కొత్త పుస్తకం

ఈ కాలపు అవసరం ఈ పుస్తకం

(ఈ నెల 13 న హైదరాబాదులో విడుదల కానున్న పాణి శాంతి చర్చలు : ప్రజాస్వామ్యం - విప్లవోద్యమం పుస్తకానికి ప్రచురణకర్తలు రాసిన ముందుమాట ) ఈ పుస్తకాన్ని వర్తమాన తెలుగు మేధా సంప్రదాయంలో అత్యవసరమైన, ప్రాసంగికమైన, కీలకమైన రచనగా పరిగణించడానికి మూడు కారణాలున్నాయి.ఒకటి, ఇది ఒక వాదనల సంకలనం. విప్లవోద్యమానికీ ప్రభుత్వానికీ మధ్య చర్చలు జరగాలని, సమాజంలో నెలకొని ఉన్న హింస తగ్గి శాంతి ఏర్పడాలని ఆకాంక్షలు వినిపిస్తున్న సందర్భంలో వ్యక్తమవుతున్న అనేక వాదనలను, అభిప్రాయాలను మదింపు చేసి విప్లవోద్యమం వైపు నుంచి ఒక వాదన వినిపిస్తున్న పుస్తకం ఇది. రెండు, ఇది ఒక ఆశావాదపు ప్రకటన.
కొత్త పుస్తకం

కల్లోల రాజ్యంలో మలిగిపోనిప్రేమ దీపం పుష్కిన్ ‘మాషా’ – నవల

రష్యా ఆద్య కవులకే ఆద్య కవిగా సాహిత్య పితామహుడుగా పేర్కొనబడే అలెగ్జాండర్ పుష్కిన్ (1799 – 1837 = 38 ఏండ్లు) అతిచిన్న వయసులోనే ఒక యువతి విషయంలో మరో యువకునితో జరిగిన ద్వంద యుద్ధంలో గాయపడి చిన్నవయసులోనే మరణించినప్పటికీ అతను సృజించిన సాహిత్యం మాత్రం అజరామరమైనిలిచింది.పుష్కిన్ 189 ఏండ్ల కింద (1836 లో) రష్యన్ భాషలో వ్రాసిన ప్రపంచ ప్రసిద్ధ నవల ‘కెప్టెన్స్ డాటర్’ ఇన్నేండ్ల తరువాత కుమార కూనపరాజు చొరవతో, మోహన్ తలారి ఇంగ్లీష్ నుండి తెలుగులోకి అనువాదం చేశాడు. దాన్ని ‘ఎన్నెలపిట్ట బుక్స్’ వారు జూలై, 2025 లో తెలుగు పాఠకలోకానికి అందించారు.మోహన్ తలారి
కొత్త పుస్తకం

ప్రజాస్వామ్యం లేకుండా శాంతి, శాంతి లేకుండా ప్రజాస్వామ్యం సాధ్యం కాదు

(ఇటీవల విడుదల అయిన *శాంతి చర్చలు - ప్రజాస్వామిక అన్వేషణ * అనే పుస్తకంలోని ముందుమాట) ఈ ప్రచురణ ఒక ప్రయోగం లాంటిది. ఇందులో రెండు ఇంటర్వ్యూలు, ఒక సంస్మరణోపన్యాసం రెండు ప్రసంగ వ్యాసాలు ఉన్నాయి. ఇవి భిన్నమైన ప్రక్రియలు. ఇంటర్వ్యూలు చాలా వరకు అది చేసే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. సంస్మరణ ఉపన్యాసం పూర్తిగా లిఖిత రూపంలో ఉంటుంది. ప్రసంగ వ్యాసాలు సందర్భాన్ని బట్టి ఏ సంస్థ నిర్వహిస్తున్నదో దాన్ని బట్టి ఉంటాయి. అయితే ఈ అన్నింటిలో అంశం దాదాపు ఒకటే కాబట్టి ఒక రన్నింగ్ థీమ్ ఉంది. వీటిలో శాంతి ప్రధానమైన అంశమైనా, శాంతి
కొత్త పుస్తకం

