల్లో బతుకుతోన్న ఆశలు కోడినిద్దురతో కుస్తీ పడుతుంటాయి.
కవిత్వం

ఉదయ్ కిరణ్ కవితలు

1ఓ యుద్ధ ప్రకటన చుట్టూ గోడలపై వున్న అక్షరాలన్నీ ఏకమై మరో కొత్త యుద్ధాన్ని ప్రకటించినట్లు మూలకున్న ముసలవ్వలా ఆ పాత గొంగడి ఎర్రగుడ్డ నా భుజాన్ని తట్టి ముందుకు నడిపినట్లు నాలోని కటిక చీకటికి ఎడిసన్ బల్బులు ప్రపంచాన్ని వెలిగించమని సైగ చేసినట్లు కాలువలై పారుతున్న నా కన్నీళ్ళను తుడవడానికి ఆ పాత పుస్తకాలే కదా! మరో కొత్త మార్గాన్ని చూపించే సన్నిహితులు. మరి ఇంకెందుకు ఆలస్యం? దేశమంతా మతపిచ్చితో మారణహోమంలో మునిగిపోతుంటే మరెంత కాలం.... ఆ నాలుగు గోడల మధ్య స్వప్నపు కాంతులంటూ కలలు కంటావ్? లే.......! ఆ చీకటి ప్రపంచంలో నుండి బయటికి రా....
కవిత్వం

నెలబాలుడు

అడవి ఇప్పుడు గాయపడింది వెదురు వనాలు నరికి వేయబడ్డాయి మహా వృక్షాలు కూకటి వేళ్ళతో పెళ్ళగించబడ్డాయిపులులు జింకలు అభయారణ్యాలకుతరలింపబడ్డాయినెమళ్ళు గోరపిట్టలు వలలలో చిక్కుబడ్డాయికాకులు దూరని కారడవి దారులన్నీ బుల్డోజర్లు చేరాయి భూమి గర్భంలోకి గునపాలు దిగి పుడమి పొత్తిళ్ళుచీల్చబడుతున్నాయివీరులంతా నేలపై ఒరుగుతూనెత్తుటి బాట వేస్తున్నారుచివరిగా వారి ఆశయాన్ని అందుకొనితూరుపున నెలబాలుడుఉదయిస్తున్నాడు!!
కవిత్వం

భంగపడ్డ ఏకాంతం

సాయం సంధ్య వేళ ఒంటరిగా ఇంటి పైకప్పు మీద కూర్చుని వినీలాకాశం చేసి ఆశగా చూస్తాను చల్లని పిల్లగాలి నా ముఖాన్ని ముద్దాడుతుంది ఒక్కోసారి మృదువుగా, ఒక్కోసారి కవిత్వంగా ..ఒక్కసారిగా ఈ ప్రపంచమంతా నాదేనని ఈ నా ఆకాశం నా చేతుల్ని మృదువుగా, దృఢంగా పట్టుకుని నీలి మేఘాల మీద నడిపిస్తున్నట్టనిపిస్తుంది కానీ ..ఒక్క ఐదు నిమిషాలు కలల రెక్కల మీద ఎగురుతానో లేదో నే పాడిన ఫైరుజ్ పాట "కెనడాలో ఒక చిన్న ఇల్లు" లోని వినూత్న ,సుందర జీవితం ఆస్వాదించే లోపల ఓ భయానక విస్పోటనం...పాట బద్దలైరక్తమోడుతదివినీలాకాశం బూడిద రంగుతో మసకబారుతది ఎటువంటి హెచ్చరిక లేకుండానే
కవిత్వం

విప్లవం అజేయం

అవును...వాళ్ళిప్పుడు రాజ్యం చేతిలోదెబ్బమీద దెబ్బ తింటున్నారు.. వాళ్ళ సహచరులెందరో అమరులవుతున్నారు...నిజమే..సామ్రాజ్యవాదుల, దళారీ కార్పొరేట్ల ఆజ్ఞల్ని శిరసావహించిన కాషాయ అష్టదిగ్బంధనంలో వాళ్ళ 'పొత్తిళ్ళలోని ప్రజాసైన్యం'చుట్టుముట్టివేయబడుతున్నది.నిజమే..జనతన సర్కార్....వాళ్ళ నాలుగు దశాబ్దాల శ్రమ ఫలితం.. అదొక ఒక ప్రత్యామ్నాయ ప్రజా స్వయం పరిపాలనా యంత్రాంగం...అదొక భవిష్యత్ సోవియెట్ నమూనా.. దాన్నిప్పుడుహస్తినాపుర రాక్షస కబంధహస్తాలు చిదిమివేస్తున్నాయి...నిజమే.. అయినప్పటికీ ...వాళ్ళ ఈ ఓటమి తాత్కాలికం...గెరిల్లా స్థావరప్రాంతాలు గెరిల్లా ప్రాంతాలుగా, గెరిల్లా ప్రాంతాలు గెరిల్లా స్థావరప్రాంతాలుగాచేతులు మారడం ప్రపంచ విప్లవ చరిత్రలో అపూర్వం కాదు. అంచేత...ప్రపంచవ్యాప్త విప్లవ పరిస్థితి అంతకంతకూ తీవ్రమవుతున్న నేపధ్యంలోవాళ్ళు త్వరలోనే దెబ్బకాచుకొని లేచినిలబడతారు. జబ్బచరిచి లేచినిలబడతారు.తప్పదు...వాళ్ళు తాము తలపడుతున్న భారత రాజ్యంఅత్యంత శక్తివంతమైన
కవిత్వం

