వ్యాసాలు

జైలు ఆకాంక్షల్లో రచన రూపేష్ అముద్రిత నవల ‘ఖైదీల జ్ఞాపకాలు’

అక్ర‌మ కేసులో  జైల్లో ఉన్న కేర‌ళకు చెందిన రాజ‌కీయ ఖైదీ రూపేష్ నవల ఖైదీల జ్ఞాపకాలు చదువుతున్నప్పుడు నెల్సన్ మండేలా ఆత్మకథలోని ఒక జైలు జ్ఞాపకం గుర్తొచ్చింది. పాతికేళ్ళకు పైగా జైలులో బందీగా ఉన్న మండేలా, దాస్ కాపిటల్ గ్రంథాన్ని జైలులోనే చదివాడు. జైలుకి వెళ్ళక ముందు మండేలా కేవలం కమ్యూనిస్ట్ మేనిఫెస్టో మాత్రమే చదివాడు. దాస్ కాపిటల్ జైలుకు చేరడం అనేది ఆసక్తికరమైన విషయం. జైలు సూపరింటెండెంట్ అశ్లీల రచనలను లేదా హాస్య కథలను మాత్రమే లోపలికి అనుమతించేవాడు. అయితే, ఈ మధ్యలో ఎవరో ఇతర పుస్తకాలతో పాటు దాస్ కాపిటల్‌ను కూడా సూపరింటెండెంట్ ముందు ఉంచారు.
సమీక్షలు

అశాంత, అవిశ్రాంత విజయగాథ

ముందే నిర్ణయమైన పరిస్థితుల మధ్య, నియంత్రించలేని పరిణామాల మధ్య, మనుషులు సొంత వ్యక్తిత్వాల్ని ఎట్లా తీర్చిదిద్దుకోగలరు? జీవితగమనాన్ని తామే నిర్దేశించుకునే ఇచ్ఛను ఎట్లా నెరవేర్చుకోగలరు?  విధింపులను కాదని ఎంపికలను సాధన చేయడం ఎట్లా? యథాస్థితికీ మార్పుకూ మధ్యనే కాదు, అనేక కొత్తదారుల మధ్య, అనేక మంచిదారుల మధ్య దిక్కుతోచని తనాన్ని అధిగమించడం సాధ్యమా? పై ప్రశ్నలను ఉదాహరణలతో సహా చర్చించుకుంటూ పోతే, అది శాంత జీవితం అవుతుంది. ఆమె ప్రయాణాన్ని  దాని ముళ్ల దారుల నుంచి కాలిబాటల నుంచి సొంతంగా వేసుకున్నరహదారుల దాకా,  ఆటుపోట్లు, జయాపజయాలు, రాజీలూ సర్దుబాట్ల తో సహా, బొమ్మకడితే అది ‘చుక్కపొడుపు’ నవల.  శాంత
వ్యాసాలు

భారతి సాహిత్య ధమ్మం

సాహిత్యంలో సామాజికత సామాజిక వాస్తవికత వంటి భావనలు యివ్వాళ కొంతమందికి యెబెట్టుగా కనిపిస్తున్నాయి. సాహిత్యకారులు సమాజంలోకి చూడటం, సాహిత్యంలో సమాజాన్ని పరిశీలించడం, సాహిత్యం ద్వారా సామాజిక చలనాన్ని వ్యాఖ్యానించటం అవసరం లేదని వాళ్ళ ఉద్దేశం. మరీ అంత చేతి దురద వుంటే ఆ పని యే వ్యాసాల్లోనో  చేసుకోండి, కథ నవల వంటి ప్రక్రియల్లో చేయాల్సిన అవసరం లేదని కూడా గొంతు చించుకుని వక్కాణిస్తారు. పతంజలి ‘పిలకతిరుగుడు పువ్వు’ కథలో  సెషన్స్ కోర్టు జడ్జి తన కింది కోర్టు న్యాయమూర్తి(యస్ కోట మున్సీఫ్  మెజిస్ట్రేట్ గంగాధరం)ని సమాజంలోకి తొంగి చూసి వ్యాఖ్యానించినందుకు  తప్పుపట్టి హెచ్చరించినట్టే శుద్ధ సాహిత్యవాదులు కూడా
అనువాదం

