తొలికెరటాలు

నల్లద్రాక్ష పందిరి – సంఘటనాత్మక కవిత్వం

సంఘటనాత్మక కవిత్వం అంటే సమకాలీనంలో జరిగిన విషయాలపై కవిత్వం రాయటం అనే కురచ అర్థంలోకి మార్చారేమో అనిపిస్తుంది. ఒక జీవితకాల వస్తువుని తీసుకొని దాన్ని సంఘటనలతో పెనుకుంటూ పోవటం సంఘటనాత్మక కవిత్వం అని అనిపిస్తుంది. కవి తనకు ఎదురైన అనుభవాల్ని, చూసిన మనుషుల జీవితాలని ఒక వరుస ప్రకారం చెప్పుకుంటూ పోతాడు. దీనిని జీవితచరిత్రాకథనం అనవచ్చునేమో... ఇలా చెప్పుకుంటూ పోయే కవిత్వాన్ని చూసినప్పుడు ఇందులో ఉపమలు తప్పా ఏమున్నాయి, కవిత్వం కాదు అనే వాళ్ళు, అనుకునే వాళ్ళు, లేకపోతే భ్రమించే వాళ్ళు ఉండవచ్చు. ఇటువంటి కవిత్వం రాయటానికి కవి ఎంచుకునే ప్రధాన మార్గం తనవైన అనుభవాలను. అందుకే కవి
తొలికెరటాలు

పురా జ్ఞాపకంలా మంగలిపల్లె

కథలు జీవన విధానాల, అనుభవాల, ఎన్నెన్నో సంఘటనల నిదర్శనాలు. కాలగర్భంలో   కలిసిపోయిన ఊరు, అక్కడి జీవన సారాంశాలను నరేష్కుమార్ సూఫీ  తనదైన పాత్రను పోషిస్తూ రాసిన కథలు 'మెమొరీస్ ఆఫ్ మంగలిపల్లె'గా రూపం దాల్చుకున్నాయి. రచయిత తన చిన్నతనాన్ని వెతుక్కుంటూ మళ్ళీ ఓ సారి వాళ్ల ఊరికి వెళ్ళి బాల్యాన్ని, బడిని... ముఖ్యంగా అక్కడి పరిస్థితులను ఇలా అన్నింటిని గుర్తుచేసుకుంటూ వివరిస్తున్న విధానం పాఠకులందరినీ కూడా వాళ్ళ చిన్నతనాన్ని నెమరువేసుకునేలా చేస్తాయి. కథల్లో ఓ ప్రతిస్పందన, వెతుకులాట ఉంటుంది. అది రచనా పరిణితిని బట్టి కథల  అనుభూతి ఉంటుంది. ఈ పుస్తకంలోని కథలు చాలా చోట్ల మనల్ని అక్కున
తొలికెరటాలు

 కాసింత ప్రేమ అవసరమైన కాలం

పుస్తకాల్లో ప్రేమ కన్నా జీవితాల్లో ప్రేమ అద్భుతంగా ఉంటుందా? అనే ప్రశ్న నన్ను అడిగితే, ఈ కవిత్వం   చదివిన వారు ఎవరైనా  ఇందులోని  ప్రేమ అద్భుతంగా ఉంది.. అని సమాధానం ఇస్తారు . ఈ పుస్తకంలోని  ప్రేమని, విరహాన్ని, వేదనను పుస్తకం చదివిన వారు ఎవరైనా ఫీల్ అవుతారు. ప్రేమ అనగానే లేదా ప్రేమ పేరు వినగానే మనకు తెలియకుండానే మన పెదవుల పై చిరునవ్వు, మన ముఖంలో ఒక  భావం చిగురిస్తుంది. అసలు ప్రేమ లేకుంటే అమ్మే బ్రతకడం కష్టం అని చెప్పే వాళ్ళు లేకపోలేదు. అసలు ప్రేమ లేకపోతే ఏ బంధము నిలువదు అనేది నా
తొలికెరటాలు

మన చుట్టూ పరచుకున్న ‘నీలి కళ్ల నేల’ 

“నీలి కళ్ల నేల” ఒక అద్భుతమైన కవితా సంపుటి. ఇందులోని కవితలు సహజత్వంతో, భావోద్వేగాలతో నిండిన మేలుకొలిపే సమాహారంగా కనిపిస్తాయి. ఈ పుస్తకంలోని ప్రేమ, సామాజికస్పృహ, అంటరానితనం మొదలైన అంశాలు ప్రత్యేకంగా నిలుస్తాయి. భావనల లోతు-హృదయాన్ని తాకే కవితలు: ఈ కవితా సంపుటి జీవితాల్ని ప్రతిబింబించేలా ఉంటాయి. ఇందులోని కవితలు దేశంలో జరిగిన, జరుగుతున్న అనేకానేక సమస్యల సమాహారం. కవిత్వం అనేది కేవలం పదబంధం కాదు, అది మనసులోని భావాలను, ఆలోచనలను నిబిడీకృతంగా వ్యక్తపరిచే సాధనం. ఈ సంపుటిలోని కవితలు ఆ లక్షణాన్ని పూర్తిగా నెరవేర్చాయి. ప్రేమను అత్యంత సున్నితంగా వర్ణించిన కవితలు ఇందులో చోటు చేసుకున్నాయి. ‘‘ప్రియా..మనం