వ్యాసాలు

సామ్రాజ్యవాద శిబిరాల మధ్య ప్రపంచ మార్కెట్ల పునర్విభజన కోసమే యుద్ధం

ప్రపంచ మార్కెట్లోకి రష్యాని ప్రవేశించకుండా; దానిని ప్రపంచాధిపత్య పోటీదారుడిగా నిలిచే అవకాశం ఇవ్వకుండా;  పాత యూరోప్ దేశాలతో దాని పాత శత్రుత్వం తగ్గే స్థితిని రానివ్వకుండా; ఆఫ్ఘనిస్తాన్ నుండి సైనిక ఉపసంహరణ తర్వాత తన వెనకంజ స్థితిని బలహీనతగా తీసుకునే అవకాశాన్ని కూడా దానికి ఇవ్వకుండా ఇటీవల అమెరికా శరవేగంతో చేపట్టిన వ్యూహాత్మక చర్యలు బెడిసికొట్టాయి. హిరోషిమా, నాగసాకి అణు మారణహోమంతో ప్రారంభమై, ఏడున్నర దశాబ్దాల పైబడి పొందిన  అమెరికా ప్రపంచాధిపత్య రాజనీతి ఉక్రెయిన్ వద్ద గాలిలో కలిసిపోయింది. ఇది ప్రపంచ బలాబలాల పొందికలో వస్తున్న గుణాత్మక మార్పుల్ని సూచించే సంఘటనగా చరిత్రలో నిలుస్తుంది. ఇదేదో ఉక్రెయిన్ కి
వ్యాసాలు

నిషేధం ఎత్తివేత రైతుల ఆత్మహత్యల నివారణకు తోడ్పడుతుంది

(2004 అక్టోబ‌ర్ 15 నుంచి19 దాకా అప్ప‌టి రాష్ట్ర ప్ర‌భుత్వానికి, రెండు విప్ల‌వ పార్టీల‌కు మ‌ధ్య శాంతి చ‌ర్చ‌లు జ‌రిగాయి. దానికి స‌న్నాహంగా తెలుగు స‌మాజాల్లో ఒక గొప్ప భావ సంఘ‌ర్ష‌ణ జ‌రిగింది. ఈ మొత్తానికి విప్ల‌వోద్య‌మం వైపు నుంచి కా. ఆర్‌కె నాయ‌క‌త్వం వ‌హించాడు.  శాంతి చ‌ర్చ‌ల  నేప‌థ్యంలో  2004 జూలై నుంచి న‌డిచిన *చ‌ర్చ ఫ‌ర్ డెమోక్ర‌టిక్ స్పేస్* ప‌త్రిక బులెటిన్‌2(జూలై 25)లో ఆర్‌కె రాసిన వ్యాసం ఇది. పాఠ‌కుల కోసం పున‌ర్ముద్రిస్తున్నాం- వ‌సంత‌మేఘం టీం) ఈ వాదన కొందరికి ఆశ్చర్యంగానూ, అతిశయోక్తిగాను అనిపించవచ్చు. కాని, సామాజిక రుగ్మతలను, అసమానతలను, అన్యాయాలను రూపుమాపడంలో ప్రజలు ఎదుర్కొంటున్న
వ్యాసాలు

గాజాలో ఇజ్రాయెల్‌ నరమేథం

ఆధునిక చరిత్రలో ఒక దేశాన్ని మరోదేశం దురాక్రమించడం లేదా వలసగా మార్చుకోవడం చూశాం. కాని అత్యధిక ప్రపంచ దేశాలచే గుర్తించబడి, చారెడు నేలకు నోచుకోక పోవడమనే దుస్థితి ఊహకందని విషయం. అదోక వాస్తవమై పాలస్తీనాగా మన కళ్లముందు కనిపిస్తోంది. పాలస్తీనా ఐరాస సభ్యదేశం, అలీన దేశాలలో గుర్తింపు పొందిన దేశం. ఆ దేశానికి రాజధాని లేదు. దాని పాలనలో ఉన్న ప్రజలు ఒకచోట లేరు. పాలస్తీనా వెలుపల (40 లక్షలు) సగం మంది కాందీశీకులుగా ఉన్నారు. ఇది ఒక భయంకర పరిస్థితి, దీని చరిత్ర అంతా పోరాటాల, త్యాగాల, రక్తసిక్త చరిత్ర. తమ మాతృభూమి కోసం 75 ఏండ్లుగా
వ్యాసాలు

Should we not think of these Encounters?

