వ్యాసాలు

 స్త్రీల కవిత్వంలో ప్రపంచ దర్శనం

(ఇటీవల విడుదలైన  ‘ప్రపంచ స్త్రీల కవిత్వం – స్వేచ్ఛానువాదం: దియా విఘ్నేష్’ పుస్తకానికి రాసిన ముందు మాట-వసంత మేఘం టీం ) ప్రపంచం నాలుగు మూలల నుండి ఒకేసారి అరవై మంది కవయిత్రులతో సంభాషణ ఎలా ఉంటుంది? ఈ ఆలోచన ఎలా వచ్చిందో కాని దానికదే ఎంత అపురూపమైనది కదా అనిపించింది ఈ పుస్తకం గురించి విన్న వెంటనే. వైవిధ్యభరితమైన సాంస్కృతిక వ్యక్తీకరణలు, ప్రాకృతిక విశేషాలు, చారిత్రక నేపథ్యాలు ఒక్క చోటికి రావడం దానంతటదే ఒక ప్రత్యేకత. అయితే ఈ కవిత్వమంతా సౌందర్యారాధన కాదు. ఒట్టి నగిషీలు చెక్కిన కళ కాదు. అలా అయితే రంగుల పుష్పగుచ్ఛంలా మన
వ్యాసాలు

సమాధి వెనుక దాగిన చరిత్ర

ఔరాంగజేబు చిన్ననాటి తరగతి గది చరిత్ర పాఠంలో విన్నపేరు. 1705 చనిపోయిన వ్యక్తి తదనంతర కాలంలో జీవిస్తున్నాడు. మరణాంతర , ఒకనాటి  పాలకుని గురించి అంచనా ఏమిటి? నిరంకుశ, దయామయుడైన పాలకుడా , లేదా, అనేది ఇవాల చర్చ ఎందుకు?  చరిత్రలో అనేక పరిశీలనలు సహజం. ఔరాంగజేబు మరణించి మూడు వందలఏళ్ల కాలం గడిచింది. 'ఒక రాణి ప్రేమ పురాణం ఇది కాదోయ్ చరిత్ర' అన్నాడు శ్రీశ్రీ.1705 కి ముందు ఏమి జరిగింది. ఔరంగ జేబు  ఇవాళ్టి భారతదేశానికి పాలకుడు కాదు. అతని రాజ్యవిస్తరణకు పరిమితి వుంది. హిందూ దేవాలయాల నేలమట్టం చేయడం, హిందుత్వ సంస్కృతిని అణిచి వేయడం
కథలు

అంటరాని బతుకమ్మ

అనగనగా ఒక కథ కొత్త కాలం ఈ సంచిక నుంచి మొదలవుతోంది . నిన్న చదివిన కథ ఇవాళ మరోసారి  చదివితే  కొత్తగా ఉంటుంది. నిన్న గ్రహించలేని అర్థాలు వినిపిస్తాయి . కవి నాగేశ్వర్ తాను మరో  సారి చదువుతున్న కథలను మనకు పరిచయం చేసే శీర్షిక ఇది - వసంత మేఘం టీం కథలో జీవితం కనిపిస్తుంది . ఆ జీవితాన్ని కథ   మన అనుభవంలోకి తెస్తుంది .  ఆ అనుభవం మనల్ని ఆలోచనల్లోకి నెట్టి ఆచరణ వైపు నడిపిస్తుంది . కథ జీవితం లాంటిది. కథ లాంటిది  జీవితం. అదే విప్లవ కథ. అట్లాంటి విప్లవ
సమకాలీనం

శాంతి చర్చల పూర్వాపరాలు

 (రంగులు మారుతున్న నక్సలిజం – సదస్సుకు స్పందన)      నక్సల్బరీ కాలం నుంచీ కమ్యూనిస్టులు కానివారు, అశేష ప్రజాదరణ ఉన్నవారు విప్లవకారులను పీడిత ప్రజలలో పని చేస్తున్నట్లు గుర్తించి సంభాషణ జరుపుతున్నారు . అప్పటి  నుంచీ  దానికి  గుండెలు బాదుకుంటున్నవారు  కూడా ఉన్నారు. వీళ్లు భావజాల రీత్యా బ్రాహ్మణీయ, మార్కెట్ శక్తుల ప్రతినిధులు.  శంకరన్, పొత్తూరి విప్లవకారులతో సంభాషణ జరిపి, ప్రభుత్వంతో చర్చల దాకా తీసుకువచ్చి చర్చల వైఫల్యానికి, తర్వాత హింసా విధ్వంసాలకు ప్రభుత్వమే కారణమనడం ఇప్పటికీ వీళ్లకు మింగుడు పడడం లేదు. పుబ్బలో పుట్టి మఖలో మాయమయే ఇటువంటి సంస్థలు కూడా ఉన్నాయి. హరగోపాల్ పోరాట రూపాలు ప్రజలు
సంపాదకీయం