రెడ్‌ జర్నలిస్ట్‌ కామ్రేడ్‌ రేణుక @బి.డి.దమయంతి

(ఐదు భాగాల  మిడ్కో సమగ్ర సాహిత్యంలో   *విముక్తి బాటలో ..*  మూడో సంపుటానికి సంపాదకురాలు రాసిన ముందుమాట. జూలై 18 ,శుక్రవారం హైదరాబాదులో జరిగే  అమరుల బంధు మిత్రుల సంఘం సభలో  ఆవిష్కరణ ) విప్లవోద్యమంలో పాల్గొంటూ ఆ నడుస్తున్న చరిత్రని అనేక పద్ధతుల్లో నమోదు చేసిన ఒక రచయిత, ఒక విలేఖరి కా.గుముడవెల్లి రేణుక. భారత విప్లవోద్యమ చరిత్రలో ఆమె ఒక విశిష్టమైన స్థానాన్ని పదిలపరచుకుంది. తన 55వ యేట క్రూరమైన రాజ్యహింసకు గురై భౌతికంగా మన మధ్య నుండి నిష్క్రమించినా అదే (2025) మార్చి 31 వ తేదీన ఆమె మరణానంతర జీవితం కూడా మొదలయ్యింది.
కొత్త పుస్తకం

రేణుక నుంచి మిడ్కో దాకా

(ఐదు భాగాల  మిడ్కో సమగ్ర సాహిత్యంలో *మెట్ల మీద *, ప్రవాహం * కథా సంపుటాలకు సంపాదకురాలు రాసిన ముందుమాట. జూలై 18 ,శుక్రవారం హైదరాబాదులో జరిగే  అమరుల బంధు మిత్రుల సంఘం సభలో  ఆవిష్కరణ ) తెలుగు సాహిత్యానికీ, ముఖ్యంగా విప్లవోద్యమ సాహిత్యానికీ ఒక గొప్ప చేర్పు కామ్రేడ్‌ గుముడవెల్లి రేణుక (మిడ్కో) సాహిత్యం. రేణుక కథల వల్లే మిడ్కో అంటే మిణుగురు అని అందరికీ తెలిసింది. ఇప్పుడు ఆ కథలు తెలుగు సాహిత్యానికే పరిమితం కావు. పలు భారతీయ భాషల ద్వారా దేశమంతటా ప్రయాణం మొదలుపెట్టాయి. దేశ సరిహద్దులను దాటి విశ్వవ్యాప్త పాఠకులను సంపాదించుకుంటున్నాయి. ఆ
కొత్త పుస్తకం

బాల్యపు జాడలెక్కడ ?

(ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు కాటెపోగు రత్నంయేసేపు (కెఆర్‌వై) కవితా సంపుటి *బాల్యమే శరణార్థి*కి అధ్యాపకజ్వాల/ఉపాధ్యాయక్రాంతి మాజీ ప్రధాన సంపాదకుడుపి. మోహన్‌ రాసిన ముందుమాట. 16వ తేదీ కర్నూలులో ఆవిష్కరణ) కాటెపోగు రత్నంయేసేపు (కెఆర్‌వై) తెస్తున్న మొదటి కవితా సంకలనం యిది. కవితలన్నీ చార్వాక కలం పేరుతో రాసినవే. మొత్తం 25 కవితలు. 12 కవితలు విద్యారంగానికి సంబంధించినవి కాగా, మిగిలినవి వివిధ సందర్భాల్లో జరిగిన సంఘటనలకు స్పందించి అక్షరీకరించిన కవితలు. తనకున్న తాత్విక భావజాల కోణంలోంచి వీక్షించి కవితలుగా మలిచారు. అన్నీ వస్తు ప్రధానమైన కవితా ఖండికలే. భావ ప్రాధాన్యాన్ని బట్టి కవితల్లో శైలి, శిల్పం వాటంతకవే అమరిపోయాయి.
వ్యాసాలు కొత్త పుస్తకం

