వ్యాసాలు

విద్రోహాలు, అబద్ధాలు, వక్రీకరణలు చెలరేగిన యుద్ధ కాలంలో చారిత్రక సత్య ప్రకటన

*భార‌త విప్ల‌వ పంథా - స‌మ‌కాలీన సందర్బం* పుస్త‌కం ముందుమాట.  డిసెంబ‌ర్ 7న హైద‌రాబాదులో జ‌రిగే స‌ద‌స్సులో ఆవిష్క‌ర‌ణ... వ‌సంత‌మేఘం టీం ఈ పుస్తకంలో ఏముందో చెప్పబోవడం లేదు. లోపలికి వెళ్లితే మీకే తెలుస్తుంది. సందర్భం గురించే నాలుగు మాటలు.  మన చుట్టూ అంతులేని శబ్ద కాలుష్యం. రణగొణ ధ్వని. యుద్ధారావం. మన పక్కన ఉన్నారనుకున్న మనుషులే శతృవు పక్కకు వెళ్లిపోతున్నారు. మనతో గొంతు కలుపుతారనుకున్న వాళ్లే ఇతరుల భాషతో మాట్లాడుతున్నారు. నిజానికి ఏ ఒక్కరి కోసమో, ఏ మార్గం కోసమో చర్చించనవసరం లేదు. దేనినైనా చరిత్రలో భాగంగా చూస్తే చాలు. అందరమూ చరిత్ర ముందు విద్యార్థులమే. కాలగతిని తెలుసుకోగల
కవిత్వం

విప్లవానికి మరణం లేదు

విప్లవం చనిపోదు రక్తం ఎండిపోతే రగిలే మంట అది!నిజం నలిగితే నినదించే గళం అది!గుండెలో దాచిన ఆవేశం కాదు గోళాల కంటే గట్టిగా పేలే శబ్దం అది!జనాల ఊపిరిలో పుడే తుపాన్ అది!అణగారిన ప్రతి కన్నీటిలోనూవిప్లవం మళ్లీ మళ్లీ పుడుతుంది!దాన్ని చంపలేరు, దాన్ని ముంచలేరు దాన్ని నెమ్మదించించలేరు!విప్లవం అంటేన్యాయం కోసం లేచిన గుండె ధైర్యం!మౌనాన్ని విరిచే కేక!అది మన రక్తంలో ముద్రైపోయిన నినాదం!“విప్లవం చనిపోదు — విప్లవం మళ్లీ పుడుతుంది!”
పరిచయం

ప్ర‌జాస్వామ్యం కోసం అన్వేష‌ణ‌

కాలికి బలపం కట్టుకొని అన్నట్టుగా ఈ మధ్య కాలమంతా తెలుగు నేలంతా తెలంగాణ అడుగడుగునా దేశం నాలుగు చెరగులా శాంతి కపోతమై తిరుగాడుతూ, తన ఉపన్యాసాలతో మధ్య తరగతిని, యువతను, విద్యార్థులను చైతన్యవంతం చేస్తూన్న, శాంతి చర్చల మేధావి మనందరికీ సుపరిచితులైన ప్రొఫెసర్ జి. హరగోపాల్ గారి ఇంటర్వ్యూలు, ఉపన్యాసాల వ్యాసాల పుస్తకం ఇది. ఈ పుస్తకాన్ని  రచయిత శాంతి చర్చల సాధనలో నిత్య కృషీవలుడైన ఎస్ ఆర్. శంకరన్ గారికి అత్యంత గౌరవంతో అంకితం చేశారు. ఇది రచన ఆచరణ రెండు చేతులా  చేస్తున్న పాలమూరు అధ్యయన వేదిక ప్రచురణ.  నేటి వ్యవస్థీకృత హింసకు శాంతి చర్చలే
కవిత్వం

వాళ్ళు ఎందుకు వెళ్ళారు?

