ఆర్ధికం

మందగిస్తున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ

మాంద్యం అంటే ఆర్థిక కార్యకలాపాలలో గణనీయమైన, విస్తృతమైన, సుదీర్ఘమైన తిరోగమనం, దీనిలో స్థూల దేశీయోత్పత్తి(జిడిపి)తో పాటు ఉద్యోగాల సంఖ్య, పారిశ్రామిక ఉత్పత్తి, అమ్మకాల వంటివి తగ్గుతాయి. సాధారణంగా, వరుసగా రెండు త్రైమాసికాల పాటు జిడిపిలో సంకోచం ఉంటే దాన్ని మాంద్యం అంటారు, అయితే దీనిని అమెరికాలో ''అధికారిక మాంద్యం స్కోర్‌ కీపర్‌'' అయిన నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ ఎకనామిక్‌ రీసెర్చ్‌ (ఎన్‌బిఇఆర్‌) నిర్వచిస్తుంది. మాంద్యం యొక్క ముఖ్య లక్షణాలు 1) ఆర్థిక వ్యవస్థలో మొత్తం పనితీరు తగ్గుతుంది. 2) ఉద్యోగాల సంఖ్య తగ్గి, నిరుద్యోగిత పెరుగుతుంది. 3) కంపెనీలు సరుకులను ఉత్పత్తి చేయడాన్ని తగ్గిస్తాయి. 4) ఈ ప్రభావం
ఆర్ధికం

భారత్‌లో నిప్పుల కొలిమిలా నిరుద్యోగం

భారతదేశ ఆర్థిక రంగాన్ని సవాలు చేస్తున్న ఒక క్లిష్టమైన సమస్య నిరుద్యోగం. అత్యంత కీలకమైన సూచికలలో ఒకటి. ఇది దేశంలోని నిరుద్యోగిత రేటు ఉద్యోగాల లభ్యతను మాత్రమే కాకుండా వివిధ రంగాలలో(వ్యవసాయ, పారిశ్రామిక, సేవా) శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుంది. అధిక జనాభా కలిగిన వ్యవసాయక దేశాలలో ఒకటిగా, విభిన్న శ్రామిక శక్తి కలిగిన దేశంగా, నిరుద్యోగ రేట్‌ ఆర్థిక వృద్ధి, దేశ అభివృద్ధిపై విస్తృతమైన ప్రభావాన్ని చూపుతోంది. పిరియాడికల్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (పిఎల్‌ఎఫ్‌ఎస్‌) నివేదిక ప్రకారం భారతదేశ నిరుద్యోగం రేటు ఏప్రిల్‌లో 5.1 శాతం ఉండగా జూన్‌ 2025 నాటికి 5.6 శాతానికి పెరిగింది. మన
ఆర్ధికం

ఎటూ తేలని చర్చలు.. ఆగని యుద్ధం

రష్యా, యుక్రెయిన్‌ల మధ్య యుద్ధం 2022 ఫిబ్రవరి 24 నుంచి కొనసాగుతోంది. ఈ యుద్ధం కారణంగా ఇరు దేశాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ యుద్ధంలో యుక్రెయిన్‌ సర్వనాశనం కాగా, రష్యా పశ్చిమ దేశాల నుండి ఒంటరి అయింది. యుక్రెయిన్‌పై రష్యా డ్రోన్‌ దాడులు, వైమానిక దాడులు, ఆప్టిక్‌ పైబర్‌ డ్రోన్‌ దాడులు వంటివి జరుగుతున్నాయి. రష్యా పలుసార్లు యుక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపించింది.  రోజురోజుకూ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. యుక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి మొదటి నుంచి అండదండగా నిలుస్తున్న ఐరోపా దేశాలు రష్యా దూకుడుపై ఆగ్రహంతో ఉన్నాయి. యుక్రెయిన్‌ రష్యా మధ్య శాంతి
ఆర్ధికం

