దండకారణ్య సమయం

ఏకకాలంలో శాంతి చర్చలు – సైనిక చర్యలు

దేశంలో దండకారణ్యం వంటి విశాలమైన ఆదివాసీ ఆవాస భూగోళంలో, జనతన రాజ్యం వంటి ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ దశాబ్దాలుగా పనిచేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో అక్షరాలా సాయుధ వర్గ యుద్ధంలో అప్రతిహతంగా పోరాడుతూ ఎన్‌కౌంటర్‌లు మొదలు కేంద్ర ప్రభుత్వ వాయు సైన్య ఆకాశ బాంబింగ్‌కు కూడ గురవుతున్న తరుణంలో ఛత్తీస్‌గఢ్‌, రaార్ఖండ్‌ రాష్ట్రాలు మొదలు దేశ వ్యాప్తంగా ఉన్న ఆదివాసీ సమాజాలు జల్‌, జంగల్‌, జమీన్‌, ఇజ్జత్‌ (ఆదివాసి స్త్రీలపై లైంగిక అత్యాచారాలకు ప్రతిఘటన మాత్రమే కాదు, ఇంకా విస్తృతార్థంలో అస్తిత్వ స్వీయ గౌరవ చైతన్యం)లను కాపాడుకోవడానికి నూతన పోరాట రూపాలు ఎంచుకుంటున్నారు. అటువంటి సాంస్కృతిక వ్యక్తీకరణ రూపాలను
సమీక్షలు

వేమన, వీరబ్రహ్మం దృక్పథం

వేమన, వీరబ్రహ్మాల్ని తెలుగు పాఠక లోకం ముందు మరోసారి చర్చకు పెట్టినందుకు ముందుగా ప్రజాశక్తి బుక్‌ హౌస్‌ వారిని అభినందించాలి. వీరిద్దరూ సామాజిక సంస్కర్తలు, తరువాతే కవులు.  ఈ పుస్తకం పేరు ‘‘తెలుగు సాహిత్యంలో వేమన వీరబ్రహ్మం - ఒక సంభాషణ’’. రచయిత జి.కల్యాణరావు.  మూడు వందల సంవత్సరాల క్రితం కవులు వేమన, వీరబ్రహ్మ  సంఘ సంస్కర్తలు. సాంస్కృతిక విప్లవం మార్పును కోరుతుంది. సంస్మరణ మార్పును కాక మరమ్మత్తులు కోరుతుంది. సంస్కరణ మార్పుకు వ్యతిరేకం కాదు. ముందుస్తు రూపం. పైగా ఈ కవులు కలం పట్టేనాటికి మార్పుకు సంబంధించిన రాజకీయ సిద్ధాంతం ఇంకా రూపొందలేదు కదా! ఈ నేపథ్యంలో
సమీక్షలు

భావుకత, అన్వేషణ కలగలసిన కవిత్వం

ఖమ్మం జిల్లా రచయిత్రి రూప రుక్మిణి కలం నుండి జాలు వారిన అక్షరాలు సమకాలీన జీవితాన్ని సుతిమెత్తగా స్పృశిస్తాయి. సమాజాన్ని హెచ్చరిస్తూ, ఇవ్వాల్టి జీవన పరిస్థితుల లోతులను భావుకతతో అన్వేషిస్తూ, వ్యక్తీకరిస్తూ సాగిన కవితల సమాహారమే ‘‘మిగుల్చుకున్న వాక్యాలు కొన్ని’’ సంపుటి. శూన్యం కవితలో.. ‘‘పచ్చి గుండెను తవ్వి చూడకు భరోసాగా భుజమెప్పుడు పానుపు కాలేదని తప్పొప్పుల లెక్కల్లో ఆమెకెప్పుడూ విశేషాలేమీలేని సశేషాలే మిగిలాయి’’ అంటూ మహిళ బతుకును ఆవిష్కరించారు. ‘ఒంటరి’  కవితలో ‘‘క్షణాలన్నీ పొరలు పొరలుగా తెగి పడుతూ పగిలిన అద్దం పైన మరకల్లా’’ అంటూ  వేదనను పలికించటానికి అద్దాన్ని వస్తువుగా తీసుకుని వర్తమానాన్ని కళ్ళ ముందుంచారు.
ఆర్ధికం