వాళ్ళు పేరుకోసమే వెళితేవాళ్లకి మారుపేరేందుకు? వాళ్ళు భూమికోసమే వెళితేవాళ్ళ అమ్మ గుడిసెలోనే ఎందుకుంది?వాళ్ళు నిధుల కోసమే వెళితే వాళ్ళ ఒంటికి ఒక్క వెండి ఉంగరమైన ఎందుకు లేదు ? వాళ్ళు వాళ్ళకోసమే వెళితేఈరోజు నిర్జీవంగా ఎందుకు పడున్నారు ? ఆకలి మంటల ఆర్తనాదాన్ని అనుభవించి వెళ్ళారు బాంచెన్ బతుకు ఇక నడవదని నినందించి వెళ్ళారుమానవత్వాన్ని మరిచిన మనకి మనిషితనాన్ని నేర్పించడానికి వెళ్ళారుదోపిడి, దౌర్జ్యాన్ని ఎదిరించి శ్రామిక రాజ్యాన్ని నిర్మించటానికి వెళ్ళారువాళ్ళు మనకోసమే వెళ్ళారుమన బతుకుల్లో వెలుగు కోసం వెళ్ళారునీకు నాకు మనందరికీ హక్కులని పంచడానికి వెళ్ళారువాళ్ళు మనకోసమే వెళ్ళారు మన కోసమే అమరులయ్యారు.
వ్యాసాలు

దిగజారుతున్న ఎన్నికల వ్యవస్థ

ఈమధ్య రెండు సందర్భాలలో భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పైన, ఎన్నికల నిర్వహణ పైన  సమాజంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది.  అందులో ఒకటి బీహార్ శాసనసభ ఎన్నికల సందర్భంగా, భారత ఎన్నికల సంఘం తీరుతెన్నులు,  ఎన్డీఏ కూటమి ప్రభుత్వ  "ఓటు చోరీ"   పైన. రెండవది ఆపరేషన్ కగార్ తో మావోయిస్టు పార్టీ పైన జరుగుతున్న సైనిక,  భావజాల పరమైన దాడుల నేపథ్యంలో.  వారు సాయిధ పోరాట విరమణ చేసి ఎన్నికలలో పాల్గొనాలని. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు  ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం రూపొందించి, ప్రకటించిన తీరు ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్రమైన విమర్శలకు గురికాబడింది. చివరకు ఈ వివాదం
కవిత్వం

వేణు క‌విత‌లు రెండు

1. ప్రియమైన కామ్రేడ్స్మిమ్ముల్ని ఏనాడు కలవనిమీతో ఏనాడు మాట్లాడనిప్రజలు కన్నీళ్లతో మీ చరిత్రను మననం చేసుకుంటున్నారుమీ త్యాగాలను హృదయాలకు హత్తుకుంటున్నారుఇప్పుడు మీ అమరత్వం దేశమంతా ఎర్రజెండాయి పరుచుకుందివీచే గాలిలాప్రవహించే నీరులామీరిప్పుడు గుండె గుండెకు చేరారుకనపడని బంధికాన లాదేశమంతా కాషాయ కంచెలు వేశారుమతోన్మాద హద్దులు గీశారుహద్దులను చేరిపేకంచెలను తొలిచే ఆలివ్ గ్రీన్ యూనిఫామ్ తోమీరిప్పుడు దేశమంతాఎర్రజెండై పరుచుకున్నారు.2. జ్ఞాపకాల జెండాలుబిడ్డలరా మీ జ్ఞాపకాలు మోస్తూ ఎదురుచూస్తున్నాం.....కొడుకులారా మీ ఆశయాలు మోస్తూలక్షలాది పీడిత ప్రజలుయుద్ధం చేస్తున్నారుజ్ఞాపకాలు స్మృతులు ఐనాయిఆశయాలు పోరాటం ఐనాయిబిడ్డలారా ఓ మా బిడ్డలరామీ జ్ఞాపకాలు మా కళ్ళనిండా దాచుకుంటాంమీరెత్తిన ఎర్రజెండాను మా గుండెలనిండా హత్తుకుంటాం.
తొలికెరటాలు

