వ్యాసాలు

ఇరవై ఐదేళ్ల విప్లవాచరణ

( నవంబర్ 24 న కృష్ణా జిల్లా కోడూరు మండలం నారేవారి పాలెంలో జరిగిన కామ్రేడ్  గౌతమ్ సంస్మరణ సభలో  ఆవిష్కరించిన *సమాజ శిల్పి* పుస్తకానికి రాసిన ముందు మాట) కామ్రేడ్ గౌతమ్ ను 2006 నవంబర్ 23న పోలీసులు దొంగ ఎదురు కాల్పుల్లో హత్యచేశారు. 24న తెల్లారికల్లా పత్రికల్లో ఈ విషాద వార్త వచ్చింది. మేము కొద్దిమందిమి రాత్రికి బయల్దేరాలి అనుకున్నాము. అప్పటికే గౌతం కుటుంబ సభ్యులు విజయవాడలో పౌరహక్కుల సంఘం నాయకులను కలిశారు. మృత దేహాన్ని స్వాధీనం చేసుకోడానికి గౌతమ్ కుటుంబ సభ్యులతోపాటు మీరెవరైనా వెళతారా? అని లాయర్ ఆంజనేయులుగారు అడిగారు. మేము రావడానికి లేటు
వ్యాసాలు

ప్రసంగించాడని అరెస్ట్ చేశారు

2023 అక్టోబర్ 28 తెల్లవారుజామున 4 గంటలకు సర్వ ఆదివాసీ సమాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, బస్తర్ జన్ సంఘర్ష్ సమన్వయ్ సమితి కన్వీనర్ తిరుమల్ సర్జూ టేకమ్‌ను ఒక కార్యక్రమంలో ఉపన్యాసం యిచ్చినందుకు ఛత్తీస్‌గఢ్‌లోని మాన్‌పూర్ జిల్లాలోని అతని నివాసం నుండి భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 295A, 153A, 506B, 435, 34 కింద, అబద్ధపు ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేశారు. భారతదేశంలోని సహజ వనరులు అధికంగా ఉన్న బస్తర్‌లో జరుగుతున్న కార్పొరేటీకరణ, సైనికీకరణలకు వ్యతిరేకంగా సర్జూ టేకం తన స్వరాన్నెత్తారు. ఛత్తీస్‌గఢ్‌లో ఆ ప్రాంతంలోని భూమి, సహజ వనరులను దోచుకోవడానికి వీలు కల్పించడానికి అనేక మంది ఆదివాసీలను
వ్యాసాలు

జాతీయ విద్యా రాజకీయాలు

జాతీయ విద్యా విధానం-2020(జా.వి.వి.)ని భారత యూనియన్ ప్రభుత్వం కేవలం ఒక ప్రకటన ద్వారానే పార్లమెంటులో ప్రవేశపెట్టింది. పార్లమెంటులో ఎటువంటి చర్చ గాని, ఆమోదం గాని లేకుండానే ప్రవేశపెట్టబడిన ఈ జా.వి.వి. కవర్ పేజీ సరిగ్గా జా.వి. వి-1986 కవర్ పేజీ లాగే కనబడుతుంది. ఆ తర్వాత రాష్ట్రపతి, ఆర్థిక మంత్రుల ప్రసంగాలలో దీనిని అత్యంత గొప్పదిగా ప్రశంసించారు. ఇప్పటికే ఇందులోని అనేక అంశాలను అమలులోకి తీసుకొచ్చారు. ఇంకా ఇతర అంశాలను తన అధికారిక ప్రకటనలు, మెమొరాండాల ద్వారా యూనియన్ ప్రభుత్వం ముందుకు తెస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలను, అకడెమిక్ సంస్థలను  కూడా త్వరగా అమలు చేయమని ఒత్తిడి చేస్తోంది. నిజానికి
వ్యాసాలు

