కవిత్వం

విప్లవానికి మరణం లేదు

విప్లవం చనిపోదు రక్తం ఎండిపోతే రగిలే మంట అది!నిజం నలిగితే నినదించే గళం అది!గుండెలో దాచిన ఆవేశం కాదు గోళాల కంటే గట్టిగా పేలే శబ్దం అది!జనాల ఊపిరిలో పుడే తుపాన్ అది!అణగారిన ప్రతి కన్నీటిలోనూవిప్లవం మళ్లీ మళ్లీ పుడుతుంది!దాన్ని చంపలేరు, దాన్ని ముంచలేరు దాన్ని నెమ్మదించించలేరు!విప్లవం అంటేన్యాయం కోసం లేచిన గుండె ధైర్యం!మౌనాన్ని విరిచే కేక!అది మన రక్తంలో ముద్రైపోయిన నినాదం!“విప్లవం చనిపోదు — విప్లవం మళ్లీ పుడుతుంది!”
కవిత్వం

వాళ్ళు ఎందుకు వెళ్ళారు?

వాళ్ళు పేరుకోసమే వెళితేవాళ్లకి మారుపేరేందుకు? వాళ్ళు భూమికోసమే వెళితేవాళ్ళ అమ్మ గుడిసెలోనే ఎందుకుంది?వాళ్ళు నిధుల కోసమే వెళితే వాళ్ళ ఒంటికి ఒక్క వెండి ఉంగరమైన ఎందుకు లేదు ? వాళ్ళు వాళ్ళకోసమే వెళితేఈరోజు నిర్జీవంగా ఎందుకు పడున్నారు ? ఆకలి మంటల ఆర్తనాదాన్ని అనుభవించి వెళ్ళారు బాంచెన్ బతుకు ఇక నడవదని నినందించి వెళ్ళారుమానవత్వాన్ని మరిచిన మనకి మనిషితనాన్ని నేర్పించడానికి వెళ్ళారుదోపిడి, దౌర్జ్యాన్ని ఎదిరించి శ్రామిక రాజ్యాన్ని నిర్మించటానికి వెళ్ళారువాళ్ళు మనకోసమే వెళ్ళారుమన బతుకుల్లో వెలుగు కోసం వెళ్ళారునీకు నాకు మనందరికీ హక్కులని పంచడానికి వెళ్ళారువాళ్ళు మనకోసమే వెళ్ళారు మన కోసమే అమరులయ్యారు.
కవిత్వం

వేణు క‌విత‌లు రెండు

1. ప్రియమైన కామ్రేడ్స్మిమ్ముల్ని ఏనాడు కలవనిమీతో ఏనాడు మాట్లాడనిప్రజలు కన్నీళ్లతో మీ చరిత్రను మననం చేసుకుంటున్నారుమీ త్యాగాలను హృదయాలకు హత్తుకుంటున్నారుఇప్పుడు మీ అమరత్వం దేశమంతా ఎర్రజెండాయి పరుచుకుందివీచే గాలిలాప్రవహించే నీరులామీరిప్పుడు గుండె గుండెకు చేరారుకనపడని బంధికాన లాదేశమంతా కాషాయ కంచెలు వేశారుమతోన్మాద హద్దులు గీశారుహద్దులను చేరిపేకంచెలను తొలిచే ఆలివ్ గ్రీన్ యూనిఫామ్ తోమీరిప్పుడు దేశమంతాఎర్రజెండై పరుచుకున్నారు.2. జ్ఞాపకాల జెండాలుబిడ్డలరా మీ జ్ఞాపకాలు మోస్తూ ఎదురుచూస్తున్నాం.....కొడుకులారా మీ ఆశయాలు మోస్తూలక్షలాది పీడిత ప్రజలుయుద్ధం చేస్తున్నారుజ్ఞాపకాలు స్మృతులు ఐనాయిఆశయాలు పోరాటం ఐనాయిబిడ్డలారా ఓ మా బిడ్డలరామీ జ్ఞాపకాలు మా కళ్ళనిండా దాచుకుంటాంమీరెత్తిన ఎర్రజెండాను మా గుండెలనిండా హత్తుకుంటాం.
కవిత్వం

ఈ కవిత్వం అసంపూర్ణవాక్యం కాదు..

