ఆర్ధికం

డాలర్ ఆధిపత్యానికి తెరపడనుందా ?

ప్రపంచ కరెన్సీలు అన్నింటిలో ఇప్పటి వరకూ డాలర్ది రారాజు పాత్ర కావడం వెనుక ఉన్నది ఆ డాలర్కు వెన్నుదన్నుగా నిలుస్తున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ తాలూకు 'బలం' అన్నది నిజం! రెండవ ప్రపంచ యుద్ధం ముగియనున్న కాలానికి రవి అస్తమించని సామ్రాజ్యం కలిగి యున్న బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ కకావికలమైంది. అప్పటిదాకా అంతర్జాతీయ వాణిజ్యంలో ఆధిపత్యం చలాయించిన బ్రిటన్, తదితర పశ్చిమ యూరప్ దేశాలు ఆర్థికంగా చితికిపోయాయి. బ్రిటిష్ కరెన్సీ పౌండ్తో పాటు ఐరోపాలోని ఇతర పశ్చిమ దేశాల కరెన్సీల విలువ కూడా క్షిణించింది. రెండు ప్రపంచ యుద్ధాల్లోనూ చెక్కుచెదరకుండా నిలిచింది అమెరికా ఒక్కటే. ఆ దేశం దగ్గర
సమకాలీనం

ఆ విద్యార్థులు చేసిన నేర‌మేమిటి?

When questions become crimes and students become ‘Maoists’; I can’t breathe, Indian edition A young tribal student from Kerala found himself pinned to the ground, a constable straddling his chest and forcing his head into the pavement at an awkward angle while two others yanked at his arms and legs. నవంబర్ 23, ఆదివారం నాడు ఢిల్లీ, ఇండియా గేట్ దగ్గరకు వచ్చిన అనేక మంది నిరసనకారుల మధ్య కేరళకు చెందిన ఒక యువ ఆదివాసీ విద్యార్థి కూడా
మీరీ పుస్తకం చదివారా ?

అమ్మ‌కు జేజేలు

విమర్శకు ప్రమాణాలు ఏమిటి? వొక రచన బాగుందా లేదా అని చెప్పడానికి ఏమైనా తూనికరాళ్లున్నాయా? మాట్లాడుతున్న విమర్శకులు ఏ సాహిత్యప్రక్రియ గూర్చి మాట్లాడుతున్నారు? కవిత్వము, కథ, నవల, నాటకం ఇలా ఉండగా అన్నింటనీ వొకే గాడిన కట్టేస్తున్నారా? తెలుగు విమర్శ ఎంత అత్యున్నతంగా ఎదిగందంటే ప్రమాణాలు లేవు అనే పేలవమైన కామెంట్లు చేసే స్థితికి చేరింది. పోనీ ప్రమాణాలేవో చెబుతారా అంటే అలా కూడా చెప్పరు. ఈ తరహా ఆలోచన తిరోగమనస్థితికి సంకేతం. ఈ సంక్లిష్ట, సందిగ్ధ సందర్భంలో వొక కవిత్వంలో ప్రమాణాల గూర్చి చర్చిద్దాం. నీలిమ విపస్‌ రావు కవిత్వం ఆగ్రహి చూద్దాం. ఈ కవిత్వంలో ఉన్న 
ఆర్ధికం

మోడీ ఏలుబడిలో అప్పుల భారతం

మోడీ ఏలుబడిలో అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.  2026 మార్చి నాటికి మొత్తం అప్పు రూ. 191 లక్షల కోట్లు దాటనుంది. దేశంలోని ఒక్కొక్కరి నెత్తిపై రూ.1.37 లక్షల అప్పు ఉంది. యేటా చెల్లిస్తున్న వడ్డీ రూ. 12,76,338 కోట్లు. కేంద్ర ప్రభుత్వం చేసే అప్పులే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల అప్పులు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఈ అప్పులను తీర్చడానికి ప్రభుత్వాలు సహజంగానే ఆదాయాలు పెంచుకోవడం తప్ప మరో మార్గం లేదు. ఈ ఆదాయాలు పెంచుకోవడానికి ప్రభుత్వాలు ప్రజల మీద విపరీతమైన భారాలు వేస్తున్నాయి. ఖర్చులు తగ్గించుకోవడం పేరు మీద ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకపోవడం, సంక్షేమ పథకాలలో
సమకాలీనం

