కరపత్రాలు

Viksith Bharath @ 2047 – Corporate Hindu Rashtra

Seminar on the occasion on Revolutionary Writers Association Formation Day 10 AM to 6 PM Thursday, July 4, 2024 Sundarayya Vignana Kendram, BaghLingampally, Hyderabad The fact that a vulture that ate a hundred sheep won't fall with a singlepoll has been proven. However, the public has also reined in the arrogance of Hindutva fascists in the elections. Despite the lies, deceptions, distortions, and enticements in the election campaign, people were
stories

Gangi

My little one, How are you my dear? It is already a year and a half since I left you. It took me some time to return to my normal self after leaving you. Binding my milk filled breasts tightly and firmly suppressing my overflowing emotions, I tried to adjust to life in my new surroundings. As I tried to adjust to the demands of this new life in the
సమీక్షలు

నెత్తుటి తడి ఆరని బస్తర్‌

దేశం కార్పొరేట్లకు’ అనే 84 పేజీల చిన్న పుస్తకంలోని వ్యాసాల్లో ఆదివాసులు తమ అస్తిత్వం కోసం చేసిన పోరాటాలు, వారికి అండగా నిలిచిన మావోయిస్టులు కనబడతారు. దాన్ని ఓర్వలేని పాలకులు చేసిన దురాగతాలు ఈ పుస్తకం నిండా ఉన్నాయి. ఇందులో  నాకు అనిపించిన నాలుగు విషయాలను పంచుకునే ప్రయత్నం చేస్తాను. పుస్తకం చదువుతుంటే పాలకులు ఇంత దుర్మార్గంగా ఎలా ప్రవర్తించగలరు అనే భావన కలుగుతుంది. ఎందుకంటే ఈ సమాజ ఆరోగ్యానికి అవసరమైన గాలీ, నీరు, ఖనిజాలు, కలపను కాపాడుతూ అవి ఈ దేశ ప్రజలకు దక్కాలన్నందుకే ఆదివాసులు, మావోయిస్టులు ప్రభుత్వాలకు కంటగింపయ్యారు. ఆ వనరులను కాపాడటానికి పోరాడటం పాలకుల
కవిత్వం

కె కె కవితలు మూడు

1 సంధ్యా కిరణం జీవితం స్తంభించినపుడు జీవితాలను ప్రతిబింబింపచేసే అమరుల ఆశయాలతో ఈ అడుగులు వేస్తున్నాను భూ మొనలపై బాంబు పేలుళ్లతో బీళ్ళు పడిన నేలపై పడుకొని స్వేచ్చా చిత్రాన్ని నా కనులలో చిత్రిస్తున్నాను డ్రోను, హెలి కాప్టర్ల రెక్కీల నడుమ కోట్ల తారల నీడలో పండు వెన్నెల్లో కొద్ది కాలపు గురుతులను కురిసే మంచుతోపాటే నా తనువు అణువణువులో దాచుకుంటున్నాను వడగాలుల వేడికి హడలి పోతున్న ఈ హృదయానికి విష్లవమే మందుగా నూరిపోశాను ఎన్నో నిశీధి చీకట్లను తొలిగించుకుంటూ తొలి సంధ్యా కిరణానై నిల్చున్నాను నిలబడిన ప్రతిసారీ నిట్టూర్చిన క్షణాలే తలచుకున్నాను తుపాకుల తూటాల నడుమ మృత్యువును
కవిత్వం

