కరపత్రాలు

Don’t be desperate – Don’t lose confidence in class struggle

When the revolutionary movement is strong, generally anyone like to walk with it. They hail it. They glorify the period when they were in the movement. All this is very easy. But it is hard to walk with the same revolutionary movement when it is entangled in war and is suffering losses. It is very difficult too, to understand its phenomena. The number of people who say that the revolutionary
తొలికెరటాలు

సిక్కు ఉద్యమంలో మనిషి అంతరంగం

*ఉద్యమం” అనే నవల మనిషి మనసులో జరిగే ఆత్మపోరాటం, మానవత్వం, నమ్మకం, ధైర్యం వంటి లోతైన భావాలను స్పృశించే ఒక గాఢమైన కథ. ఈ నవలలో బయట ప్రపంచంలో జరుగుతున్న హింస, మత ఘర్షణలు, రాజకీయ ఉత్పాతం ఉన్నప్పటికీ, అసలు ఉద్యమం మనిషి అంతరంగంలోనే మొదలవుతుందని ఒక సున్నితమైన సత్యాన్ని రచయిత మన ముందుంచారు. ప్రతి పేజీ మనిషి మనసులోని ఆందోళనను, అతని అశాంతిని, ఆశను ప్రతిబింబిస్తుంది. ఈ నవల చదువుతుంటే ఒక కాలం, ఒక సమాజం, ఒక మనసు  ఇవన్నీ కలగలిసి మన ముందుకొస్తాయి. కథ సిక్కు ఉద్యమం నేపథ్యంలో సాగేలా నిర్మించబడింది. ఆ కాలంలో జరిగిన
కవిత్వం

ప్రకృతి-విప్లవం

వ్యక్తులు వెళుతూ వెళుతూవారి జీవితాన్నిచ్చి వెళ్ళారుమేఘం చినుకులు కురిపించినట్టువెన్నెల కాంతిని పంచినట్టునేల చెట్టు వేళ్లని దాచినట్టువాళ్లేం ఊరకేనే వెళ్లలేదునదుల దారులను చూపివెలుగుల్లో చదువులు చెప్పిచెట్ల పత్రహరితాన్ని ఇచ్చిప్రకృతిని సౌందర్యం చేసి వెళ్ళారువారు వెళ్ళిపోవడమంటేమాయమైపోవడం కాదుమనలోకి మనం చేరుకోవడం..
వ్యాసాలు

ఆర్ ఎస్ ఎస్ ఫాసిస్టు స్వభావం దాని సిద్ధాంత రాజకీయాల లోగుట్టు…

(*విప్ల‌వోద్య‌మంపై విషం క‌క్కుతున్న విద్యార్థి ప‌రిష‌త్ ప్ర‌చారాన్ని ఎండ‌గ‌ట్టండి* అనే పేరుతో రాడిక‌ల్ విద్యార్థి సంఘం 1984లో ప్ర‌చురించిన పుస్త‌కంలోని ఒక వ్యాసం ఇది- వ‌సంత‌మేఘం టీం) తరతరాల దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా వీరోచితంగా ముందుకు సాగుతున్న తెలంగాణా రైతాంగ పోరాటాలపై తీవ్రమైన దమనకాండను ప్రయోగించి అణిచి వేద్దామని తెలుగుదేశం ప్రభుత్వం సి.ఆర్.పి బలగాలను దింపగా మరో వంక ఆరెస్సెస్ ,బిజెపి, ఎబివిపిలు ప్రభుత్వానికి పూర్తిగా అండగా నిలిచి విప్లవోద్యమంపై దుమారాన్ని రేపుతూ రైతుకూలీలపై, విద్యార్థి యువజనులపై పాశవికమైన దాడులకు పాల్పడుతున్నాయి. కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్‌న‌గ‌ర్‌ జిల్లాలలో ఈ ఫాసిస్టు మూకల అఘాయిత్యాలకు అంతులేకుండా పోయింది.
కథలు

ఉడుకు!

