కొత్త పుస్తకం

అస్తిత్వం నుండి విముక్తి దాకా

జైలు కథల అనూరాధగా తెలుగు పాఠకులకు పరిచయమైన బి. అనూరాధ సాహిత్య ప్రస్థానం ఈ సంకలనంలో చూడవచ్చు. హజారీబాగ్ జైలు కథలు తెలుగు కథా సాహిత్యానికి అరుదైన చేర్పు. విప్లవ కథా స్రవంతికి కూడా ఇది సరికొత్త విస్తరణ. మన సాహిత్యంలో ఖైదు కవిత్వం వచ్చినంతగా కథలు రాలేదు. ఎక్కువ మందికి తెలియని ఆ ప్రపంచపు లోతులను ఈ కథలు చూపించాయి. సమాజంలోని సమస్త ఆధిపత్యాలు, వాటిని వ్యవస్థాబద్ధం చేసే రాజ్యం ఆ ఇరుకైన, ఎత్తైన గోడల మధ్య చిక్కగా అల్లుకొని ఉంటాయి. అందులోనే మనుషులుంటారు, మానవీయ స్పందనలు, భావోద్వేగాలు ఉంటాయని పితస్వామ్య వ్యవస్థా పీడితులైన స్త్రీల  కోణం
కొత్త పుస్తకం

ప్రశ్నించే చంద్ర పాట

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కొత్త కలాలను, గళాలను తెలుగు నేలకు పరిచయం చేసింది. కలాలు నడిపే సంవాదం కవితాత్మకం. గళాలు చేసే సంభాషణ కళాత్మకం. లలిత కళల్లో కవిత్వం ప్రథమ స్థానంలో ఉంటుంది. సహజంగానే కవిత్వం రాసే వారికి గుర్తింపు ఎక్కువ. మేధో సంబంధ కార్యకలాపంగా కవిత్వాన్ని పరిగణించడం సాహిత్యంలో మునుపటి నుంచి వస్తుంది. కవిత్వ పాఠకుల స్థాయి కూడా ప్రత్యేకంగా ఉంటుంది. కనుక కవితా కళకు పరిమితులు ఉన్నాయి. పద్యకవిత్వం, గేయ కవిత్వం, వచన కవిత్వం కొందరికే కమ్యునికేట్ అవుతుంది. ఏ మినహాయింపులు, షరతులు లేకుండా శ్రోతలందరికి ఏకశృతిలో చేరుకునేది పాట కవిత్వమొక్కటే. పాటలో సంగీత సాహిత్య
కొత్త పుస్తకం

అనేక అసహనాల మధ్య అధిగమించాల్సిన దూరాలు

(ఇటీవ‌ల విడుద‌లైన డా. గీతాంజలి ‘అత్తరు మునక’ కథా సంపుటికి రాసిన ముందుమాట)  ‘మన భావాలు వాడి పారేసినవి.  మన ప్రేమ ముందే అనుకుని నిర్మించుకున్నది.  మన నమ్మకాలు రంగులు అద్దినవి.  మన స్వాభావికత కృత్రిమ కళతో మాత్రమే కొలవగలిగినది.  గాయపడకుండా నిజంగా ప్రేమించడం చాలా కష్టం అయ్యింది.’ (రోహిత్ వేముల చివరి వుత్తరం నుంచి) గీతాంజలి కథలు చదువుతుంటే నాకెందుకో రోహిత్ వేముల చివరి మాటలు గుర్తొచ్చాయి. గాయపడకుండా ప్రేమించడం కష్టమన్న పోలిక స్ఫురించింది. గాయపడకుండా ప్రేమించడమే కాదు; రచించడం కూడా కష్టమేనేమో!  కాలం గాయాల్ని మాన్పుతుంది అంటారు; కానీ పాత గాయాలు మానకుండానే కాలమే కొత్త
కొత్త పుస్తకం

