బ్రతికించే మాటల్నివాగ్దానం చేసే కవి బాలాజీ
(ఇటీవల విడుదలైన పలమనేరు బాలాజీ కవితా సంపుటి *లోపలేదో కదులుతున్నట్లు*కు రాసిన ముందుమాట ) ఒక ఊరి పేరు చెప్పగానే ఓ రచయిత గుర్తుకు రావడం అసాధారణ విషయం .ఊరు పేరుకి తన కవిత్వానికి,అస్తిత్వాన్ని నిలిపి నిలుపుతూ కొనసాగుతున్న రచయిత పలమనేరు బాలాజీ. ఊరి పేరును ఇంటిపేరుగా స్థిరపరచుకున్నారు. ఈ రచయిత కవిత్వం ,కథ ,నవల, విమర్శ ఇలా నాలుగు స్తంభాలాట ఆడుతూ విజయవంతంగా ముందుకెళ్తున్నారు. గతంలో మాటల్లేని వేళ ,ఇద్దరి మధ్య అంటూ పాఠకుల్ని పలకరించారు. బాలాజీ కవిత్వానికి మనిషితనం కేంద్ర బిందువు. ఎలా ఉండాల్సిన మనుషులు ఇలా ఎందుకు అయ్యారు ?అనేది ఆ కవి చేస్తున్న