యూత్ అసోషియేషన్ సభ్యులంతా జమయ్యిన్రు. బస్తీలో చెయ్యాల్సిన కార్యక్రమాన్ని గురించి చర్చోపచర్చలు చేసి తీర్మానం కూడా చేసిన్రు. “ఒరేయ్... మీరంతా గుండు చేపించుకుంటారా?” అడిగిండు వో దోస్తు. “మనమేం మాట్లాడినాం? వీడేమంటున్నాడ్రా?” యెవరికీ యేమీ అర్థంకాలే. మెంటలోన్ని చూసినట్టు చూసిన్రు. “సరే, నేను పైసలిస్తాను, మీరంతా గుండు చేపించుకుంటారా?” దోస్తుగాడు అన్నమాట మీదే వున్నడు. “ఒరే హవ్లే, యింట్లో యెవరు పోయిన్రని... గుండు చేపించుకుంటారు?” ఆ దోస్తుని తిరిగి అంతా అడిగిన్రు. “మీ తాత పోయిండు. మీ జేజమ్మ పోయింది. ఊ... మీ చిన్నాయిన పోయిండు. ఆ... మీ పెద్దమ్మ కూడా పోయింది. ఒరే, మీ బావ కరోనా
సమకాలీనం

జైలు హక్కుల కోసం-మావోయిస్టు  ఖైదీ సంజయ్ దీపక్ నిరాహార దీక్ష‌

జైలు అధికారులు చట్టాన్ని పాటించే ఉంటే, సంజయ్ న్యాయం కోసం నిరాహారదీక్ష చేయాల్సిన అవసరం ఉండేదే కాదు. హైదరాబాద్‌లోని చర్లపల్లి జైలులో ఉన్న మావోయిస్టు గా అరోపించబడిన  రాజకీయ ఖైదీ సంజయ్ దీపక్ రావుతో ఒక సీనియర్ జైలు అధికారి ఇలా అంటాడు. " రాజ్యాంగాన్ని పాటించని వాళ్ళ పట్ల  మేము రూల్స్ పాటించాలా? నేను పాటించను.” భారతదేశ జైళ్లలో చట్టబద్ధత ఎంత పతనమైందనే విషయాన్ని ఈ అధికారి మాటలు చెప్పకనే చెప్తున్నాయి. 2025 అక్టోబర్ 28న, 60 ఏళ్ల సంజయ్ దీపక్ నిరాహారదీక్ష ప్రారంభించారు. ఆయన నిరసన ఏవో ప్రత్యేక హక్కుల కోసమో, సౌకర్యాల కోసమో కాదు.
కవిత్వం

నేను రాస్తూనే ఉంటా

గాజాలో మండుతున్న ఆకాశం కింద నేను రాస్తూనే ఉంటా యుద్ధపు కోరలు నా మాతృభూమిని నా కుటుంబాన్ని నా ఇల్లునుగోడకు మెరిసే నా మెడల్స్ ని నా హృదయంలో మెరిసి నా గదిని చేరని ఉజ్వల వైభవాలను నా నుండి లాగేసుకుంటేనేంనేను రాస్తూనే ఉంటా రచన నాకొక వినోదం కాదు అది నా మనుగడ నా రక్తాన్ని పంచుకుపుట్టేప్రతి పద్యం ఒక ధిక్కార గీతం దురాక్రమణకు ఎదురీదే హృదయ స్పందన దయచేసి ఈ పెన్నునూ ఒకప్పటి నా మాతృభూమినీనా నుంచి లాక్కోవద్దు నేన నా పద్యాన్ని ప్రపంచంలోకి విసిరేస్తాను ఒక్క వాక్యమైనా మీ గుండెల్లోకి చొచ్చుకొని నిద్రాణమైన మీ
వ్యాసాలు

