సమకాలీనం

కృత్రిమ మేధ –  పాలకవర్గం

 ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు న్యూఢిల్లీలో కృత్రిమ మేధ ప్రభావం పై అంతర్జాతీయ శిఖరాగ్ర సభ జరిగింది. ఈ సభలో 20 దేశాలకు చెందిన అగ్ర నేతలు, 60 దేశాలకు చెందిన మంత్రులు,  వందమంది కంపెనీ సీఈఓ లు పాల్గొన్నారు. ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, "ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ అభివృద్ది,  నైపుణ్యాల పెంపుదల, ఉద్యోగ కల్పన, నైతికత, విధాన రూపకల్పనలు చేయడంగా ప్రకటించబడింది". కృత్రిమ మేధ అన్నది ఇప్పుడే పుట్టినది కాదు. 1950 లలోనే "డాక్ మౌత్" కంప్యూటర్ల తయారీ, వినియోగము, స్టోరేజీ, భాషల అనువాదం,హేతుబద్ద సమాధానాల రూపకల్పనలలో ఇంటర్నెట్ వాడకం నుంచే ఇది
అనువాదాలు

షాహిద్ అజ్మీ- కటకటాల వెనుక నుంచి 

పోలీసు కస్టడీలో అది ఏడవ రోజు. మొదట్లో కొట్టిన దెబ్బలు ఇప్పుడు రోజుకు దాదాపు 22 గంటల పాటు సాగే విచారణగా మారాయి. నాలోని సహనమూ, రక్షణ కవచాలు సడలిపోతున్నట్లు అనిపించింది. పి.ఐ. ఖాన్విల్కర్ (ఇటీవలే అవినీతి కేసులో అరెస్టయ్యారు), యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌కి చెందిన అలాంటి ఇతర అవినీతి అధికారులు ఆ విచారణ గదిలోనే తాము ఎంతమంది ముస్లింల రక్తాన్ని చిందించారో గొప్పగా చెప్పుకుంటున్నారు. దేశభక్తి పేరుతో వారు సాగిస్తున్న ఆ క్రూరమైన పోటీని చూసి నాకు అసహ్యమూ, వికారమూ కలుగుతున్న సమయంలోనే, కోర్టు అనుమతితో నాకు 'వకీల్ ములాకాత్' (న్యాయవాదితో భేటీ) కోసం పిలుపు వచ్చింది.
సమకాలీనం

గ్రామీణ ఉపాధి హక్కుపై ఉక్కుపాదం

1980ల నుండి ‘పనికి ఆహారం’ తదితర పేర్లతో కొనసాగిన పథకానికి 2006 సంవత్సరంలో కేంద్రంలోని నాటి కాంగ్రెస్(యుపిఎ) ప్రభుత్వం... గ్రామీణ ఉపాధి హామీ పథకంగా అమలు చేసింది. ప్రజానుకూల ఆర్థిక, సామాజిక శాస్త్రవేత్తల ప్రొద్భలంతో గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005లో రూపుదిద్దుకుంది. 2009 సంవత్సరంలో ‘మహాత్మా గాంధీ’ పేరును పథకానికి ముందు జోడించింది. ఎం.జి నరేగా (గ్రామీణ ఉపాధి హామీ చట్టం) ఉపాధి అవకాశాలను కల్పించడంలో ప్రకటిత లక్ష్యపు దరిదాపులకు కూడా చేరుకోకపోయినప్పటికీ, ఎన్నో అవకతవకలు, లోటుపాట్లతో అవినీతిలో కూరుకుపోయినప్పటికీ... దేశంలోని గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాల ప్రజానీకానికి ఏదో మేరకు ఉపశమనంగా పనిచేస్తోంది. ఈ పథకాన్ని సైతం
తొలికెరటాలు

మట్టి  మనసుల చిత్రణ కుందేరు సాక్షిగా

సురేంద్ర శీలం రాసిన ఈ నవల కేవలం కుందేరు నది ఒడ్డున ఉన్న క్రిస్టిపాడు గ్రామ కథ మాత్రమే కాదు. ఆ ఊరి ప్రజల జీవితాలను మాత్రమే చిత్రించదు. ఇది మట్టి మనుషుల మనసుల లోతులను పరిశీలిస్తూ, వారి జీవన విధానాన్ని, భావోద్వేగాలను సూక్ష్మంగా అద్దం పట్టే నవల. రాయలసీమ గ్రామీణ వాతావరణాన్ని అక్కడి మనుషుల బంధాలను, అక్కడి రాజకీయాలను, అక్కడి సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. సహజంగా నది అనేది నాగరికతకు మూలం. నాగరికత వృద్ధి చెందే క్రమంలో అక్కడ జరిగిన మార్పులకు అక్కడి ప్రజల జీవితాల్లో సంస్కృతి పరంగా, జీవన విధానంలో అన్ని రకాల మార్పులకు సాక్ష్యం నది.
వ్యాసాలు

