కవిత్వం

దేశానికి ఏం కావాలి

ఈ దేశానికో కండ్లు కావాలిరాజ్యం చేస్తున్న కుట్రలను ధిక్కరించడానికి న్యాయాన్ని బహిరంగంగా బజారులో అమ్మేసుకుంటున్నందుకు దేశానికో కండ్లు కావాలిఈ రాజ్యానికి బలమైన గొంతుక కావాలి గొంతెత్తి గర్జించే గళాలేన్నో మూగబోయినందుకు ఫాసిస్టు పాలకుల పాలనలో బందీలుగా నలిగిపోతున్నందుకు రాజ్యానికి బలమైన గొంతుక కావాలి ఈ దేశానికి పిడికిలి కావాలి అన్యాయపు అంగట్లో ఆదివాసి కాళ్ళ కింద నేలను తాకట్టు పెడుతున్నందుకు కార్పొరేట్లపై పిడికిలెత్తి నినదించేందుకుదేశానికో పిడికిలి కావాలి ఈ దేశానికో రంగు కావాలి కాషాయపు కాగితాల కింద నలిగిపోతున్న జెండాను కాపాడేందుకు గాయపడిన పావురపు రంగు కావాలి దోపిడి దొంగలను తరమడానికి పిడికిలెత్తి నినదిస్తూ గొంతు ఎత్తి గర్జిస్తూఈ
కవిత్వం

ఉదయ్ కిరణ్ కవితలు రెండు

1మళ్లీ ఊపిరి పోసుకుంటాయినా బిడ్డ తిరిగి వస్తాడా ముక్కుపచ్చలారని నా బిడ్డను నేను తొమ్మిది నెలలు మోసినా నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టకుండా పుట్టిన నా బిడ్డ మళ్లీ తిరిగి వస్తాడా. మొన్ననే మొదటిసారి అమ్మ అని పిలుస్తుంటే ఎంత సంతోష పడిపోయామో మళ్ళీ ఆ పిలుపు నాకు వినిపిస్తుందా నన్ను అమ్మ అని మళ్ళీ పిలుస్తాడా .నల్లని రూపున నా బిడ్డకు తెల్లని పాల బువ్వ తినిపించి జో కొడితే హాయిగా నిద్రపోయే నా బిడ్డ మళ్లీ తిరిగి లేస్తాడా మిగిలిన పాల బువ్వ తిని హాయిగా నిద్ర పోతాడా .మాటరాని నా బిడ్డను మావోయిస్టు అంటూ
కవిత్వం

వరి గొలుసులకు యమపాశాలు

సన్నని ముసురు కిందనాట్లు వేస్తున్న దృశ్యం చూసి ఫూలే గుండెమరోసారి మండే ఎడారి అవుతుంది చేతిలో పాత కాగితాల కట్టపట్టుకుని డ్యాము ఒడ్డున నిలబడితల్లిని పోగొట్టుకున్న బిడ్డలాపొలాలని పోగొట్టుకున్న 'శాలో'తల్లి డ్యాముకేసి నిర్వేదంగా చూస్తుంటది అవతల నగరం డ్యాము పుణ్యమా ..అని ధగధగా మెరిసిపోతుంటది జిలిబిలి నగవుల మురిసిపోతుంటది నగరం అభివృద్ధి కింద వ్యాపించిన పెంజీకట్లుమట్టి దీపాల్ని కలవర పెడుతుంటాయి ఇవాళ సోమాకు పస్తులే మిగిలాయి ఆయన పొలాలన్నింటినీరిజర్వాయర్ మింగేసింది పాలిపోయిన చర్మం లోంచిపొడుచుకొచ్చిన ఎముకల గూడుపిడచగట్టిన పేగులు లో లోపలికి ముడుచుకుపోతాయి ఉబికి వచ్చే కన్నీళ్లను అదిమిపెట్టిన డ్యాము విస్పోటిస్తున్న క్రోధాలనుఅదిమిపెట్టిన డ్యాముకూలిపోతాయి పర్వతాగ్రాన తిరుగుబాటు రగిలినప్పుడు
కవిత్వం

కొత్తాట నేర్చుకుందాం

ఆకురాలు కాలం,అడవిలో రాలుతున్న ఆకుల సవ్వడిఆ సవ్వడికిసుడిగాలి తోడవుతూఆ సుళ్ల చక్రబంధంలో రాలిన ఆకులుసుళ్లు తిరుగుతూ దుమ్ము లేపుతూగలగల పైకెగురుతున్న శబ్దాల మోత ఆ మోత మరే శబ్దాలను విననివ్వడమే లేదురాలిన ఆకులతో బోసిపోయిన అడవివన్నెలుడిగి, గ్రీష్మ తాపానికి తహతహలాడుతోంది.ఆరు రుతువులలో అడవిఆరు రకాలుగా ముస్తాబవుతోందికానీ, గ్రీష్మమే దాని వన్నెలన్నీ దోచుకుంటుందిచిందులన్నీ చెరిపివేస్తుంది.నిన్నటి వరకు పచ్చదనాన్ని కప్పుకున్న మానులన్నీఆకుల సోయగాలు మటుమాయమైనట్టే,బోసిపోయిన అడవి పల్చబడిందా అనే సందేహం....లేదుకదూ!పచ్చని ఆకులు పండుటాకులై రాలడం సహజంరాలిన ఆకులు ఎండటం,ఎండిన ఆకులు ఎలుగడితో కాలడం అడవిలో అంతకన్నా సహజంఆకులు రాలిన చెట్లు వసంతంలోచిగురిస్తాయి, అడవి వన్నెలన్నీ మళ్లీ మొదలవుతాయిచిగురించిన ఆకులు, మొగ్గ తొడుగుతాయి,మొగ్గలు,
కవిత్వం

