లోచూపు

ఫాసిస్టు క్రమాల పరిశీలన

పెట్టుబడి తోపాటు  ఆవిర్భవించిన ఆధునిక యుగంలోని రాజకీయాలకు రెండు తీవ్ర అంచులు ఉంటాయి. ఒకటి బూర్జువా ప్రజా స్వామ్యం, రెండు అత్యంత  ప్రగతి నిరోధక ఫాసిజం. పెట్టుబడిదారీ రాజకీయాలు ఈ రెండు అంచుల ద్వంద్వం మధ్యనే లోలకంలా కొనసాగుతాయి. పెట్టుబడి కి ఉన్న   స్వభావం వల్ల నే వలస రూపంలో   ప్రపంచమంతటా  విస్తరించింది.   ఈ  క్రమంలోనే దేశ దేశాలలో ప్రజలు  సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా  స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోసం పోరాడారు. ప్రత్యక్ష వలస పెట్టుబడిదారీ విధానం అంతమై పరోక్ష వలస పెట్టుబడిదారీ విధానం మొదలైంది.   పెట్టుబడి ద్రవ్య పెట్టుబడి గా బలపడినాక దాని పని విధానం మారించి. దాని 
క్లాసిక్స్ ప‌రిచ‌యం కాలమ్స్

హెర్‌ వోగ్ట్‌

Herr Vogt జర్మన్‌ ప్రచురణ-1860 ఇంగ్లిష్‌ అనువాదం : 1982 పుస్తకం కంపోజింగ్‌, ముద్రణ, బైండింగ్ -  ట్రేడ్‌యూనియన్‌ లేబర్‌ కార్ల్‌మార్క్స్‌ విస్తృత రచనల్లో ఒక విస్మృత గ్రంథం Herr Vogt. ఆయన సమగ్ర రచనల జాబితా తయారు చేసేటప్పుడు తప్ప ఈ పుస్తకం పేరు మరెక్కడా వినపడదు. మార్క్స్‌ ఇతర రచనల గురించి సుదీర్ఘంగా, సూక్ష్మంగా చర్చించిన పండితులు కూడా ఈ పుస్తకాన్ని, ఎందుకోగాని విస్మరించారు. ఏది ఏమైనప్పటికీ, CAPITAL రాస్తున్న దశలో ఒక సంవత్సరంపాటు ఆ కృషికి విరామమిచ్చి, ఈ పుస్తకం రాశాడు మార్క్స్‌. తనూ, ఎంగెల్స్‌ ఇతర మిత్రులకు వ్యతిరేకంగా కార్ల్‌వోగ్ట్‌ అనబడే పెద్దమనిషి
మీరీ పుస్తకం చదివారా ? కాలమ్స్

‘మన్‌ కీ బాత్‌ : వొట్టి మాయా పాచిక’

A poem is what happens when it is read- Christopher Caudwell భారతీయ సాహిత్యంలో తనకంటూ సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న కవి అఫ్సర్‌. కథ, కవిత్వం, విమర్శ ఏది రాసినా తనదైన భావజాలానికి అతీతంగా, తనదైన శైలికి భిన్నంగా రాయరు. అఫ్సర్‌ ఏది రాసినా పదికాలాలు గుర్తిండిపోయే అక్షరాలకు జన్మనిస్తాడు. ప్రగతిశీల రక్తకణాలను నరనరాల్లో నింపుకుని పిడికిలి బిగించి విప్లవోద్యమాన్ని నడిపిన కౌముది కొడుకే అఫ్సర్‌. ఈ తరానికి ఆయన కవిగానే తెలుసు. కానీ ఆయనది నాల్గున్నర దశాబ్దాల సుధీర్ఘ సాహిత్య ప్రయాణం. సమసమాజ నిర్మాణానికి రాళ్ళెత్తిన కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినవారే! దేశంకాని దేశంలో
కవి నడిచిన దారి కాలమ్స్

నా కవిత్వం ఒక నినాదం

నా కవితా ప్రస్థానం వలసలో మొదలైంది. అప్పటి వరకూ అంటే 1993 నాటకి నా ఇరవై మూడేళ్ళ జీవితంలో సీరియస్ సాహిత్యం తో పరిచయం తక్కువ. కొంత శ్రీశ్రీ, కొంత తిలక్, కొంత ఠాగూర్ గీతాంజలి తప్ప కవిత్వం అంటే సినిమా సాహిత్యం గా పరిగణించేవాణ్ణి. మా తెలుగు మాస్టార్లు పలికించిన పద్యాల ప్రతిపదార్థాలు కూడా బట్టీయం వేసినవే కానీ సిరీయస్ గా చదివినవి కావు. కాకపోతే హిందీ పాటలు ( చాలామందికి తెలియదు కానీ అందులో ఉర్దూ భాషే ఎక్కువగా ఉంటుంది. దానికి కారణం ముస్లీం ఉర్దూ కవుల ప్రభావం) వినేవారికి ఎంతో కొంత కవిత్వం లోపలికి
క్లాసిక్స్ ప‌రిచ‌యం కాలమ్స్

