కవిత్వం

రాలిన నక్షత్రాల సాక్షిగా
జనసముద్ర హోరు…

అకాశంలో ఐదు నక్షత్రాలు ఒకదాని తర్వాత ఒకటిగా నేల రాలిన వార్త! నన్ను శోక సముద్రాన ముంచెత్తింది! గుండె పగిలేలా ఏడ్వాలని... కానీ కంటనీరు ఎప్పుడో ఇంకిపోయింది గుండె రాయిలా మారింది! స్పందన లేనట్టు నిశబ్దం నన్ను ఆవరించింది! ఏమీ తోచక అకాశంవైపు చూశాను మేమున్నామంటూ చంద్రుడు మసకచీకటిలో తొంగిచూస్తున్నాడు! పక్కనే ధృవతార మిణుకు మిణుకుమంటుంది! అడవి మళ్లీ అంటుకున్నది అ దావానలం కోటి దీపాల వెలుగై చీకటి దారిని చీలుస్తున్నది! నరేంద్రుడు జనప్రభంజనంలో రవితేజంలా వెలుగుతున్నాడు! నిశబ్ద నిశీధి నుండి బయటపడి సముద్రంవైపు చూశాను! సముద్రంలో అల్లకల్లోలం తుఫాను గాలులు విరుచుకుపడే ఉప్పెన చెట్లు పడిపోతున్నాయి! ఇళ్లు
వ్యాసాలు

మోడీ+ అదానీ = భారత దేశం

దేశంలో క్రమశిక్షణారాహిత్యం పెచ్చరిల్లిపోతోంది. హిందూ ప్రభువు విధానాలను శంకిoచేవారూ, అనుమానాలను రేకిత్తించేవారూ ఎక్కువవుతున్నారు. అర్బన్ నక్సల్స్, ఖలిస్తాన్ వాదులు, పాకిస్తాన్, చైనా ఏజెంట్లు సరేసరి. చిన్నాచితకా వ్యాపారస్తులు, పొలానికెళ్ళి దుక్కి దున్ని నాలుగు చినుకులు పడగానే విత్తు విత్తి ఆ తర్వాత వానకై ఆకాశం వైపు జూస్తూ పంట చేతికొచ్చాక నాలుగురాళ్ళు చేతికందుతాయని ఆశగా జీవనం గడిపే అమాయక రైతన్నలు, నిత్యం దేశభక్తిని ఆహారంగా పొందుతూ, అది వారి ప్రాణ వాయువై , జీవిత సమస్యలను పట్టించుకోకుండా మసీదు-మందిరం తగువులాటల్లో ప్రాణాలు కోల్పోవడానికీ సిద్ధం కావాల్సిన యువకులు కూడా సామ్రాట్ మోదీ విధానాలను అపార్థం జేసుకుoటున్నారంటే ఇది కలికాలం
వ్యాసాలు

ఆదాన ప్రదానాల్లో భారత్

అయినా మన పిచ్చిగానీ , ఎంత అమెరికన్ సెoట్లతో ముంచినా, ఎంత దేశభక్తి, జాతీయతా వాదంతో ముంచెత్తినా, కుళ్ళిన శవం కంపుగొట్టకుండా ఉంటుందా?  ఐదేండ్లకొకసారి, శవపేటిక నుండి బయటకు లాగి, ఎన్నికల ప్రజాస్వామ్య శవాన్ని జీవమున్న దానిగా ప్రదర్శిస్తే మాత్రం, ప్రతి ఏడాది, అత్తరుతో స్నానం చేయించి గులాబీ, మల్లెలతో అలంకరించి వీధుల వెంట  “భారత్ మాతాకు” జై,   “జై శ్రీరాం ” నినాదాలతో హోరెత్తిస్తూ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసినంత  మాత్రాన లేని జీవం ఎక్కడ నుండి వస్తుంది. ఈ కుళ్ళు వ్యవస్థను  సమూలంగా ధ్వంసం చేయకుండా, అది హర్షద్ మెహతా కావొచ్చు, లేక కేతన్ పరిక్ కావొచ్చు..
కథలు