కోయ కవితలు రెండు

విప్లవం ఒక చిన్నారిని కవిగా మలిచింది . విప్లవకారుడిగా తీర్చి దిద్దింది . ఈ కవి సల్వాజుడుం రోజుల్లో తల్లి వేలు పట్టుకొని వచ్చి బీ.ఆర్.ను తొలిసారి చూశాడు , తరువాత ఉద్యమంలో చేరాడు. కంప్యూటర్ గురూజీగా పేరు పొందిన సుప్రసిద్ధ రచయిత్రి, అమర యోధ రేణుక అలియాస్ మిడ్కో వద్ద కంప్యూటర్ శిక్షణ పొందాడు. 1 . మా ప్రాణం బీ.ఆర్నా కళ్ల నుండి నెత్తుటి ధారలునేల రాలుతుంటే,నీ త్యాగం, నీతో, నే గడిపిన క్షణాలనుపదే పదే గుర్తు చేస్తున్నాయినీతో గడిపిన ప్రతి క్షణంనాలో నీ త్యాగాన్ని ఎత్తిపడుతోందినీ అమర స్మృతులనువిశ్వ పీడిత ప్రజ సదా స్మరిస్తారురణభూమిలో
కవిత్వం

ఇద్దరు స్త్రీలు కలిసి చాయ్ తాగినప్పుడు..

లోకంలో అంతా బానే ఉంది ఇద్దరు ఆడవాళ్ళు కలిసి టీ తాగినప్పుడు కాలం ఊపిరి బిగబెడుతుంది అనాస పువ్వు మెరుస్తుంది అల్లం ఆవిరైపోతుంది నిమ్మగడ్డి తిరగబడుతుంది దాల్చన చెక్క చేయవలసినదానికన్నా తక్కువ పాపం చేస్తుంది బోధి ధర్మ మేల్కొంటాడు ఇద్దరు స్త్రీలు కలిసి చాయ్ తాగినప్పుడు వాయువీణలు కంపిస్తాయి, డోళ్ళు దొర్లిపోతాయి,మనసు హృదయాన్ని కలుస్తుంది, భాగం సంపూర్ణమవుతుంది,ఇద్దరు మహిళలు కలిసి టీ తాగినప్పుడుమందుల దుకాణం వారు నవ్వుతారు, మద్యం సర్వ్ చేసేవారు రాగం తీస్తారు పీఠాధిపతులు ధర్మశాస్త్రాలు ఉటంకిస్తారు నీలగిరి డార్జిలింగ్ను కలుస్తుంది ఇద్దరు ఆడవాళ్ళు కలిసి చాయ్ తాగినప్పుడు పచ్చని నురుగు, రత్నపు మంచు,పురాతన కడాయి, స్నేహ
కవిత్వం

సర్రియల్‌ క్లౌడ్‌ బర్స్‌ట్స్‌  వర్సెస్‌ వసంతమేఘం

ఇట్లా వాణిజ్య రాజధాని మీదికి జనం ఎప్పుడొస్తారు వానవలెవలస కూలీలుగా కాదుకోలీలు1గా కార్మికులుగాకోస్టల్ కారిడార్ కోసం నిర్వాసితులై కాదుఈ సముద్రమూ సముద్రంలోని సరుకులూ మావే అని స్వాధీనం చేసుకోవడానికికార్పొరేట్ కాలుష్య మబ్బులు అనిక్లౌడ్ బర్స్ట్స్ కాదని హెచ్చరిస్తూమీ అక్రమ నిర్మాణాల వలన మావాళ్లే చావడానికి కాదు చెట్లు కూలిపోవడానికీ కాదుఆదివాసులను చంపివాళ్లు కళ్లల్లో పెట్టుకున్న మనుషుల్ని చంపిఅడవితల్లి గర్భం నుంచి పుట్టుకొచ్చి ఇంకా పేగుబంధం తెగనిలక్షలాది చెట్లను నరికే గఢ్ చోరీలుఉక్కుచెట్లను నాటితే అడవెక్కడికి పోవాలి మరినదులై మహానగర రోడ్లనే ముంచెత్తుతున్నది.పల్లెల్లోని రైతాంగమంతా ఢల్లీలో ఒక బహదూర్షాను పెట్టుకొని కంపెనీ మీద యుద్ధానికి తమ బిడ్డల్ని పంపింది మోషా(సా)ల
కవిత్వం

