సమీక్షలు

రాజకీయార్థిక నవల ‘చంద్రవంక’

దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి కవి, రచయిత, సామాజిక ఉద్యమకారుడు. రచనను సామాజిక బాధ్యతగా గుర్తించినవాడు. తాను ఎన్నుకున్న వస్తువు దళిత, పీడిత కులాల అంతర్భాంగా వుండాలని తపన. మా ఎర్ర ఓబన్న పల్లె, ధనుస్సు అనే రెండు నవలలు, మాదిగ సామాజిక జీవితాన్ని అనేక కోణాల నుండి స్పృశించాయి. ఒకానొక స్థితిని అంచనా వేసాయి. ఎజ్రాశాస్త్రి రచనా మాద్యమాన్ని తను నడిచి వచ్చిన తొవ్వకు అనుసంధానం చేసుకున్నాడు. రచన ఒక బాధ్యత అని భావించినప్పుడు తన రచనా పద్ధతి ఎలాఉండాలో రచయిత నిర్ణయించుకుంటాడు. చంద్రవంక ఎజ్రాశాస్త్రి మూడవ నవల. ఈ నవల చారిత్రక ఉద్యమ నవల. ఇందులో పాత్రలు వాస్తవికమైనవి.
సంభాషణ

మీరు నడిచినంత మేరా…

‌రేపో, ఎల్లుండో కలుస్తారనుకున్న సమయంలోనే ఒక విషాద వార్త చెవిన పడింది. కామ్రేడ్స్ రైను, అనిల్ లు ఇక లేరని. తేరుకోవటానికి కొంత సమయమే పట్టింది. ‌పొడవుగా, చామనఛాయగా ఉన్న కా. రైను పరిచయం ఎఓబి నుంచి ఒక పని మీద వచ్చినప్పుడు. దాదాపు పది సంవత్సరాల కిందట. ఎస్. ఎల్. ఆర్. తో ఠీవీగా ఉన్న ఆకారం. తన మాటల్లో అర్థమైంది, తనకు కొంచెం కొంచెం తెలుగు వస్తుందని. కానీ తన తెలుగు ఉచ్ఛరణ గమ్మత్తుగా ఉండేది. ఎలాగంటే, చదువుకునే రోజుల్లో నా స్నేహితురాలు అస్మా బేగం మాట్లాడిన 'తురక తెలుగులా'.  . తను వచ్చిన పని
సమీక్షలు

ఎవరికీ పట్టని మరో ప్రపంచపు కథలు

కథలకు సంబంధించి వస్తువు ఎంపికే ప్రధానమైనది. దానిని అనుసరించేవే మిగతా లక్షణాలు. నేరుగా జన జీవనంతో మమేకమైపోయి, వాళ్ళ బతుకు సాధకబాధలే ఇతివృత్తాలు గా, ఆయా సమూహాలను చరిత్రలో భాగం చేసే రచయితలు చాలా చాలా అరుదు. వాళ్ళ ఆరాటపోరాటాల్ని చాలా దగ్గరగా చూసినప్పుడు, పరిశీలించినప్పుడు కలిగే అనుభూతి చాలా భిన్నమైన మార్గంలో కథకుడ్ని నడిపిస్తుంది. చాలా సున్నితమైన అంశాల్ని, ఇతరుల కన్నుకు కనబడని జీవితం తాలూకు ఘర్షణని చూసేలా చేస్తుంది.‌ ఖచ్చితంగా పాఠకుడికి ఆ సంఘటనలకు కారణమయ్యే శక్తుల మీద ఆగ్రహం కలుగుతుంది. జీవన విధ్వంసం దృశ్యాన్ని కథగా మలిచేటప్పుడు కథలో ఇలా ఎందుకు జరిగింది?జరగకూడదే?అనే మీమాంస
కథలు

