మీరీ పుస్తకం చదివారా ?

ఆమె వొక ఆయుధం.. తన కవిత్వమొక యుద్దమైదానం..

మానవజీవితంలో కవిత్వం ఒక నిరంతరం అన్వేషణ. సమాకాలీన ప్రపంచంలో నిజం ఎక్కడున్నా వెలుగులోకి తెచ్చే ప్రతిస్పందనా సాధనం. ఏ భాషలోనైనా`ఏ ప్రాంతంలోనైనా అది కొనసాగే సంవాదం. ఆకలి` ఆవేదనలను నిర్మోహమాటంగా గుండెల్లోకి పంపించే అక్షర సముదాయం                                                                                                                                                 -అద్దేపల్లి రామ్మోహన్‌ రావు. కవిత్వమే ఆయుధంగా సమాజాన్ని నడిపించాలని అహర్నిశలు కలలు కన్న వాళ్ళలో చాలా మంది ఉంటారు. కొంతమంది బయట ప్రపంచానికి తెలిసి ఉండటమో..తెలియకపోవడమో యాదృచ్చికం. కాని వాళ్లు సృజియించిన అక్షరాలు మాత్రం ఎన్నితరాలు మారినా అవి శాశ్వతంగా ఈ యుద్దమైదానంపై పోరాడుతూనే  ఉంటాయి. అటువంటి పోరాట పటిమ ఉన్న నిండా సామాజిక చైతన్యం కలిగిన కవయిత్రి కొత్త
మీరీ పుస్తకం చదివారా ?

ఫాసిస్టు రుతువులో కవి హత్య

*అత్యంత దుర్భరమైన జైలు జీవితానుభవాల తాకిడిని ఒడిసిపట్టుకొని, తన జీవన దృక్పథపు తెరచాపతో దృఢంగా నిలబడేందుకు చేస్తున్న సాహస ప్రక్రియే ఈ కవిత్వం. వాస్తవికమైన ఉద్వేగాల, విశ్వాసాల, ఆగ్రహావేశాల, కన్నీటి దుఃఖాల కాల్పనిక ప్రపంచమంతా చుట్టి వచ్చి తిరిగి జైలు గది నేల మీది నుంచి కవిత్వాన్ని సమున్నతంగా ఎత్తిపట్టే ప్రక్రియ ఇది. కాల్పనిక రూపం ధరించే మానవ విశ్వాసానికి ఎంత శక్తి వస్తుందో ఈ కవిత్వంలో చూడవచ్చు. కవిత్వమంటే సరిగ్గా ఇదే. అలవిగాని ఒంటరితనాన్ని అనంత మానవ సంబంధాల్లోకి, అతి సున్నితమైన, ఆర్ద్రమైన అనుభూతుల్లోకి, మానవులకు మాత్రమే సాధ్యమయ్యే అనుభవాల్లోకి, అంతకుమించి భవిష్యదాశలోకి మళ్లించడంకంటే కవిత్వానికి అర్థం
మీరీ పుస్తకం చదివారా ?

కాలంఒడిలో కవిత్వ ఉద్యమం

ఉద్యమకారులు గొప్పగా మాట్లాడతారు, కారణం సామాన్య ప్రజాజీవితాలతో మమేకమై తమ జీవనసరళిని కొనసాగిస్తుంటారు. పేదలకోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికోసం, కార్మిక, కర్షక సమస్యల పరిష్కారం కోసం నిరంతరం వొక యుద్దమే చేస్తుంటారు. ఉద్యమకారులకు గొప్పజీవితాలేమీ ఉండవు. ఎక్కడైనా ఉంటారు. ఏదైనా తింటారు. ఉన్నా లేకున్నా ప్రజలకోసమే పరితపిస్తారు. ఈ క్రమంలో ప్రజాపోరాటాలు చేసే ఓ కమూనిస్టుపార్టీ కార్యకర్త, నాయకుడు పోరాటాలు చేయడం వొక కోణమైతే, మరో కోణంలో మనసుచేసిన సంఘర్షణను, మనసుకు కల్గిన బాధను మదిలో పురుడుబోసుకున్న చైతన్యాక్షరాలను కవిత్వంగా రాయడం అరుదుగా కనబడుతుంది. ఈ కవి చేస్తున్నదీ అదే. ప్రసిద్ద రష్యన్‌ కవి మాయాకోవ్‌స్కీ చెప్పిన
మీరీ పుస్తకం చదివారా ?

దళితులంటే అంత చులకనా..?