మరో ఉదయం కోసం

ఈ నిషాద విషాద కాలంలో ఒంటరిగా మిగిలి వున్నామన్న ఊహ గుండెల్లో మెలిపెడుతుంది మాటాడుకోవడానికి నీ పక్కన ఒకమనిషి లేరన్నది భయపెడుతుంది కలిసి నడిచినపాదాలన్ని దూరంగా జరిగిదారిలో నేనొక్కడినే మిగిలి వున్న ఊహ నిలువనీయదు కలిసి సాధించిన విజయాలు మరల మరలగుర్తుకు వచ్చి భుజం తడుతూనే వుంటాయి కానీ ఇన్ని మరణాలు కళ్ళలో కదలాడి నెత్తురు చిమ్ముతున్నాయి ప్రతీ దేహంతో వీడ్కోలు చెప్పే జన సందోహం నినదించిన నినాదాలు మరల ఆశను కల్పిస్తున్నాయి శిశిరం వెళ్లిన మరుక్షణం చిగురించే వసంత కాలమొకటి హామీగా వస్తుంది అయిన ఈకాలాన్ని జయించే విస్పోటనమేదొ మరల జరిగిపిడికిళ్లు బిగిసే సమయం ఉదయించే ఆ
కవిత్వం

ముస్లిములు.. నిర్దోషులు

ఇప్పుడింక వాళ్ల నిర్దోషిత్వం ప్రశ్నార్థకమైంది విడుదలైన వాళ్లు ఇప్పుడింకతమ ఛిద్రమైన జీవితాలను కూడ దీసుకోవడం కాదు భార్యా పిల్లలతో వియోగ విషాదం పూడ్చుకోవడం కాదు ఒక తరం కన్నీళ్లు ఇంకిపోయినవికోవిడ్ ఒక మరణంలోకియవ్వనాలు వృద్ధాప్యాల్లోకి పసిపాపలు పెండ్లికెదిగిన కూతుర్లయియువతీ యువకులై తామైనా చదువో, కొలువో వెతుక్కునే వెసులుబాటు దొరికే విరామం లేదు. ఉన్నదల్లా బయటి వ్యవస్థ మొహానవేనోళ్ళ వేలాడుతున్న ప్రశ్నలు ఇంక జైల్లో దాక్కోవడానికీ లేదు వీధుల్లో తిరగడానికి లేదు నూట ఎనభై తొమ్మిది మృతదేహాలకంకాళాలు ప్రశ్నిస్తున్నాయి ప్రాణమొచ్చి మానినాయనుకున్న బాంబు బ్లాస్ట్ గాయాలను కెలికినట్టయి బుసకొడుతున్నాయిఇప్పుడు మళ్ళీ మిమ్ములనుమీడియా విచారణకు పెట్టినట్లయింది చచ్చినవాళ్లు అబద్దం కాదు కదా
కవిత్వం

సిగ్గుపడు

వాడెవడో అంటున్నాడు‘ఆడపిల్లల్ని అదుపులో పెంచండ’నివాడి జ్ఞానేంద్రియాలకుమగతనపు మదము జోడించివాడిలా కూడా కూసేడుమహిళ సహకరిస్తేనే గదా..!అని కూడా అన్నాడు మహిళలే మర్మగర్భంగా ఉండాలట మీ అంగాంగాలువాళ్లను కామోన్మాదులను చేయొచ్చునటరాక్షస సూత్రీకరణల ఉద్బోధకులుఇలా సెలవిస్తున్నారు మరి...మృత దేహాలనూ వదలనిమగాళ్ళ మూక–ఎదలు కోసినామర్మంగాలను ఛిద్రంచేసినాఘోరం ఘోరమనిగగ్గోలుపెట్టొద్దటఅది–వాని పూర్వజన్మ సుకృతం...వాడల చేస్తాడటమీదీకర్మఫలంమీరలాచావండనిఆమే అంటున్నది‘అమ్మా...నాకొద్దీఆడతనంలంగా,వోణిపూలుగాజులూఅసలే లింగమూ వద్ద’నిముద్దుకు మురిపానికిమాటకూచూపుకూరసికతను రంగరించి చూసిపసిపాపలను సైతం–కసిగా చంపే విషనాగుల గుంపులువిరుచుకు పడుతుంటేఏమంటుంది మరి..?సీతాకోకచిలుకల్లారా ఆకు చాటున దాచుకోండిపూవ్వుల్లారా మీపరిమళాలను వెదజల్లకండిరంగురంగులపక్షుల్లారామీ అందచందాలు ఆరబోయకండినెలవంకానీవే మబ్బుల చాటుకోపారిపోపండు ముసలినిండు చూలాలుబిచ్చగత్తెపిచ్చి తల్లీమీ వొళ్ళుజాగ్రత్తా...గుంపులు గుంపులుగాతిరుగుతున్న పిశాచాలగణంఈ నేలపై యేదోకామక్రీడ కమ్ముకున్నట్టునిర్మానుష్య స్మశానంలానిత్యం ఇలా కాలుతున్నదిఉన్మాదపు రసిపండైవిస్తరిస్తున్నదిఇదీ –ఏ నాగరికతకు ఫలశృతిఏ