ఆర్ధికం

 అస్తవ్యస్త ఆర్థికం – మానవాభివృద్ధి  డొల్ల

భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తున్నామని పదేపదే ప్రగల్భాలకు పోతున్న మోడీ సర్కార్‌... దీనికి భిన్నంగా దేశంలో భారీగా నిరుద్యోగం పెరుగుతోంది. ద్రవ్యోల్బణం అదుపు తప్పింది. పిల్లలకు పోషకాహారం దొరకడం లేదు. ఫారెక్స్‌ నిల్వలు హరించుకుపోతున్నాయి. వాణిజ్య లోటు పెరిగిపోయింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపి) ఐదు మాసాల కనిష్టానికి పడిపోయింది. 2015-2023 మధ్యకాలంలో 18 లక్షల సూక్ష్మ చిన్న మధ్యతరహ పరిశ్రమలు (యంఎస్‌యంఇ) మూతపడి 54 లక్షల మంది ఉపాధి కోల్పోయారు. శ్రామిక శక్తి గణనీయంగా   తగ్గింది. రుణభారం పెరిగిపోతుంది. విదేశీ నిధులు రావడం లేదు. రూపాయి మారక విలువ పడిపోయింది. ప్రజల ఆదాయాలు తగ్గడంతో ప్రజల
ఆర్ధికం

సెబీలో ‘హిండెన్ బర్గ్’ తుఫాన్

 18 నెలల క్రితం అదానీ గ్రూప్ ఏకపక్ష సామ్రాజ్యాన్ని పునాదులతో కుదిపేసిన అమెరికాకు చెందిన ఫోరెన్సిక్ పరిశోధన సంస్థ హిండెన్ బర్గ్ మరోసారి 'సమ్ థింగ్ బిగ్ న్యూస్ ఇండియా' అంటూ 'ఎక్స్'లో ఆగష్టు 10న పేర్కొన్న గంటల వ్యవధిలోనే బాంబు పేల్చింది. అదానీ గ్రూప్ అక్రమంగా నిధులు మళ్లింపునకు ఉపయోగించిన విదేశీ ఫండ్స్, షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్  ఫండ్స్ లో, బెర్ముడా (బ్రిటిష్), సింగపూర్లో లో గౌతమి ఆదానీ అన్న వినోద్ అదానీ నెలకొల్పిన కంపెనీలో 'సెబి చైర్ పర్సన్' మాధవి పూరి బుచ్' తో పాటు ఆమె భర్త 'ధవళ్ బుచ్'
ఆర్ధికం

కొలువుల సంక్షోభం

అమెరికాలో గత రెండున్నర దశాబ్దాల్లో ఎన్నడూ చూడనంత నిరుద్యోగ సంక్షోభం ఏర్పడిరది. ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసతం అక్కడికి వెళ్లిన వారిలో వేల మంది మాస్టర్‌ డిగ్రీని చేతపట్టుకొని రోడ్ల వెంట తిరగాల్సి వస్తోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ గురించి ‘కాంగ్రెషనల్‌ బడ్జెట్‌ ఆఫీస్‌( సిబిఐ) జనవరిలో విడుదల చేసిన నివేదిక ప్రకారం నడుస్తున్న సంవత్సరం (2024) అమెరికా ఆర్థిక రంగంలో ప్రతికూల ఫలితాలను చవి చూస్తుందని వెల్లడిరచింది. ఫలితంగా 2024లో లక్షలాది ఉద్యోగాలకు కోత పడుతుందని తెలిపింది. అమెరికాలో నిరుద్యోగిత రేటు 2023లో 3.9 శాతం ఉండగా 2024లో 4.4 శాతానికి పెరుగుతుందని సిబిఐ వెల్లడిరచింది.
ఆర్ధికం