అనిత కవితలు రెండు

1 కామ్రేడ్ శంకర్ ఓరుగల్లు పోరుబిడ్డ కామ్రేడ్ శంకర్వీరయోధుడా కామ్రేడ్ శంకర్ నీకు అరుణారుణ జోహార్లుచల్లగరిగ గ్రామంలో పురుడుపోసుకున్నవు నువ్వుప్రపంచాన్ని మార్చడానికి పోరుబాటపట్టినవుసమసమాజ స్థాపనకు సాయుధుడివైనవుకన్నతల్లి ఒడి నుండి అడవి తల్లి ఒడికి చేరావుపీడిత ప్రజలకు పోరు బిడ్డవైనావుఉత్తర తెలంగాణ ఉరుము నీవుఉత్తర తెలంగాణ సరిహద్దులు దాటుకొనిదండకారణ్యంలో అడుగు పెట్టిన వాడాశంకర్ పేరుతో జనంతో చెలిమి చేసినవాఉత్తర బస్తర్ ఆదివాసీల గుండెల్లో గూడుకట్టుకున్నవాప్రజలను పోరుబాటలో నడిపించినావాఆపటోల-కల్పర్ అడవుల్లో శత్రువు తూటకు నేలకొరిగినావామెరిసేటి మెరుపై, మేఘ గర్హనవై తిరిగి వస్తావా,ఆకాశంలో అరుణతారవై ప్రకాశిస్తాపొడిచేటి పొద్దులో, విరిసేటి ఎర్రమందారంలోనీ రూపాన్ని చూద్దుమాప్రజా యుద్ధ కెరటమై వస్తవాప్రజల గుండెల్లో విప్లవ జ్యోతివై వెలుగుతవానాగేటి
కవిత్వం

తెలుగు వెంకటేష్ కవితలు రెండు

1యుద్ధంలో మరణాలెప్పుడూ దొంగలెక్క ఆయుధాలు గింజల్ని పండించలేవు మరణాల్ని భిక్ష వేస్తాయి పిల్లలు లేక బొమ్మలు దిగాలు పడ్డాయి వాటికి తెలియదు యుధ్ధం చంపిందని రాజ్యహింసలో ప్రజల దుఃఖం మైళ్ళు మైళ్ళు మేఘావృతం యుధ్ధం ఉన్మాదం అది సృజనాత్మకతను చంపుతుంది యుధ్ధం కామా అది మరణాల్ని కప్పుకునే రాక్షసి యుధ్ధం శరీరాల్ని మాయం చేశాక తిరిగి మనుషుల్ని ప్రవేశపెట్టలేనిది 2ప్రతి నేల రక్తంతో తడిసినదే యుధ్ధం కాలుమోపని స్థలమేది చరిత్ర అంటేనే నెత్తురుతో రాయబడ్డ పుస్తకం ఆధిపత్యాల అహంకారాలకు ఎంత కన్నీరు పారిందో బంధాల్ని పోగొట్టుకున్న ప్రజలు సాక్ష్యం యుధ్ధాలకు లాక్కోవడమే తెలుసు నాశనం చేయడమే తెలుసు ప్రాణాలు
ఖండన

కృష్ణకుమార్ కడ్తీ అరెస్టును ఖండిద్దాం

సిలింగేర్ మూడవ సంవత్సరం పూర్తయిన సందర్భంగా సభ జరుపుకోడానికి జిల్లా పాలనాయంత్రాంగం నుంచి అనుమతి అడగడానికి సుక్మాకు వెళ్ళి తిరిగి వస్తున్న మా మూల్‌వాసీ బచావో మంచ్ కార్యకర్త కృష్ణ కుమార్ కడ్తీని డోర్నపాల్ పోలీసు ఇన్ స్పెక్టర్ శశికాంత్ సిన్హా ప్రత్యక్ష ఆద్వర్యంలో అక్రమంగా అరెస్టు చేశారు. వారు పూర్తిగా తప్పుడు ఆరోపణలు చేసే  కుట్రలో సఫలమయ్యారు. మేము ఈ రాజ్యాంగ వ్యతిరేక చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మేము  సిలింగేర్ మూడవ వార్షిక ఉత్సవాన్ని జరుపుకోడానికి ఈ సంవత్సరం  చేసిన ప్రయత్నాలన్నీ ప్రభుత్వానికి తెలుసు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సాకుగా చూపించి అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ శాంతియుతంగా
ఖండన