శాంతి చర్చలు – హింసపై వైఖరులు

శాంతి కోసం ప్రయత్నించవలసి వచ్చిందంటేనే  సమాజంలో అశాంతి నెలకొని ఉన్నట్టు. ఈ ప్రయత్నం ఎందాక నడుస్తుందో ఇప్పటికిప్పుడు  చెప్పలేకపోవచ్చు. శాంతి సాధనకు ఉండగల మార్గాలన్నీ వాడుకోలేకపోయినా సరే,  అశాంతి గురించి ఆలోచించే అరుదైన సందర్భం వచ్చిందని భావించవచ్చు. అశాంతికి కారణాలను లోతుగా వెతకవచ్చు. అయితే ఈ పని చాలా ఓపికగా  జరగాలి. వీలైనంత ఓపెన్‌ మైండ్‌తో వ్యవహరించాలి. దానికి సిద్ధమైతే మామూలప్పుడు గ్రహించిన విషయాలనే మరోసారి సూక్ష్మస్థాయిలో చూడ్డానికి వీలవుతుంది. అప్పుడు కొత్త కోణాలు కనిపిస్తాయి. అది ఎట్లా ఉంటుందంటే, సమాజమే తన అనుభవాలను, విశ్వాసాలను, వైఖరులను తరచి చూసుకున్నట్లుగా ఉంటుంది. ఇదంతా సమాజాన్నంతా తీవ్ర అశాంతికి లోను
సాహిత్యం కవిత్వం

హంజా     

దేశ దేశాల కవిత్వంతో కరచాలనం (*అనువాద స్వరం* కొత్త కాలం ఈ సంచిక నుంచి మొదలవుతోంది . పాలమూరు నుంచి ప్రపంచ కవిత్వాన్ని పరిశీలిస్తూ , అధ్యనం చేస్తున్న  సీనియర్ కవి ఉదయమిత్ర ఈ శీర్షికను నిర్వహిస్తారు) హంజామా ఊళ్లోఒక సాధారణ వ్యక్తిరొట్టె ముక్క కోసంచెమటోడ్చే కూలి ఓ రోజునేను ఆయనను కలిసినప్పుడుఊరంతావిచారంలో మునిగి ఉందిగాలి మొత్తం స్తంభించినట్టుగా ఉందిలోలోపలేఓడిపోయిన ఫీలింగ్ కలిగింది హంజా నవ్వుతూ భుజం తట్టిఇలా అన్నాడు"అక్కాఇది పాలస్తీనా దీని గుండెలయసముద్రహోరుఆగేదిగాదు సమస్త పర్వతాల ,అగ్నిగర్భాల రహస్యాల్ని దాచిపెడుతుందిది ఈ నేలపొడుగునాఎన్ని నిర్బంధాలముళ్ళ తీగలు పరుచుకున్నాఇదినిరంతరం యోధులకు జన్మనిస్తుంది . ఇదిఉనికిని కోల్పోయే జాతులకువిశ్వాసాలనిచ్చే… వీరమాత
ఆర్ధికం

మందగమనంలో ఆరిక్థ వ్యవస్థ

దేశ ఆర్థిక వ్యవస్థపై అతిగా ప్రచారం చేస్తున్న ప్రధాని మాటలని నమ్మని పెట్టుబడిదారులు విశ్లేషకులు. దేశ ఆర్థిక  వ్యవస్థపై మోడీ సర్కారు గతంలో ఎన్నడూ లేని హైప్‌ను సృష్టిస్తున్నది. తమ పాలనలో భారత్‌ 5వ ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని చెప్పుకుంటున్నది. ఇదంతా తమ పాలనలో తీసుకున్న విధాన నిర్నయాల కారణంగానేనని గొప్పగా ప్రచారం చేసుకుంటున్నది. ఎన్నికల ప్రచార సభల్లో మోడీ నుంచి ఆ పార్టీ కీలక నాయకుల వరకు ఇదే మాటలు చెప్తున్నారు. టివీ డిబేట్లలో, సోషల్‌ మీడియాలో తమ, తమ అనుబంధ గోడీ మీడియా ద్వారా ఆర్థిక వ్యవస్థపై హైప్‌ను బిజెపి ఊదరగొడుతున్నది. అయితే, పెట్టుబడిదారుల్లో మాత్రం
కవిత్వం