ఎలక్టోరల్‌ ఆటోక్రసీగా భారత్‌

స్వీడన్‌(గోథెన్‌బర్గ్‌) ఆధారిత వి-డెమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ‘డెమోక్రసీ రిపోర్ట్‌ 2024’ ని మార్చి 7న విడుదల చేసింది. ప్రజాస్వామ్య నివేదిక 2024 ప్రపంచవ్యాప్తంగా 4,200 మంది ప్రతిభావంతుల సహకారంపై ఆధారపడిరది. 1789 నుండి 2023 వరకు 202 దేశాలకు సంబంధించిన 31 మిలియన్‌ డేటాసెట్‌లను ఉపయోగించుకుంది. వి-డెమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ దేశాలను నాలుగు రకాలుగా వర్గీకరిస్తుంది. అవి: లిబరల్‌ డెమోక్రసీ, ఎలక్టోరల్‌ డెమోక్రసీ, ఎలక్టోరల్‌ ఆటోక్రసీ,  క్లోజ్డ్‌ ఆటోక్రసీ. 2023 నాటికి, ప్రపంచ జనాభాలో 71 శాతం (5.7 బిలియన్ల ప్రజలు) నిరంకుశ పాలనలో నివసిస్తున్నారు. ఇది దశాబ్దం క్రితం ఉన్న 48 శాతం కంటే గణనీయమైన పెరుగుదల. ప్రపంచ జనాభాలో
సమీక్షలు

విప్లవోద్యమ కవితా పతాక 

ఇది ముప్పై ఆరు పేజీల లహర్ సాహిత్యం.ఇందులో తొమ్మిది  కవితలు ఒక కథ ఉంది. ఈ తొమ్మిది కవితల్లో, కథలో ఒక్కటి మినహా మిగతావి అన్నీ .. తనతో పాటు నడిచిన తనకు ప్రేరణనిచ్చిన తనకు జ్ఞానాన్ని ఆచరణను అలవర్చిన ....అమరుల జ్ఞాపకాల సద్దిమూట. స ద్దిమూటే కాదు. దండకారణ్య విప్లవోద్యమ వర్తమాన చరిత్రకు సాక్ష్యం ఈ సాహిత్యం. 2007 నుండి 2020 వరకు రాసిన ఈ కవితలు మరీ పిరికెడు కూడా లేవు కదా అని అనిపిస్తుండొచ్చు మనకు. నిజమే అనిపిస్తుంది కూడా. ఐతే, ఫాసిస్టు దోపిడీ పాలక వర్గాలు సల్వాజుడుం గ్రీన్ హంట్ సమాధాన్ ప్రహార్
సమీక్షలు

మెరుపులాంటి, భాస్వరంలాంటి కవిత్వం 

మట్టి గాయపడినా , చెట్టు గాయపడినా , మనిషి గాయపడినా  కన్నీళ్లు పెట్టుకుంటాడు. అక్షరాలతో యుద్దాన్ని ప్రకటిస్తాడ.  సానుభూతి కాదు. సంఘీభావం ముఖ్యమనే మాటపై నిలబడుతాడు.  నియంతృత్వ పోకడలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న రోజుల్లో ఉదయ్ కవిత్వం ఈ ఫాసిస్టు  దాడికి ప్రతిదాడిలాంటిది.  గాయానికి మందులాంటిది. ఈ మనుషుల కోసం, సమానత కోసం, బువ్వ కోసం, భుక్తి కోసం తనువు రాలే వరకు పోరాడుతున్న మిత్రులను గుండెకు హత్తుకుంటాడు.  పోరాట గీతాల్ని ఆలపిస్తాడు. అమరత్వాన్ని కీర్తిస్తాడు,. అమరుల బాటల్లో నడవాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తాడు. మనల్ని సమాయత్తం చేస్తాడు. ఈ నేల చెప్పే గాథలను, కన్నీళ్లను మనలో ఒంపుకుందాం. ఈ
సమీక్షలు

మనకు తెలియని శికారిలు

కర్నూల్ రాజవిహార్ సెంటర్ అత్యంత ఖరీదైన మనుసులు తిరుగాడే ప్రాంతం.పెద్దపెద్ద షాపింగ్ మాల్స్, బహుళ  అంతస్థుల భవనాలు, సామాన్య మానవుడు అడుగు పెట్టలేని మౌర్య ఇన్ హోటల్, మెడికల్ కాలేజీ హాస్టల్, ఆధునికత పేరుతో కట్టేబట్ట కరువై ఖరీదైన  కార్లలో తిరిగే మనుషులు( చిరిగిన జీన్స్). వీటన్నిటి మధ్య ఎండిన ఎదకు చిన్నపిల్లను అతికించుకుని అడుక్కునే మహిళలు. వారికి తోడు చెదిరిన జుట్టు, చిరిగిన బట్టలతో వాహనాల పొగ మొత్తం మొఖానికి పులుముకుని నడుస్తూ అడుక్కునే బాలికలు. వారి దీనస్థితి  చూసి  ఎవరూ  జాలిపడరు. ఎందుకంటే వాళ్ళు "శికారీలు". మా చిన్న తనంలో శికారీలు అప్పుడప్పుడు అడుక్కోవడానికి మా
సంపాదకీయం