ఆర్‌యస్‌యస్‌ నిజస్వరూపాన్ని బయటపెట్టిన ఆత్మకథ ఇటీవల విస్తృతంగా చర్చజరుగుతున్న పుస్తకం ‘నేనెందుకు హిందువును కాకుండా పోయాను?’ అని రాజస్థాన్‌కు చెందిన భన్వర్‌ మేఘ్వంశీ ఆత్మకథ రాశారు. ఆ పుస్తకం ముఖచిత్రంలోనే ఆర్‌యస్‌యస్‌ సావాసం పట్టిన ఒక దళితుని ఆత్మకథ అని రాశారు. హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ఈ పుస్తకాన్ని ప్రచురించడంలో చాలా సాహసం చేసిందనే చెప్పాలి. ఈ పుస్తకాన్ని ప్రసిద్ధ అనువాద రచయిత కె.సత్యరంజన్‌ చాలా సహజంగా తెలుగులోనే ఈ పుస్తకం వచ్చిందా అన్నంత గొప్పగా అనువాదం చేశారు. ఈ పుస్తకంలోతుల్లోకి వెళ్ళి ఆర్‌యస్‌యస్‌ ఒక అబద్దాల పుట్టఅని, దేశప్రజల్ని ఎలా మాయచేస్తుందో , కాదు కాదు ఎలా
మీరీ పుస్తకం చదివారా ?

మన కాలానికి లెనిన్

దు:ఖం అమితవేగంతో వీస్తుంది సూర్యుడు ప్రకాశించడు గాలి ప్రపంచమంతా నిద్రలేని బాధాగీతం పాడింది తిరగబడడం తెలిసిన ఆగాలికి కూడా నమ్మసాధ్యం కాలేదు మాస్కోలో ఒక గదిలో విప్లవానికి పుత్రుడూ జనకుడూ ఆయన ఒక వ్యక్తి సమాధిలో ఉన్నాడని.. సమాప్తి..సమాప్తి..సమాప్తి..అంటూ కవిత్వం రాసిన ప్రసిద్ద రష్యన్‌ కవి వ్లదిమీర్‌ మయకోవ్‌స్కీ. ఇది లెనిన్‌ అస్తమించినపుడు తన్నుకొచ్చిన దు:ఖాన్ని కవిత్వంగా రాశాడు, దు:ఖమొక్కటే కాదు..లెనిన్‌ జీవితాన్ని, నాయకత్వాన్ని, ఆచరణాత్మక సామ్యవాదపాలనను, తన కలలరష్యాను కార్మిక కర్షక కాంతుల్ని ఈ కావ్యం నిండా పరిచారు. ఈ వ్లదిమీర్‌ మయకోవ్‌స్కీ రాసిన వ్లదీమిర్‌ ఇల్యీచ్‌ లెనిన్‌ కావ్యం మహాకవి శ్రీశ్రీ అనువదించారు. మయకోవ్‌స్కీ గూర్చి
మీరీ పుస్తకం చదివారా ?

కనిపించని డైరీలో కవిత్వపు అంతరంగం

"ఇక మాటలు అనవసరం. కార్యశూరత్వం చూపాలి. సమాజం కోసం విప్లవాత్మక దృక్ఫథంతో రచనలు చేయాలి"-మహాకవి శ్రీశ్రీ(ఖమ్మంలో 8`10`1970న విరసం తొలిమహాసభల సందర్భంగా నిర్వహించిన ప్రతినిధుల సభలో..) నేటితరం కవులు అనివార్యంగా వర్తమాన సమాజంలో జరుగుతున్న అన్యాయాలూ, ఆక్రంధనలు, అత్యాచారాలులాంటి ఘటనలే కాక ప్రతీ సామాజిక దురాగతాలు, అసమానతలూ, దోపిడీ, ప్రపంచీకరణ, కార్పోరేటీకరణ లాంటి ప్రతి దుర్మార్గాన్ని ఎండగడుతూ కలమెత్తుతున్నారు. సామాజిక మాధ్యమాలొచ్చాక కవిత్వపు కాన్వాసు మరింత విశాలంగా మారింది. ఎలా రాస్తున్నారనో ఏం రాస్తున్నారనో విషయాన్ని ఆలోచిస్తే ఖచ్చితంగా సమాజం గూర్చైతే ఆలోచిస్తున్నారు. ఇటీవం కవిత్వంలోకి  మహిళలు వరదలా వస్తున్నారు..ఇది గొప్ప పరిణామం..అలా అనుకుంటున్న క్రమంలో ‘‘ నాడైరీ
మీరీ పుస్తకం చదివారా ?

ఇంకెన్నాళ్ళీ యుద్ధం?

“నీ దేవుడైన  యెహోవా నీ కనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు, నీ తండ్రిని, నీ తల్లిని సన్మానింపుము., నరహత్య చేయకూడదు. వ్యభిచరింపకూడదు. దొంగిలకూడదు. నీ పొరుగువాని మీద అబధ్ధ సాక్ష్యము చెప్పకూడదు. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగు వాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని యెద్దునైనను, అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు.’’ (బైబిల్‌ లోని పాత నిబంధన  గ్రంథం నిర్గమకాండము 20వ అధ్యాయం 12వ వచనం నుండి 17 వరకు) ఈ మాటలు ఇజ్రాయల్‌ ప్రజలొక్కటే కాదు, బైబిల్‌ను బలంగా నమ్మే నేతలకు తెలీదా? పైన పేర్కొన్న బైబిల్‌ వాక్యాలకు
మీరీ పుస్తకం చదివారా ?