మూలవాసీ బచావో మంచ్ (బస్తర్) నాయకుల అక్రమ అరెస్టు

జూన్11న హైదరాబాదులు జరిగిన మీడియా సమావేశంలో విడుదల చేసిన నోట్  చత్తీస్‌ఘడ్‌ జిల్లా సుక్మా జిల్లా జబ్బగట్టాకు చెందిన భీమా సోడీ, గుడ్‌రాజ్‌ గుడాకు చెందిన జోశన్‌ మడకంలను, బీజాపూర్‌ జిల్లా గోమ్‌గూడాకు చెందిన జోగా మడకంలను ఈనెల 8న పోలంపల్లి నుంచి అక్రమంగా పోలీసులు ఎత్తుకెళ్లారని మూలవాసీ బచావో మంచ్‌  ప్రకటన ద్వారా తెలిసింది.  వీరిలో  భీమా సోడీ జూన్‌ 19న మూలవాసీ బచావో మంచ్‌ అధ్యక్షుడు రఘు మిడియామితోపాటు హైదరాబాదు వచ్చి చత్తీస్‌ఘడ్‌లో ఆపరేషన్‌ కగార్‌ పేరుతో రాష్ట్ర పోలీసులు, కేంద్ర భద్రతా బలగాల చట్ట వ్యతరేక నిర్బంధ కాండ గురించి పత్రికలతో, మీడియాతో మాట్లాడారు.
ఓపన్ పేజ్

దృశ్యంలోని అర్థాలు

ఢల్లీ కంటే గన్నవరమే అపురూపమట. చాల మందికి అట్లా అనిపించింది. అంతే మరి. రాజుకంటే రాజును నిలబెట్టినవాడే ఘనుడు.  భూస్వామ్యంలో ఇది చెల్లుబాటవుతుందా? ప్రజాస్వామ్యంలోనే సాధ్యం. తరచూ ప్రజాస్వామ్యం సాధించే విజయం ఇదే. జూన్‌ 12వ తేదీ ప్రమాణ స్వీకార వేదిక మీద కనిపించినంత ఆహ్లాదంగా చంద్రబాబు అంతకముందెన్నడూ కనిపించలేదని ఎవరో అన్నారు. నరేంద్రమోదీ కూడానట. వేదిక మీద ఆ ఇద్దరూ  ఎన్ని ముచ్చట్లు కలబోసుకున్నారో. ఎంతగా  చిరునవ్వులు చిందించారో. అధికార ప్రదర్శన తప్ప మరేమీ తెలియని ప్రధాని మమతానురాగాలను ఎంతగా ప్రకటించాడో. తాను ఒక్కడే తప్ప మరెవరినీ పక్కన భరించలేని వ్యక్తి అంత మంది మధ్య ఎంత
వ్యాసాలు

ఆధిపత్య సమాజాల్లో ప్రాణాల విలువ

ఆధిపత్య సామాజిక వ్యవస్థల్లో (ప్రపంచంలో ఇతర దేశాలతో పోల్చినప్పుడు మన దేశంలో కులం మౌలికంగా వర్గంతో పాటు ఒక ఆధిపత్య నిర్మాణం) సుదూర గత చరిత్రలోకి వెళ్లకుండా చూసినప్పుడు యూరోపియన్లు ఆక్రమించుకున్నప్పటి నుండి అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఆసియా ఖండాల్లో ఆదివాసులు తెగలుగా, జాతులుగా ప్రాణం విలువతో కాకుండా పెట్టుబడిదారీ ప్రమాణాల్లో వనరుతో తూకం వేయబడుతున్నారు. ఇతర ఇంధనాలతో పాటు, ఒక దశలో అన్నిటికన్నా మార్కెట్లో రెండవ ప్రపంచ యుద్ధ కాలం నుంచి ప్రాబల్యంలోకి వచ్చిన చమురు అనే వనరు దృష్ట్యా ఇస్లాం మతావలంబకులైన జాతులు అధికంగా ఉన్న దేశాలు (పాలస్తీనా, ఇరాన్‌, ఇరాక్‌, ఈజిప్టు, సిరియా, జోర్డాన్‌ల