ఆర్థికం

పెరుగుతున్న కుబేరులు, అప్పుల్లో ప్రభుత్వాలు

వరల్డ్‌ ఆఫ్ డెబ్ట్‌ రిపోర్ట్‌- 2025 ని ఐక్యరాజ్యసమితి వాణిజ్యం, అభివృద్ధి కాన్ఫరెన్స్‌ (యుఎన్‌సిటిఎడి) ప్రచురించింది. 2024లో ప్రపంచ ప్రజారుణం రికార్డు స్థాయిలో 102 ట్రిలియన్లకు చేరుకుంది. ప్రపంచ జనాభా 820 కోట్లు. తలసరి సగటు అప్పు ఒక్కరికి రూ 11 లక్షలు ఉంటుంది. ప్రపంచ జిడిపి 110 ట్రిలియన్‌ డాలర్లు కాగా ప్రపంచ రుణం 102 ట్రిలియన్‌ డాలర్లు ఉంది. అంటే మొత్తం జిడిపిలో 93 శాతం వరకు రుణం ఉంటుంది.  అభివృద్ధి చెందుతున్న దేశాలు తీవ్ర‌మైన  రుణ భారాన్ని మోస్తున్నాయి. ఈ నివేదిక 2024 వరకు దృష్టి సారించినప్పటికీ, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇవాళ ఆరోగ్యం,
ఆర్థికం

పాలస్తీనియన్లను తుడిచిపెట్టే  పన్నాగం

ద‌శాబ్దాలుగా ఇజ్రాయెల్ సాగిస్తున్న దురాగ‌తాల‌కు అడ్డు క‌ట్ట  వేయాల‌ని, పాలస్తీనా భూభాగాల ఆక్రమణల‌కు చ‌ర‌మ‌గీతం పాడాల‌ని గాజాలోని హమాస్‌ అనే మిలిటెంట్‌ సంస్థ 2023 అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌ భూభాగాల‌లోకి చొర‌బ‌డి  251 మందిని బందీలుగా చేసుకొని అపహరించింది. దీనికి  ప్రతీకారంగా ఇజ్రాయెల్‌ హమాస్‌ను తుదముట్టించటానికి దాడులు మొద‌లు పెట్టింది.  అప్ప‌టినుంచి ఇజ్రాయెల్‌ మారణకాండ కొనసాగిస్తూనే ఉంది.  గాజా ప్రపంచంలోనే అత్యధిక జన సాంధ్రత గల ప్రదేశం. 22 మాసాలుగా గాజాలో ఇజ్రాయెల్ మాన‌వ హ‌న‌నానికి పాల్ప‌డుతున్న‌ది. ఇప్పటివరకు 85 వేల టన్నుల బాంబులతో ఆ ప్రాంతా న్ని శిథిలాల కుప్పగా మార్చింది. గాజాపై ఇజ్రాయెల్‌ జారవిడిచిన బాంబులు
ఆర్థికం

దండకారణ్యంలో మావోయిస్టులపై కార్పొరేట్ యుద్ధం

బిజెపి ఒక రాజకీయ పార్టీగా నిలదొక్కుకోడానికి కావలసిన బలమైన పునాదిని ఆరెస్సెస్‌ అందిస్తోంది. మాతృసంస్థగా ఆరెస్సెస్‌, దాని రాజకీయ వేదికగా బిజెపి రెండిరటికీ మధ్య సమన్వయం, ఉమ్మడి పని విధానం గత దశాబ్ధ కాలంలో బాగా బలపడ్డాయి. ఫాసిస్టు స్వభావం గల బిజెపి రాజకీయ పార్టీగా ఆధిపత్యం సాధించింది. 11 సంవత్సరాల మోడీ ప్రభుత్వ పాలనలో మనువాద ఫాసిస్టు స్వభావం గల మితవాద, మతోన్మాద, నిరంకుశ శక్తులు బలపడ్డాయి. హిందూత్వ  బడా బూర్జువా-భూస్వామ్య వర్గాలకు ప్రధాని మోడీ ప్రభుత్వం ప్రతినిధిగా ఉంది. ఆ వర్గాల మద్ధతును తన వెనుక బలంగా సమీకరించుకుంది. హిందూత్వ సిద్ధాంత ప్రభావాన్ని విస్తరించి, బడా
ఆర్థికం

