సమకాలీనం

కేసులు కొట్టేసినా, జైలు నుంచి విడుద‌లైనా దొర‌క‌ని స్వేచ్ఛ 

2022 మే లో రతీరామ్ మాంఝీ మావోయిస్టు ఆరోపణల నుండి విముక్తి పొందారు, కానీ ఆ ఆరోపణల నీడ ఆయనను ఇంకా వెంటాడుతూనే ఉంది. హత్య, అల్లర్లు, ఆయుధ చట్టం, క్రిమినల్ లా అమెండ్‌మెంట్ యాక్ట్ కింద మహువాటాండ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో బొకారోలోని ఒక సివిల్ కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. ఈ తీర్పుతో సుదీర్ఘ న్యాయపోరాటం ముగిసినప్పటికీ, ఆయన జీవితం గతంలోలాగా సాధారణ స్థితికి చేరుకోలేదు. మిగిలిందల్లా పోలీసుల వేధింపులు, సామాజిక వివక్షతో కూడిన సంవత్సరాల తరబడి అవమానాలే. దీని పర్యవసానాలు ఆయనతోనే ఆగిపోలేదు, ఆయన కుటుంబాన్ని కూడా తాకాయి. ఒక పాఠశాల తన
అనువాదం

సుదీర్ఘ జైలు శిక్ష:  జీవితాన్ని కోల్పోయిన  పాండు నరోటే, కంచన్ నానావారే, స్టాన్ స్వామి 

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాకు చెందిన 33 ఏళ్ల ఆదివాసీ యువకుడు పాండు పోరా నరోటెని, నిషేధిత మావోయిస్ట్ పార్టీ, దాని అనుబంధ సంస్థ రివల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్‌తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపైన 2013 ఆగస్టులో అరెస్టు చేసారు. ఆ తరువాత ఈ కేసును ఢిల్లీ యూనివర్సిటీ పూర్వ ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబా, మరికొంత మంది మీద పెట్టారు. నరోటెను, ఇతర నిందితులను చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణా చట్టం (ఉపా)లోని పలు నిబంధనలు, భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 120-B కింద దోషులుగా నిర్ధారించి, 2017 మార్చిలో, గడ్చిరోలి సెషన్స్ కోర్టు వారిలో చాలా మందికి జీవిత ఖైదు విధించింది.