కవిత్వం

పోదాం పద ఢిల్లీలో కవాతు చేద్దాం

కవితలల్లుదాం ఢిల్లీలో రైతుల పోరు నినాదాలను కథలు చెపుదాం రైతుల నెత్తురే ధారలై పారుతున్న ఢిల్లీ సరిహద్దుల దారుల కోసం! పిడికిళ్లు ఎత్తుదాం దగాపడ్డ బతుకుల పోరుదారిలో ! ఈ అక్షరాలను అస్వాదించండి ఆరాధించడం వద్దు మాట్లాడుదాం రైతుల పోరు ముచ్చట్లను! ఈ పదాలకు పెదవి విరుపులు అలంకారమే ! పెదాల బిగువున దాగిన మౌనాన్ని వీడి అక్షరాల అలుగు దునికిద్దాం ! మాట్లాడుదాం రైతుల పోరు గాథలను ఢిల్లీ సరిహద్దులు రక్తసిక్త మౌతుంటే, అక్షరాలా అగ్నిదీపాలను సృష్టిస్తాం! మనం తినే పళ్లెంలో అన్నంకు బదులు, రైతన్నల రక్తపుచుక్కలు మెరుస్తున్నయ్ ! ఆ వేళ యాడాదినర్థం పోరు పొద్దులై
stories

The Sword & The Shield

The encirclement of the CRPF forces by the PLGA was almost complete. A part of the enemy force that entered in their hundreds has been separated from the main contingent with ruse by the guerillas and a siege was laid. The CRPF commandant who had earlier had a taste of a PLGA attack had his doubts when the guerillas started retreating on one side. He felt it may be a
కవిత్వం

షహీద్ మంగ్లీ కోసం

గజ్జెలు లేకుండా కూడ నీ పాదాలు ఎంత భంగిమలో ఉన్నాయి ఈ పాదాల్లో కొంచెం కొంచెం దుమ్ము పట్టి ఉన్నది ధూళి అనగానే గుర్తుకొచ్చింది నువ్వు నీ ‘యోయో’ (అమ్మమ్మ) ఒళ్లోకి వట్టికాళ్లతోనే గోముతో పరుగెత్తాలనుకోవడం కూడ ప్రేమనే మట్టితో సూటిగా మాట్లాడుతూ నీ కాళ్లు పాదాలు రేలా స్వరంలోకి తర్వాత ఎగుస్తాయి మొదట నీ పాదాలను ఈ మట్టి రమ్మని పిలుస్తుంది నువ్వూ నీ పాదాలు రెండూ ఎంత శాంతంగా ఎంత ప్రకాశిస్తూ, ఎంత నిష్కళంకంగా కనిపిస్తున్నారు నీ గోళ్లు చాల విచారంగా కనిపిస్తున్నాయి నీ అమ్మ దగ్గర నెయిల్కట్టర్ లేదు నువ్వీ పాదాలతో కొంచెం దూరం
పత్రికా ప్రకటనలు

పోరాడుతున్న రైతులకు అండగా నిలబడదాం!!

2022లో ఏడాదిపాటు సాగిన రైతుల సమ్మె యావత్ దేశానికి స్ఫూర్తినిచ్చింది. అన్ని దురభిమానాలను, అధికార దురహంకారాలను ఓడించి ఆ పోరాటం విజయవంతంగా ముగిసింది. రైతులు లేవనెత్తిన డిమాండ్లను అంగీకరిస్తూ ప్రభుత్వం ఈ విధంగా ప్రకటించింది. 1) తుది విశ్లేషణలో దేశానికే హాని కలిగించే మూడు రైతు చట్టాల ఉపసంహరణ 2) ఎమ్.ఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేసిన కనీస మద్దతు ధర అమలు 3) సమ్మె సంబంధిత కేసులు ఉపసంహరణ 4) సమ్మెలో మరణించిన వారి కుటుంబాలకు తగిన పరిహారం 5) వ్యవసాయ రుణాల మాఫీ 6) విద్యుత్ బిల్లులను తగ్గింపు - అమలు చేస్తామని ప్రభుత్వం హామీ
కవిత్వం

