తొలికెరటాలు

మనుషులుగా ఉండమని చెప్పే కథలు

మొదటగా ఇది నాకు చాలా ఇష్టమైన కథల పుస్తకం. ఈ "టోపి జబ్బర్" పుస్తకంలో 11 కథలు ఉన్నాయి. ఒక కథ ద్వారా ఒక్క విషయం మాత్రమే చర్చించాలని రచయిత వేంపల్లె షరీఫ్ గారు అనుకోలేదు. ఒక ముస్లిం మనిషి చుట్టూ ఉన్న కులం, మతం, ప్రాంతం, లింగ వివక్షత ఎంత లోతుగా ప్రభావితం చేస్తాయో నాలుగు కథలు మినహా కథల్లో తన రచనా శైలితో పరిచయం చేశారు. ముస్లింల ఉనికి ఏ స్థితిగతుల్లో ఉందో ఈ కథల ద్వారా చెప్పారు. వాళ్ళ మతంలో వున్న ఆచారాలు, సంప్రదాయాలు. ఇంకా ఏ విధంగా వాళ్ళు సమాజంలో అవమాన పడుతున్నారో
తొలికెరటాలు

కళ్లకు చెమటలు పట్టించిన నల్ల బంగారం కథలు

బొగ్గుబావిలో పని కోసం సొంత ఊరిని వదిలేసి వచ్చిన కుటుంబం. తట్ట, చెమ్మసు తీసుకుని సైకిల్ పైన పనికివెళ్ళే తండ్రి. భర్త కష్టానికి తన కష్టాన్ని జతచేస్తూ, భర్త రావడం కాస్త ఆలస్యమైనా తన భయాన్ని ఇంటి దర్వాజ అలికిడిలో వ్యక్తీకరించే తల్లి. తమని ఎంతో ప్రేమించే తండ్రి కోసం, తండ్రి ప్రేమగా తీసుకొచ్చే వస్తువు కోసం కిటికీ చువ్వల నుండి ఎదురుచూపులనే ఎర్రతివాచిలుగా పరిచి పెట్టే కూతుర్లు. ఇది నల్ల బంగారం కథలలో రచయిత బాల్యం. కథలన్నీ చదువుతుంటే చాలా దగ్గరి అనుభవాలు గుర్తుకొచ్చాయి.  ఆలోచిస్తే ఇది అచ్చంగా నా బాల్యం. సింగరేణి ప్రాంతంలో గడిచిన నా
తొలికెరటాలు

ఆమె జస్ట్ హౌజ్ వైఫ్ ?

కవితే...కవిత్వమై పుస్తకమంతా పరిమళించారు, పరిణమించారు. స్పందించే హృదయాల్ని సంకెళ్లతోనే కాదు, కవిత్వాలతో కూడా బంధించగలరని ఈ పుస్తకాన్ని చదివాకే అర్ధమైంది. సమస్త గాయాలకి లేపనంగా లోపలెక్కడో చివురంత ప్రేమ తనమీద తనకే కాదు, తన అక్షరాలపై మనకీ ప్రేమని పుట్టిస్తాయి. కలవరపెడుతూనే, కలబడేలాచేస్తాయి. కవిత కుందుర్తి గారు కేవలం తనకోసమే కాదు, "జస్ట్ ఎ హౌజ్ వైఫ్" అని అనిపించుకుంటున్న ఆడవాళ్లనీ, ఉద్యోగాలు చేస్తూ కూడా తగినంత గౌరవం, స్వాతంత్రం లేని ఆడపిల్లలందరిని తనలో కలుపుకొని జస్ట్ ఎ హౌజ్ వైఫ్ అనే  కవిత్వ సంపుటిని ప్రచురించారు .   తనని తానే ఒత్తిగిల్లుకొని మెరిసే నక్షత్రమవుతారు. ఒంటరితనం మనిషిది
తొలికెరటాలు

స్త్రీల చుట్టూ ఉన్న హింసను చూపే “చిక్ లిట్” 

