కవిత్వం

ఈ కవిత్వం అసంపూర్ణవాక్యం కాదు..

అనాదినుంచీ ఈ మతాలు మనిషికీ మనిషికీ మధ్య మాయగోడలు నిర్మించాయే తప్ప మనుష్యులందర్నీ ఏ మతమూ ఒక్కటిగా చెయ్యలేక పోయింది. అలాచేసే శక్తి ఏ మతానికీ లేదు. పైగా మనిషిమీద మనిషి కుండవలసిన విశ్వాసాన్ని లేకుండా చేస్తుంది మతం. -మహాకవి శ్రీశ్రీ ఇప్పుడు జరుగుతున్నదిదే. మతమనే మారణహోమంలో బలౌతున్నది మాత్రం మనుషులే. మానవ వికాసానికి ఎంతమాత్రమూ ఏ మాత్రమూ ఉపయోగపడని మతంకోసం మనిషి ఎంతటి విధ్వంసానికైనా ఒడిగడతాడు. ఇవాళ ఇజ్రాయిల్‌ పాలస్తీనా యుద్దం సామ్రాజ్యవాదమే కానీ, ఈ సామ్రాజ్యవాదం పెంచిపోషిస్తున్న విషనాగుమాత్రం మతమే. అందుకే కవి మిరప మహేష్‌..                 యుద్దమంటే సాధించడం కాదు                 కోల్పోవడం మాత్రమే