కార్మిక సమ్మెకు సంఘీ భావం
ఫిబ్రవరి పన్నెండున దేశవ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. సమ్మె విజయవంతం కావడానికి కార్మిక వర్గం సమాయుత్తమాతుంది. పన్నెండు ఏళ్ల నరేంద్ర మోదీ పాలనలో కార్మిక, కర్షక వర్గ విధానాల పట్ల అనుసరి స్తున్న వైఖరి పట్ల అసంతృప్తి ఉంది. ఇప్పటికే భారత దేశ రైతులు రోడ్లపై నిలబడి ఉన్నారు.వ్యవసాయం ఏమాత్రం లాభసాటి కాదని చివరకు పోరాట రూపమే మిగిలిందనే నమ్మికతో వున్నారు. తాజాగా మహారాష్ట్రలో వేలాది మంది రైతులు రోడ్లపై నిల్చున్నారు. ఈ దేశానికి సంబంధించి నంతవరకు కార్మికులు, కర్షకులు పునాదిగా ఉన్నారు. ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ఉన్నారు. రైతులు ఈనాటికీ తమకు ఉన్న