ఆమె వెలుగు భూగోళ మయ్యింది 

ఇప్పుడు ఈ నేలా ఆమె కథ వింటోంది తన కాళ్ళూ చేతులూ తన మనసు మాట తన ఆలోచన ఆచరణ తరతరాల సంకెళ్ళ విడిపించుకోడానికి పితృస్వామిక గోడల పగలగొట్టింది తన నవ్వుల్ని తన ఏడ్పుల్ని మనసార కుమ్మరించి బతుకు కుదుట పడే పాటందుకుంది అర్థ రాత్రి స్వాతంత్రపుఅర్థ భాగ చీకట్ల అసాధ్య వెలుగుల కడగాలని స్వేచ్ఛా స్వాతంత్ర్య ప్రకృతి లోకి రెక్కలు తొడుక్కుని జీవితానికి సీతాకోకచిలుక రంగులద్దింది భారత స్త్రీ బానిస రంగు తూడ్చి కడివెండి వారసత్వం అద్ది ముట్టుకోవాల్సిన విప్లవాన్ని పరిచింది తన చూపు నిండా స్త్రీ విముక్త పుప్పొడి వెదజల్లుతూ మనుషుల నిండా నిండింది
కవిత్వం

ఆమె ధైర్యవచనం

ఆమె నవ్వుచింత చెట్లపై మిణుగురు పువ్వులా విరబూస్తుందిఆమె తనపెన్నుఇన్సాస్ రైఫిల్ ను వారసత్వంగా వదిలి వెళ్ళిందిఆమె ఇన్నేళ్లుగెరిల్లా యోధగాఏమని తలపోసిందిఅమ్మలకు అక్కలకుభూమ్యాకాశాలలోసగం హక్కు కావాలని పోరాడిందిఆమె కడవండి బిడ్డగా మొదలై AOB నుండి బస్తర్ వరకు జీవించిన కాలమంతాఆదివాసీ ఆడబిడ్డల ధైర్యవచనమైందిఆమె రేణుక నుండి చైతూగా మారి దమయంతిగా భానూ దీదీగాఅడవి బిడ్డల కొంగు ముడి అయిందిఆమె తెరచిన కనులు చూసి వాడికొకటే భయం అరణ్యమిప్పుడు మరల మిడ్కోవెలుతురుతో భగ్గుమంటుందని!! కెక్యూబ్01-04-2025
గల్పిక

‘బజరా’ గల్పికలు రెండు

1 సమభావం! “రేణుకని చంపేశారట...”“ఏ రేణుక?”“జి. రేణుక, మిడ్కో పేరుతో కథలు రాస్తుంది!”“ఆ... చూశాను, మనవాళ్ళంతా పోస్టులు పెడుతున్నారుగా?”“మెట్లమీద- అని యాంతాలజీ కూడా వచ్చింది!”“ఔనౌను, అందరూ అక్కడ ‘జోహార్లు’ చెపుతున్నారు, యిక్కడ ‘జేజేలు’ చెపుతున్నారు!”“జేజేలు యెవరికీ యెందుకూ?”“ఉగాది పురస్కారాలు పొందిన వాళ్ళకి, అదీ ముఖ్యమంత్రి చేతులమీదుగా అందుకుంటుంటే చెప్పరా జేజేలు...”“అదేంటి జోహార్లకి కారణమై భాగస్వాములైన వాళ్ళే శాలువాలు కప్పుతుంటే సిగ్గులేకండా జేజేలా?”“నీకు తెలీదబ్బా... మన రచయితలకు అన్నిటి మీద సమభావం వుంటుంది!”“....................................................?!?” 2 మిడ్కో! “మన రాజ్యం చీకటితో యెంత బావుందో కదా?!”“ఔను, కాని అదేమిటి యింత చీకటిలోనూ మచ్చలా ఆ వెలుగు?”“నిజమే, అది ఆ స్పార్క్... గ్లీమ్...