వ్యాసాలు

ఆధిపత్య సమాజాల్లో ప్రాణాల విలువ

ఆధిపత్య సామాజిక వ్యవస్థల్లో (ప్రపంచంలో ఇతర దేశాలతో పోల్చినప్పుడు మన దేశంలో కులం మౌలికంగా వర్గంతో పాటు ఒక ఆధిపత్య నిర్మాణం) సుదూర గత చరిత్రలోకి వెళ్లకుండా చూసినప్పుడు యూరోపియన్లు ఆక్రమించుకున్నప్పటి నుండి అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఆసియా ఖండాల్లో ఆదివాసులు తెగలుగా, జాతులుగా ప్రాణం విలువతో కాకుండా పెట్టుబడిదారీ ప్రమాణాల్లో వనరుతో తూకం వేయబడుతున్నారు. ఇతర ఇంధనాలతో పాటు, ఒక దశలో అన్నిటికన్నా మార్కెట్లో రెండవ ప్రపంచ యుద్ధ కాలం నుంచి ప్రాబల్యంలోకి వచ్చిన చమురు అనే వనరు దృష్ట్యా ఇస్లాం మతావలంబకులైన జాతులు అధికంగా ఉన్న దేశాలు (పాలస్తీనా, ఇరాన్‌, ఇరాక్‌, ఈజిప్టు, సిరియా, జోర్డాన్‌ల
ఎరుకల కథలు

ప్రయత్నం

దుర్గమ్మ గుడి ముందు  -  ఇందిరమ్మ ఎస్.టి. కాలనీలో ఆరోజు గ్రామసభ జరుగుతోందని, ఒకరోజు ముందే దండోరా కొట్టడం వల్ల, జనం అక్కడ గుమిగూడి పోయారు.మధ్యాహ్నం మూడు దాటింది. ఎండ చుర్రుమంటోంది. ఆ పంచాయతీలో ఉపాధిహామీ పనుల్ని పర్యవేక్షించే ఫీల్డ్ అసిస్టెంట్ రమణ వేపచెట్టు నీడలో చాపపరిచి కూర్చుని ఉన్నాడు. రెండు పాతచాపలు  ఒకదాని పక్కన ఒకటి పరచబడి ఉన్నాయి. ఆ రెండు చాపల చుట్టూ నాలుగు ఇనుప కుర్చీలు, రెండు ప్లాస్టిక్ కుర్చీలు పహారా కాస్తున్నట్లు ఉన్నాయి. చాపపైన తెల్లకాగితాలు, గ్రామసభ రిజిష్టరు, హాజరు పట్టిక, ఇంక్ ప్యాడ్, ప్లాస్టిక్ సంచిలో కొన్ని అర్జీలు రమణ ముందుపేర్చబడ్డాయి.
వ్యాసాలు

కొత్త కేంద్ర ప్రభుత్వం ముందు డిమాండ్ రాజకీయ ఖైదీలనందరినీ విడుదల చేయాలి

ఈ జూన్ 6 కు భీమా కోరేగావ్ ఎల్గార్ పరిషత్ కేసులో జైలుకు పోయిన మొదటి ఐదుగురిలో నలుగురి జైలు జీవితం ఆరో సంవత్సరం పూర్తి చేసుకుని ఏడో సంవత్సరంలోకి ప్రవేశిస్తుంది. ఈ  ఐదుగురిలో మొదటివాడుగా రోనా విల్సన్‌ను పేర్కొనవచ్చు. ఎందుకంటే అంతకన్నా ముందు 2018 ఏప్రిల్  27న ఢిల్లీలో మునీర్కాలో వున్న ఆయన అద్దె గదిపై పూనే విశ్రాంబాగ్ పోలీసు స్టేషన్ ఎసిపి శివాజీ పవార్ నాయకత్వంలో పోలీసులు రెయిడ్ చేసి ఆయన కంప్యూటర్‌ను , పెన్ డ్రైవ్‌లను, యితర ఎలక్ట్రానిక్ పరికరాలను, పుస్తకాలను ఎత్తుకపోయారు. మిగతా ఐదుగురిలో సుధీర్ ధావ్లే (రిపబ్లికన్ ప్యాంథర్స్ వ్యవస్థాపకుడు) ఉంటున్న
లోచూపు