పరుగుల జీవితం

కాలం తన పరుగును ఆపదు. రోజులు మారుతాయి, రహదారులు మారుతాయి, పనులు మారుతాయి…కాని మనిషి హృదయంలో మాత్రం  నిశ్శబ్దం నెమ్మదిగా పెరుగుతూనే ఉంది. దాదాపు పాతికేండ్ల క్రితం మమతా కాలియా గారు రాసిన “పరుగు” నవల. నేటి వేగవంతమైన జీవితాన్ని చూస్తే  నిజమేనని మనకు అనిపిస్తుంది. తరాలు ఎంత మారినా, మనిషి అంతరంగంలో కలిగే ఒంటరితనం మాత్రం మారలేదు. బయట శబ్దం పెరిగింది, లోపల సున్నితమైన నిశ్శబ్దం మరింత గాఢమైంది. మ‌నుషులు  లక్ష్యాల వెంట పరుగెత్తడంలో బిజీగా ఉన్నారు కాని ఆ పరుగులో తన వాళ్ల‌ను,  తన బంధాలను, తన వెచ్చదనాన్ని…చాలా సార్లు త‌మ‌ను తామే  నెమ్మదిగా వెనుక
రిపోర్ట్

రాజ‌కీయ ఖైదీ న‌వ‌ల ప్ర‌చుర‌ణ‌పై ఆంక్ష‌లెందుకు?

కేర‌ళ రాజ‌కీయ ఖైదీ రూపేష్ జైలులో రాసిన "ఖైదీల జ్ఞాపకాలు" అనే నవల ప్రచురణ అనుమతి కోసం విజ్ఞప్తి చేసి దాదాపు ఒక సంవత్సరం అవుతోంది. భావ ప్రకటనా స్వేచ్ఛకు మద్దతిస్తున్నట్లు నటిస్తున్న వామపక్ష ప్రభుత్వం ఈ ప్రచురణ దరఖాస్తుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.  సచ్చిదానందన్ వంటి ప్రముఖ రచయితలు ఈ నవలను చదివి, దీని ప్రచురణను నిరాకరించడానికి ఏమీ లేదని స్పష్టం చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల పరిశీలనలో కూడా, చట్టపరంగా అనుమతిని నిరాకరించడానికి ఎలాంటి కారణం దొరకలేదు. అయినప్పటికీ, ఈ నవల ఒక రాజకీయ ఖైదీ రాసినది కావడంతో, దీని ప్రచురణ వెలుగులోకి రాలేదు.
పత్రికా ప్రకటనలు

  హిడ్మా హ‌త్య చ‌ట్టాతీతం

2025 నవంబరు 18నాడు స్థానిక ఆదివాసీ కార్యకర్త, నక్సలైట్ నాయకుడు మడావి హిడ్మా, అతని కామ్రేడ్, జీవన సహచరి మడకాం రాజేని మరో 11 మందిని చంపినట్లు భారత రాజ్యం విజయవంతంగా ప్రకటించింది. ఈ సైనిక 'విజయం'తో, భారతదేశంలో నక్సలైట్ ఉద్యమాన్ని అంతం చేయడానికి హోం మంత్రి అమిత్ షా ఇచ్చిన 2026 మార్చి 31 గడువును విజయవంతంగా చేరుకుంటున్నట్లు బిజెపి ప్రభుత్వం పునరుద్ఘాటించింది. ఆదివాసీలు, దళితులు, ముస్లింలు, క్రైస్తవులు తదితర అట్టడుగు వర్గాలను లక్ష్యంగా చేసుకుని, ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న పెట్టుబడిదారులు భూమిని, సహజ వనరులను స్వాధీనం చేసుకోవడాన్ని సులభతరం చేయడానికి బిజెపి ప్రభుత్వ అణచివేత విధానాలలో
సమకాలీనం

ఆ విద్యార్థులు చేసిన నేర‌మేమిటి?

When questions become crimes and students become ‘Maoists’; I can’t breathe, Indian edition A young tribal student from Kerala found himself pinned to the ground, a constable straddling his chest and forcing his head into the pavement at an awkward angle while two others yanked at his arms and legs. నవంబర్ 23, ఆదివారం నాడు ఢిల్లీ, ఇండియా గేట్ దగ్గరకు వచ్చిన అనేక మంది నిరసనకారుల మధ్య కేరళకు చెందిన ఒక యువ ఆదివాసీ విద్యార్థి కూడా