రైతు దృశ్యమే నాకు కనబడుతుంది

వాడు దేశాన్ని ఒక మూసలో నెట్టుతుంటే కావడి పట్టుకొని అన్నదాత ఆందోళన చేస్తున్నాడు మద్దత్తు ధర కోసమో, పంటల రక్షణ కోసం మాత్రమే కాదు ఫాసిజం ఎంత వెర్రి తలలు వేసిందో దేశ రాజధాని నలుదిక్కుల చుట్టూ ముట్టిన రైతు చాటి చెపుతున్నాడు వాడు అయ్యోధ్యా రామమందిరం అంటూ దేశ ప్రజల మేదల్లో మూడవిశ్వాసాన్ని నింపి దేశాన్ని మతం పేర ముక్కలు చెయ్య చూస్తున్న చోట దేశమే తమ ఇల్లు అంటూ అన్నదాతల ఆందోళన చూడమంటాను వాడు ప్రశ్నను ఎదుర్కోనలేక ధర్నాలను, రాస్తారోకాలను అడ్డుకొనడానికి అక్రమంగా కుట్ర కేసులు,NIA దాడులను ఉసిగొల్పుతున్న కాడా నిటారుగా నిలబడి నాగలి కర్రును
వ్యాసాలు

దోపిడీ ప్రయోజనాలే రాజ్యాంగ విలువగా మార్చారు

విప్లవ రచయితల సంఘం 29వ మహాసభలో పాల్గొనటానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి విచ్చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనలు! గత సంవత్సరం జనవరి ఏడవ తేదీన హైదరాబాదులో జరిగిన విరసం అధ్యయన తరగతుల సందర్భంగా ఫాసిజాన్ని అర్థం చేసుకోవడం గురించిన చర్చలో మా అభిప్రాయాలను వివరించిన సంగతి ఒకసారి మీ దృష్టికి తీసుకు వస్తున్నాను. ప్రస్తుతం మనం అత్యంత సంక్లిష్ట సంక్షోభ సాంస్కృతిక వాతావరణంలో ఇక్కడ సమావేశమవుతున్నాం. ఇదంతా మన సామాజిక జీవితంలో, ప్రజల రోజువారీ అనుభవంలో ఉన్న సంక్షోభపు వ్యక్తీకరణగా భావించవచ్చు. 75 సంవత్సరాల క్రితపు అర్థవలస అర్థఫ్యూడల్‌ వ్యవస్థనుండి మౌలికంగా తెగతెంపులు చేసుకోగలిగిన నిజమైన ప్రజాస్వామిక మార్పు
వ్యాసాలు

మన కళలు సాహిత్యం కలలకు దూరం కాకూడదు

(విజయవాడలో జరిగిన విరసం 29 వ మహా సభలకు పంపిన సందేశం) మిత్రులారా, కామ్రేడ్స్‌! మొత్తం దేశమంతా ఇప్పుడొక క్లిష్ట పరిస్థితిలో ఉంది. వాళ్ళు ‘మన’ అనేదాన్ని తుడిచేసి తమ పెత్తనాన్ని చెలాయిస్తున్నారు. నియంతలు మన-జల్‌ జంగల్‌-జమీన్‌ మొత్తం తమదేనని భావిస్తున్నారు. మనల్ని అనామకుల్ని చేసి అమానుషంగా నిర్బంధించి మన గొంతుల్ని నొక్కేస్తున్నారు. పాలకులకు కావలసినంత బలముంది, మీడియా సపోర్ట్‌ ఉంది. వాళ్ళు ఏ పని చేయకుండా కేవలం ప్రచారం ద్వారా విజయం సాధిస్తున్నారు. మనం వీళ్ళను ఎదుర్కోవాలంటే అన్ని రంగాల్లోనూ కృషిచేయవలసి ఉన్నది. రాయాలి, వివరించాలి. మన గురించి, మన భూముల గురించి, మన అడుగుల గురించి
వ్యాసాలు