మధ్య భారతంలో ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా – ఒక పరిశీలన 

ఢిల్లీలో వాయు కాలుష్య సంక్షోభానికి కారణం లాభాపేక్షతో కూడిన సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనా అని, బీజాపూర్, దండకారణ్యాలలో మావోయిస్టుల జనతన సర్కార్ల రూపంలో ఉన్న పాలనా నమూనాలాంటి ప్రత్యామ్నాయ ప్రజా అభివృద్ధి నమూనాను మనం నిర్మించుకోవాలని నిరసనకారుల్లో ఒకరు మాట్లాడిన  వీడియో వెలుగులోకి వచ్చింది. కాలుష్యం సంక్షోభానికి గల నిజమైన మూలాలను, వాటిని అంతం చేయగల ఏకైక పరిష్కారాన్ని వారు సరిగ్గా, ఖచ్చితంగా ప్రకటించారని మేము భావిస్తున్నాము. మా పత్రిక నాల్గవ సంచికలోని 'ప్రజల ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా, మధ్య భారతదేశంలో పాలన' అనే వ్యాసాన్ని  మా వెబ్‌సైట్‌లో పోస్ట్ చేస్తున్నాం. ఈ వ్యాసాన్ని చదివి, ప్రజలు, ప్రకృతి
వ్యాసాలు

గుడి కట్టి దేశం గాయాన్ని మాన్పగలమా?

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్, ఆర్‌ఎస్‌ఎస్  సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్ సమక్షంలో, కొన్ని సంవత్సరాల క్రితం నిర్మాణం ప్రారంభమైన రామ మందిరం శిఖరంపైన జెండాను ఆవిష్కరిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఈ ధ్వజారోహణం రామమందిర నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు తెలియజేస్తుంది అని అన్నాడు. “శతాబ్దాల నాటి గాయాలు మానిపోతున్నాయి, ఉపశమనం కలుగుతోంది; వందల సంవత్సరాల క్రితం తీసుకున్న సంకల్పాలు నెరవేరుతున్నాయి!” అని కూడా అన్నారు. ఆయన పదేపదే రాముని నామాన్ని ఉచ్చరించాడు; మన అంతరాత్మలో కొలువైన రాముడు, రామరాజ్య భావన నుండి ప్రేరణ పొందిన దేశాన్ని స్థాపించాలని పిలుపునిచ్చాడు. ఈ కార్యక్రమం సమాజంలోని కొన్ని వర్గాలలో ఉత్సవ వాతావరణాన్ని సృష్టించింది;
ఆర్థికం

రూపాయి ఘోర పతనం – శ్రామికులపై భారం

అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ పరిణామాలు, దేశీయంగా వ్యవస్థాగతమైన సమస్యల వల్ల ఇటీవలి సంవత్సరాల్లో డాలర్‌తో భారత రూపాయి మారకపు విలువ తగ్గుతూ వస్తోంది. ఈ నెలలోనైతే దాని విలువ రికార్డు స్థాయిలో పడిపోయింది. ఇప్పుడు ఒక డాలరు కావాలంటే 90 రూపాయలకు పైగా వెచ్చించాలి. రూపాయి విలువ పడిపోవడం వ్యాపారులు, పారిశ్రామికవేత్తలనే కాదు భారతీయ విద్యార్థులనూ ఇబ్బందు ల పాల్జేస్తుంది. విదేశీ చదువుల కోసం విద్యార్థులకు అయ్యే వ్యయం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుంది. డాలర్‌కు అంతర్జాతీయ రిజర్వు కరెన్సీ హోదా ఉంది. దాని విలువ స్థిరంగా కొనసాగుతుండటం మరో అంశం. బంగారం, చమురుతో పాటు ఆహారధాన్యాలు, ముడి ఖనిజాలు తదితరాల
సమకాలీనం