ముందుకే నడువు బిడ్డా

పచ్చ పచ్చనిఅడవుల్లో పారేటి జలపాతాల్లో ఎనక ముందు శత్రువులుంటరు చేతులు పట్టుకో నా బిడ్డా ఆకలి నేర్పిన దారులలో సాయుధ పోరు బాటలలో నవ్వుతూ ముందుకు నడిచే దారిలోచేతిని వదలను నా కొడుకావీరుల గన్న తల్లులతో పోరుల కలిసే అక్కలతో మోదుగు తీగల అల్లుకుపోయిదండిగ నడువు నా బిడ్డా గాయం తగిలిన చెల్లెలితో గేయం పాడినా తమ్ముడితో త్యాగం నేర్పిన అన్నల బాటలఅడుగులు ముందుకే నా కొడుకాకమ్మిన కారుమబ్బుల్లో కురిసే చినుకుల జల్లులలో ఎముకలుకొరికే గాలుల్లో ఎదురుగానడువు నా బిడ్డా బాంబులవర్షపు దారులలో భారు ఫిరంగుల మోతలలోఅదురు బెదురు అటకనబెట్టి ముందుకె నడవు నా కొడుకామనసుకు భారంఅవుతున్నదేహం అలిసిపోతున్న
కవిత్వం

నెత్తుటి అధ్యాయం

వాళ్లు తమ ఊపిరి వున్నంతవరకు పోరాడుతూ మరణిస్తూనే వున్నారు నువ్వింకా ఎంతమందిని చంపినా చివరాఖరికి నువ్వు విసిగి పోవాలి కానీ వారు పుడుతూనే వుంటారు నువ్వు వాళ్ళతో మాటాడే ధైర్యం లేని పిరికి పందవు కనుక వాళ్ళు ప్రజల కోసం యుద్ధ రచన చేసే మేధావులు నువ్వు ప్రజలను దోపిడీ చేసే చదువు రాని మొద్దువు అందుకే నువ్వు ప్రతిసారి మాటల సందర్భాన్ని తప్పించుకుంటున్నావు ప్రజల ముందునీ ముసుగు తొలగిపోతుందని నీ బండారం బయట పడుతుందని నీకు భయం అందుకే వాళ్ళని చంపుతున్నావు కానీ ఇది వెయ్యేళ్లకు పైగా సాగుతున్న యుద్ధం చరిత్రను మార్చి రాసే నీకు చరిత్రను
కవిత్వం

‘గోడలకు నోళ్లున్నాయి’

(కోవిడ్ కాలంలో రాజకీయ ఖైదీ హేమంత్ రాసిన కవిత. కోవిడ్ తగ్గిందేమో గాని ఈ కవితలోని రాజకీయ ప్రాసంగికత అలాగే ఉంది. - వసంత మేఘం టీం ) మా పిల్లల వ్యాక్సిన్లు విదేశాలకు ఎందుకు పంపావు మోడీజీ అని అడుగుతున్నాయి ఆ గోడలు ఏడ్వడానికి, నవ్వడానికి, పాలు తాగడానికి, ఆహారం తీసుకోవడానికి తప్ప అడగడానికి నోరులేని ఆ పిల్లల ఆక్రందనలు ఆ పోస్టర్లు మా ప్రాణౌషధాలు సముద్రాలు ఎట్లా దాటాయని అడుగుతున్నాయి ఫ్రేజర్లు, బిల్‌గేట్స్‌, యురోపియన్‌ యూనియనూ, జర్మనీ పేటెంట్‌ హక్కుల కోసం దేశాన్ని తాకట్టుపెట్టుమని సైనిక స్థావరాలు స్వాధీనం చేయమని కొన్ని దేశాలను అడుగుతున్నాయిగదా మరి
కవిత్వం

అడుగడుగునా భయమే!

నువ్వేమో బూడిద అస్థికలు గంగలో కలుపుతావు మంత్రోచ్చారణల మధ్య లేని మోక్షాన్ని కాంక్షిస్తావు మా వాడిని కడచూపు ని కూడా చూడనివ్వవు మా వాడు బతికున్నన్నాళ్ళు దడిసావు చంపేసాక కూడా ఎక్కడ దింపుడు కల్లం లో లేసి వస్తాడేమోనని వణికావు మా వాడికి బూడిద ఎముకలు కర్మకాండలు అన్నీ భ్రాంతి అని తెలుసు ఏదో పిచ్చి తల్లి వృద్ధాప్యంలో కొడుకును చూడాలనుకుంది అదీ తీరకుండానే చేసింది తాను నమ్ముకున్న మతాన్ని అడ్డుపెట్టుకుని ఏలుతున్న ఏలిక అహంతో చేసిన నిర్బంధాల మధ్య ఐదు వందల మంది చేసిన భోజనాల్లో మా వాడిని సిక్కోలు యాది చేసుకుంది ఆ నివురు గప్పిన