వ్యాసాలు

మావోయిస్టు పార్టీ ఆవిర్భావ సభ(లు) జ్ఞాపకాలు కొన్ని

సిపిఐ (మావోయిస్టు) ఏర్పడి 2024 సెప్టెంబర్‌ 21 నాటికి 20 సంవత్సరాలు. సెప్టెంబర్‌ 21 నుంచి అక్టోబర్‌ 20 వరకు నెల రోజుల పాటు ఈ రెండు దశాబ్దాల వార్షికోత్సవాలు జరుపుకోవాలని పీడిత, పోరాట ప్రజలకు మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి చేసింది. పార్టీ శ్రేణులు, నాయకత్వం, విప్లవాభిమానులు దేశవ్యాప్తంగా ఈ 20 ఏళ్ల సభలు అమరుల స్మృతిలో నిర్వహించుకుంటారని కూడా ప్రకటించింది. ఈ 20 ఏళ్లలో 5250 మంది  పార్టీ సభ్యులు, 22 మంది కేంద్ర కమిటీ సభ్యులు, 8 మంది పోలిట్‌ బ్యూరో సభ్యులు అమరులయ్యారని, పార్టీ నిర్మాతలైన అమరులు కామ్రేడ్స్‌ చారుమజుందార్‌, కన్హయ్య చటర్జీతో పాటు
సంపాదకీయం

శ్రామిక జన గాయకుడు

ప్రజాకళాకారుడు ఉన్నవ నాగేశ్వరావు ఆకస్మికంగా మరణించాడు. తీవ్రమైన అనారోగ్యాన్ని దాచుకొని భూమిని ఖాళీ చేసి వెళ్లిపోయాడు. ఒక మనిషి భౌతిక నిష్క్రమణ చుట్టూ ఉన్న సమాజానికి అక్కరలేదు. రక్త సంబంధాలు, అభిరుచులు, కళా, సాహిత్య  సాహచర్యంలో వున్నవారికి ఆందోళన కలిగిస్తాయి.  ఈ ఆవేదన జీవితం కొనసాగింపులో జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. కామ్రేడ్ నాగేశ్వరరావు విప్లవ రాజకీయాలలోకి వచ్చిన కాలం నుండి మరణం వరకు ఆ రాజకీయాలకు వాహికగా పనిచేశాడు . కళారంగం ద్వారా తాను చేయదగిన పనిని నిర్వర్తించాడు. 1997లో ఏర్పడిన ప్రజా కళా మండలి లో చేరి మరణించే నాటికి కోశాధికారిగా ఉన్నాడు. ఉన్నవ నాగేశ్వరరావుది గుంటూరు జిల్లా
ఆర్థికం

తగ్గిన ఉపాధి – పెరిగిన నిరుద్యోగం

భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి శరవేగంగా పరుగులు పెడుతూ ఉందని, ప్రపంచంలో అతిపెద్ద ఐదవ ఆర్థిక వ్యవస్థగా ఉందని, త్వరలో ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఏర్పడనుందని, తద్వారా ఉపాధి పెరిగి నిరుద్యోగం, పేదరికం తగ్గుతుందన్న మోడీ ప్రభుత్వ ప్రచారం ఎంత బూటకమో దేశంలో పెరిగిన నిరుద్యోగం, తగ్గిన ఉపాధిని గమనిస్తే తెలుస్తుంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఒ) ఆదాయ అసమానత ఉపాధి దృష్టాంతం భయంకరంగా ఉందని తన నివేదికను 27 మార్చి 2024న విడుదల చేసింది. 2000-2024 వరకు నిర్వహించిన సర్వేల ద్వారా భారత ప్రభుత్వ, రిజర్వు బ్యాంకు లెక్కలను, జాతీయ నమూనా సర్వేను, పీరియాడికల్‌
సమకాలీనం

