కథలు

ఉత్తర ప్రభ!

గుంజకు కట్టేశారు. పశువుని కాదు, మనిషిని. కట్టేసిన వాళ్ళు మనుషులు కాదు, భక్తులు! అప్పటికే వొంటిమీది దుస్తులే కాదు, చర్మమూ కాస్తంత చిరిగింది. “జై శ్రీరామ్” అన్నా సరే, ముక్కుమీద గుద్దితే మూతి కూడా పగిలింది. “జై శ్రీరామ్” ఏడుపు గొంతుతో యెలుగెత్తి అన్నాడు. అయినా గూబ గుయ్‍‍‌మంది. “జై శ్రీరామ్... జై శ్రీరామ్... జై శ్రీరామ్...” కొట్టడం ఆపుతారని అరుస్తూనే వున్నాడు. దెబ్బలు పడుతూనే వున్నాయి. జై శ్రీరామ్ అనడం ఆగిపోయింది. సొమ్మసిల్లిపోయాడు. ముఖమ్మీద నీళ్ళు చల్లారు. జుత్తుపట్టి తల పైకెత్తి ముఖమ్మీద నీళ్ళు చల్లారు. ఉబ్బిన కళ్ళతో నోటివెంట చొంగ కారుస్తూ చూస్తున్నాడు. “చెప్పు” గద్దించింది
సంపాదకీయం

బీహార్‌లో ఎన్నికల కమిషన్‌ గెలుపు

కొంచెం అటూ ఇటూగా బీహార్‌ ఎన్నికల ఫలితాలను ఇలాగే ఉంటాయని అనుకున్నారు. కేవల ఊహ కాదు.  ఓట్‌ చోరీ ఆధారం. అనుకున్నదే సత్యమని తేలినప్పుడు దిగ్భ్రాంతి కలుగుతుంది. ఈ ఫలితాలు రాబోయే ప్రమాదాన్ని గాఢంగా సంకేతిస్తున్నాయి. ఓట్‌ చోరీ ఏ స్థాయిలో జరిగిందో, అదే స్థాయిలో అది బట్టబయలైంది. బీజేపీ అకృత్యాలను బైటపెట్టడంలో రాహుల్‌ గాంధీ  పరిణతి సాధించాడని చాలా మంది అనుకున్నారు. ఎన్నికల జాబితా అన్యాయాలపై  సాక్ష్యాధారాలతో, గంభీరమైన సూత్రీకరణలతో మాట్లాడి ఓట్ల నేతల్లో భిన్నమైన మనిషి అనిపించుకున్నాడు. ఆయన వాదనలేవీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయలేదని కూడా తేలిపోయింది. మనుషులు ఎంత అతార్కిక మన:స్థితిలో ఉన్నా
సంస్మరణ

ఒకే మనిషిని ఎన్ని మార్లు ఉరి తీస్తే రాజ్యం కక్ష తీరేను?!

ఈ రోజు డిసెంబర్ 1 భూమయ్య కిష్టగౌడ్ లను ఉరి తీసిన రోజు. భూమయ్య, కిష్టాగౌడ్ లు మనుషులు - సామాన్యులు. అసామాన్యులు.  తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని కమ్యూనిస్టు పార్టీతో పాటు కొనసాగుతూ, నక్సల్బరీ వసంత మేఘ గర్జనతో విప్లవపార్టీ లోకి వచ్చి వర్గశత్రు నిర్మూలన పిలుపుతో ప్రేరణ పొంది గిన్నెదరి భూస్వామి లచ్చు పటేల్ ను చంపిన కేసులో వాళ్లకు ఉరిశిక్ష పడింది. 1972లో ఉరి శిక్ష పడేదాకా వాళ్లను వరంగల్ జైల్లో ఉంచి, ఉరిశిక్ష పడినాక సికింద్రాబాద్ జైలుకు మార్చారు. తెలంగాణలో ఉరిశిక్షలు అమలు చేసే జైలు అదొక్కటే.  నైజాంకు ఉరిశిక్ష అంటే పాపభీతి
మీరీ పుస్తకం చదివారా ?