మనసుడికి పోతే…

రిక్షా అప్పన్న కూతురు పెళ్లంట. ఆడి పెద్ద కూతురు మల్లీశ్వరికి పద్నాలుగేళ్లుంటాయి. ముగ్గురు కూతుళ్ల తరువాత ఒక్కడే మొగ్గుంటడు పుట్టాడు అప్పన్నకి. అప్పన్నకి తాను తోలే రిక్షా కాకుండా పన్నెండు బళ్లు అద్దెకు తిరుగుతాయి. చెయ్యెత్తు మనిషైనా అప్పన్నకి ఒక కాలు బోదకాలు అవ్వడం చేత ఎక్కువగా రిక్షా తొక్కడు. బళ్ల అద్దెలు వసూలు చేసుకుంటాడు. అతని అన్నదమ్ములందరిదీ ఒకటే వాసని పెంకుటిళ్లు. చూడముచ్చటగా ఉంటాయి. ఎలమంచిల్లోని మాలపల్లంతటికీ అప్పన్నే మోతుబరి. అప్పన్న అక్క ఒకావిడ రంగం ఎల్లి బోల్డు బంగారం, డబ్బు తెచ్చిందనీ, అన్నదమ్ములకి ఒక కాపు కాసిందనీ చెప్పుకుంటారు. రంగవప్పయ్యమ్మకి ఈ ఊర్లో ఒక మొగుడున్నాడు.
పత్రికలు

దండకారణ్య ఆదివాసులపై వైమానిక దాడులురాజ్యాంగ వ్యతిరేకం ప్రజలపై భారత ప్రభుత్వం చేస్తున్న యుద్ధాన్ని ఆపాలని డిమాండ్‌ చేద్దాం

రౌండ్‌ టేబుల్‌ సమావేశం25 జనవరి 2023, హైదరాబాదుప్రెస్‌ నోట్‌ ఆదివాసీ హక్కుల కోసం దశాబ్దాలుగా పని చేస్తున్న మేము జనవరి 11వ తేదీన దక్షిణ బస్తర్‌లోని కిష్టారం`పామేడు ప్రాంతంలో జరిగిన సైనిక దాడికి దిగ్భ్రాంతి చెందుతున్నాం. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ హెలికాప్టర్లలో కోబ్రా దళాలు, సిఆర్‌పిఎఫ్‌ బలగాలు వెళ్లి బాంబులు దాడులు చేశాయి. ఈ దాడిలో పొట్టం హంగి అనే ఆదివాసీ యువతి మృతి చెందింది. రాజ్యాంగంలోని జీవించే హక్కును కాపాడాల్సిన ప్రభుత్వం తానే ఈ దేశ ప్రజలపై  వైమానిక యుద్ధం చేయడం భారత రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం. మానవతకు వ్యతిరేకం. భారత ప్రజలు అనేక ప్రక్రియల ద్వారా, పోరాటాల
కిటికీ పక్కన సీటు
కవిత్వం

కిటికీ పక్కన సీటు

ప్రపంచాన్ని కిటికీలో నుండి చూడడం మీకు అనుభవమేనా.. చల్లని గాలి తనువును తాకుతుంటే జ్ఞాపకాలు మనసును తాకుతుంటాయి పరిసరాలు వెనక్కు పోతుంటే పాత గుర్తులన్ని ముందుకొస్తుంటాయి.  బస్సుతో పాటు టైరు ఆడుతూ  బస్ వెనకాలే పరిగెత్తే పసివాడు మళ్ళీ మన పసితనాన్ని గుర్తు చేస్తాడు బస్ కోసం పరిగెత్తుతూ  వస్తున్న తల్లెంట  వెనకాలే ఏడుస్తూ వస్తున్న చిన్నోడు మన బాల్యాన్ని  బావిలోనుండి నీళ్ళు తోడినట్లుగా తొడుతుంటాడు. ఐదో తరగతి చదివే పిల్లవాడి తల్లిని కండక్టర్ టికెట్ అని అడిగితే మావోడు ఒకటో తరగతే అని అమ్మ చెబితే.. అమ్మ అమాయకత్వ ఆన్సర్ కి  బస్ ఎక్కినప్పుడల్లా మన చదువు
సాహిత్యం వ్యాసాలు

