వాడ నుండి జనసంద్రమైన అడెల్లు అంతిమయాత్ర
కేంద్రంలోని నరహంతక పాలకులు షెడ్యూల్ ఐదు అడవి ప్రాంతాలలో ఖనిజ సంపదను బహుళజాతి కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పేందుకు జనవరి 2024 నుండి కగార్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఆపరేషన్ కగార్ అంతర్యుద్ధం ఈ దేశ సొంత పౌరులను చంపుతూ ముందుకు సాగుతోంది. ఈ ఆపరేషన్ లో అత్యాధునిక ఇజ్రాయెల్ సాంకేతికత, ఆయుధాలను ఉపయోగిస్తూ ప్రజలను విప్లవకారులను చంపుతూ కార్పొరేట్లకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. పాలకులు చేస్తున్న ఈ దురాగతాలు వ్యతిరేకిస్తూ ప్రజలకు అండగా నిలిచి పోరాడుతున్న విప్లవ నాయకుడు కామ్రేడ్ అడెల్లు @ భాస్కర్ ఛత్తీస్గఢ్ అడవుల్లో జూన్ ఆరవ తేదీన బూటకపు ఎన్కౌంటర్ లో అమరుడైనాడు. ఆ కామ్రేడ్






