మీరీ పుస్తకం చదివారా ?

ఈ కథలనెందుకు చదవాలి..?

కథ అనేది మొదట్లో కుతూహలాన్నీ, చివర ఆలోచనల్నీ కలిగించాలి. మధ్యలో చెప్పేది రక్తి కట్టిస్తూ చెప్పుకుపోవాలి.  - ఆరుద్ర ఆధునిక కథపుట్టుకకు వందేళ్ళకుపైగా చరిత్ర ఉన్నప్పటికీ గత నాలుగుదశాబ్దాల కథాప్రయాణంలో ‘కథ’ విస్తృతమైంది. కథాసాహిత్యం ఏ సాహిత్య ప్రయోజనాలకోసం ఆవిర్భవించిందో ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు కొత్తతరం కథకులు ముందుకొస్తున్నారు. వైవిధ్యమైన కథావస్తువుల్ని కథాసాహిత్యానికి పరిచయం చేస్తున్నారు. ఆధునిక కథ ఆవిర్భావం సమాజాన్ని సంస్కరించే ఉద్దేశ్యంతో కథావస్తువులు వచ్చాయి. ఇప్పుడలా కాదు  వొక ఘటననూ, వొక జాతి సంస్కృతిని దాని తాలూకూ విలువల్ని, లేదా వివక్షల్ని, వర్తమాన ఆధునిక సమాజం ఎదుర్కొంటున్ని నైతికమానవతావిలువల పతనాన్ని, నాగరిక సమాజపు పోకడల్ని కథలుగా రాయడం
మీరీ పుస్తకం చదివారా ?

సాహిత్య మూలాలను పట్టిచూపిన విమర్శ

సాహిత్యవిమర్శ జ్ఞానవిశ్లేషణ చేసే ప్రక్రియ      -రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి వర్తమానసాహిత్యం విమర్శను కోరుకోవడం లేదు. సద్విమర్శను మాత్రమే కోరుకుంటున్నది. అందుకే తెలుగుసాహిత్యం విమర్శలో బలహీనమైందని బలంగా నమ్ముతున్నాను. ఏ పుస్తకమొచ్చినా అందులో వస్తువైఫల్యం, శిల్పవైఫల్యం లేదా ఇతర నిర్మాణపద్దతులు లోపించినపుడు విమర్శకులు ఇలా ఉంటే బాగుండేదని చెబితే సదరు కవులు ఓర్చుకునే స్థితిలోలేరు. ఇది తిరోగమనదిశకు సంకేతం. మన ద్రావిడ భాషలైన తమిళ,కన్నడ, మళయాళ కవులు విమర్శకు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. తమ పుస్తకం గూర్చి పొగడటం కంటే నాల్గు విమర్శనాత్మక సూచనలు చేస్తారని ఆశతో ఎదురు చూస్తారు. ఇలాంటి వైఖరి తెలుగు కవులలోనూ, వారు సృష్టించే సాహిత్యంలోనూ వృద్ది చెందాలి.
మీరీ పుస్తకం చదివారా ?

 కవిత్వజీవధార ‘తెర’ కవిత్వం

మనిషి చైతన్యం నిరంతరం ఆర్థిక రాజకీయ-సాంస్కృతిక వాస్తవాల నుంచే వస్తుంది-పెరుగుతుంది. పైనఉండే నిర్మాణంలోని భాగం కాబట్టి పైకీ, ముందుకు కిందికి చూసి రావలసిన మార్పుల గురించి హెచ్చరిస్తుంది-అవసరాన్ని నొక్కి చెబుతుంది. ఈ విషయంలో కవి అనేవాడు పాట, పద్యం వచన కవిత ఏది రాసినా ఏ ప్రయోగం చేసినా స్వతహాగా ఉండే మనిషి ఆవేశాన్ని-ఆలోచనలను-కలలను వ్యక్తం చేయవలసిందే.                                                                                                                                                                                  _నిఖిలేశ్వర్‌ ‘ఈ దేశపు న్యాయ గుమ్మటం దానికదే కూలిపోయింది ఎవరూ కూల్చలేదు పాపం ఈజాతి లౌకికత్వం దానికదే పేలిపోయింది ఎవరూ మందుగుండు పెట్టలేదు పాపం’ బాబ్రీమసీదు విధ్వంసాన్ని పై కవితావాక్యాల్లో చెప్పిన కవి తెలకపల్లి రవి. మస్తిష్కపొరల్ని దాటుకొని
మీరీ పుస్తకం చదివారా ?

కవిత్వం యుద్ద మైదానమే!