నెత్తుటితో తడుస్తున్న నేల గురించి

‘మనిషే మనిషిని చంపుకు తినే ఈ లోకం ఎంతకాలం మనగలదు’ ‘మూర్ఖుడా యుద్దాతో దేశాల్ని కొల్లగొట్టగలవేమో సరిహద్దుల్ని జరపగలవేమో మహా అయితే ఇంకో విస్తీర్ణాన్ని నీ కాలి కింద తొక్కి పట్టగలవ్‌ జనం హృదయాలనైతే గెలవలేవు’ ‘ప్రేమను పంచడం కంటే మరో మతం లేదు’ ‘చివరగా యుద్దం సమస్త జీవరాశిని చంపుతుంది’ ...ఇటువంటి కవితావాక్యాలతో పాలస్తీనా`ఇజ్రాయిల్‌  యుద్దానికి వ్యతిరేకంగా..సామ్రాజ్యవాదాన్ని నిరసిస్తూ వచ్చిన కవిత్వమే ఈ గాజాలేని జాగా..ఇప్పుడు దేశాలకు దేశాలు శ్మశానాలౌతున్నాయి. నిత్యం నెత్తుటితో తడుస్తున్నాయి. గాయపడ్డ నేల కాదది..చంపబడ్డ నేల..చెరచబడ్డ నేల..పసికందులని కనికరం లేకుండా బుల్లెట్ల వర్షం కురుస్తున్న నేల..ఇప్పటికీ ఎటుచూసినా దేహాన్ని తెంచుకుని విసిరేయబడ్డ అవయవాలు,
ఈబుక్స్ మీరీ పుస్తకం చదివారా ?

మీరీ పుస్త‌కం చ‌దివారా?

ఈ పుస్త‌కం మీ కోసం. దేశంలో ఉత్ప‌త్తి సంబంధాల తీరును అర్థం చేసుకోడానికి ఈ పుస్త‌కం ఉప‌క‌రిస్తుంద‌ని మీకు అందిస్తున్నాం. చ‌ద‌వండి.. చ‌ర్చించండి. భారతదేశంలో వ్యవసాయంలో పెట్టుబడిదారీ సంబంధాలు వృద్ధి అయి పెట్టుబడిదారీ విధానంగా మారిందని, అయితే ఈ మార్చు సంప్రదాయ (క్లాసికల్‌) రూపంలో కాకుండా ఈ దేశ విశిష్ట లక్షణాలపై ఆధారపడి మాత్రమే పెట్టుబడిదారీ విధానం అభివృద్ధిని చూడాలని కొంతమంది వాదిస్తున్నారు. బ్రిటన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, జపాన్‌, చివరకు రష్యా దేశాలలో ఇలాగే జరిగాయని చారిత్రక ఉదాహరణలు చూపెడుతున్నారు. నేడు అర్ధ వలస, అర్ధభూస్వామ్య విధానంలో సామ్రాజ్యవాదుల అదుపాజ్ఞలలో దేశంలో పెట్టుబడిదారీ విధానం వృద్ధి కావడం సాధ్యం
ఈబుక్స్ మీరీ పుస్తకం చదివారా ?

మీరీ పుస్తకం చదివారా ?

సుప్ర‌సిద్ధ మార్క్సిస్టు లెనినిస్టు మేధావి సునీతికుమార్ ఘోష్ రాసిన పుస్త‌కం *భార‌త బ‌డా బూర్జువా వ‌ర్గం.పుట్టుక -పెరుగుద‌ల‌-స్వ‌భావం*.  ఈ పుస్త‌కం తెలుగు అనువాదం పిడిఎఫ్ మీ కోసం. విప్ల‌వాభిమానులు, కార్య‌క‌ర్త‌లు, రాజ‌కీయ అర్థ శాస్త్ర విద్యార్థులు త‌ప్ప‌క చ‌ద‌వాల్పిన పుస్త‌కం ఇది. కా. సునీతి దీన్ని 1985లో రాశారు. 2012లో మ‌రింత తాజా స‌మాచారంతో రెండో కూర్పు విడుద‌ల చేశారు. దానికి ఆయ‌న ఒక సుదీర్ఘ‌మైన ముందుమాట రాశారు. ఇప్ప‌డు మీకు అందిస్తున్న‌ది ఆ ముందుమాటే. కా. ఆశాల‌త ఈ పుస్త‌కాన్నిచ‌క్క‌గా తెలుగులోకి అనువ‌దించారు. 2018లో విప్ల‌వ ర‌చ‌యితల సంఘం  ప్ర‌చురించింది. దేశంలో ఉత్ప‌త్తి సంబంధాలు, భార‌త బూర్జువా వ‌ర్గ స్వ‌భావం,  విప్ల‌వ ద‌శ