అనాదినుంచీ ఈ మతాలు మనిషికీ మనిషికీ మధ్య మాయగోడలు నిర్మించాయే తప్ప మనుష్యులందర్నీ ఏ మతమూ ఒక్కటిగా చెయ్యలేక పోయింది. అలాచేసే శక్తి ఏ మతానికీ లేదు. పైగా మనిషిమీద మనిషి కుండవలసిన విశ్వాసాన్ని లేకుండా చేస్తుంది మతం. -మహాకవి శ్రీశ్రీ ఇప్పుడు జరుగుతున్నదిదే. మతమనే మారణహోమంలో బలౌతున్నది మాత్రం మనుషులే. మానవ వికాసానికి ఎంతమాత్రమూ ఏ మాత్రమూ ఉపయోగపడని మతంకోసం మనిషి ఎంతటి విధ్వంసానికైనా ఒడిగడతాడు. ఇవాళ ఇజ్రాయిల్‌ పాలస్తీనా యుద్దం సామ్రాజ్యవాదమే కానీ, ఈ సామ్రాజ్యవాదం పెంచిపోషిస్తున్న విషనాగుమాత్రం మతమే. అందుకే కవి మిరప మహేష్‌..                 యుద్దమంటే సాధించడం కాదు                 కోల్పోవడం మాత్రమే
కవిత్వం

ప్రకృతి-విప్లవం

వ్యక్తులు వెళుతూ వెళుతూవారి జీవితాన్నిచ్చి వెళ్ళారుమేఘం చినుకులు కురిపించినట్టువెన్నెల కాంతిని పంచినట్టునేల చెట్టు వేళ్లని దాచినట్టువాళ్లేం ఊరకేనే వెళ్లలేదునదుల దారులను చూపివెలుగుల్లో చదువులు చెప్పిచెట్ల పత్రహరితాన్ని ఇచ్చిప్రకృతిని సౌందర్యం చేసి వెళ్ళారువారు వెళ్ళిపోవడమంటేమాయమైపోవడం కాదుమనలోకి మనం చేరుకోవడం..
కవిత్వం

నేను రాస్తూనే ఉంటా

గాజాలో మండుతున్న ఆకాశం కింద నేను రాస్తూనే ఉంటా యుద్ధపు కోరలు నా మాతృభూమిని నా కుటుంబాన్ని నా ఇల్లునుగోడకు మెరిసే నా మెడల్స్ ని నా హృదయంలో మెరిసి నా గదిని చేరని ఉజ్వల వైభవాలను నా నుండి లాగేసుకుంటేనేంనేను రాస్తూనే ఉంటా రచన నాకొక వినోదం కాదు అది నా మనుగడ నా రక్తాన్ని పంచుకుపుట్టేప్రతి పద్యం ఒక ధిక్కార గీతం దురాక్రమణకు ఎదురీదే హృదయ స్పందన దయచేసి ఈ పెన్నునూ ఒకప్పటి నా మాతృభూమినీనా నుంచి లాక్కోవద్దు నేన నా పద్యాన్ని ప్రపంచంలోకి విసిరేస్తాను ఒక్క వాక్యమైనా మీ గుండెల్లోకి చొచ్చుకొని నిద్రాణమైన మీ
కవిత్వం

వాళ్ళు..

వాళ్లు నిప్పు రవ్వలు వాళ్లు వెలుగు దివ్వెలు వాళ్ళు నీటి ఊటలు వాళ్ళు స్వచ్ఛ చెలిమలు వాళ్ళుఉప్పొంగిన నదీ ప్రవాహాలువాళ్లు పోటెత్తిన సంద్రపు అలలు వాళ్ళు తీరంతో విరామమెరుగకతలపడుతున్న తుఫాను హోరులు వాళ్ళను గురించి ఏమని చెప్పేది ఎంతని చెప్పేదివాళ్ళు లేని కాలాన్ని.. ఎలా ఊహించేది..వాళ్ళు ఉండనిలోకాన్నీ.. వాళ్ళు లేరన్న స్పృహను.. ఎలా భరించేది.. వాళ్లు రారన్నా వార్తను ఎలా తట్టుకునేది?!! తూరుపు అరుణిమలు వాళ్ళు.. తొలిపొద్దు వేకువలు వాళ్ళు.. ఛిద్రమైన మా బతుకు గాయాలకు.. ఆత్మీయ లేపనాలు వాళ్లు.. బూడిదై పోయిన మా బువ్వా.. ఇళ్ళూ..ఇడుపుల్లో.. ఉబికి వస్తున్న పొగల నడుమ.. గుక్కపట్టి ఏడుస్తున్న మా బిడ్డలను
కవిత్వం