గులాం మహమ్మద్ భట్ కాళ్ళకి జిపిఎస్ బెల్ట్

యూఏపీఏ, తీవ్రవాద సెక్షన్ల కింద నిందితుడు, ఢిల్లీలోని ఎన్‌ఐఏ పాటియాలా కోర్టు దోషిగా నిర్ణయించిన గులాం ముహమ్మద్ భట్‌కు జమ్ము ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పుడు, అతని పాదాలకు జీపీఎస్ బెల్టును (గ్లోబల్ పోసిషనింగ్ సిస్టమ్- అతను ఎక్కడ వున్నాడో తెలియచేసే పరికరం) ధరించాలని ఆదేశం యిచ్చింది. అతని పాదాలకు ఆ బెల్ట్ వేశారు కూడా. ‘ది సండే ఎక్స్‌‌ప్రెస్’ తొమ్మిదవ పేజీలో ప్రచురించబడిన ఈ వార్త ఒక అధికారిని ఉటంకిస్తూ: "ప్రాసిక్యూషన్ చేసిన వాదన ఆధారంగా, ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు, నిందితుడి కాలుకి జీపీఎస్ ట్రాకర్లను అమర్చమని జమ్ము, జమ్ము- కశ్మీర్ పోలీసులను ఆదేశిస్తే
వ్యాసాలు

బొగ్గు గనుల జిల్లాలోప్రమాదకర స్థితిలోజనజీవనం

మధ్య భారతదేశంలో భూపరివేష్టిత రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో గనుల తవ్వకం మొదలుకాక ముందు, హస్దియో అరంద్ డజను ఆదివాసీ కుగ్రామాలు వున్న మారుమూల అడవి. 650 చదరపు మైళ్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ఈ అడవిని "మధ్య భారతదేశ ఊపిరితితిత్తి" అని పిలుస్తారు. ఏనుగులు, ఎలుగుబంట్లు, చిరుతపులులతో పాటు, అమూల్యమైన నీటి నిల్వలు వుండేవి. స్థానిక గ్రామస్తులలో చాలా మంది ఆదివాసీలు లేదా గోండు తెగకు చెందిన "ఆదిమ నివాసులు". వారు తమ పెరట్లో పంటలు పండిస్తారు, నేసిన గడ్డి బుట్టలను మార్కెట్‌లో అమ్ముకొంటారు. వారికి తమ భూమి చాలా పవిత్రమైనది. హస్డియో అరణ్య అడవులలో, కొత్త బొగ్గు
వ్యాసాలు

సిజిమాలి తిరుగుబాటు

వేదాంత మైనింగ్ ప్రాజెక్ట్; పోలీసుల బెదిరింపులను సవాలు చేసిన ఒడిశా గ్రామస్తులుఒడిశాలో, కార్పొరేట్ ప్రయోజనాలు, అక్రమ మైనింగ్, అన్యాయమైన నిర్బంధాల ద్వారా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే గ్రామస్థుల అద్భుతమైన దృఢ సంకల్పాల గాథ పురివిప్పుతోంది. సిజిమాలి కొండలకు సమీపంలో ఉన్న ఈ సముదాయాలు తమ జీవన విధానానికి ముప్పు కలిగించే మైనింగ్ ప్రాజెక్టుల ప్రతికూల పర్యావరణ ప్రభావాలకు భయపడి కార్పొరేట్ నియంత్రణకు వ్యతిరేకంగా నిలబడాలని ఎంచుకున్నాయి. పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంతో, ఈ కథనం ఒడిశాలోని గ్రామస్తులు తమ భూమి, జీవనోపాధి, హక్కులను కాపాడుకోవాలనే తపనలో కార్పొరేట్ ప్రభావాన్ని ధిక్కరిస్తున్నారు. వేదాంత మైనింగ్ ప్రాజెక్ట్: సిజ్మాలిలో నిల్వ చేయబడిన 311
వ్యాసాలు

నారాయణపూర్ ఉద్యమం: ఎన్నికలపై ప్రభావం

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌లో కొనసాగుతున్న ఉద్యమ ప్రభావం ఎన్నికలపై ఎంత ఉంటుంది? దసరా ముగిసిన వెంటనే ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. బస్తర్ డివిజన్‌లో ప్రచార వాహనాలు తిరుగుతున్నాయి. పార్టీ అభ్యర్థుల కోసం ఎన్నికల ప్రచారం జరుగుతోంది. నగర వెలుగులకి దూరంగా కొన్ని చోట్ల ఇవేమీ లేకపోయినా ఎన్నికల సందడి నెలకొంది. నారాయణపూర్ అసెంబ్లీలోనూ అదే జరుగుతోంది. చాలా కాలంగా ఇక్కడ ఉద్యమం జరుగుతోంది. ఆదివాసీలు తమ డిమాండ్లతో ఆందోళనలు చేస్తున్నారు. బస్తర్‌లోని అనేక ప్రాంతాలలో ఉద్యమాలు జరుగుతున్నప్పటికీ, నారాయణపూర్ జిల్లాలోని 5 ప్రదేశాలలో - తోయమెట, మధోనార్, ఇరాక్ భట్టి, దొండి బేడ, ఓర్చా నదిపరాలలో ఉద్యమం చాలా
వ్యాసాలు

హమాస్‌ దాడులను ఎలా చూడాలి..?

