తొలికెరటాలు

ధిక్కార పతాకమై ఎగిరే నీలం రంగు నది

నల్లింకు పెన్నుతో పరిచయమైన రచయిత హథీరామ్ సభావట్, తనలోని ఎన్నో ఆవేదనలను అక్షరీకరించి, మళ్ళీ తన బలమైన గొంతును వినిపించేందుకు ధిక్కార పతాకమై ఎగిరే "నీలం రంగు నది"ని మన ముందుకు తెచ్చారు. ఇందులోని ప్రతీ కవిత దేనికదే ప్రత్యేకం. ఆదివాసీ గూడాల గుండెలలో రగులుతున్న ఆవేదనను... పాలస్తీనా, సూడాన్ వంటి ప్రపంచ దేశాలలో జరుగుతున్న మానవ హననాన్ని... ప్రకృతిని దోచుకుంటున్న రాజ్యపు అహంకారాన్ని.... మనుగడ కాన్వాస్ పై రక్తపు మరకలతో యుద్ధం చిత్రించిన దృశ్యాలను... ఎన్నింటినో రచయిత తన కవిత్వంతో మన కళ్ళ ముందుంచారు. నది అనగానే మనకు గుర్తొచ్చేది పచ్చని ప్రకృతి. ఆ ప్రకృతితో మమేకమై
తొలికెరటాలు

సు – ఒక మైలురాయి పుస్తకం

తెలుగు సాహిత్యంలో సైన్స్ ఆధారిత రచనలు చాలా అరుదు. మరీ ముఖ్యంగా ఒక నిర్దిష్ట సైన్స్ సబ్జెక్టును (ఇక్కడ మైక్రోబయాలజీ & ఆంకాలజీ) కేంద్రంగా చేసుకొని, ఫిక్షన్ రూపంలో అందంగా అల్లిన నవలలు దాదాపు లేవని చెప్పవచ్చు (ఉంటే నన్ను కరెక్ట్ చేయండి). అలాంటి ఖాళీని ‘సు’ అద్భుతంగా నింపేసింది. ఇది కేవలం ఒక నవల మాత్రమే కాదు – తెలుగు సాహిత్యంలో సైన్స్-ఫిక్షన్ జానర్‌కు ఒక బలమైన పునాది వేసిన మైలురాయి. చదువుకున్న సబ్జెక్టును సాహిత్యంలో రాయడం అంటే సులువైన పని కాదు. దానికి సబ్జెక్టుపై లోతైన పట్టు, శాస్త్రీయ ఖచ్చితత్వం, అదే సమయంలో పాఠకుడికి ఆసక్తికరంగా
తొలికెరటాలు

పరుగుల జీవితం

కాలం తన పరుగును ఆపదు. రోజులు మారుతాయి, రహదారులు మారుతాయి, పనులు మారుతాయి…కాని మనిషి హృదయంలో మాత్రం  నిశ్శబ్దం నెమ్మదిగా పెరుగుతూనే ఉంది. దాదాపు పాతికేండ్ల క్రితం మమతా కాలియా గారు రాసిన “పరుగు” నవల. నేటి వేగవంతమైన జీవితాన్ని చూస్తే  నిజమేనని మనకు అనిపిస్తుంది. తరాలు ఎంత మారినా, మనిషి అంతరంగంలో కలిగే ఒంటరితనం మాత్రం మారలేదు. బయట శబ్దం పెరిగింది, లోపల సున్నితమైన నిశ్శబ్దం మరింత గాఢమైంది. మ‌నుషులు  లక్ష్యాల వెంట పరుగెత్తడంలో బిజీగా ఉన్నారు కాని ఆ పరుగులో తన వాళ్ల‌ను,  తన బంధాలను, తన వెచ్చదనాన్ని…చాలా సార్లు త‌మ‌ను తామే  నెమ్మదిగా వెనుక
తొలికెరటాలు