మితిమీరుతున్న ప్రపంచదేశాల సైనిక వ్యయం

ప్రపంచవ్యాప్తంగా సైనిక వ్యయం భారీగా పెరిగింది. మారుతున్న భౌగోళిక, రాజకీయ సంబంధాలు, యుద్ధాల నేపథ్యంలో ప్రభుత్వాలు సైనిక భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. తాజా వివరాలను స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (సిప్రి) నివేదిక ప్రకారం భౌగోళిక రాజకీయ అలజడుల కారణంగా ప్రపంచ దేశాల సైనిక వ్యయం రికార్డు స్థాయిలో 2024లో ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాలు తమ సైనిక వ్యయాన్ని పెంచాయి. 2023తో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా ఖర్చు 9.4 శాతం పెరిగింది. వరుసగా పదో సంవత్సరం కూడా సైనిక వ్యయంలో పెరుగుదల ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలకు అద్దం పడుతోంది. 2025లో రక్షణకు అత్యధిక బడ్జెట్‌ను కేటాయించిన
ఆర్థికం

ప్రపంచ సామాజిక నివేదిక

ఐక్యరాజ్యసమితి ఆర్థిక సామాజిక వ్యవహారాల విభాగం, యునైటెడ్‌ నేషన్స్‌ విశ్వవిద్యాలయ ప్రపంచ అభివృద్ధి ఆర్థిక పరిశోధనా సంస్థతో కలిసి రూపొందించబడిన  ‘ప్రపంచ సామాజిక నివేదిక -2025’ ని ఏప్రిల్‌ 24న విడుదల చేసింది. ఇందులో  సామాజిక పురోగతిని వేగవంతం చేయడానికి నూతన విధాన రూపకల్పనను ప్రోత్సహిస్తుంది. పెరుగుతున్న అసమానత, ఉద్యోగ అభద్రత, సామాజిక అపనమ్మకం వంటి అంశాలు ఇందులో చర్చిస్తుంది. పెరుగుతున్న ఆర్థిక అభద్రత, అస్థిరమైన అసమానత స్థాయిలు, క్షీణిస్తున్న సామాజిక విశ్వాసం, సామాజిక విచ్ఛిన్నం ప్రపంచవ్యాప్తంగా సమాజాలను అస్థిరపరుస్తున్నాయి. ప్రపంచ సామాజిక నివేదిక 2025, సమాజాలను భయపెడుతున్న ధోరణులను వెల్లడిస్తుంది. తక్షణ, నిర్ణయాత్మక విధాన చర్యను డిమాండ్‌
ఆర్థికం

ఏకరూప జాతీయ మార్కెట్లు: రైతులకు మరణశాసనం

గత సంవత్సరం మే లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో మెజారిటీ తగ్గిపోయినప్పటికీ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కార్పొరేట్‌ అనుకూల, రైతు వ్యతిరేక విధానాలను అవిచ్ఛిన్నంగా కొనసాగిస్తోంది. మోడీ ప్రభుత్వంపై రైతులకు విశ్వాసం సన్నగిల్లడమే గత మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బిజెపి మెజారిటీ తగ్గిపోవడానికి ప్రదాన కారణం. జెడియు, టిడిపి మద్దతుతో బిజెపి కేంద్రంలో అధికారంలో కొనసాగుతోంది. ఎన్నికలలో వచ్చిన ఫలితాలను గుర్తించడానికి బదులుగా 2017 మందసౌర్‌ రైతుల నిరసనను అమానుషంగా అణచివేసేందుకు ప్రయత్నించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ను వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిగా నియమించడంతో సహా రైతులకు హానిచేసే విధానాలను బిజెపి కొనసాగిస్తోంది. కేంద్రంలో
ఆర్థికం