మానేసర్‌ మారుతీ ప్లాంట్‌లో కార్మికుల నిరవధిక ధర్నా

ఆటోమొబైల్ కంపెనీ మారుతీకి చెందిన మనేసర్ ప్లాంట్‌లో కార్మికుల పోరాటంలో జరిగిన  హింసాత్మక ఘటనల తర్వాత 2012లో తొలగించబడిన కార్మికులు తమ ఉద్యోగాలను తిరిగి పొందాలని డిమాండ్ చేస్తూ మనేసర్ తహసీల్ కార్యాలయం వద్ద నిరవధిక ధర్నా ప్రారంభించారు. హర్యానాలోని మానేసర్‌లోని మారుతీ సుజుకీ ప్లాంట్‌లో 2012లో యాజమాన్యం తొలగించిన 100 మందికి పైగా కార్మికులు,  సుదీర్ఘమైన 12 సంవత్సరాల తర్వాత,  2024 సెప్టెంబర్ 18 నాడు తిరిగి తమను పనిలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫ్యాక్టరీ గేటు దగ్గర నిరవధిక ధర్నాకు కూర్చున్నారు. సత్యం ఆటో యూనియన్, లుమాక్స్ మజ్దూర్ యూనియన్, ఎఎస్‌ఐ యూనియన్, బెల్సోనియా ఆటో
వ్యాసాలు దండకారణ్య సమయం

లైంగిక హింస, అరెస్టులు:  ఆదివాసీ మహిళల పోరాట పటిమ

ఆదివాసీ సమాజం ఎదుర్కొంటున్న అణచివేతలో పెద్ద భాగం బూటకపు ఎన్‌కౌంటర్లు. ముప్పులో ఉన్న తమ భూమి, జీవనోపాధిలపై  భద్రతా బలగాలు చేసే లక్షిత దాడులతో పాటు లైంగిక వేధింపులకు గురికావడం వల్ల మహిళలు ఈ ఘర్షణలో మరింతగా రక్షణ లేనివారిగా మారారు. సునీతా పొట్టెంని మొదటిసారి న్యూఢిల్లీలోని అంబేద్కర్ భవన్‌లోని మసకవెలుతురు వున్న ఒక ఖాళీ గదిలో కలుసుకున్నాం; 2023 అక్టోబర్. ఆదివాసీ హక్కుల కార్యకర్త అయిన ఆమెపైన  అప్పటికి "మావోయిస్ట్" అనే ముద్ర పడలేదు. సరిగ్గా మూడు నెలల క్రితం 2024 జూన్‌లో ఆమెను అరెస్టు చేశారు. మేము ఆమెను కలిసినప్పుడు – స్వేచ్ఛా, ధిక్కరణలు ధ్వనించే
పత్రికా ప్రకటనలు

ఒడిశాలోని  తిజిమలిలో అరెస్టు చేసిన కార్తీక్ అరెస్టును ఖండించండి!

దక్షిణ ఒడిశాలో వేదాంత బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉద్యమ నాయకుడు కార్తీక్ నాయక్ అరెస్టును నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాం. 2024  సెప్టెంబర్ 19న ఉదయం 11.30 గంటల సమయంలో బ్యాంకు నుంచి బయటకు వెళ్లేటపుడు ముప్పై ఏళ్ల కార్తీక్‌ను కాశీపూర్ పోలీసులు తీసుకెళ్లారు. కాశీపూర్ పోలీస్ స్టేషన్‌లో కొద్దిసేపు ఆగిన తర్వాత కాశీపూర్ జెఎంఎఫ్‌సి కోర్టుకు తీసుకెళ్ళి కొన్ని గంటల తర్వాత, రాయగడ సబ్ జైలుకి పంపారు. అదే రోజు, తిజిమాలి ప్రాంతానికి చెందిన వెయ్యి మందికి పైగా గ్రామస్తులు కార్తీక్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పోలీసు స్టేషన్‌ ముందు సాయంత్రం వరకు నిరసన ప్రదర్శన చేసారు.
మీరీ పుస్తకం చదివారా ?

