ఆర్థికం

పాలస్తీనియన్లను తుడిచిపెట్టే  పన్నాగం

ద‌శాబ్దాలుగా ఇజ్రాయెల్ సాగిస్తున్న దురాగ‌తాల‌కు అడ్డు క‌ట్ట  వేయాల‌ని, పాలస్తీనా భూభాగాల ఆక్రమణల‌కు చ‌ర‌మ‌గీతం పాడాల‌ని గాజాలోని హమాస్‌ అనే మిలిటెంట్‌ సంస్థ 2023 అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌ భూభాగాల‌లోకి చొర‌బ‌డి  251 మందిని బందీలుగా చేసుకొని అపహరించింది. దీనికి  ప్రతీకారంగా ఇజ్రాయెల్‌ హమాస్‌ను తుదముట్టించటానికి దాడులు మొద‌లు పెట్టింది.  అప్ప‌టినుంచి ఇజ్రాయెల్‌ మారణకాండ కొనసాగిస్తూనే ఉంది.  గాజా ప్రపంచంలోనే అత్యధిక జన సాంధ్రత గల ప్రదేశం. 22 మాసాలుగా గాజాలో ఇజ్రాయెల్ మాన‌వ హ‌న‌నానికి పాల్ప‌డుతున్న‌ది. ఇప్పటివరకు 85 వేల టన్నుల బాంబులతో ఆ ప్రాంతా న్ని శిథిలాల కుప్పగా మార్చింది. గాజాపై ఇజ్రాయెల్‌ జారవిడిచిన బాంబులు
కవిత్వం

కొలమానం

మీ అమరత్వాన్ని కొలవఎన్ని పదాలు చూసినాఎంత సాహిత్యం వెతికినాఏవి సరిపోవటం లేదు.యాభై ఏళ్లుగా త్యాగాలను ముద్దాడుతూతడియారని ఆశయాలతోఊత కర్రలతో నడుస్తూదేశ విప్లవానికి ఊతమైపండుటాకులై కూడాపాలకుల వెన్నులోచలి జ్వరం పుట్టిస్తూవిప్లవాన్ని నిలబెడుతూమిమ్ము కాల్చినాబూడిద చేసినారాజ్యానికి చెమటలు పట్టిస్తున్నమీ త్యాగాలను కొలవఏ భాషలో చూడాలిఏ గ్రంథంలో వెతకాలిమీ భుజాలపై ఎగిసినఎర్ర జెండా సగర్వంతో మురిసిపోతూమరింత ఎర్రగాకాంతులీనుతుంది.ఆ జెండా రెపరెపలేమీ త్యాగాలకు కొలమానం.
సంపాదకీయం

విప్లవం తీర్చిదిద్దిన మనిషి

ఆగస్టు 13న చత్తీస్ఘడ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో మరో నలుగురు కూడా చనిపోయినట్లు సమాచారం. వాళ్ల గ్రామస్థులు కావచ్చని, అందుకే వాళ్ల వివరాలు ప్రకటించడం లేదని అనుమానం. ఇప్పటికి పోలీసులు ప్రకటించిన ఇద్దరు మావోయిస్టులలో ఒకరు స్థానిక ఆదివాసీ, మరొకరు కర్నూలు జిల్లాకు చెందిన సుగులూరు చిన్నన్న అలియాస్ విజయ్. విప్లవం ఎన్ని అద్భుతాలు చేస్తుందో. ఎందరిని అసాధారణ మానవులుగా తీర్చిదిద్దుతుందో .. చరిత్రను నిర్మించే ఎన్ని సామాజిక సాంస్కృతిక నైతిక పరివర్తనా క్రమాలను ముందుకు నడుపుతుందో. ఇందులో పాల్గొనే కోటానుకోట్ల మందికి ప్రతినిధులనదగిన లక్షలాది మందిని ఉదాహరణలు
ఖండన

పుస్తకాలను నిషేధించి చరిత్రను రద్దు చేయలేరు సాహిత్యంపై కశ్మీర్‌ ప్రభుత్వ నిరంకుశ దాడిని ఖండించండి

