ఆర్ధికం

కృత్రిమ మేధస్సు 

‘మన కలలను సాకారం చేసుకోవడానికి, మనం ఊహించలేని వాటిని సృష్టించడానికి ఉపయోగించే ఒక సాధనం- టెక్నాలజీ’ అంటాడు లైనక్స్‌ కెర్నల్‌ (ఏకశిలా, మాడ్యులర్‌, మల్టీ టాస్కింగ్‌ వంటి ఆపరేటింగ్‌ సిస్టమ్‌ కెర్నల్‌) సృష్టికర్త లైనస్‌ టోర్వాల్డ్‌. కృత్రిమ మేధ లేదా ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌... సంక్షిప్తంగా చెప్పాలంటే ఎఐ.. దీని వినియోగం ప్రపంచానికి మేలు చేస్తుందో లేదో తెలియని పరిస్థితి. అంతేకాదు... భవిష్యత్తులో ఎన్ని కొత్త మలుపులు తిరుగుతుందో చెప్పడం అసాధ్యం. మనిషి మేధస్సును కృత్రిమ మేధ అధిగమిస్తుందని నిపుణుల అంచనా. ఇప్పటికే కృత్రిమ మేధ ఎన్నో రకాల ఉద్యోగాలకు ఎసరు పెట్టింది. ఉద్యోగులను నిలువునా ముంచేస్తున్నది. డిగ్రీలు చేత
లోచూపు కాలమ్స్

కులం, జెండర్ లను ఇలా చూద్దాం

కులం గురించి దళితవాదం చర్చిస్తుందని, జెండర్ గురించి స్త్రీవాదం చర్చిస్తుందని, ఒక్కో అస్తిత్వ సమస్యను ఆ నిర్దిష్ట అస్తిత్వవాదమే చర్చిస్తుందని, లేదా పరిష్కరిస్తుందనే  అస్తిత్వ వాదాల భావజాల వాతావరణం నెలకొని ఉన్న ఈనాటి సందర్భంలో ‘’స్త్రీవాద దృక్కోణంలో జెండర్, కులం’’ అనే ఈ పుస్తకం రావడం ఎంతో ఆహ్వానించదగింది. మన అంతరాలవారీ  సామాజిక వ్యవస్థలో జెండర్, కులం అనేవి విడివిడిగా కనబడుతున్నప్పటికీ, వాటి మధ్య నున్న సంబంధాలను లోతుగానే కాకుండా శాస్త్రీయంగా విశ్లేషించిందీ పుస్తకం. సుదీర్ఘ  పరిణామ క్రమంలో ఆ రెండింటి సాన్నిహిత్యం కారణంగా ఏర్పడిన వాటి  ఉమ్మడి చరిత్ర క్రమాన్ని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని రచయిత్రి
కవి నడిచిన దారి కాలమ్స్

ఇది ప్ర‌యాణం..

చదువేలేని తరంలోంచి వచ్చాను. మా జేజబ్బ ఏటవతల తాండ్రపాడు. నాన్నకు చదువు లేదు. అప్పట్లో  పిలిచి కోర్టులో తోటమాలి పని ఇచ్చారు. ఆ తరువాత బిల్లజవానుగా ఉద్యోగంలో స్థిరపడ్డారు. నాకు చదువు మీదకన్నా సినిమాలు కథలమీద మోజు . అందుకే చదువు అబ్బలేదు.  కర్నూలు లో పుట్టాను.  అది 1990 కవిత్వజ్వరం బాగా పట్టుకున్న కాలం. నాకు కవులంటే పిచ్చి మోహం. వాళ్ళ ఫోటోలు తెల్లపుస్తకం లో అతికించి, ఫోటోలకింద వారి చిరునామాను, ప్రచురితమైన కవిత్వం సంకలనాల్ని రాసి దాచుకునే వాణ్ణి. ఇప్పటికీ ఆపుస్తకం ఉంది.  ఆశారాజు రాసిన రెండవపుస్తకం 'దిశ ' నాకు రంగుల సీతాకోకలా అనిపించింది.
లోచూపు కాలమ్స్

