వ్యాసాలు

వి. ప్రతిమ, సుంకర గోపాలయ్య , పల్లిపట్టు నాగరాజు

పుస్తకాలను చదవకుండా పుస్తకాలను  తాకకుండా చాలామందికి ఒక్కరోజు కూడా గడవదు. పగలంతా పనులతో బాధ్యతలతో అటు ఇటు తిరుగుతూ గడిపేసినా, ఎంత రాత్రయినా సరే, కొన్ని పేజీలైనా చదవటం, ఉదయం నిద్ర లేవగానే ముందుగా ఎంపిక చేసుకుని వెతికి పెట్టుకున్న పుస్తకాన్ని చదవటం కొందరికి అలవాటు. ఈ ప్రపంచంలో పుస్తకాలు చదవడానికి నిర్ణీత సమయం అంటూ లేదు. ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా పుస్తకాలు చదవడానికి అలవాటు పడిన వాళ్లే. చాలామందికి పుస్తకాలను దాచి పెట్టుకోవడం అలవాటు. కానీ చాలా కొంతమంది మాత్రమే తాము చదివిన తర్వాత పుస్తకాలను ఇతరులకు చదవడానికి ఇచ్చేస్తారు. చదివిన తర్వాత వాళ్లు కూడా
వ్యాసాలు

ప్రజా ఉద్యమాలు – రాజ్యాధికార ప్రాసంగికత

"సేవ్ ఆరావళి" ఉద్యమం ఉత్తర భారత దేశంలో పెద్ద ఎత్తున జరిగి లక్షలాదిమంది ప్రజలు పాల్గొని, ఆ ఉద్యమం తాకిడికి కేంద్ర ప్రభుత్వం మరియు సుప్రీంకోర్టు కూడా దిగి వచ్చిన తర్వాత సామాజిక మాధ్యమాలలో సాయుధ పోరాటయేతర ఉద్యమాల పట్ల విపరీతమైన చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా గతంలో ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమం విజయాల పట్ల కూడా ప్రస్తావనలు చేయడం జరుగుతుంది. ఈ రకమైన చర్చల యొక్క ప్రధాన ఉద్దేశం ఏమంటే, "భారతదేశంలో సాయుధ పోరాటాలు యొక్క ప్రాసంగికత ఏమిటన్న అంశం ప్రధానంగా చర్చనీయాంశం అయింది." అయితే ఇక్కడ సేవ్ ఆరావళి, ఢిల్లీ రైతు ఉద్యమం అన్నవి
వ్యాసాలు

మాట్లాడే పుస్తకాలు

పుస్తకాలను చదవకుండా పుస్తకాలను  తాకకుండా చాలామందికి ఒక్కరోజు కూడా గడవదు.పగలంతా పనులతో బాధ్యతలతో అటు ఇటు తిరుగుతూ గడిపేసినా, ఎంత రాత్రయినా సరే, కొన్ని పేజీలైనా చదవటం, ఉదయం నిద్ర లేవగానే ముందుగా ఎంపిక చేసుకుని వెతికి పెట్టుకున్న పుస్తకాన్ని చదవటం కొందరికి అలవాటు. ఈ ప్రపంచంలో పుస్తకాలు చదవడానికి నిర్ణీత సమయం అంటూ లేదు. ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా పుస్తకాలు చదవడానికి అలవాటు పడిన వాళ్లే. చాలామందికి పుస్తకాలను దాచి పెట్టుకోవడం అలవాటు. కానీ చాలా కొంతమంది మాత్రమే తాము చదివిన తర్వాత పుస్తకాలను ఇతరులకు చదవడానికి ఇచ్చేస్తారు. చదివిన తర్వాత వాళ్లు కూడా అలా..
వ్యాసాలు