పశ్చిమాసియాలో అమెరికా యుద్ధోన్మాదం

మనుషుల శవాల గుట్టలపై, ఎముకల కుప్పలపై, రక్త ప్రవాహాలపై రాజ్యపాలనని సుస్థిర పరచుకునే దుష్ట లక్ష్యంతో దోపిడీ పాలకవర్గాలు కృత్రిమ యుద్ధాలు సృష్టస్తాయని, రెండు దేశాలు లేదా రెండు కూటముల మధ్య జరిగే యుద్ధాలు సారాంశంలో తమ సొంత  దేశ పేద వర్గాలపై సాగే యుద్ధాలు అని లెనిన్‌ చాలా స్పష్టంగా చెబుతాడు. సామ్రాజ్యవాద రక్త పిపాసి, పెట్టుబడి లాభాపేక్ష లేకుండా మానవాళి చరిత్రలో జరిగే యుద్ధాలు దాదాపు అరుదు. ఈ యుద్ధ జ్వాలల్లో సామాన్యులే సమిధలవుతారు. తాజా పశ్చిమ ఆసియా పరిణామాలు కూడా దీనికి మినహాయింపు కాదు. పన్నెండు రోజులపాటు జరిగిన యుద్ధం అటు ఇరాన్‌లోను, ఇటు
ఆర్ధికం

టారిఫ్‌ ఉత్పాతానికి షేర్‌మార్కెట్‌ పతనం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను భ్రష్ఠు పట్టించనున్నారని అంతర్జాతీయ సంస్థలు గగ్గోలు పెడుతోన్నాయి. ప్రపంచ దేశాలపై ట్రంప్‌ విధించిన ప్రతీకార సుంకాలు వాణిజ్య యుద్ధానికి దారి తీస్తుందన్న భయం ఇప్పుడు అమెరికా సహా ప్రపంచమంతటా నెలకొంది. వాణిజ్య యుద్ధానికి తెర లేపి ఇప్పటికే స్టాక్‌ మార్కెట్లను కుప్పకులేలా చేసిన ట్రంప్‌ విధానాలు మరిన్ని ప్రమాదాలను సృష్టించనుందని ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. వర్తమాన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అమెరికాను తలకిందులు చేయాలన్న (డీ డాలకైజేషన్‌) సంకల్పం... అందువల్ల ట్రంప్‌ చర్యలతో అమెరికా భారీగా లాభపడుతుందన్న గుడ్డి విశ్వాసం ఆవరించినట్టుంది. పర్యవసానంగా ఏప్రిల్‌ 3 నుంచి అంతర్జాతీయ
ఆర్ధికం

మందగమనంలో ఆరిక్థ వ్యవస్థ

దేశ ఆర్థిక వ్యవస్థపై అతిగా ప్రచారం చేస్తున్న ప్రధాని మాటలని నమ్మని పెట్టుబడిదారులు విశ్లేషకులు. దేశ ఆర్థిక  వ్యవస్థపై మోడీ సర్కారు గతంలో ఎన్నడూ లేని హైప్‌ను సృష్టిస్తున్నది. తమ పాలనలో భారత్‌ 5వ ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని చెప్పుకుంటున్నది. ఇదంతా తమ పాలనలో తీసుకున్న విధాన నిర్నయాల కారణంగానేనని గొప్పగా ప్రచారం చేసుకుంటున్నది. ఎన్నికల ప్రచార సభల్లో మోడీ నుంచి ఆ పార్టీ కీలక నాయకుల వరకు ఇదే మాటలు చెప్తున్నారు. టివీ డిబేట్లలో, సోషల్‌ మీడియాలో తమ, తమ అనుబంధ గోడీ మీడియా ద్వారా ఆర్థిక వ్యవస్థపై హైప్‌ను బిజెపి ఊదరగొడుతున్నది. అయితే, పెట్టుబడిదారుల్లో మాత్రం
ఆర్ధికం

