వ్యాసాలు

నా జీవితానికి దారి దీపాలు – రాఘ‌వ‌

బాగా రాసే వారు కాదు, బాగా చదివేవారే బాగా లోతుగా విశ్లేషణాత్మకంగా మాట్లాడగలుగుతారు. బాగా చదివే వారే బాగా రాయగలుగుతారు. మంచి పుస్తకం మనిషి నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతుంది. కొత్త చూపునిస్తుంది కొత్త ఆలోచనలను ఇస్తుంది ,ఆచరణ దిశగా చైతన్యవంతంగా నడిపిస్తుంది. మంచి పుస్తకం మాట్లాడుతుంది. మాట్లాడనిస్తుంది. అక్షరానికి గొంతు నిస్తుంది. * తెలుగు సమాజాలకు అవసరమైన ఎన్నో విలువైన వ్యాసాలను తెలుగులో నేరుగాను ,అనువాదం ద్వారానూ అందిస్తున్న రాఘవ కొత్త పుస్తకం 'ప్రశ్నించే గొంతులు'. ఈ పుస్తకం సోమవారం తిరుపతిలో ఆవిష్కరించబడుతుంది.  'మాట్లాడే పుస్తకాలు శీర్షికన'  పుస్తకాల గురించి తన అభిప్రాయాలను వసంతమేఘం కోసం అందించారు రాఘవ.
తొలికెరటాలు

అనేక రూపాల ప్రేమ‌

“ప్రేమమ్ – కాలయానం (1995)” అనే పుస్తకం పేరు వినగానే ఇది ఒక ప్రేమకథగా అనిపిస్తుంది. కానీ ఈ పుస్తకం చదివిన తర్వాత తెలుస్తుంది,ఇది కేవలం ప్రేమ గురించి మాత్రమే కాదు. ప్రేమను ప్రధానంగా పెట్టుకుని, కాలం, జ్ఞాపకం, విధి, పశ్చాత్తాపం, రెండో అవకాశం, తండ్రి ప్రేమ వంటి అంశాల్ని ఒకదానితో ఒకటి ముడిపెట్టి నడిపించిన కథ అని. 1995 అనే సంవత్సరం ఇక్కడ ఒక తేదీ కాదు; అది, మన మనసులో ఎప్పుడో దాచిపెట్టిన మధుర జ్ఞాపకాల్ని, పాత గాయాల్ని, చెప్పుకోని ప్రేమల్ని ఈ పుస్తకం మళ్లీ బయటకు తీసుకొస్తుంది. ఈ కథలో 1995 నేపథ్యం చాలా
సమకాలీనం

కేసులు కొట్టేసినా, జైలు నుంచి విడుద‌లైనా దొర‌క‌ని స్వేచ్ఛ 

2022 మే లో రతీరామ్ మాంఝీ మావోయిస్టు ఆరోపణల నుండి విముక్తి పొందారు, కానీ ఆ ఆరోపణల నీడ ఆయనను ఇంకా వెంటాడుతూనే ఉంది. హత్య, అల్లర్లు, ఆయుధ చట్టం, క్రిమినల్ లా అమెండ్‌మెంట్ యాక్ట్ కింద మహువాటాండ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో బొకారోలోని ఒక సివిల్ కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. ఈ తీర్పుతో సుదీర్ఘ న్యాయపోరాటం ముగిసినప్పటికీ, ఆయన జీవితం గతంలోలాగా సాధారణ స్థితికి చేరుకోలేదు. మిగిలిందల్లా పోలీసుల వేధింపులు, సామాజిక వివక్షతో కూడిన సంవత్సరాల తరబడి అవమానాలే. దీని పర్యవసానాలు ఆయనతోనే ఆగిపోలేదు, ఆయన కుటుంబాన్ని కూడా తాకాయి. ఒక పాఠశాల తన
అనువాదం

సుదీర్ఘ జైలు శిక్ష:  జీవితాన్ని కోల్పోయిన  పాండు నరోటే, కంచన్ నానావారే, స్టాన్ స్వామి 

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాకు చెందిన 33 ఏళ్ల ఆదివాసీ యువకుడు పాండు పోరా నరోటెని, నిషేధిత మావోయిస్ట్ పార్టీ, దాని అనుబంధ సంస్థ రివల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్‌తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపైన 2013 ఆగస్టులో అరెస్టు చేసారు. ఆ తరువాత ఈ కేసును ఢిల్లీ యూనివర్సిటీ పూర్వ ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబా, మరికొంత మంది మీద పెట్టారు. నరోటెను, ఇతర నిందితులను చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణా చట్టం (ఉపా)లోని పలు నిబంధనలు, భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 120-B కింద దోషులుగా నిర్ధారించి, 2017 మార్చిలో, గడ్చిరోలి సెషన్స్ కోర్టు వారిలో చాలా మందికి జీవిత ఖైదు విధించింది.