సంపాదకీయం

ప్రజా యుద్ధమే కా. హన్మంతు జీవన సందేశం

మావోయిస్టు పాక హన్మంతు అంత్యక్రియలకు పదిహేను వేల మంది వచ్చారని పత్రికలు రాశాయి. ఈ మాటకు మీలో కొందరైనా  'ఆఁ వస్తార్లెండీ, చనిపోయినప్పుడు. చివరిసారి చూద్దామని. ఆదేమీ ఆ ఉద్యమ బలం కాద'ని అంటారు. అందులో ఏ అర్థ‌మూ లేద‌ని అంటారు. ఇంత జన సందోహం ఆయనకు వీడ్కోలు పలికిందని అంటే 'మరణాన్ని సెలబ్రేట్ చేస్తున్నార'నే మేధావులు మీలో ఉంటారు. జీవితం, మరణం అవిభాజ్యమనే ఎరుక ప్రజలకు ఉంటుందని అంటే, 'సిద్ధాంతం గురించి మాట్లాడకుండా ప్రజల కామన్సెన్స్ చూసి సంతృప్తి చెందుతున్నార'ని అనే వాళ్లు మీలో తప్పక ఉంటారు. ఇంతకూ ప్రజల్లో ఎవరు ఉన్నారు? వాళ్ల మనో ప్రపంచాన్ని
సంపాదకీయం

అల్లూరి నుంచి హిడ్మా దాకా అదే రక్తసిక్త చరిత్ర

అమరులు మడావి హిడ్మా, రాజే, సహయోధుల ఎన్‌కౌంటర్‌ హత్యలు ఏ దుర్మార్గమైన సామ్రాజ్యవాద దళారీ నిరంకుశ బ్రాహ్మణీయ ఫాసిస్ట్‌ స్వభావానికి దాఖలా! రాజ్య వైఖరి ప్రభుత్వాలతో మారుతుందా, మారిన పరిస్థితులతో మారుతుందా? మారిన పరిస్థితులు అంటే ఏమిటి! బిహార్‌ ఎన్నికల తర్వాత, టు లవ్‌ విత్‌ సర్‌ కాదు, సర్‌తో కళ్ళు తెరుచుకున్న ఉదారవాద ప్రజాస్వామ్యవాదులు పార్లమెంటు ఎన్నికలను బహిష్కరించమని చెప్తున్నారు. ఎన్నడో చెప్పాడు చారుమజుందార్‌ ఈ మాట. ఎప్పుడో చేసి చూపింది నక్సల్బరీ పంథా. హిడ్మా ఆయన సహాయోధుల ఎన్‌కౌంటర్‌ జరిగిన తీరు చూడండి. శత్రువు చాలా స్పష్టంగా ఏం చేస్తున్నాడు. 2024 ఎన్నికల ముందు నుంచే
సంపాదకీయం

బీహార్‌లో ఎన్నికల కమిషన్‌ గెలుపు

కొంచెం అటూ ఇటూగా బీహార్‌ ఎన్నికల ఫలితాలను ఇలాగే ఉంటాయని అనుకున్నారు. కేవల ఊహ కాదు.  ఓట్‌ చోరీ ఆధారం. అనుకున్నదే సత్యమని తేలినప్పుడు దిగ్భ్రాంతి కలుగుతుంది. ఈ ఫలితాలు రాబోయే ప్రమాదాన్ని గాఢంగా సంకేతిస్తున్నాయి. ఓట్‌ చోరీ ఏ స్థాయిలో జరిగిందో, అదే స్థాయిలో అది బట్టబయలైంది. బీజేపీ అకృత్యాలను బైటపెట్టడంలో రాహుల్‌ గాంధీ  పరిణతి సాధించాడని చాలా మంది అనుకున్నారు. ఎన్నికల జాబితా అన్యాయాలపై  సాక్ష్యాధారాలతో, గంభీరమైన సూత్రీకరణలతో మాట్లాడి ఓట్ల నేతల్లో భిన్నమైన మనిషి అనిపించుకున్నాడు. ఆయన వాదనలేవీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయలేదని కూడా తేలిపోయింది. మనుషులు ఎంత అతార్కిక మన:స్థితిలో ఉన్నా
సంపాదకీయం

ఎందుకింత కోపం?