మార్క్స్- అంబేద్కర్ : మానవ విమోచనా దృక్పథాలు 

మానవ విమోచనను మార్క్స్, అంబేద్కర్ లు ఎలా అర్థం చేసుకున్నారు? మానవ విమోచన పట్ల వాళ్ల అవగాహనల గురించి ప్రఖ్యాత రచయిత, పౌర హక్కుల నేత, ప్రజా మేధావి ఆనంద్ తేల్ తుంబ్డె  చేసిన లోతైన ఆసక్తికరమైన విశ్లేషణ ఈ పుస్తకం. ఆయన రాసిన ఇంగ్లీష్ పుస్తకాన్ని సి. పటేల్ తెలుగులోకి అనువదించగా భూమి బుక్ ట్రస్ట్ (హైదరాబాద్)  మూడవ ముద్రణగా ప్రచురించింది. భారతదేశ చరిత్రలో వివిధ రంగాలలో ఆవిర్భవించి ముందుకు వచ్చిన మానవ విమోచనకు సంబంధించిన దృక్పథాలలో   మార్క్సిస్ట్, అంబేడ్కరిస్టు దృక్పథాలు   ముఖ్యమైనవి . భారత సమాజపు పితృ స్వామిక, కుల, వర్గ పునాదుల రీత్యా అవి
లోచూపు

ఫాసిస్టు క్రమాల పరిశీలన

పెట్టుబడి తోపాటు  ఆవిర్భవించిన ఆధునిక యుగంలోని రాజకీయాలకు రెండు తీవ్ర అంచులు ఉంటాయి. ఒకటి బూర్జువా ప్రజా స్వామ్యం, రెండు అత్యంత  ప్రగతి నిరోధక ఫాసిజం. పెట్టుబడిదారీ రాజకీయాలు ఈ రెండు అంచుల ద్వంద్వం మధ్యనే లోలకంలా కొనసాగుతాయి. పెట్టుబడి కి ఉన్న   స్వభావం వల్ల నే వలస రూపంలో   ప్రపంచమంతటా  విస్తరించింది.   ఈ  క్రమంలోనే దేశ దేశాలలో ప్రజలు  సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా  స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోసం పోరాడారు. ప్రత్యక్ష వలస పెట్టుబడిదారీ విధానం అంతమై పరోక్ష వలస పెట్టుబడిదారీ విధానం మొదలైంది.   పెట్టుబడి ద్రవ్య పెట్టుబడి గా బలపడినాక దాని పని విధానం మారించి. దాని 
క్లాసిక్స్ ప‌రిచ‌యం కాలమ్స్

హెర్‌ వోగ్ట్‌

Herr Vogt జర్మన్‌ ప్రచురణ-1860 ఇంగ్లిష్‌ అనువాదం : 1982 పుస్తకం కంపోజింగ్‌, ముద్రణ, బైండింగ్ -  ట్రేడ్‌యూనియన్‌ లేబర్‌ కార్ల్‌మార్క్స్‌ విస్తృత రచనల్లో ఒక విస్మృత గ్రంథం Herr Vogt. ఆయన సమగ్ర రచనల జాబితా తయారు చేసేటప్పుడు తప్ప ఈ పుస్తకం పేరు మరెక్కడా వినపడదు. మార్క్స్‌ ఇతర రచనల గురించి సుదీర్ఘంగా, సూక్ష్మంగా చర్చించిన పండితులు కూడా ఈ పుస్తకాన్ని, ఎందుకోగాని విస్మరించారు. ఏది ఏమైనప్పటికీ, CAPITAL రాస్తున్న దశలో ఒక సంవత్సరంపాటు ఆ కృషికి విరామమిచ్చి, ఈ పుస్తకం రాశాడు మార్క్స్‌. తనూ, ఎంగెల్స్‌ ఇతర మిత్రులకు వ్యతిరేకంగా కార్ల్‌వోగ్ట్‌ అనబడే పెద్దమనిషి
మీరీ పుస్తకం చదివారా ? కాలమ్స్

‘మన్‌ కీ బాత్‌ : వొట్టి మాయా పాచిక’

A poem is what happens when it is read- Christopher Caudwell భారతీయ సాహిత్యంలో తనకంటూ సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న కవి అఫ్సర్‌. కథ, కవిత్వం, విమర్శ ఏది రాసినా తనదైన భావజాలానికి అతీతంగా, తనదైన శైలికి భిన్నంగా రాయరు. అఫ్సర్‌ ఏది రాసినా పదికాలాలు గుర్తిండిపోయే అక్షరాలకు జన్మనిస్తాడు. ప్రగతిశీల రక్తకణాలను నరనరాల్లో నింపుకుని పిడికిలి బిగించి విప్లవోద్యమాన్ని నడిపిన కౌముది కొడుకే అఫ్సర్‌. ఈ తరానికి ఆయన కవిగానే తెలుసు. కానీ ఆయనది నాల్గున్నర దశాబ్దాల సుధీర్ఘ సాహిత్య ప్రయాణం. సమసమాజ నిర్మాణానికి రాళ్ళెత్తిన కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినవారే! దేశంకాని దేశంలో
కవి నడిచిన దారి కాలమ్స్