Police informed the public that as many as 12 people were killed in an encounter that was said to have happened in the Pidia forests in Bijapur district on 10th May. A T V channel broadcasted excitedly that it was most likely that there were important Maoist leaders among those 12 dead people. It also conveyed the news that the SP’s of Bijapur, Dantewada and Sukuma districts were personally monitoring
వ్యాసాలు

మీ ఇంటిపైనే ఎందుకు దాడి చేశారు.. మా ఇంటిపై ఎందుకు చేయలేదు?

సెప్టెంబరు 5న మా ఇంటితో పాటు ఎనిమిది చోట్ల ఎన్‌ఐఏ దాడులు చేసిన తర్వాత.. ‘మీ ఇంటిపైనే ఎందుకు దాడులు చేశారు.. మా ఇంటిపై ఎందుకు దాడి చేయలేదు?” అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ముందుగా, ఈరోజు మేం పడుతున్న మానసిక వేదన మరెవరికీ రాకూడదని కోరుకుంటున్నామని చెప్పాలి. అయితే, అది మన యిష్టాయిష్టాలపై  ఆధారపడి ఉండదు. కానీ ఎవరైనా ముస్లింలని అరెస్టు చేసినప్పుడు లేదా వారి యింటిపై దాడి జరిగినప్పుడు, సాధారణంగా ముస్లింలు మీ యింటి మీదనే ఎందుకు దాడి చేశారు అని ప్రశ్నించరు. సూరత్‌లో అరెస్టయిన ముస్లింలను నిర్దోషులుగా జైలు నుంచి విడుదల చేసిన తర్వాత ప్రముఖ
వ్యాసాలు

ఎవరిపై పోరాడుతున్నారో తెలుసుకోండి

పోలీసు, అర్ధ సైనిక, సైనిక జవాన్ లారా! భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) గత 50 సంవత్సరాలకు పైగా మన దేశంలో విప్లవోద్యమాన్ని నిర్మిస్తోంది. భారత విప్లవోద్యమాన్ని నిర్మూలించడానికి మిమ్మల్ని పెద్ద సంఖ్యలో పాలకులు మోహరిస్తున్నారు. ఇప్పటికే దేశానికి ఉత్తరాన కశ్మీర్ లో, ఈశాన్యాన అసోం నుండి అరుణాచల్ ప్రదేశ్ ల వరకు లక్షల సంఖ్యలో మిమ్మల్ని మోహరించారు. మధ్య, తూర్పు భారత రాష్ట్రాలలో మీరు ఆరు లక్షలకు పైగానే మోహరించబడి ఉన్నారు. ఇటీవల 2019 డిసెంబర్ లో జాతీయ భద్రతా సలహాదారు విజయకుమార్ నాయకత్వంలో జరిగిన ఐదు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారుల సమావేశంలో నూతనంగా విప్లవోద్యమం నిర్మూలనకు
వ్యాసాలు

గనుల తవ్వకాన్ని వ్యతిరేకించినందుకు ..

గడ్‌చిరోలిలో గనుల తవ్వకానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన నేతలు వేధింపులు, బెదిరింపులకు గురయ్యారు. వారికి మావోయిస్టులు మద్దతు ఇస్తున్నారని ఆరోపిస్తూ పలువురు నిరసనకారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. తోడ్‌గట్టకు వెళ్ళే దారి సుదీర్ఘమైన, రాళ్ళు రప్పలతో, మలుపులతో వుంటుంది. ఈ గ్రామం మహారాష్ట్రలోని గడ్‌చిరోలి జిల్లాలోని ఏటపల్లి తాలూకాలో ఛత్తీస్‌గఢ్ సరిహద్దుకు దగ్గరగా ఉంది. గడ్‌చిరోలి పట్టణం నుంచి తోడ్‌గట్ట వరకు కారులో వెళ్లదగిన మార్గం గూగుల్ మ్యాప్‌లో కనిపించలేదు. ఆగష్టు 27 నాడు మధ్యాహ్నం సుమారు 150 కిలోమీటర్లు కారులో ప్రయాణించడానికి మాకు ఆరు గంటలు పట్టింది. ఏటపల్లి పట్టణం దాటిన తరువాత ఇరుకైన 
వ్యాసాలు

హిడ్మే మర్కం అక్రమ అరెస్టును ఖండిద్దాం!