ఏకకాలంలో ఉద్రిక్తతా, నిశ్శబ్దామూ ఉంటాయా? ఆ రెంటి అర్థాలే పొసగవు. అయితే మానవ జీవితం నిఘంటు అర్థాలకు భిన్నమైనది. సామాజిక శాస్త్ర సూత్రాలకూ అది లోబడదు. సామాజిక, రాజకీయ సూత్రాలు జీవితాన్వేషణకు దారి చూపగలవు. జీవితాన్నీ, సమాజాన్నీ ఉన్నతీకరించే సాధనాలుగా ఉపయోగపడగలవు.  ఇది పరిమితి కాకపోగా,  విస్తృతికి అవకాశం ఇస్తుంది. దీన్ని ఎంతగా గ్రహించగలం?   పరస్పర విరుద్ధతల మధ్య సాగుతున్న కాలంలో మనం జీవిస్తున్నాం. ఈ ఎరుక ఒక్కటే మనం ఎటో ఒక వైపు కొట్టుకపోకుండా కాపాడుతుంది. ఆ తర్వాత ఎన్ని వాదనలైనా చేయవచ్చు. మానవాచరణను కేంద్రం చేసుకున్నవాళ్లు వాద వివాదాల్లో పై చేయి కోసం ప్రయత్నించరు. వాదనలు
సంపాదకీయం

సాయుధ ప్రతిఘాతుకం.. ఉల్కా పతనం

 14 అక్టోబర్‌ కామ్రేడ్‌ అక్కిరాజు హరగోపాల్‌ రెండేళ్ల క్రితం దండకారణ్యం - బస్తర్‌లో మరణించిన రోజు - అమరత్వం పొందిన రోజు.  జీవిస్తాం జీవిస్తాం ప్రజల కోసమే జీవిస్తాం..  మరణిస్తాం మరణిస్తాం ప్రజల కోసమే మరణిస్తాం..  అని 11 అక్టోబర్‌ 2004లో గుత్తికొండ బిలం అమరుడు చారుమజుందార్‌ స్మారక స్థూపం దగ్గర వేలాది మంది ప్రజల ముందు దేశంలోని కోట్లాది పీడిత ప్రజలకిచ్చిన మాట ఆయన నిలుపుకున్నాడు. అప్పటికొక 25 ఏళ్లుగా సాయుధ విప్లవాచరణలో ఉన్నాడు.  నల్లమల విప్లవోద్యమ నిర్మాణానికి నాయకత్వం వహించాడు. సాయుధ విప్లవ శాంతి స్వాప్నికుడుగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో చర్చలకు వెళ్లే రెండు విప్లవ పార్టీల
సంపాదకీయం

ఈసారి లోపలి నుంచి…

చుట్టుముట్టు యుద్ధంలో చిక్కుకపోయిన విప్లవోద్యమం మీద లోపలి నుంచి విమర్శలు మొదలయ్యాయి. విప్లవోద్యమం కాల్పుల విరమణ, శాంతి చర్చల ప్రతిపాదన చేశాక అనేక వైపుల నుంచి సుదీర్ఘ చర్చ కొనసాగుతున్నది. అంతర్యుద్ధాన్ని పోలిన ఈ అణచివేతలో ప్రాణాలు కోల్పోవడం కంటే సాయుధ పోరాట విరమణ చేయడం మంచిదని చాలా మంది సూచించారు. సాయుధ పోరాటాలకు ఇది కానికాలమని, శాంతి చర్చల ప్రతిపాదనకు అనుగుణంగా సాయుధ పోరాటం వదిలేయాలని  కొందరు హితవు పలికారు.   వీటన్నిటికంటే ముఖ్యమైన విమర్శ మరోటి ఉంది. మావోయిస్టుపార్టీ ఎంచుకున్న పంథా వల్లనే ఈ అణచివేత, వైఫల్యాలు ఎదురయ్యాయని, మారుతున్న ప్రపంచాన్ని మావోయిస్టులు అర్థం చేసుకోలేకపోతున్నారని, పిడివాద,
సంపాదకీయం

జైలు గోడల మీదా, ఆడవి అంచుల మీదా..