కుటుంబం-సొంత ఆస్తి- రాజ్యాంగ‌యంత్రం- 4

దంపతీ వివాహం :దంపతీ వివాహం యొక్క అంతిమ విజయం, నాగరికత యొక్క ప్రారంభ దశకు చిహ్నం. దీనిలో మగవాడికి ప్రాధాన్యం. జన్మ కారకుడైన తండ్రి విషయంలో సందేహం లేకుండా చేసుకోవడం దీని ముఖ్య ఉద్దేశ్యం. తండ్రి అనంతరం, అతని ఆస్తికి అతని బిడ్డలే సకాలంలో వారసులు కావాలన్నది అక్కడున్న అవసరం. వివాహ బంధం యొక్క గట్టి దనమే జంట పెళ్ళికీ, దీనికీ తేడా. ఈ నూతన వ్యవస్థలో దంపతులలో ఎవరుకోరినా వివాహాన్ని ఛేదించడం సాధ్య పడదు. దాంపత్య ధర్మాన్ని అతిక్రమించే హక్కు కూడా అతనికే మిగిలింది. సమాజం అభివ్రుద్ధి పొందిన కొద్దీ మగవాడు తన హక్కును అమలు పరచుకుంటూ
సమకాలీనం వ్యాసాలు కాలమ్స్

రామానుజుడు-ఆయ‌న స‌మ‌త‌

క్రీశ 1017-1137 మ‌ధ్య జీవించిన రామానుజుడికి ముందే విశిష్టాద్వైతం ఉంది. దాన్ని ఆయ‌న  తాత్వికంగా, ఆచ‌ర‌ణాత్మ‌కంగా వ్య‌వ‌స్థీకృతం చేశాడు. రామానుజుడు రంగం మీదికి వ‌చ్చేనాటికి ఉన్న  చారిత్ర‌క , తాత్విక ప‌రిస్థితుల‌తో సంబంధం లేకుండా ఆయ‌న *స‌మ‌తా వాదాన్ని* కీర్తించడం వ‌ల్ల ప్ర‌యోజ‌నం  ఏమీ ఉండ‌దు.  రామానుజుడి విశిష్టాద్వైతానికి ముందు ఆదిశంక‌రుడి అద్వైతం బ‌లంగా ఉండింది.  *బ్ర‌హ్మ స‌త్యం- జ‌గం మిధ్య* అనేది ఆయ‌న ప్ర‌ధాన సిద్ధాంతం. దీన్నుంచే త‌త్వ‌మ‌సి అనే భావ‌న‌ను తీసుకొచ్చాడు.  ప‌ర‌బ్ర‌హ్మ‌వు నీవే. ఈశ్వ‌రుడు, మాన‌వుడు(ఆత్మ‌) వేరే కాదు. రెండూ ఒక‌టే అనేది అద్వైతం.  జ‌గం మిధ్య అన‌డంలోని అద్వైత మాయావాదాన్ని రామానుజుడు అంగీక‌రించ‌లేదు. 
సమకాలీనం

మానేసర్‌ మారుతీ ప్లాంట్‌లో కార్మికుల నిరవధిక ధర్నా

ఆటోమొబైల్ కంపెనీ మారుతీకి చెందిన మనేసర్ ప్లాంట్‌లో కార్మికుల పోరాటంలో జరిగిన  హింసాత్మక ఘటనల తర్వాత 2012లో తొలగించబడిన కార్మికులు తమ ఉద్యోగాలను తిరిగి పొందాలని డిమాండ్ చేస్తూ మనేసర్ తహసీల్ కార్యాలయం వద్ద నిరవధిక ధర్నా ప్రారంభించారు. హర్యానాలోని మానేసర్‌లోని మారుతీ సుజుకీ ప్లాంట్‌లో 2012లో యాజమాన్యం తొలగించిన 100 మందికి పైగా కార్మికులు,  సుదీర్ఘమైన 12 సంవత్సరాల తర్వాత,  2024 సెప్టెంబర్ 18 నాడు తిరిగి తమను పనిలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫ్యాక్టరీ గేటు దగ్గర నిరవధిక ధర్నాకు కూర్చున్నారు. సత్యం ఆటో యూనియన్, లుమాక్స్ మజ్దూర్ యూనియన్, ఎఎస్‌ఐ యూనియన్, బెల్సోనియా ఆటో
కథనం

ఈ పసిపాపల కథ వింటారా?

