శాంతి చర్చల పూర్వాపరాలు
(రంగులు మారుతున్న నక్సలిజం – సదస్సుకు స్పందన) నక్సల్బరీ కాలం నుంచీ కమ్యూనిస్టులు కానివారు, అశేష ప్రజాదరణ ఉన్నవారు విప్లవకారులను పీడిత ప్రజలలో పని చేస్తున్నట్లు గుర్తించి సంభాషణ జరుపుతున్నారు . అప్పటి నుంచీ దానికి గుండెలు బాదుకుంటున్నవారు కూడా ఉన్నారు. వీళ్లు భావజాల రీత్యా బ్రాహ్మణీయ, మార్కెట్ శక్తుల ప్రతినిధులు. శంకరన్, పొత్తూరి విప్లవకారులతో సంభాషణ జరిపి, ప్రభుత్వంతో చర్చల దాకా తీసుకువచ్చి చర్చల వైఫల్యానికి, తర్వాత హింసా విధ్వంసాలకు ప్రభుత్వమే కారణమనడం ఇప్పటికీ వీళ్లకు మింగుడు పడడం లేదు. పుబ్బలో పుట్టి మఖలో మాయమయే ఇటువంటి సంస్థలు కూడా ఉన్నాయి. హరగోపాల్ పోరాట రూపాలు ప్రజలు