కశ్మీర్‌ ప్రభుత్వం 25 పుస్తకాలను నిషేధిస్తూ ఆగస్టు 5 నాడు జారీ చేసిన ఉత్తర్వు కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలకు పరాకాష్ట. మన దేశంలో పుస్తకాలను నిషేధించడం కొత్త కాదు. ఈ విషయంలో బ్రిటీష్‌ పాలకుల వారసత్వాన్ని మన ప్రభుత్వం నిస్సిగ్గుగా స్వీకరించింది. అయితే ఒకేసారి 25 పుస్తకాల జాబితా ఇచ్చి, వీటిని నిషేధిస్తున్నామని, ఆ కాపీలు ఎక్కడున్నా జప్తు చేస్తామని ప్రకటించడం చరిత్రలో ఎన్నడూ చూడని విపరీత పోకడ. ఈ జాబితాలో కశ్మీర్‌ చరిత్రకు సంబంధించిన ప్రామాణిక పరిశోధనలు ఉన్నాయి. ఏండ్ల తరబడి అధ్యయనం చేసి, ఎన్నో డాక్యుమెంట్లను ఆధారం చేసుకుని చేసిన రచనలున్నాయి. ఎ జి
సాహిత్యం

నేటితరానికి గర్వకారణం భూమిక

(విప్లవ రచయిత్రి, విప్లవోద్యమ సీనియన్ కార్యకర్త  కామ్రేడ్ విజయ లక్ష్మి @భూమిక కథల సంపుటి *ప్రజలు అజేయులు *కు  రాసిన ముందు మాట ఇది . ఆమె ఈ ఏడాది మే 21 న ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం నారాయాణపూర్  గుండెకోట్  అటవీ ప్రాంతంలో జరిగిన బూటకపు ఎదురుకాల్పుల్లో అమరురాలైంది) భారత విప్లవ ప్రజానీకానికి తీవ్రమైన గుండెకోత మిగిల్చిన గుండె కోట్‌ అమరులలో ఒకరు తెలంగాణ పోరు బిడ్డ వన్నాడ విజయలక్ష్మి. విప్లవోద్యమంలోని మిత్రులకు భూమిక. రచయితగా పాఠకులకు వసుధ. ఉస్మానియా యూనివర్సిటీలో తన చదువుకున్న వారికి బహుశా విజ్జి అయి ఉంటుంది. గత కొంతకాలంగా ‘ఇక విద్యార్థులు
తొలికెరటాలు

పాలన ముసుగులు తీసిన ‘నియంత అంతం’

నియంత అంతం ఒక కాల్పనిక వాస్తవం. వాస్తవిక కల్పన. ఈ నవలలో ఉన్న ప్రతీ పాత్ర కల్పితమే అయినా నవల చదువుతున్నంత కాలం వాస్తవిక పాత్రలను, పరిస్థితులనే స్పురణకు తెస్తూ ఉంటాయి. చదువుతున్న కల్పిత రచన కంటే స్పురణకు వస్తున్న వాస్తవిక ఘటనలే ఎక్కువగా ఆలోచింపచేస్తాయి. ఈ నవల చదివాక ఎప్పుడో చదివిన కథ ఒకటి గుర్తుకువచ్చింది. రాచరిక వ్యవస్థ బలంగా ఉన్న కాలంలో ఒక నిరంకుశ రాజు. రాజుకి వ్యతిరేకంగా మాట్లాడడానికి ధైర్యం కూడా నాలుగు గోడల మధ్య దాక్కునే అంత భయంకరమైన పాలన. లక్ష మంది జనాభా ఉన్న రాజ్యం, వంద మంది సైనికులకు బయపడి
మీరీ పుస్తకం చదివారా ?

 కవిత్వజీవధార ‘తెర’ కవిత్వం

మనిషి చైతన్యం నిరంతరం ఆర్థిక రాజకీయ-సాంస్కృతిక వాస్తవాల నుంచే వస్తుంది-పెరుగుతుంది. పైనఉండే నిర్మాణంలోని భాగం కాబట్టి పైకీ, ముందుకు కిందికి చూసి రావలసిన మార్పుల గురించి హెచ్చరిస్తుంది-అవసరాన్ని నొక్కి చెబుతుంది. ఈ విషయంలో కవి అనేవాడు పాట, పద్యం వచన కవిత ఏది రాసినా ఏ ప్రయోగం చేసినా స్వతహాగా ఉండే మనిషి ఆవేశాన్ని-ఆలోచనలను-కలలను వ్యక్తం చేయవలసిందే.                                                                                                                                                                                  _నిఖిలేశ్వర్‌ ‘ఈ దేశపు న్యాయ గుమ్మటం దానికదే కూలిపోయింది ఎవరూ కూల్చలేదు పాపం ఈజాతి లౌకికత్వం దానికదే పేలిపోయింది ఎవరూ మందుగుండు పెట్టలేదు పాపం’ బాబ్రీమసీదు విధ్వంసాన్ని పై కవితావాక్యాల్లో చెప్పిన కవి తెలకపల్లి రవి. మస్తిష్కపొరల్ని దాటుకొని
సంపాదకీయం

శాంతి, సమానత్వం కోసం..