‘‘యుద్ధాన్ని వాయిదా వేయడమే మంచిది. వాకిలి నీదైనా నాదైనా, దీపాలు వెలుగుతూ వుండడమే మంచిది నెత్తురు నీదైనా పరాయిదైనా అది ఆదాము నెత్తురే కదా యుద్ధం తూర్పున జరిగినా పడమర జరిగినా అది ప్రపంచ శాంతి దారుణ హత్యే కదా. బాంబులు ఇళ్ళమీద పడినా సరిహద్దులో రాలినా.. గాయపడేది మానవాత్మే కదా మాడిమసైపోయే పోలాలు నీవైనా పరులవైనా ఆకలితో అలమటించే బాధ ఒకటే కదా.....’’ అంటూ 1965 ఇండో పాక్‌ యుద్ధం నేపథ్యంలో, హిందీ చిత్ర రంగంలో గొప్ప కవిగా వెలుగొందిన ‘సాహిర్‌ లూధియాన్వీ’ యుద్ధం గురించి అద్భుతమైన ఒక కవిత్వం రాశాడు. నిజమే కదా యుద్ధ భీభత్సం
వ్యాసాలు

మోహన్ జీ అజరామర జ్ఞాపకాలు

కామ్రేడ్‌ ఆనంద్‌ నాకు మొదటిసారి ఓ సమావేశంలో  పరిచయం. ఆ రోజుల్లో సత్యమూర్తి విప్లవోద్యమంలో   సృష్టించిన మొదటి సంక్షోభం  పరిష్కారానికి ఏర్పాటు చేసిన ప్లీనానికి హాజరయ్యాం. కరీంనగర్‌ నుండి నేను, మరికొందరు అదిలాబాద్‌ నుండి కామ్రేడ్‌ ఆనంద్‌తో పాటు మరికొందరు రాష్ట్ర వ్యాప్తంగా ఇతర జిల్లాల నుండి  మరికొందరు  హాజరయ్యారు. ఆ రోజు ఉత్తర తెలంగాణ విప్లవోద్యమంపై ఎన్‌.టి.ఆర్‌. ప్రభుత్వం తీసుకవచ్చిన తీవ్ర నిర్బంధం, వరుస ఎన్‌కౌంటర్లు కొనసాగుతున్నాయి. అలాంటి  సమయంలో   సంక్షోభం రావడం చాలా బాధాకరం. యావత్‌ విప్లవోద్యమానికి  ఇది మొదటి సంక్షోభం కావడంతో ఆ సమావేశంలో   ఒక విధమైన ఆందోళనకర వాతావరణం నెలకొన్నది. కొందరు ప్రతినిధులు 
వ్యాసాలు

రక్త సంబంధీకులకు..

ఈ నేలకు చెందిన నా తల్లులకు, తండ్రులకు, అక్కలకు, చెల్లెళ్ళకు, మీ కోసం నేనురాసే ఒక బహిరంగ లేఖ. మీకీ లేఖ రాయాలని చాలా ఏళ్ళ క్రితమే అనుకున్నాను. చాలా కాలం నుంచి రాయకుండా ఈ లేఖ అలా ఉండిపోయింది. మా సంస్థలో రొట్టెలు కాలుస్తున్నప్పుడు నా శరీరం కాలడంతో తొలిసారిగా నా కలాన్నిలా కదిలించాను. అమ్మా.. నీ అడుగుల్లో అడుగులు వేసి నడుస్తున్నప్పుడు నీకు రాయాలనుకున్నాను. ధనికులుగా, పేదలుగా, స్త్రీలుగా పురుషులుగా విభజించే విధానం పెరిగిపోతుండడం గురించి మా సంస్థలో తొలిసారిగా చర్చించాం. మన సమాజంలో వీటిని ఎలా అర్థం చేసుకోవాలో, ఆ చణలో వీటిని ఎలా