‘స్టాలిన్యుగం’లో ఇండియా
రష్యాలో వానబడితే మనదేశంలో కమ్యూనిస్టులు గొడుగుపడతారు అని 1955కు ముందు ఇండియాలో కమ్యూనిస్టు వ్యతిరేకులు వ్యాఖ్యానించే వాళ్లు. నిజానికి బోల్షివిక్ విప్లవం తర్వాత ఆరేళ్లకు గానీ ఇక్కడ కమ్యూనిస్టుపార్టీ పుట్టలేదు. లెనిన్ బతికుండగానే ఇండియా నుంచి ఎం.ఎన్.రాయ్ ఆసియా ఖండంలోనే మొదటివాడుగా ఇక్కడికి కమ్యూనిస్టుపార్టీని తెచ్చాడుగానీ ఆయనే అందులో నిలవక ఆ తర్వాత రాడికల్ హ్యూమనిస్ట్పార్టీ పెట్టి వేరుపడ్డాడు. అయితే బ్రిటిష్ సామ్రాజ్యవాద వలసపాలన దమనకాండ భరించచలేని ప్రజలు, ముఖ్యంగా జలియన్వాలాబాగ్ ఉదంతం ఇంచుమించు అదేకాలంలో జరిగింది గనుక బోల్షివిక్ విప్లవంతో చాల ఉత్తేజితులయ్యారు. లెనిన్ను పీడితప్రజల, శ్రామికవర్గాల విముక్తిప్రదాతగా చూడసాగారు. అమెరికాలో ఉన్న సిఖ్కు మేధావులు కొందరు