డిజిటల్ ప్రేమ

“వద్దు, వద్దు, మనం వర్షంలో తడవ కూడదు. అందుకే ఆ చెట్టు దగ్గరకు వెళదాం. అమ్మా పరిగెత్తు  తొందరగా” అని అలేఖిని  పరిగెత్తే లోపలే  వర్షం చుక్కలు కనికరం లేకుండా ఆమె మీద పడ్డాయి. కొన్ని నిమిషాల ఫోటో షూట్ తర్వాత, ఫోటోలు ఆమెకు సంతృప్తికరంగా ఉన్నాయో లేదో చూసుకుంది. తల్లి కూతుళ్లు ఇద్దరూ స్థలాలను మార్చుకున్నారు. చివరగా, కొన్ని సెల్ఫీల తర్వాత, వారు సమీపంలోని షెల్టర్‌కి పరుగెత్తారు. వారు ఉత్సాహంగా ముసిముసిగా నవ్వుతూ, మంచి వాటిని ఎంచుకోవడానికి కష్ట పడ్డారు. క్లిక్ చేసిన ఫోటోలను సెలెక్ట్ చేశారు. ఎంచుకున్న వాటిని సరైన ఫిల్టర్‌, లైటింగ్, కాంట్రాస్ట్ మొదలైన
కాలమ్స్ ఆర్ధికం

అదానీ గుట్టు విప్పిన హిండెన్‌బర్గ్‌

ప్రధాని నరేంద్ర మోడీకి ఎంతో సన్నిహితుడు గుజరాత్‌ వ్యాపారి గౌతమ్‌ అదానీ ఇప్పుడు ఆయన  సిరుల శిఖరాల వెనుక అతి పెద్ద కుట్ర దాగి ఉన్నదని అమెరికాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక పెట్టుబడుల పరిశోధన సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ అనే అంతర్జాతీయ సంస్థ జనవరి 24న వెల్లడించిన  సమాచారం సంచలనం సృష్టించింది. ప్రపంచంలోనే మూడవ అత్యంత ధనవంతునిగా ఖ్యాతికెక్కిన గౌతమ్‌ అదానీ వ్యాపార మోసాల పుట్ట పగిలింది. ఇంతకాలం ఆయన చక్కబెట్టిన అవినీతి, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. అదానీ నెరపిన మార్కెట్‌ కుంభకోణాలను దాంతో డబ్బు సంపాదనా పరులకు ఆదర్శంగా నిలిచిన అదానీ ఆర్థిక ఎదుగుదల వెనుక గల
కవిత్వం

వడ్డెబోయిన శ్రీనివాస్ కవితలు మూడు

1. మృతకాలం-అమృతకాలం అమృతకాలం వచ్చిందహో ఆవుకు ! ఆలోచించినా ఆశాభంగం కౌగిలించుకో కౌగిలించుకో ఆహా. మనిషికంటావా మృతకాలమే. ఆకలితో ఉపాధి లేమితో బాదలతో కన్నీళ్ళతో కరోనా కార్మికచావువో కారోనా ఆకలిచావువో పోపో చప్పట్లు కొట్టుకుంటో దీపాలు వెలిగించుకుంటో అమృతకాలం వచ్చింది ఆవును కొగిలించుకో పోసిటివ్ ఎనిర్జీ వస్తుంది ఆహా మనిషికంటావా మృతకాలమే. పరిశీలకునివో పరిశోధకునివో శాస్త్రీయ సామాజిక వ్యాఖ్యతవో డబోల్కరో గౌరీ లంకేశో చంపబడితేనేం కాల్చబడితేనేం పొండి పొండి సత్యం ఉచ్చరిస్తూనే అమృతకాలం వచ్చింది ఆవును కౌగిలించుకో పాజిటివ్ ఎనర్జి వస్తుంది. ఆహా మనిషి కంటావా మృతకాలమే అపవిత్రమనో దళితనో ఎదురొచ్చాడనో ఎదురునిల్చాడనో పండు కోశాడనో నీల్లుతాగాడనో మీసాలు
సంపాదకీయం

కార్పొరేట్ స్వామ్యంలో ప్రజలపై యుద్ధం

పాణి రాజకీయ అధికారం అనే మాటకు కాల క్రమంలో చాలా అర్థాలు మారాయి. ఎవరి అధికారం, ఎలాంటి అధికారం అనే మాటలకు ప్రజాస్వామ్యంలో నిశ్చయ అర్థాలు ఏర్పడ్డాయి. రాజ్యాంగాలు వాటిని రూఢపిరిచాయి. భారత రాజ్య రూపాన్ని పార్లమెంటరీ ప్రజాస్వామ్యంగా మన రాజ్యాంగం నిర్వచించింది. దీని ప్రకారం భారత భూభాగంపై సర్వంసహాధికారం ఈ దేశ ప్రజలది. ఆ ప్రజలు ఎన్ని సాంఘిక, సాంస్కృతిక వివక్షలతోనైనా బతుకుతూ ఉండవచ్చు. ఎన్ని రూపాల దోపిడీకైనా గురి కావచ్చు. కానీ వాళ్లకు రాజకీయాధికారం ఉన్నదని రాజ్యాంగం నమోదు చేసింది. ప్రజల తరపున దాన్ని అమలు చేసే ఏజెంటే ప్రభుత్వం. రాజనీతి శాస్త్రంలోని ఈ మౌలిక
సంభాషణ సాహిత్యం