అమ్మ‌కు జేజేలు

విమర్శకు ప్రమాణాలు ఏమిటి? వొక రచన బాగుందా లేదా అని చెప్పడానికి ఏమైనా తూనికరాళ్లున్నాయా? మాట్లాడుతున్న విమర్శకులు ఏ సాహిత్యప్రక్రియ గూర్చి మాట్లాడుతున్నారు? కవిత్వము, కథ, నవల, నాటకం ఇలా ఉండగా అన్నింటనీ వొకే గాడిన కట్టేస్తున్నారా? తెలుగు విమర్శ ఎంత అత్యున్నతంగా ఎదిగందంటే ప్రమాణాలు లేవు అనే పేలవమైన కామెంట్లు చేసే స్థితికి చేరింది. పోనీ ప్రమాణాలేవో చెబుతారా అంటే అలా కూడా చెప్పరు. ఈ తరహా ఆలోచన తిరోగమనస్థితికి సంకేతం. ఈ సంక్లిష్ట, సందిగ్ధ సందర్భంలో వొక కవిత్వంలో ప్రమాణాల గూర్చి చర్చిద్దాం. నీలిమ విపస్‌ రావు కవిత్వం ఆగ్రహి చూద్దాం. ఈ కవిత్వంలో ఉన్న 
నివాళి

ప్ర‌జాక‌వి అందెశ్రీ‌కి జోహార్లు

 తెలంగాణ ప్ర‌జాక‌వి అందెశ్రీ (అందె ఎల్ల‌య్య‌) హైద‌రాబాద్‌లో సోమ‌వారం (2025 నవంబర్ 10 న) హ‌ఠార్మ‌ర‌ణం పొందారు. తెలంగాణ‌ గుండె క‌నీసం మూడు ద‌శాబ్దాలపాటు ఆయ‌న గొంతుక‌లో కొట్లాడింది.  1960వ ద‌శకం తొలి రోజుల్లో ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా జ‌న‌గామ స‌మీపంలోని రేబ‌ర్తి అనే గ్రామంలో నిరుపేద కుటుంబంలో అందె ఎల్ల‌య్య జ‌న్మించారు. బాల్యంలోనే కుటుంబమంతా చెల్లాచెదురైంది. దీంతో అనాథగా బతికారు. బడికివెళ్లి చదువుకొనే అవకాశం లేదు. అదే ఊరిలో మల్లారెడ్డి, సూరమ్మ దంపతులు ఆయ‌న‌ను చేరదీశారు. వాళ్ల దగ్గరే ఉంటూ పశువులు కాస్తూ, పనుల్లో సాయపడేవారు.  మల్లారెడ్డి దగ్గరే భారతం, భాగవతాలు కంఠతా పట్టారు. బాల్యం నుంచే
వ్యాసాలు

తీవ్ర పేదరికం లేని రాష్ట్రంగా కేరళ ప్రకటించుకోవడం అణగారిన వర్గాలు ఎదుర్కొంటున్న కఠిన వాస్తవాలను దాచాడమే

2025 అక్టోబర్ 31 ఆశా కార్యకర్తల తర్వాత, ఆదివాసీ సంఘాలు కూడా కేరళ ప్రభుత్వం నిర్వహించబోయే "తీవ్ర పేదరికం లేని రాష్ట్రం" ప్రకటన కార్యక్రమంలో సినీ నటులను పాల్గొనవద్దని విజ్ఞప్తి చేశాయి. ఈ ప్రకటనను అవి "తప్పుదారి పట్టించే ఎన్నికల ఎత్తుగడ"గా అభివర్ణించాయి. ఆదివాసీ గోత్ర మహాసభ, ఆదిశక్తి సమ్మర్ స్కూల్‌లు చేసిన ఒక సంయుక్త ప్రకటనలో, నవంబర్ 1 (కేరళ ఆవిర్భావ దినం) రోజున చేయబోయే ఈ ప్రకటన ఆదివాసీలు, దళితులు, మత్స్యకారులతో సహా అణగారిన వర్గాలు ఎదుర్కొంటున్న కఠిన వాస్తవాలను దాచిపెడుతోందని పేర్కొన్నాయి. అధికారిక కార్యక్రమానికి సినీ నటులు మోహన్‌లాల్, మమ్ముట్టి, కమల్ హాసన్‌లను ఆహ్వానించడం
విశ్లేషణ

