వ్యాసాలు

సవర్ణ ఫాసిస్టుల దుశ్చర్యలకు వ్యతిరేకంగాబహుజనులు మేల్కోవాలి

దళిత బహుజన విద్యార్ధుల పై ఉన్నత విద్యా సంస్థలలో అమలు జరుగుతున్న కుల వివక్షను నిర్మూలించి సమానత్వ భావనలు నెలకొల్పడానికి బహుజనులు, ప్రజాస్వామికవాదులు చేసిన నిరంతర పోరాటాల ఫలితంగా దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ విద్యా కమిటీ చేసిన సిఫార్సులను ఆధారం చేసుకుని ఇంతకు ముందు యూజిసి వివక్ష పరిధిలో ఉన్న ఎస్సి,ఎస్టీలతో పాటు ఓబిసిలను కూడా ఈ సిఫార్సుల పరిధిలోకి చేర్చారు.ఒకప్పుడు దళిత బహుజనులకు విద్య నిషేదించిన మనువాద అగ్రవర్ణాలు నేడు రాజ్యాంగం ప్రకారం లభించిన రిజర్వేషన్ల ద్వారా ఉన్నత విద్యా సంస్థల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్ధుల పట్ల అగ్రవర్ణాల విద్యార్ధులు,అధ్యాపకులు చూపుతున్న వివక్ష,వేదింపులు,దాడులు నిరంతరం జరుగుతూ,ఏటేటా
వ్యాసాలు

యు జి సి నిబంధనలు-కులవివక్ష: సుప్రీం కోర్టు దృక్కోణం

ఉన్నత విద్యాసంస్థలలో కులవివక్షతను రూపుమాపేందుకై  యుజిసి ఈ  జనవరి 14 న నియమ నిబంధనల విడుదల చేసింది. పై  వాటిపై ఉన్నత కులాలనే వారినుండి తీవ్రమైన నిరసనలు వెల్లువెత్తాయి. అవి కేంద్రప్రభుత్వాన్ని ఇబ్బందులలో పెడుతాయని మనలాంటి వారు భావించినా, వాస్తవంలో అవి మోడీ, షా రాజకీయ ఎత్తుగడలలో భాగమని చెప్పక తప్పదు. గతంలో, 1990 లో మండల్ నివేదికకు వ్య‌తిరేకంగా అగ్రవర్ణ విద్యార్థులురోడ్డు ఎక్కిన విషయం విదితమే.  నాడు వి. పి . సింగ్,  తన పదవిని కోల్పోయేoదుకు సిద్ధమై వాటిని అమలుచేయడం, ఆ తర్వాత కమండల్ ఉద్యమం మొదలు కావడమూ మనకు తెలిసిందే. అయితే, ఇప్పుడు మోదీ,
వ్యాసాలు

పుస్తకం వల్లనే చాలా మారాను…

1. మీకు పుస్తకాలు ఎలా ఎప్పుడు ఎక్కడ ఎవరి ద్వారా పరిచయం అయ్యాయి? జ.పాఠశాల స్థాయి నుంచే తెలుగు మీద మమకారం పెంచుకున్నాను.1992 ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో మా రెండో అన్న హుస్సేన్ భావకవిత్వం రాసేవాడు. మా వాడి కవిత్వం రహస్యంగా చదివేవాడిని. సాహిత్యం అంటే ఏమో తెలుసుకోవాలనిపించింది. మా తెలుగు లెక్చరర్ ను అడిగితే బైపీసీ వాడికి తెలుగు సాహిత్యం తో ఏం పని అన్నారు. నీకు అభిలాష ఉంటే పుస్తకాలు బయట అద్దెకు దొరుకుతాయి అవి చదువు అన్నారు. ఇక అదే సందర్భంలో ఆదోనిలో పుస్తకాలు అద్దెకు తెచ్చుకుని చదివేవాడిని.. మొదట ఫిక్షన్, కొమ్మనాపల్లి గణపతిరావు,
వ్యాసాలు

