వ్యాసాలు

 ఛత్తీస్‌ఘడ్ హైకోర్టు  తీర్పుః   బొగ్గు పారిశ్రామికుల విజయం

హస్‌దేవ్ అరణ్య అటవీ ప్రాంతంలోని ఘట్‌బర్రా గ్రామ ప్రజలకు ఉన్న అటవీ హక్కులను రద్దు చేయడాన్ని సమర్థిస్తూ 2025 అక్టోబర్ 8న ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు నిజంగా ఒక న్యాయ అవహేళన. ఇది కేవలం ఒక తీర్పు కాదు; ఆదివాసులను మాట్లాడనీయకుండా చేసి, బొగ్గు మాఫియాలకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయం. ఈ తీర్పు అటవీ హక్కుల చట్టం-2006 కింద ఇచ్చిన హక్కులను రద్దు చేయడమే కాకుండా, తరతరాలుగా ఈ అటవీ ప్రాంతాలను సంరక్షిస్తున్న ఆదివాసుల జీవనాధారాన్ని, గౌరవాన్ని కూడా ఆటపట్టిస్తోంది. అంతేకాదు, దీనివల్ల “అభివృద్ధి” అనే పేరుతో అడ్డూ అదుపూ లేకుండా  పరిశ్రమల విస్తరణకు అనుమతినిస్తోంది. భారతదేశ
సమకాలీనం

అదానికి ప్రతిఘటన అదాని బొగ్గు గనుల ప్రతిపాదన బహిరంగ విచారణలో ప్రజా నిరసన

పరిపాలనాధికారులు, కలెక్టరు, ఎస్‌డీఎంలు మాట్లాడాలనుకుంటే గ్రామాలకు రావాలి. గ్రామంలోని ప్రజల మధ్య మాట్లాడాలి. సార్, మాకు ఇంతే తెలుసు, మా భూమిని అదానీకి గానీ, ఇంకెవరికీ గానీ ఇవ్వాలని మేము అనుకోవడం లేదు. ఈ దేశం రాజ్యాంగం ప్రకారం నడవాలి, రాజ్యాంగబద్ధ పాలన ఉండాలి తప్ప, ఏ ఒక్క పారిశ్రామికవేత్త కనుసన్నలలో జరిగేది  కాదు. భూమికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కేవలం ట్రస్టీలే (ధర్మకర్తలే) తప్ప యజమానులు కారని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ భూమిపై ఎవరికి హక్కు పత్రం (అధికార పత్రం) ఉందో వారే యజమాని. చిన్న రైలు మార్గం నిర్మించి, దాని ద్వారా రవాణా
కవిత్వం

వాళ్ళు..

వాళ్లు నిప్పు రవ్వలు వాళ్లు వెలుగు దివ్వెలు వాళ్ళు నీటి ఊటలు వాళ్ళు స్వచ్ఛ చెలిమలు వాళ్ళుఉప్పొంగిన నదీ ప్రవాహాలువాళ్లు పోటెత్తిన సంద్రపు అలలు వాళ్ళు తీరంతో విరామమెరుగకతలపడుతున్న తుఫాను హోరులు వాళ్ళను గురించి ఏమని చెప్పేది ఎంతని చెప్పేదివాళ్ళు లేని కాలాన్ని.. ఎలా ఊహించేది..వాళ్ళు ఉండనిలోకాన్నీ.. వాళ్ళు లేరన్న స్పృహను.. ఎలా భరించేది.. వాళ్లు రారన్నా వార్తను ఎలా తట్టుకునేది?!! తూరుపు అరుణిమలు వాళ్ళు.. తొలిపొద్దు వేకువలు వాళ్ళు.. ఛిద్రమైన మా బతుకు గాయాలకు.. ఆత్మీయ లేపనాలు వాళ్లు.. బూడిదై పోయిన మా బువ్వా.. ఇళ్ళూ..ఇడుపుల్లో.. ఉబికి వస్తున్న పొగల నడుమ.. గుక్కపట్టి ఏడుస్తున్న మా బిడ్డలను
మీరీ పుస్తకం చదివారా ?

కవిత్వ అంతరంగాన్ని శోధించే కవిత్వం

తెలుగులో వస్తున్న సాహిత్యవిమర్శపై ఇటీవల తీవ్రంగా చర్చ జరుగుతున్నది. ఏది విమర్శ? ఏది కాదు.? విమర్శకులు తెలంగాణ ప్రాంతం నుంచి వొకరకమైన విమర్శ రాస్తే, కోస్తాంధ్ర నుంచి, ఉత్తరాంధ్ర నుంచి, రాయలసీమ నుంచి వారి వారి కోణాల్లోంచి దృక్పథాల్లోంచి విమర్శ రాస్తున్నారు. సాహిత్య ప్రక్రియల్లో కవిత్వం, కథ గూర్చి విమర్శ రాసేటప్పుడు మాత్రం అనేక చర్చలు మొదలౌతున్నాయి. కవిత్వాన్ని తీసుకుంటే పదునైన విమర్శ ఏది? అన్నప్పుడు భిన్నవాదనలొస్తున్నాయి. వాస్తవానికి కవిత్వమిలాగే ఉండాలనే ఎవరూ నిర్థారించకపోయినా హృదయాన్ని మీటే కవిత్వానికి కొన్ని సంగతులైతే నిర్ణయించుకున్నారు. ఇందులో కవిత్వ నిర్మాణసూత్రాలైన వస్తువు, శిల్పం, ఎత్తుగడ, అభివ్యక్తి, భావుకత, సాంద్రత, రూపం, సారం
కవిత్వం

