సవాళ్లను గుర్తించని ఆర్థిక వ్యవస్థ
మోడీ పాలనలో దేశమంతా ఆగమాగంగా తయారయ్యింది. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. వృద్ధిరేటు గాడితప్పింది. డాలర్తో పోలిస్తే, రూపాయి మారకం విలువ చరిత్రలో ఎన్నడూ చూడని కనిష్ఠ స్థాయికి పతనమయ్యింది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. లక్షల కంపెనీలు మూతబడ్డాయి. ఉద్యోగాలు లేక యువత తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయింది. వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొరంటున్న ప్రధాన సవాలు పేదరికం. దాదాపు 28 శాతం జనాభా దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్నారు. దీనివల్ల జనాభాలో ఎక్కువ భాగం ఆర్థిక వ్యవస్థలో పాల్గొనలేకపోతున్నారు. ఇది పేదరికం యొక్క విష వలయానికి దారితీస్తుంది. భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న మరో పెద్ద