నవతగా సులోచన

(భారత విప్లవోద్యమంలో అత్యుత్తమ విప్లవకారిణి కా. నవత అమరత్వం తర్వాత 2016 జులై లో అమరుల బంధుమిత్రుల సంఘం ప్రచురించిన పుస్తకానికి రాసిన ముందుమాట ఇది. మొదట ఈ పుస్తకం పేరు ఆదర్శవీర వనిత కామ్రేడ్ నవత. అచ్చుకు వెళ్లే క్షణాన కామ్రేడ్ అమ్మగా మారింది. ఫిబ్రవరి 5వ తేదీ గడ్చిరోలీలో జరిగిన దాడిలో నవత జీవన సహచరుడు కా. ప్రభాకర్ అలియాస్ పడ్కల్ స్వామి అమరుడయ్యాడు. ఆ ఇద్దరి స్మృతిలో ఈ వ్యాసం పునర్ముద్రణ ..వసంతమేఘం టీం) ఆరోజు కామారెడ్డిలో బస్సు దిగే సరికి ఉదయం పది గంటలైంది. అక్కడి విలేఖర్లకు ఫోన్ చేసి సంగోజివాడికి ఎలా
వ్యాసాలు

కామ్రేడ్ నవతా!

(ఫిబ్ర‌వ‌రి 5వ తేదీ గ‌డ్చిరోలీలో జ‌రిగిన దాడిలో అమ‌రుడైన కా.ప్ర‌భాక‌ర్ అలియాస్ ప‌డ్క‌ల్ స్వామి  2016లో త‌న జీవ‌న స‌హ‌చ‌రి కా.సులోచ‌న అలియాస్ న‌వ‌త అమ‌ర‌త్వ సంద‌ర్భంగా రాసిన వ్యాసం ఇది. అప్ప‌ట్లో అమ‌రుల బంధుమిత్రుల సంఘం ప్ర‌చురించిన పుస్త‌కంలో ఇది అచ్చ‌యింది. మొద‌ట ఈ పుస్త‌కం పేరు ఆద‌ర్శ‌వీర వ‌నిత కామ్రేడ్ న‌వ‌త‌. అచ్చుకు వెళ్లే క్ష‌ణాన కామ్రేడ్ అమ్మ‌గా మారింది. కా.ప్ర‌భాక‌ర్  స్మృతిలో ఈ వ్యాసం పున‌ర్ముద్ర‌ణ.. వ‌సంత‌మేఘం టీం) నిన్ను, మన పిల్లల్ని కలుసుకోవడానికి ఈ మధ్య కాలంలో ఉద్యమ అవసరాల రిత్యా కొంత లేటయినా చివరికి మనందరిని కలుసుకొమ్మని మనకు ఓ మంచి అవకాశం పార్టీ
వ్యాసాలు

భావ‌జాల, సాంస్కృతిక రంగాల్లో వ‌ర్గపోరాటం

(జ‌న‌వ‌రి 24, 25 తేదీల్లో జ‌రిగిన విర‌సం 30 మ‌హా స‌భ‌ల కీల‌క ప‌త్రంలోంచి కొన్ని భాగాలు- వ‌సంత‌మేఘం టీం) ఉపోద్ఘాతం: విరసం ముప్పైవ మహా సభలకు హాజరైన కామ్రేడ్స్‌కు విప్లవాభివందనాలు. మార్క్సిజం లెనినిజం మావోయిజం   మార్గదర్శకంగా విప్లవ సాహిత్య, భావజాల, సాంస్కృతికోద్య‌మాల‌ను నిర్వహిస్తున్న విరసం ఈ మహా సభల ఇతివృత్తంగా వర్గపోరాటాన్ని ఎంచుకున్నది. వర్గపోరాటం చరిత్ర నియమమే అయినా అది నిర్దిష్ట స్థల కాలాల్లో కొనసాగుతూ ఉంటుంది. నక్సల్బరీతో మొదలైన విప్లవోద్యమ చరిత్రలోని అనుకూల, ప్రతికూల సందర్భాలన్నిటినీ విరసం తన ప్రాపంచిక దృక్పథంతో వర్గపోరాటం గీటురాయి మీద విశ్లేషిస్తూ వచ్చింది. అట్లాగే ప్రస్తుత విప్లవోద్యమ సంక్షోభాన్ని అర్థం
వ్యాసాలు