పిల్లలు పుట్టగానే జెండర్ తో సంబంధం లేకుండా వాళ్ళకు కొన్ని మూసపద్దతులను, కొన్ని తయారుచేయబడిన ప్రవర్తనలను, భావోద్వేగాలను (Manufactured Behaviours and Feelings)  సమాజం, కుటుంబం, తల్లితండ్రులు, బంధువులు, స్నేహితులు ఇలా వాళ్ళ చుట్టూ జనాలు నూరిపోస్తుంటారు. కాస్తా కూస్తో మినహాయింపులు ఇచ్చినట్టే ఇచ్చి కచ్చితంగా వాటిని పాటించాలని నియమం పెట్టకనే పెడ్తారు. పిల్లలకు ఇలాంటి కుట్ర ఒకటి జరుగుతుందని తెలియనివ్వరు. పొరపాటున ఇచ్చిన మినహాయింపులు దాటి ప్రవర్తిస్తే అది చాలా పెద్ద నేరంగా, బరితెగింపుగా, కొన్నిసార్లు కొన్ని వర్గాలు  ధైర్యంగా కూడా గుర్తిస్తారు. అయితే కొన్ని సమూహాలు స్వచ్ఛందంగానే పై పద్దతులను పాటించాలనే ఆంక్షలు పెట్టకుండా స్వేచ్ఛనిస్తారు
తొలికెరటాలు

భూమి పతనంలోని సామాజిక విషాదం

సాహితీలోకంలోకి ముందుగా చాలా మంది కవితల్తోనో, కథల్తోనో ఎక్కవగా ప్రవేశిస్తుంటారు. కాని గూండ్ల వెంకట నారాయణ  మొదటగా నవల ప్రక్రియ ద్వారా అది కూడా డిగ్రీ చదివే వయస్సులో సాహితీలోకానికి  ‘భూమి పతనం’ అనే నవల ద్వారా పరిచయం కావడం చాలా విశేషమైన విషయం. గూండ్ల వెంకట నారాయణ  తాను వ్యక్తికరించబోయే విషయాలకు తగిన ప్రక్రియగా నవల ఉండటం వల్ల నవల ప్రక్రియను వాహకంగా ఎన్నుకున్నారేమోనని భూమి పతనం నవలను చదివిన తర్వాత అనిపించింది. భూమి పతనం తర్వాత ఇయ్యాల ఊళ్ళో, గరికపాటోడి కథలు, కాపలాదారుని పాటలు, ద్రావిడమహాసముద్రం వంటి రచనలు చేసారు. ‘భూమి పతనం’ పుస్తకం కవర్
తొలికెరటాలు

ఇది తెలుగువాళ్ళ వంతు

ప్రతి సంవత్సరం హిందీ సినిమా ప్రముఖుల ఆత్మకథలో, జ్ఞాపకాలో(memoir) ఒకటో రెండో వస్తూనే ఉంటాయి. దాన్ని  పెంగ్విన్, హార్పర్ కాలిన్స్ లాంటివి ప్రచురించి మార్కెట్ లో అమ్ముతూనే ఉంటాయి. దానికి ఉన్న రీడర్షిప్, మార్కెట్ కూడా అలాంటిదే. సాహిత్యంలో సినిమా గురించిన రచన కూడా ఒక ప్రక్రియ(genre). భారతీయ ఇంగ్లీషు సాహిత్యం ఈ genre ని దాదాపు హిందీ సినిమాకి సంబంధించిన విషయంగానే ఉంచింది. భారతీయ ఇంగ్లీషు సాహిత్యంలో వేరే ఏ సమాజం నిర్లక్ష్యం కాబడనంతగా తెలుగు సమాజం నిర్లక్ష్యం అయింది. గత కొన్నేళ్లుగా ఇంగ్లీషులో తమిళ, మలయాళ, కన్నడ భాషల సాహిత్యం, సంస్కృతి, చరిత్రకి సంబంధించిన పుస్తకాలు
తొలికెరటాలు

నల్లద్రాక్ష పందిరి – సంఘటనాత్మక కవిత్వం

సంఘటనాత్మక కవిత్వం అంటే సమకాలీనంలో జరిగిన విషయాలపై కవిత్వం రాయటం అనే కురచ అర్థంలోకి మార్చారేమో అనిపిస్తుంది. ఒక జీవితకాల వస్తువుని తీసుకొని దాన్ని సంఘటనలతో పెనుకుంటూ పోవటం సంఘటనాత్మక కవిత్వం అని అనిపిస్తుంది. కవి తనకు ఎదురైన అనుభవాల్ని, చూసిన మనుషుల జీవితాలని ఒక వరుస ప్రకారం చెప్పుకుంటూ పోతాడు. దీనిని జీవితచరిత్రాకథనం అనవచ్చునేమో... ఇలా చెప్పుకుంటూ పోయే కవిత్వాన్ని చూసినప్పుడు ఇందులో ఉపమలు తప్పా ఏమున్నాయి, కవిత్వం కాదు అనే వాళ్ళు, అనుకునే వాళ్ళు, లేకపోతే భ్రమించే వాళ్ళు ఉండవచ్చు. ఇటువంటి కవిత్వం రాయటానికి కవి ఎంచుకునే ప్రధాన మార్గం తనవైన అనుభవాలను. అందుకే కవి
తొలికెరటాలు