విచారణ కోరుతూ.. ఏకాంత నిర్బంధాన్ని నిరసిస్తూ.. పోరాటంలో ఇద్దరు ఖైదీలు

తెలంగాణ రాష్ట్రంలోని చెర్లపల్లి జైలు నుండి చంచల్‌గూడ జైలుకు బదిలీ చేసిన ఒక రాజకీయ ఖైదీ, పగటిపూట తన జైలు గది (సెల్) బయట గడిపే కనీస హక్కు — కాస్సేపు ఎండలో నిలబడే — అలాగే ఖైదీలకు చట్టపరంగా కల్పించిన హక్కులను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, తొమ్మిది రోజులపాటు నిరాహార దీక్ష చేపట్టాడు. అదే సమయంలో, ఒడిశాలో ఉన్న మరో రాజకీయ ఖైదీ సుప్రీంకోర్టు సత్వర పరిష్కారం జరపమని ఆదేశమిచ్చినప్పటికీ తన కేసుల పరిష్కరణలో జరుగుతున్న జాప్యాన్ని గురించి రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించాడు. ఆసుపత్రి మంచం మీద నుంచే ఇరవై రోజులపాటు నిరాహార దీక్ష
ఆర్ధికం

మోడీ ఏలుబడిలో అప్పుల భారతం

మోడీ ఏలుబడిలో అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.  2026 మార్చి నాటికి మొత్తం అప్పు రూ. 191 లక్షల కోట్లు దాటనుంది. దేశంలోని ఒక్కొక్కరి నెత్తిపై రూ.1.37 లక్షల అప్పు ఉంది. యేటా చెల్లిస్తున్న వడ్డీ రూ. 12,76,338 కోట్లు. కేంద్ర ప్రభుత్వం చేసే అప్పులే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల అప్పులు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఈ అప్పులను తీర్చడానికి ప్రభుత్వాలు సహజంగానే ఆదాయాలు పెంచుకోవడం తప్ప మరో మార్గం లేదు. ఈ ఆదాయాలు పెంచుకోవడానికి ప్రభుత్వాలు ప్రజల మీద విపరీతమైన భారాలు వేస్తున్నాయి. ఖర్చులు తగ్గించుకోవడం పేరు మీద ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకపోవడం, సంక్షేమ పథకాలలో
అనువాదం

స్వత్రంత్ర భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ:అదానీ బొగ్గు ప్రాజెక్టుకు వ్యతిరేకంగావేలాది ఆదివాసుల సభ

2025 నవంబర్ 11 జల్ జంగల్ జమీన్‌ను సమూలంగా నాశనం చేయకండి ఝార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలో ఉన్న బర్కాగావ్ బ్లాక్‌లో ఇంతకుముందెన్నడూ జరగనంత పెద్ద  మహాపంచాయత్‌ వైపు ప్రజలు నడుస్తుంటే, “గావ్ చోడబ్ నహీ, జంగిల్ చోడబ్ నహీ, మై మాటి చోడబ్ నహీ, లడై చోడబ్ నహీ…” (మేము మా గ్రామాన్ని విడిచిపెట్టము, అడవులను విడిచిపెట్టము! మా భూమి తల్లిని వదలం, పోరాటాన్ని ఆపము…) అనే విప్లవ ఆదివాసీ గీతం స్పీకర్ల ద్వారా బిగ్గరగా వినిపిస్తోంది. ఒడిశాలోని కాశీపూర్ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకం, పారిశ్రామికీకరణలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పాల్గొన్న ప్రముఖ ఆదివాసీ నాయకుడు భగవాన్ మాజీ
సమకాలీనం

 ‘నూతన భారతం’లో ఆదివాసుల సంక్షోభం

నవంబర్ 15న బిర్సా ముండా జయంతి సందర్భంగా, మోదీ ప్రభుత్వం మళ్లీ ఘనంగా “జనజాతి గౌరవ దివస్”ను జరిపి, దేశ జనాభాలో దాదాపు 9 శాతం ఉన్న ఆదివాసుల శ్రేయస్సు కోరేవారిగా తనను తాను చూపించుకుంటోంది. మరోవైపు, ఇటీవల, ప్రభుత్వం లదాఖ్‌లోని ఆదివాసుల రాజ్యాంగపరమైన డిమాండ్ కోసం జరిగిన ప్రజాస్వామ్య పోరాటాన్ని దారుణంగా అణచివేసింది. మణిపూర్‌లో ఆదివాసీ-స్థానిక సముదాయాల పైన రెండేళ్ల హింస తర్వాత కూడా పరిస్థితి సాధారణ స్థితికి రాలేదు. మావోయిజం నిర్మూలన పేరుతో బస్తర్‌లో ఆదివాసులపై పోలీసుల అణచివేత జరుగుతోంది. జార్ఖండ్ సహా ఇతర రాష్ట్రాల ఆదివాసులు తమ స్వతంత్ర మతపరమైన కోడ్ (నియమ నిబంధనల