స్వేచ్ఛ కోసం విరబూసిన ఎర్రమల్లెలు
ఎర్ర మల్లెలు, వాక్యం పాతదైనప్పటికి యి పుస్తక ముఖచిత్రం మాత్రం ఆకర్షించే విధంగా చదవాలని ఆత్రుత పెంచే విధంగా, ముఖ్యంగా యీ కాలపు జనరేషన్ ను ఆకట్టుకునే విధంగా ఉంది. అయితే ముందుగా యి పుస్తకం నవలగా మారిందా అనే సందేహం చదివింతరువాత కలిగింది నాకు. సరే అది చివరకు మాట్లాడుకుందాం. కథలో ప్రధాన పాత్రలు మూడు. వారి చుట్టూతా తిరుగుతుంటుంది కథ. అయితే కథ వస్తువు కొత్తదేమీ కాదు. అయినప్పటికీ ఆ కథని చెప్పే విధానంలో రచయిత్రి గారికి మార్కులు వేయొచ్చు. నేనేమీ మాష్టారు కాదు, ఆవిడ రాసింది పరీక్షా కాదు, కానీ తిన్న తిండి మీద