సిక్కు ఉద్యమంలో మనిషి అంతరంగం

*ఉద్యమం” అనే నవల మనిషి మనసులో జరిగే ఆత్మపోరాటం, మానవత్వం, నమ్మకం, ధైర్యం వంటి లోతైన భావాలను స్పృశించే ఒక గాఢమైన కథ. ఈ నవలలో బయట ప్రపంచంలో జరుగుతున్న హింస, మత ఘర్షణలు, రాజకీయ ఉత్పాతం ఉన్నప్పటికీ, అసలు ఉద్యమం మనిషి అంతరంగంలోనే మొదలవుతుందని ఒక సున్నితమైన సత్యాన్ని రచయిత మన ముందుంచారు. ప్రతి పేజీ మనిషి మనసులోని ఆందోళనను, అతని అశాంతిని, ఆశను ప్రతిబింబిస్తుంది. ఈ నవల చదువుతుంటే ఒక కాలం, ఒక సమాజం, ఒక మనసు  ఇవన్నీ కలగలిసి మన ముందుకొస్తాయి. కథ సిక్కు ఉద్యమం నేపథ్యంలో సాగేలా నిర్మించబడింది. ఆ కాలంలో జరిగిన
తొలికెరటాలు

నల్లింకు పెన్నులో తొణికిన భావోద్వేగాలు

హతీరామ్ రచించిన నల్లింకు పెన్ను పుస్తకం చదివినప్పుడు కేవలం కవిత్వం చదివిన అనుభూతి కాకుండా మనసులో ఒక వేదన మానవత్వంలో ఒక కదలిక అణిచివేతకు వ్యతిరేకమైన స్వరంగా అన్యాయం పట్ల ప్రతిఘటనగా జీవన గాయాలపై ఓదార్పుగా కవి రచనా శైలి సాగింది. ఈ కవి రచన శైలి చాలా ప్రత్యేకం ఆయన కవిత్వంలో అలంకారాలు తక్కువే కానీ ప్రతి పదం వెనుక జీవన సత్యాలు కన్నీళ్లు కనిపిస్తాయి. ఆయన రాసే ప్రతి కవితలో సూటితనం గాఢమైన లోతు కూడా కనిపిస్తుంది తన అనుభవాలను మాత్రమే కాకుండా తన చుట్టూ ఉన్న సమాజపు అనుభవాలను కూడా పాఠకులకు అనుభవింపచేస్తాడు..  గుండెకు
తొలికెరటాలు

జీవిత అనుభవాల కేరాఫ్ బావర్చి

కథ రాయడం ఒక కళ, కానీ అందరికి సులభం కాదు. ప్రతి మనిషి రాయగలడు, కానీ ఆ కథలు పాఠకుడి హృదయానికి తాకేలా, వారి జీవిత అనుభవాలతో అనుసంధానం అయ్యేలా రాయడం కష్టమే. రాయడం అంటే ఆలోచించే, భావించే మనసు ఉండాలి. చరణ్ పరిమి గారి కథలు ఈ విషయంలో ప్రత్యేకంగా నిలిచాయి. ఆయన కథలలోని ప్రతి సంఘటన, ప్రతి మాట పాఠకుడి హృదయానికి చేరి, జీవిత అనుభూతులను పంచేలా ఉంటాయి. కాలింగ్ సప్తవర్ణం - కథలో మనసును పునరుజ్జీవనంగా చూపించారు. ప్రతి రోజు కొత్తగా ప్రేమించడం, జీవితం పట్ల ఆశ కలిగి ఉండడం ప్రధాన అంశాలు. 40
తొలికెరటాలు

పాలన ముసుగులు తీసిన ‘నియంత అంతం’

నియంత అంతం ఒక కాల్పనిక వాస్తవం. వాస్తవిక కల్పన. ఈ నవలలో ఉన్న ప్రతీ పాత్ర కల్పితమే అయినా నవల చదువుతున్నంత కాలం వాస్తవిక పాత్రలను, పరిస్థితులనే స్పురణకు తెస్తూ ఉంటాయి. చదువుతున్న కల్పిత రచన కంటే స్పురణకు వస్తున్న వాస్తవిక ఘటనలే ఎక్కువగా ఆలోచింపచేస్తాయి. ఈ నవల చదివాక ఎప్పుడో చదివిన కథ ఒకటి గుర్తుకువచ్చింది. రాచరిక వ్యవస్థ బలంగా ఉన్న కాలంలో ఒక నిరంకుశ రాజు. రాజుకి వ్యతిరేకంగా మాట్లాడడానికి ధైర్యం కూడా నాలుగు గోడల మధ్య దాక్కునే అంత భయంకరమైన పాలన. లక్ష మంది జనాభా ఉన్న రాజ్యం, వంద మంది సైనికులకు బయపడి
తొలికెరటాలు