2024 ఎన్నికలు – హిందూ రాష్ట్ర స్థాపన

ఇప్పుడు దేశంలో ఎన్నికల కాలం నడుస్తున్నది. గత కొంత కాలంగా సాగుతున్న ఓట్ల యుద్ధం ముగింపు దశకు చేరుకుంది. 2024 ఎన్నికలు ఈ దేశ  గమనాన్ని  నిర్ణయిస్తాయనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. మళ్లీ అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోంటే, మరోసారి ఆ పార్టీ వస్తే దేశం ఏమైపోతుందని ఆందోళనపడేవాళ్లు ఎక్కువ అవుతున్నారు.  దీనికి కారణం లేకపోలేదు.  మూడోసారి  బిజెపీ అధికారంలోకి రావడం అంటే ‘హిందూ రాష్ట్ర’ స్థాపన అధికారికంగా ప్రారంభం కావడమే. ఇప్పటికే దానికి అవసరమైన సన్నాహాలను బీజేపీ పూర్తి చేసుకున్నది. సకల సాధనాలను ఉపయోగిస్తున్నది.  మరో వైపు కాంగ్రెస్‌ పార్టీ ఉనికిని నిర్ణయించే ఎన్నికలు కూడా
వ్యాసాలు

అభివృద్ధి విధ్వంసాల రాజకీయార్థిక విశ్లేషణ

(ఇటీవల పౌరహక్కుల సంఘం యాభై వసంతాల సభల్లో విడుదలైన అమరుడు ప్రొ. శేషయ్య గారి పుస్తకానికి రాసిన ముందుమాట ) ప్రొ. శేషయ్యగారి రచనా సర్వస్వం-4లో అభివృద్ధి విధ్వంసాల మాయాజాలాన్ని వివరించే వ్యాసాలు ఉన్నాయి. బహుశా ఈ సంపుటిలోకి ఇంకొన్ని వ్యాసాలు కూడా తీసుకరావచ్చనిపించింది. వాటిలో అభివృద్ధి విధ్వంసాల గురించి ఉన్నప్పటికీ నిర్దిష్టంగా హక్కుల విశ్లేషణే ప్రధానంగా ఉన్నది. వాటిని హక్కుల ఉద్యమ వ్యాసాల్లో చేర్చితే బాగుంటుందనిపించి ఇక్కడికి తీసుకరాలేదు. ఈ వ్యాసాల్లో శేషయ్యగారు అభివృద్ధి విధ్వంసాలను మానవ జీవితంలోని అనేక కోణాల్లో వివరించారు. ఘటనలు, పరిణామాలు, వివరాలు, లెక్కలు, ముఖ్యంగా పాలకుల ఆర్భాట ప్రకటనలు, వాళ్ల ప్రకటిత
వ్యాసాలు

ప్రొ. సాయిబాబా కేసులో లాయర్ల  అవిశ్రాంత కృషి

మా అప్పీలు  విజయవంతం అవుతుందని మాకు పూర్తిగా నమ్మకం వుంది. సాక్ష్యాలను బూటకమని నిరూపించగలమని మాకు తెలుసు.' ఇందుకోసం ఒక న్యాయవాదుల సేన పని చేయాల్సి వచ్చింది. ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా,  అతని సహ నిందితుల నిర్దోషిత్వాన్ని నిరూపించడానికి విజయవంతమైన పోరాటం వెనుక సంవత్సరాల తరబడి జరిగిన సన్నాహాలు వున్నాయి. న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్‌కు జూనియర్‌లుగా ఉన్న న్యాయవాదుల బృందం చేసిన కృషి ఆ తయారీకి వెన్నెముక. కోర్టులో వాదించిన సీనియర్‌ అడ్వకేట్లు.. త్రిదీప్ పైస్, ప్రదీప్ మంధ్యాన్, ఎస్పీ ధర్మాధికారిలు అయితే వారికి వివరాలందించడానికి బృందంగా పనిచేసిన న్యాయవాదులు బరుణ్ కుమార్, నిహాల్ సింగ్ రాథోడ్, హర్షల్