మావోయిస్టుల కాల్పుల విరమణ ప్రతిపాదన లక్ష్యం సాధారణ ప్రజల ప్రాణ రక్షణేనా? అంతకంటే విశాలమైన ఉద్దేశం మరేదైనా ఉన్నదా? హింస లేని సమాజం కావాలనే వాళ్ల కోరికను ఎలా అర్థం చేసుకోవాలి? అనే చర్చ జరుగుతున్నది. గతంలో మవోయిస్టులకు-ప్రభుత్వానికి మధ్య జరిగిన శాంతి చర్చల్లో అనుకూల, ప్రతికూల ఫలితాలను చూసిన సమాజం అలిసిపోకుండా, నిరాశకు గురికాకుండా మళ్లీ అట్లాంటి ప్రయత్నానికి మానసికంగా సిద్ధమవుతున్నది. ఇది మన సమాజ స్థితిని ఎత్తిపట్టే బలమైన సూచిక. సమాజం చాలా చెడిపోయిందని, ఎవ్వరి గురించి ఎవ్వరికీ పట్టని చైతన్యరహిత దశకు చేరుకున్నదనీ కొందరు అంటూ ఉంటారు. ఇదేమీ దురభిప్రాయం కాదు. అవాస్తవం కానే
వ్యాసాలు

వేగుచుక్క సందేశం

(విప్లవ రచయిత్రి, విప్లవోద్యమ నాయకురాలు కామ్రేడ్ అరుణ కథల సంపుటి *అప్రతిహతం* కు రాసిన ముందు మాట ఇది . ఆమె ఈ ఏడాది జూన్ 18 న ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన బూటకపు ఎదురుకాల్పుల్లో అమరురాలైంది . అరుణ ఆంద్ర ఒడిశా సరిహద్దు విప్లవోద్యమ కమిటీ సభ్యురాలు ) ఒక దశాబ్ద కాలంపాటు ప్రతి నిత్యం  ఏడాది పత్రికల్లో నిలిచిన మావోయిస్టు నాయకురాలిగా కామ్రేడ్ అరుణ పేరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చిరపరిచితమే. అయితే ఆమె రచయిత అనే విషయం చాలా మందికి తెలియదు. అజ్ఞాత మహిళా రచయితల కథలను సంకలనాలుగా
కరపత్రాలు

తెలంగాణలో కాల్పుల విరమణ కోసం ప్రజలతో, ప్రభుత్వంతో సంభాషణ

 ప్రజలు శాంతిని కోరుకుంటున్న కాలం ఇది. సమాజం ప్రశాంతంగా ఉన్నప్పుడే  ప్రజా సమస్యలు చర్చనీయాంశం అవుతాయి. వాటికి అర్థవంతమైన పరిష్కారాలు  దొరుకుతాయి. కానీ శాంతి, సామరస్యం నానాటికీ అడుగంటిపోతున్నాయి. హింస, విద్వేషం లెక్కలేనన్ని రూపాల్లో పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు విద్యార్థులుగా మంచి సమాజం కోసం ప్రయత్నించిన మేము ఇప్పుడున్న ఈ స్థితిని గ్రహించాం. దీన్ని మార్చడానికి జరుగుతున్న ప్రయత్నాలకు తోడు నిలబడాలని అనుకున్నాం. యుద్ధాలు ఉన్నంత కాలం శాంతి ప్రయత్నాలు ఉంటాయి. ఇప్పుడు దేశాల మధ్య, దేశాల లోపలా దురాక్రమణ యుద్ధాలు  సాగుతున్నాయి. వాటికి వ్యతిరేకంగా కోటానుకోట్ల మంది ప్రజలు శాంతిని కోరుకుంటున్నారు.  శాంతి ఒక పోరాట నినాదంగా మారింది.