కాషాయ కార్పొరేట్ ఆక్రమణ దాడి – ప్రజల ప్రత్యామ్నాయ పోరాట పంథా

(ఇటీవ‌ల విడుద‌లైన  *క‌గార్ రిప‌బ్లిక్‌* ఫెలోట్రావెల‌ర్ పుస్త‌కానికి రాసిన ముందుమాట- వ‌సంత‌మేఘం టీం) Res publica అనే లాటిన్ పదం నుంచి వచ్చిన రిపబ్లిక్ పదానికి 'పబ్లిక్ విషయం' అనే అర్థం ఉంది. అంటే ఎవరో ఒక రాజో, రాణో కాకుండా దేశ పుత్రులు /పుత్రికలు తమ ఇచ్ఛానుసారం (వోటు రూపంలోనే కావచ్చు) తమ ప్రతినిధులను ఎన్నుకోవడం అనే ప్రజాసామిక పాలనా ప్రక్రియే రిపబ్లిక్. అటువంటి రిపబ్లిక్ ప్రభుత్వం విశాల ప్రజల ప్రయోజనం కోసం తప్ప ఎటువంటి ప్రైవేట్ వ్యక్తుల ప్రయోజనం కోసం పాలించకూడదు. ఇది 1950లో భారత రాజ్యాంగంలో ప్రజలుగా తమకు తాము పొందుపరచుకున్న పాలనా విధానం
కొత్త పుస్తకం

ఈ కాలపు అవసరం ఈ పుస్తకం

(ఈ నెల 13 న హైదరాబాదులో విడుదల కానున్న పాణి శాంతి చర్చలు : ప్రజాస్వామ్యం - విప్లవోద్యమం పుస్తకానికి ప్రచురణకర్తలు రాసిన ముందుమాట ) ఈ పుస్తకాన్ని వర్తమాన తెలుగు మేధా సంప్రదాయంలో అత్యవసరమైన, ప్రాసంగికమైన, కీలకమైన రచనగా పరిగణించడానికి మూడు కారణాలున్నాయి.ఒకటి, ఇది ఒక వాదనల సంకలనం. విప్లవోద్యమానికీ ప్రభుత్వానికీ మధ్య చర్చలు జరగాలని, సమాజంలో నెలకొని ఉన్న హింస తగ్గి శాంతి ఏర్పడాలని ఆకాంక్షలు వినిపిస్తున్న సందర్భంలో వ్యక్తమవుతున్న అనేక వాదనలను, అభిప్రాయాలను మదింపు చేసి విప్లవోద్యమం వైపు నుంచి ఒక వాదన వినిపిస్తున్న పుస్తకం ఇది. రెండు, ఇది ఒక ఆశావాదపు ప్రకటన.
కొత్త పుస్తకం

కల్లోల రాజ్యంలో మలిగిపోనిప్రేమ దీపం పుష్కిన్ ‘మాషా’ – నవల

రష్యా ఆద్య కవులకే ఆద్య కవిగా సాహిత్య పితామహుడుగా పేర్కొనబడే అలెగ్జాండర్ పుష్కిన్ (1799 – 1837 = 38 ఏండ్లు) అతిచిన్న వయసులోనే ఒక యువతి విషయంలో మరో యువకునితో జరిగిన ద్వంద యుద్ధంలో గాయపడి చిన్నవయసులోనే మరణించినప్పటికీ అతను సృజించిన సాహిత్యం మాత్రం అజరామరమైనిలిచింది.పుష్కిన్ 189 ఏండ్ల కింద (1836 లో) రష్యన్ భాషలో వ్రాసిన ప్రపంచ ప్రసిద్ధ నవల ‘కెప్టెన్స్ డాటర్’ ఇన్నేండ్ల తరువాత కుమార కూనపరాజు చొరవతో, మోహన్ తలారి ఇంగ్లీష్ నుండి తెలుగులోకి అనువాదం చేశాడు. దాన్ని ‘ఎన్నెలపిట్ట బుక్స్’ వారు జూలై, 2025 లో తెలుగు పాఠకలోకానికి అందించారు.మోహన్ తలారి
కొత్త పుస్తకం

ప్రజాస్వామ్యం లేకుండా శాంతి, శాంతి లేకుండా ప్రజాస్వామ్యం సాధ్యం కాదు

(ఇటీవల విడుదల అయిన *శాంతి చర్చలు - ప్రజాస్వామిక అన్వేషణ * అనే పుస్తకంలోని ముందుమాట) ఈ ప్రచురణ ఒక ప్రయోగం లాంటిది. ఇందులో రెండు ఇంటర్వ్యూలు, ఒక సంస్మరణోపన్యాసం రెండు ప్రసంగ వ్యాసాలు ఉన్నాయి. ఇవి భిన్నమైన ప్రక్రియలు. ఇంటర్వ్యూలు చాలా వరకు అది చేసే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. సంస్మరణ ఉపన్యాసం పూర్తిగా లిఖిత రూపంలో ఉంటుంది. ప్రసంగ వ్యాసాలు సందర్భాన్ని బట్టి ఏ సంస్థ నిర్వహిస్తున్నదో దాన్ని బట్టి ఉంటాయి. అయితే ఈ అన్నింటిలో అంశం దాదాపు ఒకటే కాబట్టి ఒక రన్నింగ్ థీమ్ ఉంది. వీటిలో శాంతి ప్రధానమైన అంశమైనా, శాంతి
కొత్త పుస్తకం