న్యాయమైన వేతనం కోసం విచారణ ఖైదీ పోరాటం

ఖైదీల రోజువారీ వేతనాల్లో రాష్ట్ర ప్రభుత్వం భారీ సవరణను ప్రకటించినప్పుడు .. నైపుణ్యం కలిగిన పనులకు రూ. 620, పాక్షిక నైపుణ్యం కలిగిన పనులకు రూ. 560, నైపుణ్యం లేని పనులకు రూ. 530 గా నిర్ణయించింది. జైలు గోడల వెనుక సంస్కరణలను ప్రోత్సహించడమూ; శ్రమ గౌరవాన్ని పెంపొందించడమూ ఈ చర్య ఉద్దేశ్యంగా భావించారు. అయితే, ఒకప్పుడు విచారణా ఖైదీగా రోజుకు రూ. 20 కంటే తక్కువ వేతనం పొందిన టి.కె. రాజీవన్ వంటి వారికి, ఈ వార్త ఒక పరాకాష్టగా, చేదు వ్యంగ్యంగా అనిపించింది. ఎడక్కర మావోయిస్టు కేసులో ఐదవ నిందితుడిగా ఉన్న రాజీవన్, ఒకప్పుడు అమల్లో
వ్యాసాలు

ప్ర‌మాద‌క‌ర‌మైన వికసిత్ భారత్

1947 అధికార మార్పిడి జరిగిన తర్వాత సుమారు 8 దశాబ్దాల గణతంత్ర రాజ్యంలో సుమారుగా 58 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, 21 సంవత్సరాలు కాంగ్రేసేతర పార్టీల కూటములు  భారతదేశంలో అధికారాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో ఆర్ఎస్ఎస్ భావజాల బిజెపి కూటమి 18 సంవత్సరాలు పాలన సాగిస్తూ నేడు వారే అధికారంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పంచవర్ష ప్రణాళికలు, జమీందారీ వ్యవస్థ రద్దు, బ్యాంకుల జాతీయకరణ, సంస్థానాల విలీనం, భూ సంస్కరణలు, గరీబీ హటావో మొదలగు వాటిని చేపట్టడం జరిగింది. అంతేకాకుండా సాగునీటి ప్రాజెక్టులు, ప్రభుత్వ రంగ పరిశ్రమలను ఏర్పాటు చేయడం జరిగింది.1975 ఎమర్జెన్సీ తదనంతర  పరిణామాలలో ముఖ్యంగా 
వ్యాసాలు

లొంగిపోయినా త‌ప్ప‌ని దాడులు,  దర్యాఫ్తులు  

Figure 1 ఉపర్పరలోని భీమా మాద్వి ఇంటి బయట రేఖపల్లి వాసులు డిసెంబర్ 4న, రేఖపల్లి గ్రామంలో భద్రతా బలగాలు తీసుకువెళ్తున్నప్పుడు భీమా మాడ్వీని అతని కుటుంబ సభ్యులు చివరిసారిగా చూశారు. మూడు రోజుల తర్వాత, వాట్టేవాగు దగ్గర ఉన్న  సెక్యూరిటీ క్యాంపులో ఒక మంచంపైన చనిపోయి ఉండటాన్ని అతని బంధువు సుక్రామ్ మాడ్వీ గమనించాడు. 46 ఏళ్ల భీమా ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు అంటున్నారు. అయితే, భద్రతా బలగాలు కొట్టి చంపి ఉంటాయని  అతని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా, ఉసూర్ బ్లాక్‌లో ఉన్న రేఖపల్లి, వాట్టేవాగు గ్రామాల మధ్య  సుమారు మూడు కిలోమీటర్ల
వ్యాసాలు

నా జీవితానికి దారి దీపాలు – రాఘ‌వ‌

బాగా రాసే వారు కాదు, బాగా చదివేవారే బాగా లోతుగా విశ్లేషణాత్మకంగా మాట్లాడగలుగుతారు. బాగా చదివే వారే బాగా రాయగలుగుతారు. మంచి పుస్తకం మనిషి నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతుంది. కొత్త చూపునిస్తుంది కొత్త ఆలోచనలను ఇస్తుంది ,ఆచరణ దిశగా చైతన్యవంతంగా నడిపిస్తుంది. మంచి పుస్తకం మాట్లాడుతుంది. మాట్లాడనిస్తుంది. అక్షరానికి గొంతు నిస్తుంది. * తెలుగు సమాజాలకు అవసరమైన ఎన్నో విలువైన వ్యాసాలను తెలుగులో నేరుగాను ,అనువాదం ద్వారానూ అందిస్తున్న రాఘవ కొత్త పుస్తకం 'ప్రశ్నించే గొంతులు'. ఈ పుస్తకం సోమవారం తిరుపతిలో ఆవిష్కరించబడుతుంది.  'మాట్లాడే పుస్తకాలు శీర్షికన'  పుస్తకాల గురించి తన అభిప్రాయాలను వసంతమేఘం కోసం అందించారు రాఘవ.