సీమ అస్తిత్వ చరిత్రలో వెలుగు కెరటం సుబ్బరాయుడు

( రాయ‌సీమ విద్యావంతుల వేదిక  మూడో బులిటెన్‌కు రాసిన ముందుమాట‌. జ‌న‌వ‌రి 4న క‌ర్నూలులో జ‌ర‌గ‌నున్నఆర్ వి వి రాష్ట్ర మ‌హాస‌భ‌లో ఆవిష్క‌ర‌ణ‌) చరిత్ర చాలా అద్భుతమైనది. తన స్థల కాలాలకు అవసరమైన మానవులను తానే తయారు చేసుకుంటుంది. తన స్వరానికి తగిన గొంతుకలను సిద్ధం చేసుకుంటుంది. ఈ విడత రాయలసీమ ఉద్యమానికి అవసరమైన వాదనలతో  మేధో సమర్థన అందివ్వగల వ్యక్తిగా చరిత్ర సుబ్బరాయుడుగారిని ఎంచుకున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయే నాటికి ఆయన కేవలం ఇంజనీర్‌ మాత్రమే. వృత్తి వల్ల పట్టుబడిన నైపుణ్యాలతో రాయలసీమ నీటి పారుదల వ్యవస్థ గురించి ఆలోచిస్తుండేవారు. తుంగభద్రలో వృథా అవుతున్న నీటిని ఒడిసిపట్టుకొని
వ్యాసాలు

వందేమాతర స్వరం మారుతున్నది

వందేమాతరం గీతంపై శీతాకాలపు సమావేశాలలో భారత పార్లమెంట్ చర్చి స్తున్నది.   ఆనాటి రాజ్యాంగ సభ దేశభక్తి గీతంగా వందేమాతరం గీతాన్ని ఆమోదించింది. ఇటీవల కాలంలో వాజ్ పేయి(1998) నరేంద్ర మోదీ (2025) పరిపాలనా కాలంలో ఒకానొక చర్చగా ముందుకు వస్తుంది.  వందేమాతరం గీతం సారాంశం ఏమిటి? కాలంతో పాటు ఎందుకు వివాదాస్పదం అవుతోంది. బకించంద్ర ఆనందమఠం  నవలలో వందేమాతర గీతాన్ని రాశారు. జాతీయోద్యమ కాలంలో ప్రజల పాడుకునే విధంగా గీతం ప్రాచుర్యం పొందింది. అధికార మార్పిడి తర్వాత అధికారక దేశభక్తి గీతం అయింది. దేశంలోని భిన్న మతాల ప్రజలలో కొన్ని మినహాయింపులున్నా వందేమాతర గీతాన్ని ఆలపిస్తున్నారు. వందేమాతర గీతాన్ని
వ్యాసాలు

జైలు ఆకాంక్షల్లో రచన రూపేష్ అముద్రిత నవల ‘ఖైదీల జ్ఞాపకాలు’

అక్ర‌మ కేసులో  జైల్లో ఉన్న కేర‌ళకు చెందిన రాజ‌కీయ ఖైదీ రూపేష్ నవల ఖైదీల జ్ఞాపకాలు చదువుతున్నప్పుడు నెల్సన్ మండేలా ఆత్మకథలోని ఒక జైలు జ్ఞాపకం గుర్తొచ్చింది. పాతికేళ్ళకు పైగా జైలులో బందీగా ఉన్న మండేలా, దాస్ కాపిటల్ గ్రంథాన్ని జైలులోనే చదివాడు. జైలుకి వెళ్ళక ముందు మండేలా కేవలం కమ్యూనిస్ట్ మేనిఫెస్టో మాత్రమే చదివాడు. దాస్ కాపిటల్ జైలుకు చేరడం అనేది ఆసక్తికరమైన విషయం. జైలు సూపరింటెండెంట్ అశ్లీల రచనలను లేదా హాస్య కథలను మాత్రమే లోపలికి అనుమతించేవాడు. అయితే, ఈ మధ్యలో ఎవరో ఇతర పుస్తకాలతో పాటు దాస్ కాపిటల్‌ను కూడా సూపరింటెండెంట్ ముందు ఉంచారు.
వ్యాసాలు