 ‘నూతన భారతం’లో ఆదివాసుల సంక్షోభం

నవంబర్ 15న బిర్సా ముండా జయంతి సందర్భంగా, మోదీ ప్రభుత్వం మళ్లీ ఘనంగా “జనజాతి గౌరవ దివస్”ను జరిపి, దేశ జనాభాలో దాదాపు 9 శాతం ఉన్న ఆదివాసుల శ్రేయస్సు కోరేవారిగా తనను తాను చూపించుకుంటోంది. మరోవైపు, ఇటీవల, ప్రభుత్వం లదాఖ్‌లోని ఆదివాసుల రాజ్యాంగపరమైన డిమాండ్ కోసం జరిగిన ప్రజాస్వామ్య పోరాటాన్ని దారుణంగా అణచివేసింది. మణిపూర్‌లో ఆదివాసీ-స్థానిక సముదాయాల పైన రెండేళ్ల హింస తర్వాత కూడా పరిస్థితి సాధారణ స్థితికి రాలేదు. మావోయిజం నిర్మూలన పేరుతో బస్తర్‌లో ఆదివాసులపై పోలీసుల అణచివేత జరుగుతోంది. జార్ఖండ్ సహా ఇతర రాష్ట్రాల ఆదివాసులు తమ స్వతంత్ర మతపరమైన కోడ్ (నియమ నిబంధనల
సమకాలీనం

జైలు హక్కుల కోసం-మావోయిస్టు  ఖైదీ సంజయ్ దీపక్ నిరాహార దీక్ష‌

జైలు అధికారులు చట్టాన్ని పాటించే ఉంటే, సంజయ్ న్యాయం కోసం నిరాహారదీక్ష చేయాల్సిన అవసరం ఉండేదే కాదు. హైదరాబాద్‌లోని చర్లపల్లి జైలులో ఉన్న మావోయిస్టు గా అరోపించబడిన  రాజకీయ ఖైదీ సంజయ్ దీపక్ రావుతో ఒక సీనియర్ జైలు అధికారి ఇలా అంటాడు. " రాజ్యాంగాన్ని పాటించని వాళ్ళ పట్ల  మేము రూల్స్ పాటించాలా? నేను పాటించను.” భారతదేశ జైళ్లలో చట్టబద్ధత ఎంత పతనమైందనే విషయాన్ని ఈ అధికారి మాటలు చెప్పకనే చెప్తున్నాయి. 2025 అక్టోబర్ 28న, 60 ఏళ్ల సంజయ్ దీపక్ నిరాహారదీక్ష ప్రారంభించారు. ఆయన నిరసన ఏవో ప్రత్యేక హక్కుల కోసమో, సౌకర్యాల కోసమో కాదు.
సమకాలీనం

అదానికి ప్రతిఘటన అదాని బొగ్గు గనుల ప్రతిపాదన బహిరంగ విచారణలో ప్రజా నిరసన

పరిపాలనాధికారులు, కలెక్టరు, ఎస్‌డీఎంలు మాట్లాడాలనుకుంటే గ్రామాలకు రావాలి. గ్రామంలోని ప్రజల మధ్య మాట్లాడాలి. సార్, మాకు ఇంతే తెలుసు, మా భూమిని అదానీకి గానీ, ఇంకెవరికీ గానీ ఇవ్వాలని మేము అనుకోవడం లేదు. ఈ దేశం రాజ్యాంగం ప్రకారం నడవాలి, రాజ్యాంగబద్ధ పాలన ఉండాలి తప్ప, ఏ ఒక్క పారిశ్రామికవేత్త కనుసన్నలలో జరిగేది  కాదు. భూమికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కేవలం ట్రస్టీలే (ధర్మకర్తలే) తప్ప యజమానులు కారని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ భూమిపై ఎవరికి హక్కు పత్రం (అధికార పత్రం) ఉందో వారే యజమాని. చిన్న రైలు మార్గం నిర్మించి, దాని ద్వారా రవాణా
మీరీ పుస్తకం చదివారా ?