కాలంఒడిలో కవిత్వ ఉద్యమం

ఉద్యమకారులు గొప్పగా మాట్లాడతారు, కారణం సామాన్య ప్రజాజీవితాలతో మమేకమై తమ జీవనసరళిని కొనసాగిస్తుంటారు. పేదలకోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికోసం, కార్మిక, కర్షక సమస్యల పరిష్కారం కోసం నిరంతరం వొక యుద్దమే చేస్తుంటారు. ఉద్యమకారులకు గొప్పజీవితాలేమీ ఉండవు. ఎక్కడైనా ఉంటారు. ఏదైనా తింటారు. ఉన్నా లేకున్నా ప్రజలకోసమే పరితపిస్తారు. ఈ క్రమంలో ప్రజాపోరాటాలు చేసే ఓ కమూనిస్టుపార్టీ కార్యకర్త, నాయకుడు పోరాటాలు చేయడం వొక కోణమైతే, మరో కోణంలో మనసుచేసిన సంఘర్షణను, మనసుకు కల్గిన బాధను మదిలో పురుడుబోసుకున్న చైతన్యాక్షరాలను కవిత్వంగా రాయడం అరుదుగా కనబడుతుంది. ఈ కవి చేస్తున్నదీ అదే. ప్రసిద్ద రష్యన్‌ కవి మాయాకోవ్‌స్కీ చెప్పిన
stories

Ramko

It was nearing seven in the morning. Ranitha set off towards the village along with two people from her team. It was a tiny hamlet with just four houses, known as Makadichuvva. This village was situated in the ChamorshiTaluka of Gadchiroli district. Among the four houses, two belonged to the OraonAdivasis, who had migrated from Rayagada, while the other two were owned by the local residents. It was the rainy
అనువాదం

ఇస్లామోఫోబియా ఎందుకు?

2024 జూలై లో, ఇంగ్లండ్‌లోని అనేక నగరాల్లో అల్లర్లు, దాడులు జరిగాయి. దీనికి ప్రధాన కారణం తప్పుడు వార్తలు, ప్రజల్లో ఉన్న వలస వ్యతిరేక భావాలు. అల్లర్ల బాధితుల్లో ఎక్కువ మంది ముస్లింలు. మసీదులు, వలసదారులు నివసించే ప్రదేశాలపై దాడులు జరిగాయి. ఈ ఘటనల తర్వాత, భవిష్యత్తులో ఇటువంటి హింసను నిరోధించే లక్ష్యంతో ఇంగ్లాండులోని 'ఆల్-పార్టీ పార్లమెంటరీ గ్రూప్' ఒక నివేదికను విడుదల చేసింది. "ముస్లింలు కత్తి చూపించి ఇస్లాంను వ్యాప్తి చేశారు" అని చెప్పడాన్ని నిషేధించాలని నివేదిక పేర్కొంది. ఈ విశ్వాసం ఇస్లామోఫోబియాకు మూలమైన విషయాలలో ఒకటి. అనేక ఇతర అపోహలు, దురభిప్రాయాలు ప్రజల మనస్సులలో లోతుగా
సమకాలీనం

జంషెడ్పూర్ పౌరులు వర్సెస్ టాటా కంపెనీ

జార్ఖండ్ ప్రభుత్వం జంషెడ్‌పూర్‌ను పారిశ్రామిక పట్టణంగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ సౌరభ్ విష్ణు, జంషెడ్‌పూర్‌కు చెందిన 50 మందికి పైగా పౌరులు రాష్ట్ర హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. జంషెడ్‌పూర్ నగరాన్ని పారిశ్రామిక పట్టణంగా మార్చిన తర్వాత, నగరంలోని చాలా మంది పౌరుల హక్కులు చాలా పరిమితం అవుతాయి; టాటా కంపెనీ హక్కులు చాలా ఎక్కువైపోతాయి. జార్ఖండ్ ప్రభుత్వం 2023 డిసెంబర్ 23న నగరాన్ని పారిశ్రామిక పట్టణంగా మార్చేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ 13న, జంషెడ్‌పూర్‌ను పారిశ్రామిక పట్టణంగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిల్‌ను గౌరవ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సుజిత్ నారాయణ్ ప్రసాద్, గౌరవనీయులైన జస్టిస్ అరుణ్