యుద్ధం మధ్య దండకారణ్య కథకుల సమావేశం

నా సన్నిహిత మితృడు కామ్రేడ్‌ చందూ దండకారణ్యంలో సాహితీ కార్యశాల నడుపుతున్నాం, విధిగా మీరు రావాలని నన్ను కోరాడు. డేట్‌ పంపాడు. వాస్తవంగా అ తేదీలలో నాకు అప్పటికే నిర్ణయమైపోయిన ఇతరత్ర పలు పనులున్నాయి. కానీ, ఏం చేయడం? నేనూ సాహితీ ప్రియుడినే! నాకూ వెళ్లాలనే వుంది. చందుకు దండకారణ్యంలో పాట రచనపై కార్యశాలలు నడిపిన అనుభవం వుంది. స్వతహాగా అనేక పాటలు రాశాడు. తాను పాడుతాడు, పాటపై అడుతాడు. కానీ, కథల కార్యశాల నడిపిన అనుభవం మాత్రం ఆయనకు లేదు. కథలు రాసిన అనుభవం కూడా లేదు. కథలు చదివింది కూడ తక్కువేననీ ఆయన నిర్మాహమాటంగానే తెలిపాడు.
కవిత్వం

విప్లవమే ఊపిరిగా

నాన్నా !నీ కమ్మని ,తియ్యని గొంతుప్రేమకు ప్రతి రూపమైన నీ మోముఆదివాసీ త ల్లుల నాన్నల పసిపాపలఅపార ప్రేమ వాత్స్యల్యంనిత్యం నన్ను నిమురుతాయి దోపిడీ అన్యాయం ఫై మాట్లాడకుంటేతిన్న బువ్వ స హించదనినేవు చెప్పిన మాటలునా మనసులో మెదులుతాయి ! కడుపు కట్టుకొని కష్టపడి సాదివిద్యా బుద్ధులు నేర్పిసమాజం జీవనం సంస్కృతినివర్గ దృష్టితో చూసేందు కు ప్రేరణనీ నీతి మాటలే ! కుళ్ళిన భూస్వామ్య సామ్రాజ్యవాద సంస్కృ తిసమాజాన్ని విష తుల్యం చే స్తూవ్యక్తి స్వార్థం, కేరిరిజం తోమానవ విలువలు ధ్వంసమైకుటుంబాలు చితిల మవుతున్న వేళ.. నాన్నావ్యక్తీ స్వార్థాన్ని ,అమ్మానాన్నలని విడిచినిస్వార్థంగా ప్రజలకోసందోపిడ సమాజాన్ని సమూలంగానిర్మూలించే సేద్యంలోదోపిడి పీడన
నివేదిక

చిడియాబేడా ఆదివాసీలపై
పోలీసుల క్రౌర్యం

రూర్ఖండ్‌లోని సరండా అడవుల గురించి మీరు వినే ఉంటారు. భారతదేశంలోనే అనేక పోరాటాలతో ప్రజ్వరిల్లుతున్న నేల అది. ఆ ఉద్యమాలను అణచివేయడానికి చాలా ఏళ్లుగా అక్కడ దారుణ నిర్బంధం కొనసాగుతోంది. అయినా ఆదివాసులు వెనక్కి తగ్గలేదు. చిడియాబేడా, లోవాబేడా, హాథిబురు అడవులలో కోబ్రా బటాలియన్‌ 209, 205, రూర్జండ్‌ జాగ్వార్‌, సీఆర్‌పీఎఫ్‌కు చెందిన పోలీసు బలగాలు గాలింపులు జరుపగా కొన్ని పోస్టర్లు, బ్యానర్లు సహ రోజువారిగా వాడుకునే దినుసులు దొరికినట్టు, సీరిస్‌ కనెక్షన్‌లో వుంచిన మందుపాతరలను కనుగొని వాటిని డిఫ్యూజ్‌ చేసినట్టు 12 నవంబర్‌ 2022 (ప్రభాత్‌ ఖబర్‌, దైనిక్‌ భాస్కర్‌ తదితర హింది పత్రికలలో) వార్త ప్రచురితమైంది.