నా కవిత్వం ఒక నినాదం

నా కవితా ప్రస్థానం వలసలో మొదలైంది. అప్పటి వరకూ అంటే 1993 నాటకి నా ఇరవై మూడేళ్ళ జీవితంలో సీరియస్ సాహిత్యం తో పరిచయం తక్కువ. కొంత శ్రీశ్రీ, కొంత తిలక్, కొంత ఠాగూర్ గీతాంజలి తప్ప కవిత్వం అంటే సినిమా సాహిత్యం గా పరిగణించేవాణ్ణి. మా తెలుగు మాస్టార్లు పలికించిన పద్యాల ప్రతిపదార్థాలు కూడా బట్టీయం వేసినవే కానీ సిరీయస్ గా చదివినవి కావు. కాకపోతే హిందీ పాటలు ( చాలామందికి తెలియదు కానీ అందులో ఉర్దూ భాషే ఎక్కువగా ఉంటుంది. దానికి కారణం ముస్లీం ఉర్దూ కవుల ప్రభావం) వినేవారికి ఎంతో కొంత కవిత్వం లోపలికి
క్లాసిక్స్ ప‌రిచ‌యం కాలమ్స్

కుటుంబం-సొంత ఆస్తి- రాజ్యాంగ‌యంత్రం- 4

దంపతీ వివాహం :దంపతీ వివాహం యొక్క అంతిమ విజయం, నాగరికత యొక్క ప్రారంభ దశకు చిహ్నం. దీనిలో మగవాడికి ప్రాధాన్యం. జన్మ కారకుడైన తండ్రి విషయంలో సందేహం లేకుండా చేసుకోవడం దీని ముఖ్య ఉద్దేశ్యం. తండ్రి అనంతరం, అతని ఆస్తికి అతని బిడ్డలే సకాలంలో వారసులు కావాలన్నది అక్కడున్న అవసరం. వివాహ బంధం యొక్క గట్టి దనమే జంట పెళ్ళికీ, దీనికీ తేడా. ఈ నూతన వ్యవస్థలో దంపతులలో ఎవరుకోరినా వివాహాన్ని ఛేదించడం సాధ్య పడదు. దాంపత్య ధర్మాన్ని అతిక్రమించే హక్కు కూడా అతనికే మిగిలింది. సమాజం అభివ్రుద్ధి పొందిన కొద్దీ మగవాడు తన హక్కును అమలు పరచుకుంటూ
సమకాలీనం వ్యాసాలు కాలమ్స్

రామానుజుడు-ఆయ‌న స‌మ‌త‌

క్రీశ 1017-1137 మ‌ధ్య జీవించిన రామానుజుడికి ముందే విశిష్టాద్వైతం ఉంది. దాన్ని ఆయ‌న  తాత్వికంగా, ఆచ‌ర‌ణాత్మ‌కంగా వ్య‌వ‌స్థీకృతం చేశాడు. రామానుజుడు రంగం మీదికి వ‌చ్చేనాటికి ఉన్న  చారిత్ర‌క , తాత్విక ప‌రిస్థితుల‌తో సంబంధం లేకుండా ఆయ‌న *స‌మ‌తా వాదాన్ని* కీర్తించడం వ‌ల్ల ప్ర‌యోజ‌నం  ఏమీ ఉండ‌దు.  రామానుజుడి విశిష్టాద్వైతానికి ముందు ఆదిశంక‌రుడి అద్వైతం బ‌లంగా ఉండింది.  *బ్ర‌హ్మ స‌త్యం- జ‌గం మిధ్య* అనేది ఆయ‌న ప్ర‌ధాన సిద్ధాంతం. దీన్నుంచే త‌త్వ‌మ‌సి అనే భావ‌న‌ను తీసుకొచ్చాడు.  ప‌ర‌బ్ర‌హ్మ‌వు నీవే. ఈశ్వ‌రుడు, మాన‌వుడు(ఆత్మ‌) వేరే కాదు. రెండూ ఒక‌టే అనేది అద్వైతం.  జ‌గం మిధ్య అన‌డంలోని అద్వైత మాయావాదాన్ని రామానుజుడు అంగీక‌రించ‌లేదు.