అటవీహక్కుల చట్టాన్ని అపహాస్యం చేసిన హైకోర్టు 

25 అక్టోబర్ 2025ఛత్తీస్‌గఢ్‌లోని ఘట్‌బర్రా గ్రామానికి మంజూరు చేసిన సాముదాయిక అటవీ హక్కుల  పట్టాను రద్దు చేయడాన్ని హస్‌దేవ్ అరణ్య బచావో సంఘర్ష్ సమితి సవాలు చేస్తూ, దానిని 'ఆందోళనకర'మైనదిగానూ 'తీవ్రంగా నిరాశపరిచేది'గానూ అభివర్ణించింది. ఈ పిటిషన్‌ను కొట్టివేయాలని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సింగిల్-జడ్జి బెంచ్ ఇచ్చిన ఆదేశాలు భారతదేశంలో ఒక సాముదాయిక అటవీ హక్కుల  పట్టా ను రద్దు చేయటం బహుశా ఇదే మొదటి సందర్భం అని ఛత్తీస్‌గఢ్ బచావో ఆందోళన్ అక్టోబర్ 23న విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. కోర్టు తన అక్టోబర్ 8 నాటి ఉత్తర్వులో, హస్‌దేవ్ అరణ్య బచావో సంఘర్ష్ సమితి లేవనెత్తిన
అనువాదం

బ్రిటిష్ ఇండియాను తలదన్నే కొత్త నేర చట్టాలు

లోక్‌సభ, రాజ్యసభలు ఇటీవల ఆమోదించిన, కేంద్ర ప్రభుత్వం "పౌర కేంద్రీకృత"మైనవిగా పేర్కొన్న కొత్త క్రిమినల్ చట్టాలు వాస్తవానికి బ్రిటిష్ కాలంనాటి చట్టాలకంటే ఘోరంగా ఉన్నాయి. నిందితుడి అరెస్టుకు సంబంధించి సుప్రసిద్ధ డికె బసు కేసులో సుప్రీం కోర్టు నిర్దేశించిన మార్గదర్శకాలను తొలగించడం మొదలుకొని, గరిష్ట పోలీసు కస్టడీ వ్యవధిని 15 నుండి 90 రోజులకు పెంచడం వరకు, కొత్త చట్టాలు పోలీసులకు అపరిమితమైన అధికారాన్ని ఇస్తాయి. అదే సమయంలో వారి జవాబుదారీతనాన్ని తగ్గిస్తాయి. ఫిర్యాదులో నేరంగా గుర్తించదగిన అంశం వెల్లడైనప్పటికీ "ప్రాథమిక విచారణ" నిర్వహించడానికి పోలీసులకు అనుమతినివ్వడం ద్వారా మరో  మైలురాయి కేసుగా పిలిచే లలితా కుమారి vs
సంస్మరణ

చెదరని ప్రొఫెసర్ ఎస్ఎఆర్ గిలానీ స్మృతి

సుమారు 11 సంవత్సరాల క్రితం, 2008 నవంబరులో, ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థులు ఆర్ట్స్ ఫ్యాకల్టీలోని గది నంబర్ 22 లో "సామ్యవాదం, ఫాసిజం, ప్రజాస్వామ్య పదాల ఆర్భాటం- వాస్తవం" అనే అంశంపైన సెమినార్ నిర్వహించారు. సెమినార్ ముఖ్య వక్త విశ్వవిద్యాలయంలో అరబిక్ భాషా ప్రొఫెసర్, కశ్మీరీ ముస్లిం ప్రొఫెసర్ సయ్యద్ అబ్దుల్ రెహమాన్ గిలానీ. ఈ అంశంపై గిలానీ కంటే మెరుగ్గా మాట్లాడగలిగే మరొకరు బహుశా దేశంలో లేరు. 2002 లో పార్లమెంట్‌పై జరిగిన దాడిలో ఆయన “వహించిన పాత్రకు”గాను కోర్టు ఆయనకు ఉరిశిక్ష విధించింది. మీడియా విచారణ జరిపి, కోర్టు తీర్పు రాకముందే గిలానీని ఉగ్రవాదిగా ప్రకటించింది.