   కలీం క‌విత‌లు రెండు

1. కొత్తకాదుఎన్ని ఆటుపోట్లుఎన్ని సంక్షోభాలుఎంత నిర్బంధంఎంత రక్త దారపోతఆటుపోట్లను అధిగమించిసంక్షోభాలను చిత్తుచేసినిర్బంధాన్ని బడ్డలుకొడుతూత్యాగాలతో ఎరుపెక్కిందినక్సల్బరీలో ముగిసిందన్నారుశ్రీకాకుళంలో మొదలుకాలేదా..శ్రీకాకుళంలోవెనకడుగు వేసిందనుకుంటేసిరిసిల్ల, జగిత్యాలలోజైత్రయాత్ర కాలేదా..జంగ్ సైరనూదలేదా..?నల్లదండులు, నయీమ్ ముఠాలుగ్రీన్ హంట్ లు, సల్వాజుడుంలుఆపరేషన్ ప్రహార్లు,ఆపరేషన్ సమాధాన్ లు,అన్నిటిని ప్రజా యుద్ధంతోనేఎదుర్కోలేదా..జనతన సర్కార్ లను ఏర్పరచలేదా..?లొంగుబాట్లు, కుంగుబాట్లువెన్నుపోట్లు, వెనకడుగులుఇవేవీ కొత్తకాదుప్రతీది ఒక గుణపాఠమేగుణపాఠం నుండే కదావిప్లవ పురోగమనంఖచ్చితంగా పురోగమిస్తాంపురోగమిస్తూ విస్తరిస్తాం. 2. అడవివెన్నుపోటుతో అడవికుంగిపోతుందిదోసుకునే దోపిడిగాళ్లకుదారి చూపుతున్న ద్రోహులను చూసి దుఃఖిస్తుంది.తన ఒడిలోని బిడ్డలనుఒక్కొక్కరిని కూల్చుతుంటేతల్లికోడిలా తల్లడిల్లుతుంది.తేదీలను బెట్టితుడిచేస్తామంటూకుట్రదారులు, పెట్టుబడిదారులుఒక్కటై వస్తూ ఉంటేతన బిడ్డల త్యాగాలతోతడిసిన అడవిసగర్వంతో ఎర్రబడిపోరుకు సై అంటున్నదివాడు చిగురించేఆకులను తుంచేస్తేనేను మళ్ళీగర్జించే గన్నులనుకంటానంటున్నది.
ఆర్ధికం

ట్రంప్ విధానాలతో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం

ప్రపంచ దేశాల ఉత్పత్తి, మార్పిడి, వినియోగం కార్యకలాపాల మొత్తాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంటారు. ఇది ప్రపంచ దేశాల మధ్య అంతర్జాతీయ వాణిజ్యం ద్వారా అనుసంధానించబడి ఉంటుంది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన భాగం. ఇది ప్రపంచీకరణలో ఒక భాగం. ఇప్పటికీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాత స్థానంలో చైనా, జర్మనీ, జపాన్‌, భారత్‌లు ఉన్నాయి. అమెరికా అధ్యకక్షుడు ట్రంప్‌ ఏప్రిల్‌ 2న విముక్త దినోత్సవం రోజున ప్రకటించిన దిగుమతి సుంకాల పెంపుతో అకస్మాత్తుగా వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ప్రస్తుత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి, బలహీనమైన వృద్ధి నెలకొంది. అన్నీ
కవిత్వం

విప్లవం పురుడోసుకోక మానదు

పచ్చని అడవి వీరుల నెత్తుటితో తడిసిపోయి రక్తపు మడుగుగా మారొచ్చుఅమాయకపు ఆదివాసీలు ఏదో తెలియని కేసులో బంధించబడొచ్చు మిగిలినవాళ్ళు బానిసలుగా వాళ్ళ నేలని వారే తవ్వుతూ కార్పొరేట్ల కింద నలిగిపోవొచ్చు…..ఎప్పుడూ పేదల గుడిసెల వైపు అడుగు వేయని పాలకులు వారి నేలపై ఫాం హౌస్ కట్టుకుని జల్సాలు చేయొచ్చు ఇంతకంటే ఇంకా ఘోరమైనవి ఎన్నో జరగొచ్చు కానీఏరోజు అయితే …..ఏరోజు అయితే……అడవి లో చివరి మావోయిస్టు ను చంపుతారో నగరంలో మొదటి మావోయిస్టు పుడతాడు నిశీధి చీకటిలో మిణుగురు పురుగుల వెలుగులావిప్లవం పురుడోసుకోక మానదు.
సంపాదకీయం

ఎందుకింత కోపం?

ఏకకాలంలో ఉద్రిక్తతా, నిశ్శబ్దామూ ఉంటాయా? ఆ రెంటి అర్థాలే పొసగవు. అయితే మానవ జీవితం నిఘంటు అర్థాలకు భిన్నమైనది. సామాజిక శాస్త్ర సూత్రాలకూ అది లోబడదు. సామాజిక, రాజకీయ సూత్రాలు జీవితాన్వేషణకు దారి చూపగలవు. జీవితాన్నీ, సమాజాన్నీ ఉన్నతీకరించే సాధనాలుగా ఉపయోగపడగలవు.  ఇది పరిమితి కాకపోగా,  విస్తృతికి అవకాశం ఇస్తుంది. దీన్ని ఎంతగా గ్రహించగలం?   పరస్పర విరుద్ధతల మధ్య సాగుతున్న కాలంలో మనం జీవిస్తున్నాం. ఈ ఎరుక ఒక్కటే మనం ఎటో ఒక వైపు కొట్టుకపోకుండా కాపాడుతుంది. ఆ తర్వాత ఎన్ని వాదనలైనా చేయవచ్చు. మానవాచరణను కేంద్రం చేసుకున్నవాళ్లు వాద వివాదాల్లో పై చేయి కోసం ప్రయత్నించరు. వాదనలు