కొన్ని ప్రశంసాపూర్వక వాక్యాలు, మరికొన్ని ముఖస్తుతి పదబంధాలు, ఇంకొన్ని పొగడ్తతో ముంచెత్తి  ఈ కవిని కవిత్వాన్ని అభినందించాలని  కాదు. ఈ కవిత్వం చదువుతున్నంతసేపూ ఎదో తెలియని బాధ. ఇలా కదా చెప్పాల్సింది. ఇలా కదా మాట్లాడాల్సింది. ఇలా కదా రాయాల్సింది. నివురుగప్పిన నిప్పుకణికలతో మరిన్ని నిప్పుకణికల్ని ఇలా కదా మండించాలి అనిపించింది. ఆలోచింపజేసేలా ఈ కవిత్వం కవి నాయుడు గారి జయన్న రాశారు. తెలంగాణలోని గద్వాల ప్రాంతానికి చెందిన కవి. సామాన్యజనం ఈ సమాజాన్ని ఎలా చూస్తారన్నది వారి చైతన్యం మీద, స్పృహ మీద ఆధారపడి వుంటుంది. కాని కవికి ఈ సమాజం పట్ల మాత్రం బాధ్యత ఉందని
మీరీ పుస్తకం చదివారా ?

గాథలు కావివి.. జీవితాలు

ఇటీవలకాలంలో ప్రగతిశీల ఉద్యమాల్లో ఉన్న కొంతమంది కవులు పద్యకావ్యాలతో అభ్యుదయకవిత్వాన్ని రాస్తున్నారు. ప్రజా సమస్యల్ని, ప్రజల బాధల్ని గాథల్ని కవిత్వంగా రాయడం ఈ మధ్య తెలుగుకవిత్వంలో సహజంగా చూస్తుంటాం. కానీ పద్యంలోనూ ఉద్యమాలను రాయడం ఆరదు. అయితే ఈ పద్యకావ్యాలు ప్రాచుర్యంలోకి పెద్దగా రావడం లేదు. వారు ఎక్కడికక్కడే రాసి పుస్తకాలను ముద్రించుకుంటున్నారు. ఏ జిల్లాకాజిల్లాకే వాళ్ళు పరిమితమవుతున్నా, ప్రపంచాన్నంతా కవిత్వంగా రాస్తున్నారు. ఆ కోవలోకి చెందిన కవి కర్నూలులో కనిపించారు. ఆయన రాసేవన్నీ పద్యాలే. అవి కారల్‌ మార్క్స్‌, లెనిన్‌, చెగువేరా..ఇలా మహనీయుల గూర్చి, ప్రజా ఉద్యమాల గూర్చి, సమస్యలగూర్చి రాస్తుంటారు. వాటిని పద్యాల్లో పరిచయం చేస్తుంటారు.
మీరీ పుస్తకం చదివారా ?

నిప్పులుగా ప్రవహించే కవిత్వం

చాన్నాళ్ళుగా కవి వసీరా గూర్చి అన్వేషిస్తూనే ఉన్నాను. ఇప్పటికి దొరికారు. అప్పుడెప్పుడో ఎక్కడెక్కడో చదివిన కవిత్వం ఇప్పుడు ఒక్కచోట ఇలా వసీరా లోహనది పేరుతో లభించడం కవిత్వప్రేమికులకు...నాకూ ఆనందమే. కవి వసీరా రాసింది మూడంటే మూడు కవిత్వసంపుటాలే. ఎంతలోతుగా రాస్తారు. ఎంతగాఢతగా రాస్తారు. ఇది చదువుతున్నంతసేపూ కవిత్వం కోసమే కవిత్వం రాసిన అనుభూతి కలిగింది. ఆపకుండా చదివించాడీకవి. గుండెకు ప్రకంపనం కలిగింది. కవిత్వం చదువుతున్నంత సేపూ హృదయం లయాత్మక విన్యాసమైంది. ఎనబయ్యోదశకంలోనే ఎంతో గొప్ప కవిత్వం రాశారు. ఇప్పటికది అవసరమని భావించి ఈ కవిత్వం గూర్చి నాల్గుమాటలు రాయాలనిపించింది.          ‘అన్నా! నాకు నిరుద్యోగం వచ్చింది’ అని                
మీరీ పుస్తకం చదివారా ?

విశ్వగురు బసవన్నే… ‘నమో’ కాదు..