కులం – విప్లవోద్యమం

(త్వరలో విడుదల కానున్న *కులం - విప్లవోద్యమం* పుస్తకానికి రచయిత  రవి నర్ల రాసిన  ముందుమాట ) కారంచేడు మారణకాండ తరువాత విప్లవోద్యమంలోకి వచ్చిన వాళ్లం. మండల్‌ కమిషన్‌ రిజర్వేషన్ల అమలు కంటే ముందే మురళీధర్‌ రావు కమిషన్‌ నివేదిక ఆధారంగా ఎన్‌టి రామారావు ప్రభుత్వం ఓబిసి లకు రిజర్వేషన్లను పెంచినప్పుడు విప్లవ విద్యార్థి సంఘాలకు చెందిన వారిని మినహాయిస్తే మిగతా అగ్రకులాల విద్యార్థులందరూ రిజర్వేషన్‌ వ్యతిరేక ఆందోళన మొదలు పెట్టారు. దానికి వ్యతిరేకంగా రిజర్వేషన్ల పక్షంలో బలంగా నిలబడిన రాడికల్‌ విద్యార్థి ఉద్యమంలో తొలి అడుగులు నేర్చుకున్న వాళ్లం.  అందువల్ల దళిత ఉద్యమం లేవనెత్తిన ప్రశ్నలను, కులంతో
వ్యాసాలు కొత్త పుస్తకం

ఫాసిజాన్నిసమగ్రంగా చూపే వ్యాసాలు

(డిశంబర్ 23 న విజయవాడలో విడుదల కానున్న *కార్పొరేట్ హిందుత్వ ఫాసిజం* పుస్తకానికి రాసిన ముందుమాట. *దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం* ఈ పుస్తకాన్ని ప్రచురించింది.) ఫాసిజాన్ని మౌలికంగా ఓడించే  పోరాటాలు నిర్మాణం కావలసే ఉన్నది. ఆ వెలితి దేశమంతా ఉన్నది. తెలుగు రాష్ట్రాల్లో కూడా  కనిపిస్తోంది. అయితే ఫాసిజాన్ని సమగ్రంగా అర్థం చేసుకొనే ప్రయత్నం మిగతా భాషల్లో కన్నా మన దగ్గరే  లోతుగా జరుగుతున్నదని నా అభిప్రాయం. ఇప్పటికీ ఇండియన్‌ ఫాసిజాన్ని మతతత్వమని, మతోన్మాదమని, మెజారిటేరియనిజమని, మత ఫాసిజమని అనే వాళ్లు చాలా మంది ఉన్నారు. ఈ అవగాహనలు కూడా అవసరమే. ఫాసిజంలోని కొన్ని కోణాలను ఇవి వివరిస్తాయి.
సమీక్షలు కొత్త పుస్తకం

చదవాల్సిన కవిత్వం

నీలం సర్వేశ్వర రావు  సంపాదకత్వంలో వెలువడిన "మల్లయోధ" కవితా సంకలనంలో మల్ల యోధురాళ్ళ పై లైంగిక వేధింపుపై  రాజ్యం మను ధర్మ  పాలన పై కవులు కవయిత్రులు వివిధ కోణాల్లో తమ కలాలను నిశితంగా నిర్భయంగా ఝుళిపించిన తీరును పరిశీలిస్తే ఆయా భావాల్లో పిడికిళ్లు బిగించగలిగే  శక్తి గలదని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు. కొన్ని కవితలు చప్పగా వున్ననూ తిరుగుబాటు స్పష్టంగా కనిపించింది. రేపటి స్ఫూర్తి పొద్దులు కవితలో "వారు స్త్రీలు  ఒంటికి మట్టిపొరల వస్త్రం కప్పుకున్న పాలపిట్టలు అని కుస్తీ లోని ప్రాథమిక సత్యాన్ని వివరిస్తూ" క్రీస్తు పూర్వం 2023 దేశభక్తి కొత్త నిర్వచనం జాతి గీతం అయింది