నైతిక , మత , వ్యంగ్యాత్మకాలు

(1829లో వేమన పద్యాల కూర్పుకు బ్రౌన్‌ రాసిన ఇంగ్లీషు ముందుమాట)  తెలుగు: సిఎస్‌ఆర్‌ ప్రసాద్‌ ఏదైనా ఒక భాషను అధ్యయనం చేయాలని అనుకున్నప్పుడు మనం సహజంగానే దేశీయులలో ప్రజాదరణపొందిన పుస్తకాలను గురించి తెలుసుకోవాలని అశిస్తాం. ఆ పుస్తకాలు సరళమైన శైలిలో వుండి విదేశీయులు కూడా తేలికగా అర్థం చేసుకునేటట్లు వుండాలని అనుకుంటాం. తెలుగుకు సంబంధించి 1824లో ఇలాంటి పరిశోధన ప్రారంభించాను. ఆ సందర్భంగా ఈ పుస్తకంలో ప్రచురించిన పద్యాలతో నాకు పరిచయం కలిగింది. ‘వేమ’ లేదా ‘వేమన’ (రెండు పేర్లూ వాడుకలో వుండేవి) రచించిన అనేకమైన రాత ప్రతులు నాకు లభ్యమయ్యాయి. నేను వాటిని చదివి నా ఉద్యోగబాధ్యతల్లో
కవిత్వం

సంక్రాంతి

నగరాలు పట్టణాలు ఖాళీ పల్లెలు రద్దీ పండుగ సంక్రాంతి గొట్టాలు ఊదరగొట్టే వాతావరణం గతం వర్తమానం విషమం పల్లె తరిమితే పట్టణీకరణ  బహుళ అంతస్థులే అభివృద్ధి భ్రాంతుల ప్రజ పండుగకి పల్లెకు పయనం ద్రవ్యం పల్లెల్లో జొరబడింది  ప్రపంచీకరణ తో పల్లె విధ్వంసం పాలు పెరుగు మజ్జిగ నెయ్యి ల మార్పిడి లేదు అంతా పెట్టుబడి సంకలో సేద తీరు రాశుల కొద్దీ ధాన్యం లేదు వాణిజ్య పంటల ధాటికి నేల నిస్సారంగా పెట్టుబడి అమ్మేదే ఎరువు పెంట దిబ్బల్లేవు చెరువు మట్టి తోలేది లేదు అదే నేల కిందికి మీదికి దున్నితే ఏం వుంటది! సారం!! పంటలో
వ్యాసాలు

మతవర్గ తత్త్వం

(జనవరి 10 , 1985 గద్వాల విరసం సాహిత్య పాఠశాల ప్రసంగ పాఠంలోంచి కొంత భాగం - వసంత మేఘం టీం ) ...ఐతిహాసిక ,  పౌరాణికాంశాలను వదిలి, చరిత్రలో మధ్యయుగాలకు సంబంధించిన మతపరమైన యుద్ధాలకూ మారణదారుణాలకూ వస్తే, వాటి కారణాలు కేవలం మతంలోనే లేవని తేలుతుంది. మతసంస్థలకు చెందిన ఆస్తిపాస్తుల విషయంలో, రాజపోషణవల్ల సమకూరే శుద్ధభౌతిక సదుపాయాల విషయంలో, భూస్వామిక సమాజంలోని హెచ్చుతగ్గుల విషయంలో వచ్చిన సామాజికమైన పోటాపోటీలు మత విరోధాల రూపం పొందిన సందర్భాలు ఒకటీ రెండూ కాదు. బ్రాహ్మణ మతం ఎన్నడో గతించిపోగా, బౌద్ధాన్ని చావగొట్టిగానీ చచ్చుపార్చిగానీ హైందవం తన ప్రాబల్యం స్థాపించుకున్న తర్వాత
నివేదిక సంభాషణ

సాంస్కృతిక ప్రతివ్యూహపు కలనేత

విరసం సాహిత్య పాఠశాల నివేదిక విరసం 23వ సాహిత్య పాఠశాల జనవరి 7,8 తేదీల్లో  హైదరాబాదు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉత్తేజకరంగా జరిగింది. ఫాసిస్టు వ్యతిరేక పోరాటాల ప్రాంగణం, వాసం శివ హాలులో, నర్మద వేదికపైన రెండు రోజులు ‘ఫాసిజం ` సాంస్కృతిక ప్రతివ్యూహం’ అనే అంశంపై లోతైన చర్చ సాగింది. 7వ తేదీ శనివారం ఉదయం 11.00 గంటలకు సభా ప్రాంగణం ముందు పతాకావిష్కరణతో ప్రారంభమై ఆదివారం రాత్రి 9.00 గంటల దాకా సుమారు 16 గంటలపాటు నడిచిన సాహిత్య పాఠశాలలో వందలాది సాహిత్యాభిమానులు, సామాజిక కార్యకర్తలు, విప్లవాభిమానులు పూర్తి నిమగ్నతతో పాల్గొన్నారు.  విరసం సీనియర్‌ సభ్యులు