పురా జ్ఞాపకంలా మంగలిపల్లె

కథలు జీవన విధానాల, అనుభవాల, ఎన్నెన్నో సంఘటనల నిదర్శనాలు. కాలగర్భంలో   కలిసిపోయిన ఊరు, అక్కడి జీవన సారాంశాలను నరేష్కుమార్ సూఫీ  తనదైన పాత్రను పోషిస్తూ రాసిన కథలు 'మెమొరీస్ ఆఫ్ మంగలిపల్లె'గా రూపం దాల్చుకున్నాయి. రచయిత తన చిన్నతనాన్ని వెతుక్కుంటూ మళ్ళీ ఓ సారి వాళ్ల ఊరికి వెళ్ళి బాల్యాన్ని, బడిని... ముఖ్యంగా అక్కడి పరిస్థితులను ఇలా అన్నింటిని గుర్తుచేసుకుంటూ వివరిస్తున్న విధానం పాఠకులందరినీ కూడా వాళ్ళ చిన్నతనాన్ని నెమరువేసుకునేలా చేస్తాయి. కథల్లో ఓ ప్రతిస్పందన, వెతుకులాట ఉంటుంది. అది రచనా పరిణితిని బట్టి కథల  అనుభూతి ఉంటుంది. ఈ పుస్తకంలోని కథలు చాలా చోట్ల మనల్ని అక్కున
తొలికెరటాలు

 కాసింత ప్రేమ అవసరమైన కాలం

పుస్తకాల్లో ప్రేమ కన్నా జీవితాల్లో ప్రేమ అద్భుతంగా ఉంటుందా? అనే ప్రశ్న నన్ను అడిగితే, ఈ కవిత్వం   చదివిన వారు ఎవరైనా  ఇందులోని  ప్రేమ అద్భుతంగా ఉంది.. అని సమాధానం ఇస్తారు . ఈ పుస్తకంలోని  ప్రేమని, విరహాన్ని, వేదనను పుస్తకం చదివిన వారు ఎవరైనా ఫీల్ అవుతారు. ప్రేమ అనగానే లేదా ప్రేమ పేరు వినగానే మనకు తెలియకుండానే మన పెదవుల పై చిరునవ్వు, మన ముఖంలో ఒక  భావం చిగురిస్తుంది. అసలు ప్రేమ లేకుంటే అమ్మే బ్రతకడం కష్టం అని చెప్పే వాళ్ళు లేకపోలేదు. అసలు ప్రేమ లేకపోతే ఏ బంధము నిలువదు అనేది నా
తొలికెరటాలు

మన చుట్టూ పరచుకున్న ‘నీలి కళ్ల నేల’ 

“నీలి కళ్ల నేల” ఒక అద్భుతమైన కవితా సంపుటి. ఇందులోని కవితలు సహజత్వంతో, భావోద్వేగాలతో నిండిన మేలుకొలిపే సమాహారంగా కనిపిస్తాయి. ఈ పుస్తకంలోని ప్రేమ, సామాజికస్పృహ, అంటరానితనం మొదలైన అంశాలు ప్రత్యేకంగా నిలుస్తాయి. భావనల లోతు-హృదయాన్ని తాకే కవితలు: ఈ కవితా సంపుటి జీవితాల్ని ప్రతిబింబించేలా ఉంటాయి. ఇందులోని కవితలు దేశంలో జరిగిన, జరుగుతున్న అనేకానేక సమస్యల సమాహారం. కవిత్వం అనేది కేవలం పదబంధం కాదు, అది మనసులోని భావాలను, ఆలోచనలను నిబిడీకృతంగా వ్యక్తపరిచే సాధనం. ఈ సంపుటిలోని కవితలు ఆ లక్షణాన్ని పూర్తిగా నెరవేర్చాయి. ప్రేమను అత్యంత సున్నితంగా వర్ణించిన కవితలు ఇందులో చోటు చేసుకున్నాయి. ‘‘ప్రియా..మనం