వ్యక్తిగత గోప్యతకు చెల్లు చీటీ – నూతన టెలికామ్ బిల్లు – 2022
మోడీ పాలనలో పౌరుల వ్యక్తిగత గోప్యత మన దేశంలో ఎండమావిగా మారింది. పెగాసస్ వంటి స్పైవేర్ను రచయితలపై, ప్రతిపక్షాలపై, సామాజిక మేధావులపై, జర్నలిస్టులపై, న్యాయమూర్తులపై ఉపయోగించింది. ఇప్పటిదాకా రహాస్యంగా సాగిస్తున్న నిఘాకు, డేటా చౌర్యానికి చట్టబద్ధత కల్పించేందుకు కేంద్రంలోని మోడీ సర్కార్ వ్యూహాలు పన్నుతున్నది. అందులో భాగంగానే కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇప్పుడున్న ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1985, ఇండియన్ వైర్లెస్ టెలిగ్రఫీ యాక్ట్ 1933, టెలిగ్రాఫ్ వైర్స్ (చట్ట విరుద్ధ స్వాధీనం) యాక్ట్ 1950 స్థానంలో నూతన టెలికాం ముసాయిదా బిల్లు- 2022ను కేంద్రం సెప్టెంబర్లో విడుదల చేసింది. భారత వినియోగదారులు, నియంత్రణ