మోడెం బాలకృష్ణ అంటే జైలు పోరాటం గుర్తుకు వస్తుంది. ఆయన విద్యార్థి ఉద్యమం నుంచి మావోయిస్టు పార్టీ కేంద్ర నాయకత్వం దాకా ఎదిగే క్రమంలో ఎన్నెన్ని ప్రజా పోరాటాలు చేశాడో తెలియదుగాని ఖైదీల పోరాటానికి ఆయన సంకేతం. జాతీయోద్యమం కాలంలో జితేందాస్‌ తదితరుల జైలు పోరాటాల తర్వాత మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డిసెంబర్‌ 26, 1994 నుంచి 21 ఫిబ్రవరి 1995 దాకా జరిగిన  రాజకీయ ఖైదీల, జీవిత ఖైదీల పోరాటమే గుర్తుకు వస్తుంది. విప్లవమంటే స్వేచ్ఛా మానవుల నిర్మాణం. దాన్ని  ఈ సమాజంలోని అన్ని వ్యవస్థల్లాగే జైలు తీవ్రంగా అడ్డుకోవాలని చూస్తుంది. మానవులంటే మానవ సంబంధాల సమాహారం.
సంపాదకీయం

అమరావతి ఎప్పటికీ వర్తమానమే…

వర్షం కురుస్తున్నప్పుడు ఆంధ్రుల రాజధాని ఎలా ఉంది అనే సందేహం దూరంగా ఉన్న తెలుగువారికి రావచ్చు. అమరావతి మునకలో ఉందా, లేదా వర్షపు నీటి వెలుపల ఉందా! ఇవి రెండు పాక్షిక సత్యాలు. 'నీరు పల్ల మెరుగు ' అనే సామెత తెలుగువారిదే. ఇరవై  ఎనిమిది   గ్రామాలు పూర్తిగా నీటిలో ఉండవు. కొన్ని గ్రామాలు ఉండవచ్చు. ముప్పై రెండువేల ఎకరాల లో రాజధాని నిర్మాణం జరుగుతున్నప్పుడు భోరున కురిసే వర్షానికి నీరు చేరడం సహజం. దానిని ఒక కాలపు రివాజుగా చూడాలి. వర్షం కురిస్తే భారతీయ నగరాలు జీవనదిలో ఉన్నట్లు ఉన్న దృశ్యాలు  సహజం. అమరావతి కూడా దీనికి
సంపాదకీయం

విప్లవం తీర్చిదిద్దిన మనిషి

ఆగస్టు 13న చత్తీస్ఘడ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో మరో నలుగురు కూడా చనిపోయినట్లు సమాచారం. వాళ్ల గ్రామస్థులు కావచ్చని, అందుకే వాళ్ల వివరాలు ప్రకటించడం లేదని అనుమానం. ఇప్పటికి పోలీసులు ప్రకటించిన ఇద్దరు మావోయిస్టులలో ఒకరు స్థానిక ఆదివాసీ, మరొకరు కర్నూలు జిల్లాకు చెందిన సుగులూరు చిన్నన్న అలియాస్ విజయ్. విప్లవం ఎన్ని అద్భుతాలు చేస్తుందో. ఎందరిని అసాధారణ మానవులుగా తీర్చిదిద్దుతుందో .. చరిత్రను నిర్మించే ఎన్ని సామాజిక సాంస్కృతిక నైతిక పరివర్తనా క్రమాలను ముందుకు నడుపుతుందో. ఇందులో పాల్గొనే కోటానుకోట్ల మందికి ప్రతినిధులనదగిన లక్షలాది మందిని ఉదాహరణలు
సంపాదకీయం

శాంతి, సమానత్వం కోసం..

మావోయిస్టుల కాల్పుల విరమణ ప్రతిపాదన లక్ష్యం సాధారణ ప్రజల ప్రాణ రక్షణేనా? అంతకంటే విశాలమైన ఉద్దేశం మరేదైనా ఉన్నదా? హింస లేని సమాజం కావాలనే వాళ్ల కోరికను ఎలా అర్థం చేసుకోవాలి? అనే చర్చ జరుగుతున్నది. గతంలో మవోయిస్టులకు-ప్రభుత్వానికి మధ్య జరిగిన శాంతి చర్చల్లో అనుకూల, ప్రతికూల ఫలితాలను చూసిన సమాజం అలిసిపోకుండా, నిరాశకు గురికాకుండా మళ్లీ అట్లాంటి ప్రయత్నానికి మానసికంగా సిద్ధమవుతున్నది. ఇది మన సమాజ స్థితిని ఎత్తిపట్టే బలమైన సూచిక. సమాజం చాలా చెడిపోయిందని, ఎవ్వరి గురించి ఎవ్వరికీ పట్టని చైతన్యరహిత దశకు చేరుకున్నదనీ కొందరు అంటూ ఉంటారు. ఇదేమీ దురభిప్రాయం కాదు. అవాస్తవం కానే