హిడ్మే మర్కంను వెంటనే విడుదల చేయాలీ! చత్తిస్‌ఘఢ్‌లో పౌర హక్కుల కార్యకర్తలపై వేధింపులను ఆపాలి! మార్చి 9, 2021 ఛత్తీస్‌‌ఘఢ్ పోలీసులు, పారా మిలటరీ దళాలు అదుపులోకి తీసుకుని శారీరక, లైంగిక హింసలకు గురిచేయడంతో ఆత్మహత్య చేసుకొన్న కావ్య నంది, పండే కవాసీ అనే యిద్దరు ఆదివాసీ యువతుల స్మృతిలో దంతేవాడ, సమేలిలో జరుగుతున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంనుంచి 28 ఏళ్ల ఖనిజ తవ్వకాల వ్యతిరేక, ఆదివాసీ హక్కుల కార్యకర్త హిడ్మే మార్కమ్‌ను నిస్సిగ్గుగా, చట్టవిరుద్ధమైన తీరులో ఎత్తుకెళ్లిన ఘటన మమ్మల్ని దిగ్భ్రాంతుల్ని చేసింది. ఆ తరువాత హిడ్మే మార్కంను, (d/o పోడియం మార్కం, బుర్గం గ్రామం,
వ్యాసాలు

కృష్ణా జలాల పంపిణీ, పునః పంపిణీ సాధిద్దాం 

ఎంత  పెద్ద సమస్యయినా, ఎంత చిన్న సమస్యయినా పంపిణీ దగ్గర బిగుసుకు పోతున్నాయి. ఆ సమస్య తెగకుండా అనేక ఉచ్చులు బిగించటంలో ఎవరి మానాన వారు వాద ప్రతివాదాలు తీవ్రం చేస్తూనే ఉంటారు. ఈ నాలుగు దశాబ్దాలుగా కృష్ణానదీ జలాల పంపిణీకి, పున:పంపిణీకి సంబంధించి అనేకానేక చిత్రవిచిత్ర వాదనలు వినవలసి వచ్చింది. ఆ సంభాషణలో  ఘర్షణలో చిన్నచిన్న మెట్లుగా సమస్య పరిష్కారం వైపు ముందడుగు వేస్తూ వచ్చింది కానీ ఓ కొలిక్యిరాలేదు. రాలేదు అనేకంటే పట్టించుకోగల బాధ్యత ఉన్నవారు రానీయలేదు అనటమే సరిగా ఉంటుంది. కృష్ణానది నీళ్ళ విషయంలో అన్ని వనరుల సంపదల పంపిణీల చర్చ సందర్బం కాదు
వ్యాసాలు

కథలవనం ఎండిపోయింది..

ఆకులన్నీ రాలి మోడై ఎండిన కథల చెట్టు కూలిపోయిన వర్తమాన స్థితి కనబడుతుంది. రాయలసీమలోకథల పెద్దోళ్ళలో.. బహుశా ఆధునిక కథను వొడిసిపట్టుకుని దాంతోనే నాలుగైదు దశాబ్ధాలు సాహచర్యంచేసిన కథల రారాజు అస్తమించిన దుఃఖ సందర్భమిది. ఆయన గూర్చి మాట్లాడ్డమంటే మానవీయ విలువలగూర్చి మాట్లాడటమే. సింగమనేని నారాయణ అసలు సిసలైన మార్క్సిస్టు కథకుడు. నిఖార్సైన భావజాలంతోజీవించినవాడు. కథల కార్థానాలోనే జీవితఖైదీగా బతికినవాడు. ఎవరేకథ రాసినా ఆ కథను అసాంతం చదివిఆ కథపై నాలుగుమాటలు మాట్లాడి కథకుడిని ఉత్సాహ పరిచే సాహిత్య సంస్కారమున్నవాడు. రాయలసీమకథను కథల ప్రపంచంలో అగ్రభాగాన నిలిపిన కథకుడు. ఆయన రాయని కథావస్తువు మిగల్లేదు. ఇదిరాయలేదనడానికి వీల్లేని వస్తువులన్నింటిని