ట్రంప్‌..టారిఫ్‌..టెర్రర్‌

అందరిదీ ఒక దారి అయితే ఉలిపి కట్టెదొక దారి అన్నట్టుగా ఉంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీరు. దూకుడుతనానికి దుందుడుకు స్వభావానికి డొనాల్డ్‌ ట్రంప్‌ పెట్టింది పేరు. ప్రమాణ స్వీకారం చేసి చేయగానే దుందుడుకుగా మొదటి వారం రోజుల్లోనే పచ్చిగా తన మితవాద అజెండాను ముందుకు తెచ్చారు. అందులో ఒకటి వాణిజ్య యుద్ధానికి తెర తీసింది. అయితే, ఇది ఆయుధాలతో కూడిన యుద్ధం కాదు... ఆర్థికపరమైన యుద్ధం... సుంకాలు, పన్నులతో ఆయన మిత్రులనూ, శత్రువులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోరాకడతో ప్రపంచం ఇప్పటికే ఉత్పాతాలకు సిద్ధపడిరది. కొలంబియాపై సుంకాల మోత మోగించిన ట్రంప్‌,
ఆర్థికం

పోషకాహార లోపం… పాలకుల వైఫల్యం!

నేటి బాలలే రేపటి పౌరులు. బాలల ఆహారం, ఆరోగ్యం, విద్య, మానసిక వికాసానికి తగిన చర్యలు తీసుకోకపోతే ఆ దేశం అభివృద్ధిలో అట్టడుగు స్థాయికి దిగజారుతుంది. ప్రస్తుతం మన దేశంలోని బాలలు అత్యంత దయనీయమైన స్థితిలో ఉన్నారు. దేశం 2021లో ఐదు సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న 7 లక్షల మంది బాలలు చనిపోయారు. వీరిలో 5 లక్షల మంది (70 శాతంకు పైగా) పోషకాహార లోపంతో చనిపోయారని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. తల్లి ఎదుర్కొంటున్న పోషకాహార లోపం పిల్లల మరణాలకు కూడా కారణమౌతున్నది. ఇదేకాలంలో ప్రపంచ వ్యాపితంగా 47 లక్షల మంది పిల్లలు మరణించారు. వీరిలో 24 లక్షల
ఆర్థికం

మాంద్యంలోకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ

1980 దశకంలో నెమ్మదించిన వృద్ధి, వాణిజ్య అసమతుల్యత, క్షీణిస్తున్న సామాజిక పరిస్థితుల్లో సామ్రాజ్యవాద ప్రపంచీకరణ శకం ప్రారంభమైంది. సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాలు అమలులోకి వచ్చిన 1990 నుండి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలో ఆటు పోట్లు ఏర్పడుతోన్నాయి. పర్యావరణ సమస్యలు, యుద్ధాలు. ఫలితంగా వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు సంక్షోభంలోకి జారుకున్నాయి. ద్రవ్యోల్భణం, నిరుద్యోగం, పేదరికం పెరిగింది. ప్రపంచ ద్రవ్య సంస్థలు, కార్పొరేట్లు, ఆయా దేశాలలోని ఆశ్రితులు విపరీత లాభాలు గడిరచి బిలియనీర్లుగా మారుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య, దేశాలలోని ప్రజల మధ్య ఆర్థిక అంతరాలు అనూహ్యంగా పెరిగాయి. మరోవైపు దేశాల రుణభారం పెరిగింది. సహజ వనరుల లూటీ
ఆర్థికం

తగ్గిన ఉపాధి – పెరిగిన నిరుద్యోగం

భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి శరవేగంగా పరుగులు పెడుతూ ఉందని, ప్రపంచంలో అతిపెద్ద ఐదవ ఆర్థిక వ్యవస్థగా ఉందని, త్వరలో ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఏర్పడనుందని, తద్వారా ఉపాధి పెరిగి నిరుద్యోగం, పేదరికం తగ్గుతుందన్న మోడీ ప్రభుత్వ ప్రచారం ఎంత బూటకమో దేశంలో పెరిగిన నిరుద్యోగం, తగ్గిన ఉపాధిని గమనిస్తే తెలుస్తుంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఒ) ఆదాయ అసమానత ఉపాధి దృష్టాంతం భయంకరంగా ఉందని తన నివేదికను 27 మార్చి 2024న విడుదల చేసింది. 2000-2024 వరకు నిర్వహించిన సర్వేల ద్వారా భారత ప్రభుత్వ, రిజర్వు బ్యాంకు లెక్కలను, జాతీయ నమూనా సర్వేను, పీరియాడికల్‌