ఈ భూమి శ్రమజీవులదని ఈ శ్రమలోనే సమాజం నిర్మితమైందని సమాజంలో కులం లేదు మతం లేదు మానవత్వమే ఈ సమాజానికి జీవనాధారం అని చాటి చెప్పిన విశ్వగురు బసవన్న.  సామాజిక మాధ్యమాల్లో నరేంద్ర మోడీని విశ్వగురుగా అభివర్ణిస్తూ పోస్టింగులు పెట్టి బసవన్నను మతోన్మాదులు సాంస్కృతిక విప్లవకారుడుగా 12వ శతాబ్దంలో అసమాన తలపై కులవివక్షపై ఆధిపత్య ధోరణిపై తన ప్రవచనాలతో సాంస్కృతిక విప్లవానికి పునాదులు వేసిన మహోన్నతమైన సంస్కర్త బసవన్న.  12వ శతాబ్దంలోనే కార్మిక వర్గం నా అస్తిత్వం అంటూ ప్రకటించిన గొప్ప విప్లవకారుడు. ఆ మహనీయుడిపై ఇటీవల కాలంలో కన్నడ భాషలో బసవన్న మత్తు అంబేద్కర్ అద్భుతమైన పుస్తకం
మీరీ పుస్తకం చదివారా ?

ఎవడ్రా ఈ నేల నాది కాదన్నది..?

‘మనఓట్లు తీసుకుని గెలిచిన ప్రభుత్వం మన పునాది బతుకులను దెబ్బతీసేందుకు చట్టాలను నియమాలను తెచ్చిందా? దేశ రక్షణ పేరుతో, ఇస్లాం టెర్రరిస్టుల బూచి చూపి ముస్లిం చొరబాటుదారులను ఏరివేయడానికి అని చెప్పి, మొత్తం జన వర్గానికి ప్రతి వ్యక్తికీ తన ఉనికిని రుజువుచేసుకునే దుర్మార్గమైన పరిస్థితిని కల్పించింది.అధర్మం. అన్యాయం.’ ‘మనఓట్లు తీసుకుని గెలిచిన ప్రభుత్వం మన పునాది బతుకులను దెబ్బతీసేందుకు చట్టాలను నియమాలను తెచ్చిందా? దేశ రక్షణ పేరుతో, ఇస్లాం టెర్రరిస్టుల బూచి చూపి ముస్లిం చొరబాటుదారులను ఏరివేయడానికి అని చెప్పి, మొత్తం జన వర్గానికి ప్రతి వ్యక్తికీ తన ఉనికిని రుజువుచేసుకునే దుర్మార్గమైన పరిస్థితిని కల్పించింది.’ ఈ
మీరీ పుస్తకం చదివారా ?

పదునెక్కిన ఆయుధం కదా జీవితం..!

స్వేచ్ఛ నాకు జీవితం మించిన కల అంటూ లోసారి సుధాకర్‌ ‘ఆయుధంలాంటి మనిషి’ కవిత్వం తెచ్చారు. జీవితం ఎలా పదునక్కుతుంది అని ప్రశ్నించుకున్నప్పుడు కొన్ని కన్నీళ్ళు, ఇంకొన్ని దు:ఖాలు, మరికొన్ని విషాదాలు కవిత్వంలో కనబడతాయి. వర్తమాన కవిత్వలోకంలో విస్తృతంగా కవిత్వం వస్తునే వుంది. నవతరం యువ కవులు కవిత్వం రాస్తూనే ఉన్నారు. కవిగమ్యం, కవిత్వ పరిణామం ఏమిటి అని ప్రశ్నించినపుడు జవాబు మనికిప్పుడు అస్పష్ట్టంగానే వినబడుతుంది.  సామాజికవాస్తవాన్ని నొక్కి చెప్పగలిగిన కవిత్వం వర్తమాన సాహిత్యంలో చాలా అరుదుగా కనబడుతుందన్న విషయం కొద్ది మందికే తెలుసు. సామాజిక వాస్తవాన్ని కవిత్వంలో చెప్పాలనుకున్నప్పుడు కవికి సైద్దాంతికబలం ఉండాలి. అలా ఉన్నప్పుడే కవి
కాలమ్స్ మీరీ పుస్తకం చదివారా ?

‘మన్‌ కీ బాత్‌ : వొట్టి మాయా పాచిక’

A poem is what happens when it is read- Christopher Caudwell భారతీయ సాహిత్యంలో తనకంటూ సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న కవి అఫ్సర్‌. కథ, కవిత్వం, విమర్శ ఏది రాసినా తనదైన భావజాలానికి అతీతంగా, తనదైన శైలికి భిన్నంగా రాయరు. అఫ్సర్‌ ఏది రాసినా పదికాలాలు గుర్తిండిపోయే అక్షరాలకు జన్మనిస్తాడు. ప్రగతిశీల రక్తకణాలను నరనరాల్లో నింపుకుని పిడికిలి బిగించి విప్లవోద్యమాన్ని నడిపిన కౌముది కొడుకే అఫ్సర్‌. ఈ తరానికి ఆయన కవిగానే తెలుసు. కానీ ఆయనది నాల్గున్నర దశాబ్దాల సుధీర్ఘ సాహిత్య ప్రయాణం. సమసమాజ నిర్మాణానికి రాళ్ళెత్తిన కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినవారే! దేశంకాని దేశంలో