వర్తమాన సామాజిక సందర్భంలో మన రచన, ఆచరణ

సాహిత్యరంగంలో విశాల వేదిక నిర్మాణం కావాలి. ఎందుకంటే భావజాలరంగాన్ని నియంత్రించడానికి రాజ్యం పూనుకుంటున్నది. రాజ్యాంగం ప్రసాదించిన పౌరహక్కులూ, పోరాటాల ద్వారా యిన్నాళ్లూ సాధించుకున్న పౌరహక్కులూ కాలరాయడానికి కంకణం కట్టుకున్నది. కేవలం యిపుడు కొందరు మేధావులూ, రచయితలూ, కళాకారులూ (రాజకీయ భావజాల కారణంగా మాత్రమే గాదు, రాజకీయపార్టీల కార్యాచరణలో భాగమైనందుకు) రాజ్యపు నిర్బంధానికి గురయినారే గానీ యిక ముందర కనీస ప్రజాస్వామిక హక్కు గురించి మాటాడే అందరూ గురయే ప్రమాదం వుంది, రాజకీయ కార్యాచరణ లేకపోయినా! దీన్ని నివారించాలంటే విశాల వేదికలు అవసరం. ఈ విశాల వేదికలు గూడా రాజకీయాలీనంగా వుండాలి. వేదిక పరంగా యే రాజకీయపార్టీకీ అనుసంధానం గాకూడదు.
సంపాదకీయం

మావోయిస్టు పార్టీ మీద నిషేధంఎందుకు ఎత్తేయాలంటే…

విష్లవ పార్టీ మీద నిషేధం తొలగించాలని కోరడం అంత మామూలు డిమాండ్‌ కాదు.  దీని చుట్టూ ఎన్నో అంశాలు ఉన్నాయి. కాబట్టి సహజంగానే చాలా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాటన్నిటినీ చర్చించాల్సిందే. ముందు ఆ పని చేయకపోతే నిషేధం తొలగించాలని ఎందుకు కోరుతున్నామో చెప్పలేం. మావోయిస్టు పార్టీ మీద నిషేధం ఎత్తేయాలనే మాట 2004 తర్వాత మళ్లీ ఇవ్చుడే వినిపిస్తోంది. ఇంత నుదీర్ఘకాలం ప్రస్తావనలో లేకపోవడం వల్ల ఈ డిమాండ్‌ చాలా కొత్తగా ఉన్నది. ఎంతగానంటే మావోయిస్టుల మీది నిషేధం మామూలే కదా! అని సమాజం చాలా వరకు కన్విన్స్‌ అయిపోయింది. చర్చ లేకుండా, చర్చించాల్సిన విషయం కాకుండాపోయి, దాని
వ్యాసాలు

త‌పాలా ఉద్యోగులంటే మోదీకి ఎందుకింత కక్ష ? 

చెడ్డ‌ పోస్టుమ్యాన్ ఉండ‌డు.. , మంచి పోలీస్ క‌నిపించ‌డు.. అనేది ఓ నానుడి. అంటే..  పోస్ట్ మ్యాన్ పని విధానం ఎంత‌  నిస్వా ర్థంగా త్యాగ‌పూరితంగా ఉంటుందో ఈ సామెత తెలియ‌జేస్తున్న‌ది. నేటికీ మారుమూల గ్రామం మొద‌లు న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల దాకా త్యాగ‌పూరితంగా సేవ‌లు అందిస్తున్న ప్ర‌భుత్వ విభాగం ఏదైనా ఉన్న‌ది అంటే అది తంతి త‌పాలా శాఖ (పోస్ట‌ల్ డిపార్ట్ మెంటు) మాత్ర‌మేన‌ని చెప్పుకోవాలి. వృత్తి నిబ‌ద్ధ‌త‌తో ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందిస్తున్న గ్రామీణ త‌పాలా ఉద్యోగులు త‌మ స‌మ‌స్య ల ప‌రిష్కారం కోసం  కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరుతూ స‌మ్మె చేస్తే, వారిని కేంద్రంలోని న‌రేంద్ర‌మోదీ బీజేపీ ప్ర‌భుత్వం