రెడ్‌ జర్నలిస్ట్‌ కామ్రేడ్‌ రేణుక @బి.డి.దమయంతి

(ఐదు భాగాల  మిడ్కో సమగ్ర సాహిత్యంలో   *విముక్తి బాటలో ..*  మూడో సంపుటానికి సంపాదకురాలు రాసిన ముందుమాట. జూలై 18 ,శుక్రవారం హైదరాబాదులో జరిగే  అమరుల బంధు మిత్రుల సంఘం సభలో  ఆవిష్కరణ ) విప్లవోద్యమంలో పాల్గొంటూ ఆ నడుస్తున్న చరిత్రని అనేక పద్ధతుల్లో నమోదు చేసిన ఒక రచయిత, ఒక విలేఖరి కా.గుముడవెల్లి రేణుక. భారత విప్లవోద్యమ చరిత్రలో ఆమె ఒక విశిష్టమైన స్థానాన్ని పదిలపరచుకుంది. తన 55వ యేట క్రూరమైన రాజ్యహింసకు గురై భౌతికంగా మన మధ్య నుండి నిష్క్రమించినా అదే (2025) మార్చి 31 వ తేదీన ఆమె మరణానంతర జీవితం కూడా మొదలయ్యింది.
కొత్త పుస్తకం

రేణుక నుంచి మిడ్కో దాకా

(ఐదు భాగాల  మిడ్కో సమగ్ర సాహిత్యంలో *మెట్ల మీద *, ప్రవాహం * కథా సంపుటాలకు సంపాదకురాలు రాసిన ముందుమాట. జూలై 18 ,శుక్రవారం హైదరాబాదులో జరిగే  అమరుల బంధు మిత్రుల సంఘం సభలో  ఆవిష్కరణ ) తెలుగు సాహిత్యానికీ, ముఖ్యంగా విప్లవోద్యమ సాహిత్యానికీ ఒక గొప్ప చేర్పు కామ్రేడ్‌ గుముడవెల్లి రేణుక (మిడ్కో) సాహిత్యం. రేణుక కథల వల్లే మిడ్కో అంటే మిణుగురు అని అందరికీ తెలిసింది. ఇప్పుడు ఆ కథలు తెలుగు సాహిత్యానికే పరిమితం కావు. పలు భారతీయ భాషల ద్వారా దేశమంతటా ప్రయాణం మొదలుపెట్టాయి. దేశ సరిహద్దులను దాటి విశ్వవ్యాప్త పాఠకులను సంపాదించుకుంటున్నాయి. ఆ
కొత్త పుస్తకం

బాల్యపు జాడలెక్కడ ?

(ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు కాటెపోగు రత్నంయేసేపు (కెఆర్‌వై) కవితా సంపుటి *బాల్యమే శరణార్థి*కి అధ్యాపకజ్వాల/ఉపాధ్యాయక్రాంతి మాజీ ప్రధాన సంపాదకుడుపి. మోహన్‌ రాసిన ముందుమాట. 16వ తేదీ కర్నూలులో ఆవిష్కరణ) కాటెపోగు రత్నంయేసేపు (కెఆర్‌వై) తెస్తున్న మొదటి కవితా సంకలనం యిది. కవితలన్నీ చార్వాక కలం పేరుతో రాసినవే. మొత్తం 25 కవితలు. 12 కవితలు విద్యారంగానికి సంబంధించినవి కాగా, మిగిలినవి వివిధ సందర్భాల్లో జరిగిన సంఘటనలకు స్పందించి అక్షరీకరించిన కవితలు. తనకున్న తాత్విక భావజాల కోణంలోంచి వీక్షించి కవితలుగా మలిచారు. అన్నీ వస్తు ప్రధానమైన కవితా ఖండికలే. భావ ప్రాధాన్యాన్ని బట్టి కవితల్లో శైలి, శిల్పం వాటంతకవే అమరిపోయాయి.