రుణ ఊబిలో ప్రపంచ దేశాలు

ప్రపంచ దేశాల రుణభారం ప్రమాదకర స్థాయిలో పెరగడం వల్ల ప్రజల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుంది. ఇవాళ ప్రపంచ దేశాల్లోని ప్రభుత్వాలు అసాధారణంగా 97 ట్రిలియన్‌ డాలర్ల రుణభారాన్ని కలిగి ఉన్నాయి. ఈ మొత్తం దాదాపు ప్రపంచ వార్షిక ఆర్థిక ఉత్పతి కంటే ఎక్కువ. 2023లో అభివృద్ధి చెందుతున్న దేశాలు 847 బిలియన్‌ డాలర్ల వడ్డీని చెల్లించాయి. ఇలాంటి ఆర్థిక ఒత్తిళ్ల మధ్య భవిష్యత్‌ ఆలోచనలను కార్యరూపం దాల్చేలా వ్యవహరించడం కష్టతరమని నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో ఆర్థిక మాంద్యం, మహమ్మారి లేదా ప్రకృతి విపత్తులు వంటి షాక్‌లకు ప్రభుత్వాలు శీఘ్రంగా స్పందించే సామర్థ్యాన్ని కోల్పోతూ వస్తున్నాయని తాజాగా ఐఎంఎఫ్‌
ఆర్ధికం

డీ-డాలరైజేషన్

మొదటి ప్రపంచ యుద్ధ అనంతరం 1920ల నుండి అమెరికా డాలర్‌, బ్రిటన్‌ పౌండ్‌ స్టెర్లింగ్‌ను అంతర్జాతీయ రిజర్వ్‌ కరెన్సీగా   స్థానభ్రంశం చేయడం ప్రారంభించింది. యుద్ధం తర్వాత బంగారం ప్రవాహాలలో అమెరికా గణనీయమైన గ్రహీతగా ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా మరింత బలమైన సూపర్‌ పవర్‌గా అవతరించింది.1944 నాటి బ్రెట్టన్‌ వుడ్స్‌ ఒప్పందం రెండవ ప్రపంచ యుద్ధానంతర అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థను స్థాపించింది. దీంతో అమెరికా డాలర్‌ అంతర్జాతీయ వాణిజ్యం కోసం ప్రపంచంలోని ప్రాథమిక రిజర్వ్‌ కరెన్సీగా మారింది. యుద్ధానంతర కరెన్సీ బంగారంతో ముడిపడి ఉన్న ఏకైక అంతర్జాతీయ కరెన్సీ, ట్రాయ్‌ ఔన్సుకు 35 డాలర్లుగా స్థిరీకరించింది.
ఆర్ధికం

పెరిగిన నిరుద్యోగం – తగ్గిన నిజ వేతనం

వికసిత భారత్‌, అచ్ఛేదిన్‌, అమృత్‌కాల్‌ ఇత్యాది అద్భుతపదజాలంతో ఎన్నికల్లో ఘన విజయాలు సాధించాలని భారతీయ జనతాపార్టీ అనుకుంటూంటే, దేశంలో పరిస్థితులు అంత పచ్చగా ఏమీ లేవని, మోడీ గొప్పగా ప్రకటించిన మేక్‌-ఇన్‌-ఇండియా, స్టార్టప్‌ ఇండియా, స్టాండప్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా వంటి పథకాలు ఏవి యువత ఉపాధికి తోడ్పడలేదు. పైగా పరిస్థితులు మరింత దిగజారిపోతున్నాయని ఇటీవల మానవాభివృద్ధి సంస్థ, అంతర్జాతీయ కార్మిక సంస్థ సంయుక్తంగా నిర్వహించిన తాజా అధ్యయనంలో మనదేశంలో నెలకొన్న నిరుద్యోగ సమస్య తీవ్రతను కళ్లకు కడుతున్నది. పలు అంతర్జాతీయ నివేదికలు ఉపాధి దెబ్బతిన్నదనీ, అసమానతలు ఆకాశాన్నంటాయని, సగం బలం అనుకున్న సంతోషానికి కూడా ఈ దేశపౌరుడు
ఆర్ధికం