కవిత్వ అంతరంగాన్ని శోధించే కవిత్వం

తెలుగులో వస్తున్న సాహిత్యవిమర్శపై ఇటీవల తీవ్రంగా చర్చ జరుగుతున్నది. ఏది విమర్శ? ఏది కాదు.? విమర్శకులు తెలంగాణ ప్రాంతం నుంచి వొకరకమైన విమర్శ రాస్తే, కోస్తాంధ్ర నుంచి, ఉత్తరాంధ్ర నుంచి, రాయలసీమ నుంచి వారి వారి కోణాల్లోంచి దృక్పథాల్లోంచి విమర్శ రాస్తున్నారు. సాహిత్య ప్రక్రియల్లో కవిత్వం, కథ గూర్చి విమర్శ రాసేటప్పుడు మాత్రం అనేక చర్చలు మొదలౌతున్నాయి. కవిత్వాన్ని తీసుకుంటే పదునైన విమర్శ ఏది? అన్నప్పుడు భిన్నవాదనలొస్తున్నాయి. వాస్తవానికి కవిత్వమిలాగే ఉండాలనే ఎవరూ నిర్థారించకపోయినా హృదయాన్ని మీటే కవిత్వానికి కొన్ని సంగతులైతే నిర్ణయించుకున్నారు. ఇందులో కవిత్వ నిర్మాణసూత్రాలైన వస్తువు, శిల్పం, ఎత్తుగడ, అభివ్యక్తి, భావుకత, సాంద్రత, రూపం, సారం
ఆర్ధికం

ట్రంప్ విధానాలతో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం

ప్రపంచ దేశాల ఉత్పత్తి, మార్పిడి, వినియోగం కార్యకలాపాల మొత్తాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంటారు. ఇది ప్రపంచ దేశాల మధ్య అంతర్జాతీయ వాణిజ్యం ద్వారా అనుసంధానించబడి ఉంటుంది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన భాగం. ఇది ప్రపంచీకరణలో ఒక భాగం. ఇప్పటికీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాత స్థానంలో చైనా, జర్మనీ, జపాన్‌, భారత్‌లు ఉన్నాయి. అమెరికా అధ్యకక్షుడు ట్రంప్‌ ఏప్రిల్‌ 2న విముక్త దినోత్సవం రోజున ప్రకటించిన దిగుమతి సుంకాల పెంపుతో అకస్మాత్తుగా వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ప్రస్తుత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి, బలహీనమైన వృద్ధి నెలకొంది. అన్నీ
సమకాలీనం

కొండల కోసం పోరాడిన మహిళా కార్యకర్తకు బెయిలు నిరాకరణ

ఒడిశాలోని రాయగడ, కలహండి జిల్లాలలో ఉన్న, తరచుగా తిజిమాలిగా పిలిచే సిజిమాలి అనే ప్రశాంతమైన గ్రామంలో, ప్రతిపాదిత మైనింగ్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా రెండేళ్లుగా ప్రతిఘటనా ఉద్యమం జరుగుతోంది. సిజిమాలి అనేది భారతదేశంలోని ఒడిశా రాష్ట్రంలో ఉన్న ఒక కొండ శ్రేణి. బాక్సైట్ నిల్వలు, స్థానిక సముదాయాల పవిత్రస్థల ప్రాముఖ్యత, జీవవైవిధ్యాల కోసం ప్రసిద్ధి చెందింది. 311 మిలియన్ టన్నుల బాక్సైట్ నిల్వ ఉన్నదని అంచనా వేసిన 1,549.022 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న సిజిమాలి బాక్సైట్ బ్లాక్‌కు 2023లో మైనింగ్ దిగ్గజం వేదాంత లిమిటెడ్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ (అభిప్రాయ పత్రం) ను తీసుకున్నది. అయితే, సెప్టెంబర్ నెల ప్రారంభంలో,