ఫాసిస్టు క్రమాల పరిశీలన

పెట్టుబడి తోపాటు  ఆవిర్భవించిన ఆధునిక యుగంలోని రాజకీయాలకు రెండు తీవ్ర అంచులు ఉంటాయి. ఒకటి బూర్జువా ప్రజా స్వామ్యం, రెండు అత్యంత  ప్రగతి నిరోధక ఫాసిజం. పెట్టుబడిదారీ రాజకీయాలు ఈ రెండు అంచుల ద్వంద్వం మధ్యనే లోలకంలా కొనసాగుతాయి. పెట్టుబడి కి ఉన్న   స్వభావం వల్ల నే వలస రూపంలో   ప్రపంచమంతటా  విస్తరించింది.   ఈ  క్రమంలోనే దేశ దేశాలలో ప్రజలు  సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా  స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోసం పోరాడారు. ప్రత్యక్ష వలస పెట్టుబడిదారీ విధానం అంతమై పరోక్ష వలస పెట్టుబడిదారీ విధానం మొదలైంది.   పెట్టుబడి ద్రవ్య పెట్టుబడి గా బలపడినాక దాని పని విధానం మారించి. దాని 
కొత్త పుస్తకం

బాల్యపు జాడలెక్కడ ?

(ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు కాటెపోగు రత్నంయేసేపు (కెఆర్‌వై) కవితా సంపుటి *బాల్యమే శరణార్థి*కి అధ్యాపకజ్వాల/ఉపాధ్యాయక్రాంతి మాజీ ప్రధాన సంపాదకుడుపి. మోహన్‌ రాసిన ముందుమాట. 16వ తేదీ కర్నూలులో ఆవిష్కరణ) కాటెపోగు రత్నంయేసేపు (కెఆర్‌వై) తెస్తున్న మొదటి కవితా సంకలనం యిది. కవితలన్నీ చార్వాక కలం పేరుతో రాసినవే. మొత్తం 25 కవితలు. 12 కవితలు విద్యారంగానికి సంబంధించినవి కాగా, మిగిలినవి వివిధ సందర్భాల్లో జరిగిన సంఘటనలకు స్పందించి అక్షరీకరించిన కవితలు. తనకున్న తాత్విక భావజాల కోణంలోంచి వీక్షించి కవితలుగా మలిచారు. అన్నీ వస్తు ప్రధానమైన కవితా ఖండికలే. భావ ప్రాధాన్యాన్ని బట్టి కవితల్లో శైలి, శిల్పం వాటంతకవే అమరిపోయాయి.
ఆర్థికం

ప్రపంచంలో పెరుగుతున్న సైనిక వ్యయం

2023 సంవత్సరానికి వివిధ దేశాల రక్షణ వ్యయానికి సంబంధించి ఏప్రిల్‌ 22న స్టాక్‌ హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సిప్రి) ఒక నివేదికను విడుదల చేసింది. ప్రపంచ దేశాల సైనిక వ్యయం ఆల్‌టైమ్‌ గరిష్టానికి పెరిగింది. ప్రపంచ సైనిక వ్యయం 2023లో 2443 బిలియన్ల డాలర్లకు చేరుకుందని  ఇది 2022 వ్యయం కంటే 6.8 శాతం పెరుగుదలను సూచిస్తుంది. భౌగోళిక రాజకీయ అనిశ్చితి సైనిక వ్యయం పెరుగుదలకు కారణంగా విధితమవుతుంది. ఇందుకు పెరుగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతలు, యుద్ధాలు, అభద్రత, ఆధిపత్య ధో రణులు అని చెప్పవచ్చు. యునైటెడ్‌ స్టేట్స్‌, చైనా, రష్యా తోడ్పాటుతో చాల దేశాలు సైనిక
కరపత్రాలు