షాహిద్ పునర్ధర్శనం: వ్యవస్థపైన విశ్వాసం కోసం అవిశ్రాంత అన్వేషణ

న్యాయవాది షాహిద్ అజ్మీని 2010 ఫిబ్రవరి 11నాడు (1977-2010)అతని ఆఫీసులోనే దుండగులు కాల్చి చంపారు; ఆ నిందితులు నేటికీ ఎటువంటి శిక్షా అనుభవించకుండా తప్పించుకు తిరుగుతున్నారు. 2000వ దశకంలో ముంబై పరిసర ప్రాంతాలలో జరిగిన భారీ ఉగ్రవాద దాడుల నేపథ్యంలో, పోలీసు బలగాల ద్వారా హడావుడిగా జైలుకు పంపిన క్లయింట్ల తరపున వాదించినందుకే ఆయనను చంపారని నమ్ముతారు. 1994 నాటి టెర్రరిస్ట్ అండ్ డిస్రప్టివ్ యాక్టివిటీస్ (ప్రివెన్షన్) యాక్ట్ (టాడా) కింద బలహీనమైన సాక్ష్యాలతో నిందితుడిగా ఏడేళ్ల పాటు జైలు జీవితం గడిపిన అజ్మీ, ఇలాంటి కేసులను నిర్వహించడంపైన లోతైన అవగాహన పెంచుకున్నారు. జైలులో ఉన్నప్పుడే ఆయన చదువుకుని,
సమీక్షలు

గతం కూడా వర్తమానమే..

 కవిత్వ రచనలో అనేక ప్రాపంచిక దృక్పథాలు ఉంటాయి. సృజనాత్మకత ఏదో ఒక దగ్గర స్థిరం కాదు. కవి చుట్టు పరిభ్రమిస్తున్న సామాజిక స్థితి యొక్క వ్యక్తీకరణ ప్రధానం. అనుసంధానం కూడా ప్రధానమైనదే. ప్రాంతం, సామాజికత లేదా ఇతర భిన్న రూపాలు కవిత్వంలో ఇమడవచ్చు. ఆ ఇమడిక లో సాంధ్రత ముఖ్యమైనది. ఒకానొక ప్రాంతానికి ప్రాతినిత్య కవి అనలేము. దృక్పథానికి సంబంధించిన భావజాలం. కవి పుట్టుక, కవిత్వ రచన ఏచలనం దగ్గర మొదలైంది. కేంద్ర స్థానాన్ని వెతకాలి. ఈ వెతకడంలో కవి అంత రంగం కనబడతుంది. కేవలం సంవేదన మాత్రమేనా? ఈ రసాయినిక ప్రక్రియ వెనుక దాగిన కల్లోలం ఏదో
కవిత్వం

యుద్ధ రహస్యం

కోయిలల గుండెల్లోశిలకోలలు నృత్యం చేస్తున్న దృశ్యాలు కంటిపాపల్ని కాటేస్తూనే ఉన్నాయి,పాటలు పాడీ పాడీనేలరాలిన పిట్టల నిర్జీవ దేహాల్నైనా కనీసం చూసే భాగ్యానికి నోచుకోని మాతృవిహంగాల కన్నీళ్ళలో నెత్తుటి మరకలు కరిగి చెరిగిపోతున్నాయి, పిట్టలు అడవికొమ్మల గూళ్ళొదిలి పంజరాలే శరణ్యమనుకునే దుస్థితి,పాట ఎప్పుడు ఎక్క డ ఎలా పాడాలో దిక్కుతోచనిసందిగ్ధ సందర్భం, నామమాత్రంగా మిగిలివున్న పక్షులు నిగూఢ కులాయంలోనిశ్శబ్ద గీతాలైపోయేయి,గడువు దగ్గరపడుతోందనిగుర్తుచేస్తో ఆకురాల్చిన అడవి పండుటాకు వలువను మార్చిహరిత పతాకను ఎగరేస్తోంది,రేపటి పక్షితరం కోసం పునరాలోచన ప్రస్తుతంపిట్టకీ అవసరమేపాటకీ అవసరమే,ప్రవాసమూ ఒక యుద్ధరహస్యమేనని,పాటకీ పాటకీ మధ్య మాత్రమే కాదుచరణానికీ చరణానికీ కూడా వ్యవధి తప్పదనిహెచ్చరిస్తోంది కాలజ్ఞానం .
వ్యాసాలు

స్టోలోపిన్ నిర్బంధ కాలంలో విప్లవోద్యమం-మేధావులు

(ర‌ష్యా విప్ల‌వోద్య‌మ చ‌రిత్ర‌లో 1905 తిరుగుబాటు ఓట‌మి ఘోర‌మైన అనుభ‌వం. ఉద్య‌మం తీవ్రంగా న‌ష్ట‌పోయింది. ఆ స‌మ‌యంలో   ప్రతికూల మేధావులు, పార్టీ మేధావుల్లో కొంద‌రు మార్క్సిజంలోని మౌలిక భావ‌న‌ల‌కు, విప్ల‌వాచ‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా త‌యార‌య్యారు. మార్క్సిస్టు సిద్ధాంతాన్ని తిరగదోడే  ప్రయత్నం చేశారు.  విప్ల‌వ పంథా త‌ప్ప‌ని ప్ర‌చారం చేశారు.  మెన్షివిక్ నాయ‌కుడైన ప్ల‌హ‌నోవ్ *వారు ఆయుధాలు ప‌ట్టుకోవ‌ల‌సింది కాదు* అన్నాడు. దానికి లెనిన్ స‌మాధానం ఇస్తూ *మ‌నం సాయుధ పోరాటాన్ని మ‌రింత దృఢంగా, శ‌క్తివంతంగా నిర్వ‌హించి ఉండ‌వ‌ల‌సింది* అన్నాడు. ఆ కాలంలో తాత్విక రంగంలో త‌లెత్తిన మార్క్సిస్టు వ్య‌తిరేక వాద‌న‌ల‌ను తిప్పి కొడుతూ లెనిన్   “భౌతికవాదం- అనుభవవాద విమర్శ” అనే