‘మీ డబ్బులు నాకక్కర్లేదు. మీ ఓదార్పూ అక్కర్లేదు. నాక్కావాల్సింది నా పిల్ల. తలకి తల కావాలి’ కోపం, దుఃఖంతో అన్నది మాసే సోడి. ఆమె రెండు చేతి వేళ్ళకు గాయాలయ్యాయి. ‘ఈళ్ళను కూడా పట్టుకుపొండి. మాకు మీ సామాన్లు అక్కర్లా. నా పిల్లను చంపి సామాన్లు పడేసి పోయారు. నాకు నా పిల్ల కావాలి. పిల్లను చంపిన పోలీసులు, డి.ఆర్‌.జి. గుండాలను ఎంటనే శిక్షించాలి’ ఖరాఖండిగా అన్నాడు బామన్‌ సోడి. మాసే, బామన్‌ మంగ్లి తల్లిదండ్రులు. ‘మేం చంపలేదు’ పోలీసులు. ‘ఆరోజు దీదీని తరిమింది నువ్వేగా! నీకు తల్లి లేదా? చెల్లె లేదా? నీకు పిల్లల్లేరా? ఈ నొప్పి
ఓపెన్ పేజీ

ఆఫ్గ‌నిస్తాన్‌ను ఎలా అర్ధం చేసుకోవాలి?

ఆఫ్ఘనిస్తాన్  రాజకీయ వ్యవస్థను,  సామాజిక సంబంధాలను అమెరికన్ సామ్రాజ్యవాదపు కనుసన్నలలో న‌డిపేందుకు అక్క‌డ ఒక బ్యూరాక్రటిక్ బూర్జువా నమూనా ప్రభుత్వాన్ని  ఏర్పరిచే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది.   నిజానికి బ్రిటన్ సామ్రాజ్యవాదం సైతం ఎన్నో సార్లు అఫ్ఘనిస్తాన్ ని దాని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించింది. బ్రిట‌న్‌ను    అనుసరించే రాజుని లేదా పరిపాలనను స్థాపించాలనే  ప్రయత్నం జ‌రిగింది. అయితే అవ‌న్నీ విఫ‌ల‌మ‌య్యాయ‌యి.  చరిత్ర దీన్ని రుజువు చేస్తుంది.  అయితే  ఈ రోజు మత ప్రాతిపదిక‌గా ఆఫ్ఘనిస్తాన్ ని సామ్రాజ్యవాద కబంధ హస్తాల నుండి *విముక్తం* చేయడం అనే ప్రక్రియను విమర్శనాత్మకంగా ప‌రిశీలించాలి.  ఈ పరిశీలన ఆఫ్ఘనిస్తాన్ సామాజిక సంబంధాల నుంచి,  ఉత్పత్తి సంబంధాల నేపథ్యం నుండి
ఆర్ధికం

ఆకలి కేకలకు అంతమెప్పుడు?

ఐక్యరాజ్యసమితి ప్రధాన శాఖలైన ప్రపంచ ఆహార సంస్థ (యఫ్‌ఎఒ), యునిసెఫ్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్య్లూహెచ్‌ఓ), ఇంటర్నేషనల్‌ ఫండ్‌ ఫర్‌ అగ్రికల్చరల్‌ డెవలప్‌మెంట్‌(ఐఎఫ్‌ఎడి), వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌ (డబ్య్లూఎఫ్‌పి)లు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనాల ఆధారంగా మే 2న ప్రపంచ ఆహార సంక్షోభాలపై నివేదికను విడుదల చేశాయి. ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో (ఎస్‌డిజి) భాగంగా 2030 నాటికి ప్రపంచంలో ఆకలి చావులు, పోషకాహార లోపం లేకుండా చూస్తూ, ‘జీరో హంగర్‌ (ఆకలి లేని లోకం)’ సాధించాలనే ఉన్నత, ఉత్తమ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలో పోషకాహార లోపం అత్యధికంగా ఆసియా దేశాల్లో 418 మిలియన్లు ఉండగా, ఆఫ్రికాలో 282 మిలియన్లు ఉన్నారని