   కలీం క‌విత‌లు రెండు

1. కొత్తకాదుఎన్ని ఆటుపోట్లుఎన్ని సంక్షోభాలుఎంత నిర్బంధంఎంత రక్త దారపోతఆటుపోట్లను అధిగమించిసంక్షోభాలను చిత్తుచేసినిర్బంధాన్ని బడ్డలుకొడుతూత్యాగాలతో ఎరుపెక్కిందినక్సల్బరీలో ముగిసిందన్నారుశ్రీకాకుళంలో మొదలుకాలేదా..శ్రీకాకుళంలోవెనకడుగు వేసిందనుకుంటేసిరిసిల్ల, జగిత్యాలలోజైత్రయాత్ర కాలేదా..జంగ్ సైరనూదలేదా..?నల్లదండులు, నయీమ్ ముఠాలుగ్రీన్ హంట్ లు, సల్వాజుడుంలుఆపరేషన్ ప్రహార్లు,ఆపరేషన్ సమాధాన్ లు,అన్నిటిని ప్రజా యుద్ధంతోనేఎదుర్కోలేదా..జనతన సర్కార్ లను ఏర్పరచలేదా..?లొంగుబాట్లు, కుంగుబాట్లువెన్నుపోట్లు, వెనకడుగులుఇవేవీ కొత్తకాదుప్రతీది ఒక గుణపాఠమేగుణపాఠం నుండే కదావిప్లవ పురోగమనంఖచ్చితంగా పురోగమిస్తాంపురోగమిస్తూ విస్తరిస్తాం. 2. అడవివెన్నుపోటుతో అడవికుంగిపోతుందిదోసుకునే దోపిడిగాళ్లకుదారి చూపుతున్న ద్రోహులను చూసి దుఃఖిస్తుంది.తన ఒడిలోని బిడ్డలనుఒక్కొక్కరిని కూల్చుతుంటేతల్లికోడిలా తల్లడిల్లుతుంది.తేదీలను బెట్టితుడిచేస్తామంటూకుట్రదారులు, పెట్టుబడిదారులుఒక్కటై వస్తూ ఉంటేతన బిడ్డల త్యాగాలతోతడిసిన అడవిసగర్వంతో ఎర్రబడిపోరుకు సై అంటున్నదివాడు చిగురించేఆకులను తుంచేస్తేనేను మళ్ళీగర్జించే గన్నులనుకంటానంటున్నది.
కవిత్వం

విప్లవం పురుడోసుకోక మానదు

పచ్చని అడవి వీరుల నెత్తుటితో తడిసిపోయి రక్తపు మడుగుగా మారొచ్చుఅమాయకపు ఆదివాసీలు ఏదో తెలియని కేసులో బంధించబడొచ్చు మిగిలినవాళ్ళు బానిసలుగా వాళ్ళ నేలని వారే తవ్వుతూ కార్పొరేట్ల కింద నలిగిపోవొచ్చు…..ఎప్పుడూ పేదల గుడిసెల వైపు అడుగు వేయని పాలకులు వారి నేలపై ఫాం హౌస్ కట్టుకుని జల్సాలు చేయొచ్చు ఇంతకంటే ఇంకా ఘోరమైనవి ఎన్నో జరగొచ్చు కానీఏరోజు అయితే …..ఏరోజు అయితే……అడవి లో చివరి మావోయిస్టు ను చంపుతారో నగరంలో మొదటి మావోయిస్టు పుడతాడు నిశీధి చీకటిలో మిణుగురు పురుగుల వెలుగులావిప్లవం పురుడోసుకోక మానదు.
కవిత్వం

చలనం

స్వప్నం సాకారమవుతుందనిసంబరపడుతున్న వేళ...కల చెదిరి, నిజం బొట్లు బొట్లుగా కారిపోతూవుంది.వేదన కన్నీరు మున్నీరుగా ఉబికివస్తూ వుంది.ఇప్పుడిప్పుడే..మొలకెత్తి,ఎదుగుతున్న విశ్వాసం..ఊపిరి సలుపక..ఉక్కిరి బిక్కిరి అవుతూ వుంది.ఉత్సాహ జవనాశ్వాలతో పరిగెడుతున్న వేళ..కాళ్ళు నరికివేయబడ్డఖండిత దేహం రోదిస్తూ వుంది.ఈ నేల బిడ్డలుపోరాడి, సాధించుకున్నపిడికెడు మట్టి, దోసెడు నీళ్లు, చారెడు నేల....కాసింత స్వేచ్ఛలనుకసాయి కర్కశత్వం...ఆసాంతం కబళిస్తూ వుంటే...ఏ జయ గీతాలను ఆలపించగలను ?బొడ్డు పేగు కూడా తెగని,పసికందుల కుత్తుకలను కోసే కంసులకు ఇక్కడ కొదువ లేదు.పాలుగారే పసిబుగ్గలకు..ముదిమి దేహాలకు...తేడా లేదిక్కడ !అన్నీ చిద్రం కావలసిందే !బ్రతుకే భారమైన చోట...త్యాగాలకు లెక్కలేదు..విలువ లేదు !ఇక్కడ యుద్ధం చేస్తున్న కపోతాలను...శాంతి పేరిట కసాయి డేగలు మట్టు బెడుతూ ఉన్నాయి.ఇక్కడ