కవితా నిరసన అగ్నివేశ్

"కేవలం జీవితంలోని బాధలను చిత్రించడమే ప్రధానం కాదు.అది చదివినా, విన్నా, తిరగబడాలనే కసిని పెంచకపోతే, ఆ రచన నిరుపయోగం" అంటాడు కొండపల్లి సీతారామయ్య.కవిత్వంలో ప్రతీకారేచ్చ ఉంటుంది. ఎవరిపై!?అసమానతలపై, వాటి దొంతరలపై,దాని దృష్టి కేంద్రీకృతం అవుతుంది. అది శక్తివంతమైన భావాలుగా విస్పోటనం చెందుతుంది. సరిగ్గా బాలు అగ్నివేష్ కవితా సంకలనం నా చేతికి వచ్చే నాటికి, ఒక సీనియర్ ఉపాధ్యాయుడు తను దళితుడు అయిన కారణంగానే తనకు రూమ్ దొరకలేదని, కులం తెలిశాక దొరికిన రూమ్ లో నుంచి, ఆ ఊరి వాళ్ళు వెళ్ళగొట్టారని, అంతేకాకుండా, ఆ ఇంటి అల్లుడు సైతం,తను ఆ ఇంట్లో ఉన్నందువల్ల ఆ ఇంటికి రానని
తొలికెరటాలు

ఆమె చేసిన చర్చ మెట్ల మీద ఆగిపోలేదు

మన సమాజంలో  మహిళ నిర్మాణమయ్యె క్రమం ప్రత్యేకమైనది. పురుషుడి నిర్మాణ క్రమానికి భిన్నమైనది.  పురుషుడితో సమానమైన స్వేచ్ఛ, సొంత అభిప్రాయాల ప్రకటన ఈ నిర్మాణక్రమంలో నిషేధం. అణచివేతలు, ఆంక్షలు ఈ నిర్మాణక్రమానికి ఉన్న ప్రత్యేకతలు. సహజంగానే సమాజంలోకి వచ్చిన ప్రతి మహిళా ఈ నిర్మాణ క్రమం నుండి వేరుపడదు. వేరుపడాలని ప్రయత్నించినా సమాజం అంగీకరించదు. కానీ అట్లాంటి నిర్బంధ క్రమాన్ని బద్దలు కొట్టే సామాజిక చైతన్యం తెచ్చుకున్న స్త్రీలు సమాజంలో ఉంటారు. వీరే సమాజాన్ని నూతన ప్రపంచంలోకి తీసుకువెళ్తారు.  ఏ ఆంక్షలు లేని ఆ ప్రపంచంలోకి వెళ్ళడానికి తీవ్రమైన సంఘర్షణ పడతారు. ఆ ప్రయాణంలో భాగంగా నూతన మానవులుగా
తొలికెరటాలు

అందరు చదవాల్సిన కథలు

కలవపూడి కథలు రచయిత సాoబశివతడవర్తి గారు రాసిన మొదటి కథ సంపుటి. ఉభయకుశలోపరి అని ఒక పిల్లవాడి ఉత్తరం తో మొదలై హంస మేడ అనె కథ లో..ఒక యువకుడి విరహ ప్రేమ లేఖలకు తన ప్రేయసి ప్రత్యుత్తరం తో ఈ కథ సంపుటి ముగిసిద్ది. ఈ కథ సంపుటి లో కృష్ణప్ప, కటారి, తారకం అనే పాత్రలతో వాటితో పాటు మధ్యలో వివిధ కథల్లో ఆ పాత్రధారులు  మనల్ని పలకరించి వాళ్ళ జ్ఞాపకాలు, అనుభవాలు, కథలు , స్మృతులు అన్ని మనతో పంచుకుంటూ వెళ్తారు. ఆ కథలతో పాటు మనమూ కలవపూడి కెళ్తామూ. మొదటి కథ నుండి