వికసిత భారత్‌ @ 2047 – కార్పొరేట్‌ హిందూ రాష్ట్ర

విరసం ఆవిర్భావ దినం సందర్భంగా సదస్సు జూలై 4 2024, గురువారం ఉ. 10 గంటల నుండి సా . 6 గంటల వరకుసుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌ వంద గొడ్లను తిన్న రాబందు ఒక్క పోలింగ్‌తో కూలిపోదని రుజువైంది. అయినా హిందుత్వ ఫాసిస్టు దురహంకారానికి ఎన్నికల్లో కూడా ప్రజలు కళ్లెం వేశారు. అబద్ధాలు, వంచనలు, వక్రీకరణలు, ప్రలోభాలతో సాగిన ఎన్నికల ప్రచారంలో సహితం ప్రజలు నిజాలు తెలుసుకోగలిగారు. ఫాసిస్టు నరేంద్ర మోదీ కళ్లలో భయం బట్టబయలైంది. రాముడు కాపాడలేడని కూడా తేలిపోయింది. ‘మందబుద్ధి’ని రెచ్చగొట్టి ఎల్లకాలం చెలామణి కాలేరని స్పష్టమైంది. ప్రజల వివేకం, సత్యాసత్యాల ఎరుక ఎంత
కథనం

ఈ పసిపాపల కథ వింటారా?

‘మీ డబ్బులు నాకక్కర్లేదు. మీ ఓదార్పూ అక్కర్లేదు. నాక్కావాల్సింది నా పిల్ల. తలకి తల కావాలి’ కోపం, దుఃఖంతో అన్నది మాసే సోడి. ఆమె రెండు చేతి వేళ్ళకు గాయాలయ్యాయి. ‘ఈళ్ళను కూడా పట్టుకుపొండి. మాకు మీ సామాన్లు అక్కర్లా. నా పిల్లను చంపి సామాన్లు పడేసి పోయారు. నాకు నా పిల్ల కావాలి. పిల్లను చంపిన పోలీసులు, డి.ఆర్‌.జి. గుండాలను ఎంటనే శిక్షించాలి’ ఖరాఖండిగా అన్నాడు బామన్‌ సోడి. మాసే, బామన్‌ మంగ్లి తల్లిదండ్రులు. ‘మేం చంపలేదు’ పోలీసులు. ‘ఆరోజు దీదీని తరిమింది నువ్వేగా! నీకు తల్లి లేదా? చెల్లె లేదా? నీకు పిల్లల్లేరా? ఈ నొప్పి
సంభాషణ

విప్లవంలో రూపొందిన మానవుడు

కామ్రేడ్‌ చీమల నరుసయ్య నవ యవ్వన ప్రాయంలోనే అడవి దారి పట్టాడు. అప్పటికి ఆయన వయసు రెండుపదులు నిండి వుంటాయేమో! అప్పటివరకు ఆయన గురించి మాకు తప్ప బయట ఎవరికి తెలుసు? 1978లో ప్రస్తుత పెద్దపల్లి జిల్లా రాఘనేడు భూస్వాములను ‘సార్లు’ (మల్లోజుల కోటేశ్వర్లు) అపహరించి రైతాంగ డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చలు జరిపిన నాటికి నరుసయ్య ఇంకా వెలుగులోకి రాలేదు. కేశోరాం సిమెంట్‌ కంపెనీలో కార్మిక నాయకుడిగా చలామణి అవుతూ గూండాగిరి, దాదాగిరి చలాయించే హసనొద్దీన్‌ను నక్సలైట్లు మట్టుబెట్టిన నాటికి కూడ నరుసయ్య సాధారణ ఊరి యువకుడే. మా పొరుగూరు పాల్తెం గన్ను పటేల్‌ ఆగడాలపై ప్రజాపంచాయతీ జరిపిన
సమకాలీనం

చె గువేరా’మోటార్ సైకిల్ డైరీస్’అంటే ఎందుకంత భయం?

చె గువేరా భూతం ఇప్పుడు భారత రాజ్యాధికారాన్ని వెంటాడుతోంది. అతని ఆత్మ సమాధి నుండి బయటకు వచ్చి భారతీయ పాలక వర్గాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు కనిపిస్తోంది. చె గువేరా ను చూసి భయపడే నేటి పాలకులను చూస్తుంటే , చె తనను కాల్చి చంపేస్తున్న అమెరికన్ సైనికులు తనపై తూటాలు పేల్చి చంపుతున్న అమెరికా సైనికులతో  సరిగ్గా చెప్పినట్లు అనిపిస్తుంది – “నన్ను కాల్చకండి! నేను చే గువేరాను. నేను బతికి వుంటే మీకు మరింత ఉపయోగకరంగా ఉంటాను. మరణానంతరం నేను మీకు మరింత ప్రమాదకరమని నిరూపిస్తాను” అలాగే జరిగింది. అమరత్వం తరువాత చే ప్రపంచ యువతకు విప్లవానికి,