ఆక్స్ఫామ్: ప్రజల్ని దోచేసున్న గుత్త సంస్థలు

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జనవరి 20-25 తేదిలలో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్య్లూఇఎఫ్‌) 2025 వార్షిక సమావేశం తొలి రోజున (జనవరి 20) ఆక్స్‌ఫామ్‌ సంస్థ ‘టేకర్స్‌ నాట్‌ మేకర్స్‌’ పేరుతో ఆర్థిక అసమానతల నివేదికను విడుదల చేసింది. ఇందులో కీలక విషయాలు వెల్లడిరచింది. బిలియనీర్ల సంపద మునుపెన్నడు లేనంతగా పెరిగిపోయిందని, ప్రపంచవ్యాప్తంగా పేదరికంలో మగ్గుతున్న ప్రజలు అనేక సంక్షోభాలను ఎదుర్కొంటున్నారని నివేదిక నొక్కి చెప్పింది. రోజు రోజుకు ప్రపంచంలోని ధనిక, పేద ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. ఈ విషయం మరోసారి రుజువైంది. మానవజాతి చరిత్రలో ఇంతకుముందెన్నడూ ఎరగని అసమానతలపర్వం ఇప్పుడు సమాజాన్ని
ఆర్ధికం

మందగమనంలో భారత ఆర్థిక వ్యవస్థ

కేంద్ర ప్రభుత్వం ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం,  స్థూల జాతీయోత్పత్తిలో గణనీయమైన ప్రగతిని సాధించడం,  2047 నాటికి అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరడం..వంటి లక్ష్యాలు చెప్పడానికి బాగానే ఉంటాయి. కానీ కేవలం మాటల గారడీతో అభివృద్ధి సాధ్యం కాదని గత పదేళ్ల కాలంలో ప్రత్యక్షంగా చూశాం. మరోవైపు మోడీ ప్రచారానికి భిన్నమైన వాస్తవ దృశ్యాలు ఒక్కొక్కటిగా ఆవిష్కృతమవుతున్నాయి. వర్తమాన కాలంలో భారత ఆర్థిక వ్యవస్థను దట్టమైన చీకట్లు కమ్ముకొన్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని విధంగా క్షీణించిందనేదీ చేదు నిజం. వాస్తవానికి ‘ఆర్థిక వినాశనం’ అని చెప్పవచ్చు. దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారుకుంటుంది.
ఆర్ధికం

‘బేరు’ మంటున్న రూపాయి

విశ్వగురుగా చెప్పుకొంటున్న ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో ప్రపంచ మార్కెట్‌లో రూపాయి విలువ చరిత్రలో ఎన్నడు లేనివిధంగా రికార్డ్‌ పతనాన్ని చవి చూస్తోంది. 2014 మేలో డాలర్‌కు 63 రూపాయలుగా ఉన్న మారకం 2024 డిసెంబర్‌ నాటికి జీవితకాల కనిష్ట స్థాయి రూ.85.25కి పడిపోయింది. ఈ స్థాయిలో పతనం కావడం ముందెన్నడూ లేదు. చరిత్రలో ఇదివరకూ ఎప్పుడూ లేని విధంగా రూపీ క్షీణించడంతో పేద, సామాన్య ధనిక భారతీయులందరిపై ప్రత్యక్షంగా... పరోక్షంగా తీవ్ర ప్రభావం చూపనుంది. వరుస పతనంతో రూపాయి చరిత్రలోనే అత్యంత పేలవ ప్రదర్శనను కనబర్చుతోంది. గడిచిన ఐదేండ్లలో ఈ కరెన్సీ 20 శాతం పైగా పడిపోయింది.
ఆర్ధికం

అస్తవ్యస్తంగా భారత ఆర్థిక వ్యవస్థ

దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తున్నామని పదేపదే ప్రగల్భాలకు పోతోంది మోడీ ప్రభుత్వం. మోడీ మాటలకు క్షేత్రస్థాయి వాస్తవాలకు భిన్నంగా దేశంలో భారీగా నిరుద్యోగం పెరుగుతోంది. ద్రవ్యోల్బణం అదుపు తప్పింది. పిల్లలకు పోషకాహారం దొరకడం లేదు. ఫారెక్స్‌ నిల్వలు హరించుకుపోతున్నాయి. వాణిజ్య లోటు పెరిగిపోతోంది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపి) ఐదు మాసాల కనిష్టానికి పడిపోయింది. 2015-2023 మధ్యకాలంలో 18 లక్షల సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు (యంఎస్‌యంఇ) మూతపడి 24 లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. శ్రామిక శక్తి గణనీయంగా తగ్గింది. రుణభారం పెరిగిపోతోంది. విదేశీ నిధులు రావడం