భారతి సాహిత్య ధమ్మం

సాహిత్యంలో సామాజికత సామాజిక వాస్తవికత వంటి భావనలు యివ్వాళ కొంతమందికి యెబెట్టుగా కనిపిస్తున్నాయి. సాహిత్యకారులు సమాజంలోకి చూడటం, సాహిత్యంలో సమాజాన్ని పరిశీలించడం, సాహిత్యం ద్వారా సామాజిక చలనాన్ని వ్యాఖ్యానించటం అవసరం లేదని వాళ్ళ ఉద్దేశం. మరీ అంత చేతి దురద వుంటే ఆ పని యే వ్యాసాల్లోనో  చేసుకోండి, కథ నవల వంటి ప్రక్రియల్లో చేయాల్సిన అవసరం లేదని కూడా గొంతు చించుకుని వక్కాణిస్తారు. పతంజలి ‘పిలకతిరుగుడు పువ్వు’ కథలో  సెషన్స్ కోర్టు జడ్జి తన కింది కోర్టు న్యాయమూర్తి(యస్ కోట మున్సీఫ్  మెజిస్ట్రేట్ గంగాధరం)ని సమాజంలోకి తొంగి చూసి వ్యాఖ్యానించినందుకు  తప్పుపట్టి హెచ్చరించినట్టే శుద్ధ సాహిత్యవాదులు కూడా
వ్యాసాలు

గుడి కట్టి దేశం గాయాన్ని మాన్పగలమా?

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్, ఆర్‌ఎస్‌ఎస్  సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్ సమక్షంలో, కొన్ని సంవత్సరాల క్రితం నిర్మాణం ప్రారంభమైన రామ మందిరం శిఖరంపైన జెండాను ఆవిష్కరిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఈ ధ్వజారోహణం రామమందిర నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు తెలియజేస్తుంది అని అన్నాడు. “శతాబ్దాల నాటి గాయాలు మానిపోతున్నాయి, ఉపశమనం కలుగుతోంది; వందల సంవత్సరాల క్రితం తీసుకున్న సంకల్పాలు నెరవేరుతున్నాయి!” అని కూడా అన్నారు. ఆయన పదేపదే రాముని నామాన్ని ఉచ్చరించాడు; మన అంతరాత్మలో కొలువైన రాముడు, రామరాజ్య భావన నుండి ప్రేరణ పొందిన దేశాన్ని స్థాపించాలని పిలుపునిచ్చాడు. ఈ కార్యక్రమం సమాజంలోని కొన్ని వర్గాలలో ఉత్సవ వాతావరణాన్ని సృష్టించింది;
వ్యాసాలు

అన్ని వర్సిటీలనూ అభివృద్ధి చేయాలి

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జరుపుతున్న ప్రజాపాలన ఉత్సవాలలో భాగంగా డిసెంబర్ 10 వ తేదీన, ఉస్మానియా యూనివర్సిటీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సందర్శించారు.అంతకు మూడు నెలల ముందు ఆగస్టు 25 వ తేదీన కూడా ఓయూలో పర్యటించి ఓయూ అభివృద్ధిపై అధికారులు నివేదిక ఇస్తే అందుకు అనుగుణంగా నిధులు మంజూరు చేస్తామని, తాను మళ్లీ డిసెంబర్ 10 నాడు ఓయూ ఆర్ట్స్ కళాశాల వస్తానని, భారీ బహిరంగసభ నిర్వహిస్తానని ఆ సమయంలో ఒక్క పోలీసు కూడా క్యాంపస్ లో వుండకూడదని,ఆ రోజు విద్యార్థులు నిరసన వ్యక్తం
వ్యాసాలు

అమ్మాయిలపై పబ్లిక్, డిజిటల్ వేధింపులు

ఈ ప్రపంచంలో అమ్మాయిగా జీవించడం అంటే భయంతో, జాగ్రత్తలతో, అనేక అడ్డంకులతో నడవడం అని చెప్పిన అతిశయోక్తి కాదు. అమ్మాయి ఎంత బలంగా ఉన్నా, ఎంత చదువుకున్నా, ఎంత ఆత్మవిశ్వాసం ఉన్నా ఆమె బయటికి వెళ్లే ప్రతిసారి, ఫోన్ పట్టుకునే ప్రతిసారి, రోడ్డు మీద నడిచే ప్రతిసారి ఒక చిన్న భయం ఆమె మనసులో ఉండక తప్పదు. ఎందుకంటే పబ్లిక్ ప్రదేశాల్లో జరుగుతున్న వేధింపులు ఏళ్ళుగా ఉన్న, ఇప్పుడు అది కాదు  ఫోన్లలో, సోషల్ మీడియాలో కూడా వేధింపుల రూపం పెరిగిపోయింది. అమ్మాయిలకు రెండు వైపులా ప్రమాదాలు పెరుగుతున్నాయి పబ్లిక్ ప్రదేశాల్లో అమ్మాయిలపై వేధింపులు చాలా కాలంగా ఉన్నాయి.