మోడీ కాలంలో మీడియా

(ముంబై నుండి ప్రచురితమయ్యే  మిడ్ - డేలో ఎజాజ్ అష్రాఫ్ ఆరు సంవత్సరాల నుండి రాస్తున్న కాలమ్‌ను ఆపివేశారు. సోమవారం కాలమ్‌లో సమాధి వ్యాసంతో అతను తన కాలమ్ మరణాన్ని ప్రకటించాడు. సీనియర్ జర్నలిస్ట్, ‘భీమా కొరేగావ్: ఛాలెంజింగ్ కాస్ట్’ రచయిత ఎజాజ్ అష్రాఫ్ రాసిన వ్యాసం ఇది – జాన్‌చౌక్ సంపాదకమండలి) ఎందుకంటే అది ఆఖరి శ్వాస తీసుకుంటోన్న ‘మండే బ్లూస్‌’*కి నివాళులర్పించాలని అనిపిస్తోంది; మీరు ఈ రోజు దాని చివరి విడత చదవడం పూర్తి చేయగానే, అది ఎలాంటి హడావిడీ, విచారమూ లేకుండా కనుమరుగైపోతుంది. అయితే, నేను నా ఆలోచనలను చాలా వరకు స్వతంత్రంగా వ్యక్తం
కవిత్వం

అతడి మరణం

అతడి మరణం పొద్దుకు తెలిసిందికన్ను తెరిచే వేళన వేకువ గాయపడ్డది.గుడిసెను తాకుతున్న తొలికాంతికన్నీరులా చల్లబారింది.అతడి మరణం నేలను తాకింది.వాలిపోతున్న సాహసానికి ఒడిని చాపింది. మహా ప్రళయాలకు లొంగని పచ్చని గరిక నెత్తురుగా దుఃఖ పడ్డది.అతడి మరణం గాలినీ తాకింది.శూన్యం కాని శూన్యమంతావెక్కిళ్ళలో ధ్వనించింది.అతడి మరణం ప్రాణాలఆశను ఛేదించిందితత్వశాస్త్రం లయ తప్పినట్టుగానమ్మకాలన్నీ బూడిదకుప్పల్లాతేలిపోయాయి.అణచబడ్డ మానవుల శోకానికిసమాధానమతడు.అతడి మరణం పల్లవి తెగిన పాటలాఎదలో సంచరిస్తోంది.అతడి మరణం అడవిని చేరింది.భాషలేని బాధ దుఃఖమై తడిపింది.సద్దుమణగని నినాదంలాకొండకోనల్లో నిలిచింది.అతడి మరణం నిశబ్దం కాదు.కాగుతున్న డప్పులాకాలానికి కంఠాన్ని పొదుగుతుంది.
కవిత్వం

మ‌హా యోధ

వెన్నెల కురిసిన రాత్రిలోఒక పువ్వు వికసించింది .ఆ పువ్వు వికసించడానికి కారణం చీకటిఅడవి తల్లి రక్షణ కోసం.ఆయుధంలా జన్మించాడుప్రజల స్వప్నాల్లో మొక్కలా మొలకెత్తాడుప్రజల ఆశనే, తన లక్ష్యంగా ములుచుకున్న త్యాగమూర్తి అతడుఅన్యాయాన్ని ఎదిరించి గిరిజన ధీరుడయ్యాడురాత్రీ, పగలు అడవి తల్లిని తన కన్నబిడ్డలా కాపాడాడుఅడవికి, జనాలకు అండగానిల్చిన యోధుడతడుఆ కుమురం భీం నుంచిఈ హిడ్మా దాకా అడవి పోరాటం కొనసాగుంది.
తొలికెరటాలు

సు – ఒక మైలురాయి పుస్తకం

తెలుగు సాహిత్యంలో సైన్స్ ఆధారిత రచనలు చాలా అరుదు. మరీ ముఖ్యంగా ఒక నిర్దిష్ట సైన్స్ సబ్జెక్టును (ఇక్కడ మైక్రోబయాలజీ & ఆంకాలజీ) కేంద్రంగా చేసుకొని, ఫిక్షన్ రూపంలో అందంగా అల్లిన నవలలు దాదాపు లేవని చెప్పవచ్చు (ఉంటే నన్ను కరెక్ట్ చేయండి). అలాంటి ఖాళీని ‘సు’ అద్భుతంగా నింపేసింది. ఇది కేవలం ఒక నవల మాత్రమే కాదు – తెలుగు సాహిత్యంలో సైన్స్-ఫిక్షన్ జానర్‌కు ఒక బలమైన పునాది వేసిన మైలురాయి. చదువుకున్న సబ్జెక్టును సాహిత్యంలో రాయడం అంటే సులువైన పని కాదు. దానికి సబ్జెక్టుపై లోతైన పట్టు, శాస్త్రీయ ఖచ్చితత్వం, అదే సమయంలో పాఠకుడికి ఆసక్తికరంగా