ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం 20వ రాష్ట్ర మహాసభలకు రండి
ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం 20వ రాష్ట్ర మహాసభలకు రండి జనవరి 10, 11 2026, తిరుపతి ప్రజలారా! ఎవరి హక్కుల కోసం మరెవ్వరూ గొంతెత్తరో, అలాంటి వారి హక్కుల కోసం గొంతెత్తడమే లక్ష్యంగా, తెలుగురాష్ట్రాల్లో గత ఐదు దశాబ్దాలకు పైగా పౌర ప్రజాస్వామిక హక్కుల కోసం పనిచేస్తున్న పౌరహక్కుల సంఘం తన 20వ రాష్ట్రమహాసభల్ని తిరుపతిలో జరుపుకుంటున్నది. పౌరహక్కుల సంఘం ఆవిర్భవించిన తొలినాళ్ళల్లో రాజ్య హింసకు వ్యతిరేకంగా మాత్రమే పని చేసిన పౌరహక్కుల సంఘం, తరువాత కాలంలో తన కార్యరంగాన్ని విస్తృత పరచుకుని, సమాజంలో వివిధ ఆధిపత్య వ్యవస్థల మూలంగా అణచివేతకు గురి అవుతున్న ప్రజల హక్కుల కోసం