ఎలక్టోరల్‌ ఆటోక్రసీగా భారత్‌

స్వీడన్‌(గోథెన్‌బర్గ్‌) ఆధారిత వి-డెమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ‘డెమోక్రసీ రిపోర్ట్‌ 2024’ ని మార్చి 7న విడుదల చేసింది. ప్రజాస్వామ్య నివేదిక 2024 ప్రపంచవ్యాప్తంగా 4,200 మంది ప్రతిభావంతుల సహకారంపై ఆధారపడిరది. 1789 నుండి 2023 వరకు 202 దేశాలకు సంబంధించిన 31 మిలియన్‌ డేటాసెట్‌లను ఉపయోగించుకుంది. వి-డెమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ దేశాలను నాలుగు రకాలుగా వర్గీకరిస్తుంది. అవి: లిబరల్‌ డెమోక్రసీ, ఎలక్టోరల్‌ డెమోక్రసీ, ఎలక్టోరల్‌ ఆటోక్రసీ,  క్లోజ్డ్‌ ఆటోక్రసీ. 2023 నాటికి, ప్రపంచ జనాభాలో 71 శాతం (5.7 బిలియన్ల ప్రజలు) నిరంకుశ పాలనలో నివసిస్తున్నారు. ఇది దశాబ్దం క్రితం ఉన్న 48 శాతం కంటే గణనీయమైన పెరుగుదల. ప్రపంచ జనాభాలో
ఆర్ధికం

పొంతన లేని జిడిపి వృద్ధి అంకెలు

దేశ జిడిపికి సంబంధించి జాతీయ గణాంకాల కార్యాలయం ఫిబ్రవరి 29న విడుదల చేసిన గణాంకాలు ఆశ్చర్యపరిచాయి. నిపుణులను కలవరపరిచాయి. ప్రభుత్వ అంచనాలను, స్వంత డేటాను తారుమారు చేసింది. కారణం ఏమి కావచ్చు? ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన ముడో త్రైమాసికం (క్యూ3)లో జిడిపి 8.4 శాతం పెరిగిందని ఎన్‌ఎస్‌ఓ గణాంకాలు చూపుతున్నాయి. క్యూ1, క్యూ2 వృద్ధి రేటును కూడా సవరించింది. 2023-2024 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో భారత జిడిపి వృద్ధిరేటు విశ్లేషకుల అంచనాలను అధిగమించింది. ఇంతకుముందు త్రైమాసికంలో నమోదైన 8.1 శాతంతో పోల్చితే ఇది అధికం. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన 4.5 శాతం వృద్ధి
ఆర్ధికం

మాంద్యంలోకి ప్రపంచ దేశాలు

ఆర్థిక మందగమన మేఘాలు ప్రపంచాన్ని కమ్మేస్తున్నాయి. ఆ దేశం ఈ దేశం అని లేదు... అగ్రరాజ్యం, చిన్న రాజ్యం అని లేదు. అన్నింటినీ కబళించి వేయడానికి మాంద్యం దూసుకోస్తోంది. ఒకవైపు యుద్ధాలు, యుద్దాలతో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ విబేధాలు మరోవైపు పర్యావరణ మార్పులు, కారణాలేమైతేనేం... ప్రపంచాన్ని క్రమంగా మాంద్యం మేఘాలు కమ్ముకుంటున్నాయి. జపాన్‌ ఇటీవలే ఆర్థిక మాంద్యపు ఛాయల్లోకి జారుకుంది. ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో మూడు నుంచి నాలుగో స్థానానికి దిగజారింది. బ్రిటన్‌ కూడా సాంకేతికంగా మాంద్యంలోకి జారుకుంది. అయితే ఇది ట్రైలర్‌ మాత్రమేనని ఆర్థికవేత్తలంటున్నారు. పదుల సంఖ్యలో దేశాలు ఆర్థిక ఒడిదొడుకులతో విపరీతంగా
ఆర్ధికం

కార్పొరేట్‌ దురాశ వల్లే అసమానతలు

ప్రపంచంలో అత్యంత ధనవంతులైన ఐదుగురి సంపద 2020 నుండి రెట్టింపుకు పైగా పెరిగింది. అదే సమయంలో 4.8 బిలియన్ల (480 కోట్లు) మంది అంటే జనాభాలో 60శాతం మంది మరింత పేదలుగా మారారు. ఈ లెక్కన చూస్తే ప్రపంచంలో ఏ ఒక్కరూ పేదరికంతో బాధపడకుండా ఉండాలంటే 229 సంత్సరాలు పడుతుందని అంచనా వేసిన ఆక్స్‌ఫామ్‌ ఇంటర్నేషనల్‌ ప్రచురించిన నివేదికను దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు సందర్భంగా జనవరి 14న విడుదల చేశారు. ‘ఈ అంతరాలను మేం గమనిస్తున్నాం. కొవిడ్‌, ద్రవ్యోల్బణం, యుద్దాలు వంటి ప్రతికూల పరిణామాలతో కోట్లాది మంది ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. మరోవైపు బిలియనీర్ల సంపద