స్పందన

శాంతి కోసం పౌర సమాజ ప్రతినిధులు

తెలంగాణలో కాల్పుల విరమణ ప్రకటించి,  మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కోరుతూ  దాదాపు 7500 మంది సంతకాలు చేశారు. అందులో కొందరి  పేర్లు కింద ఇస్తున్నాం 1)  ప్రొ. హరగోపాల్‌               2)  జస్టిస్‌ చంద్ర కుమార్‌ 3) ప్రొ. డి. నర్సింహా రెడ్డి 4)  ప్రొ. ఘంటా చక్రపాణి, వైస్‌ ఛాన్స్‌లర్‌, అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ 5)  కె. శివారెడ్డి, కవి 6)  కె. శ్రీనివాసరెడ్డి, మీడియా అకాడమీ చైర్మెన్‌, తెలంగాణ 7)  అల్లం నారాయణ, మాజీ సంపాదకుడు, నమస్తే తెలంగాణ, మీడియా అకాడమీ మాజీ చైర్మెన్‌ 8)  కె. శ్రీనివాస్‌, మాజీ సంపాదకుడు, ఆంధ్రజ్యోతి 9)  పాశం
స్పందన

గడ్చిరోలి లేఖ – ఆగని మారణకాండ శాంతి చర్చల ఆవశ్యకత

ఆదివాసి హక్కుల ఐక్యవేదిక 24 ఆగస్టున వరంగల్‌లో తలపెట్టిన శాంతి చర్చల సభ పోలీసుల అనుమతి లేక ఆగిపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఆశాభంగము అయ్యింది. అంత విస్తృతమైన ప్రచారం జరిగి సభ జరగకపోవడమే రెండు తీర్ల భావనకు కారణమైంది. కొంతకాలం క్రితం కాకతీయ యూనివర్సిటీలో పిడిఎస్‌యు విద్యార్థులు తలపెట్టిన శాంతి చర్చల సదస్సును కూడా పోలీసులు జరగనివ్వలేదు. ఇది వరంగల్‌ మీద కేంద్రీకరించిన పోలీసులు అతి జాగ్రత్తనా, రాష్ట్రవ్యాప్త హక్కుల హననానికి దారితీస్తుందా. పర్యావరణ విధ్వంసం వల్ల కురుస్తున్న వానల్లో కకావికలమవుతున్న తెలంగాణ ప్రజలు ఇటువంటి స్థితి గురించి స్థిమితంగా ఆలోచించే స్థితి లేకపోవచ్చు గాని అందువల్ల శాంతి
స్పందన

జైల్లో ప్రతి రోజూ స్వేచ్ఛను కోల్పోవడమే

యాపిల్స్, హై స్ట్రీట్, హల్‌బెర్టన్, టివర్టన్ ఎక్స్ 16, 7AWఎడబ్ల్యు, యు కె టెర్రీయాండ్ హెడర్ @హాట్ మెయిల్.కొ.యుకె 13 మార్చి 2025 ప్రియమైన ...... మానవహక్కులను కాపాడుకోవడానికి ఇతరులు చేసే కృషికి మీరు ఎంత అందగా ఉంటారో తెలిసిన ఒక మిత్రుల బృందం మాది. మీ వంటి పరిస్థితిలోనే ఉన్న ఎవరో ఒకరు రాసిన కవితా మాకు సవాల్ విసిరింది. ఇక్కడ ఇంగ్లాండులో ఇప్పుడు వసంతం. కొన్ని వేళల్లో సూర్యుడు ప్రకాశిస్తాడు. గ్రామీణ ప్రాంతాల్లో పుష్పాలు కాంతివంతంగా వికసించడం ప్రారంభమైంది. మీకు, మీరు సమర్థిస్తున్నవారికి కొంత ఆశ చేకూరి ఉంటుందని మేం ఆశిస్తున్నాం. దృఢంగా ఉండండి.  నా,
స్పందన

1844 ఆర్ధిక, తాత్విక రాతప్రతుల గురించి

   కారల్ మార్క్స్  రచన ఇటీవల తెలుగు అనువాదమైంది. 1844 ఆర్థిక, తాత్విక రాత ప్రతులు. 1932లో జర్మనీలో వెలువడిన ఈ పుస్తకం తెలుగులో సమగ్రంగా రావడం ఇదే మొదటిసారి. పీకాక్ ప్రచురించిన రాత ప్రతులు సమగ్రం కాదు. మార్క్స్ తన ఇరవై నాల్గవ ఏట యవ్వనకాలంలో తన ముందు తరపు తాత్విక రచయితల నుండి అనుభవ సారం నుండి తనని తాను రూపొందించుకున్నాడు. కారల్  తర్వాత రచనలకు ఆర్థిక, తాత్విక రాత పతులు బీజం వేశాయి.దాదాపు నూరేళ్ల తర్వాత తెలుగులో వచ్చిన రచనకు ప్రాసంగిత ఏమిటి?  యువ మార్క్స్ గా ఉన్నప్పుడు  అధ్యయనం చేసిన అంశాలు తన
స్పందన

నాకు నచ్చిన శికారి

పాణి రాసిన శికారి నవలలో నన్ను అమితంగా మెప్పించిన పాత్ర, నాకు నచ్చిన పాత్ర గుమ్లి. ఏ వర్గంలో అయినా స్త్రీలు సమాజ కట్టుబాట్లకు తల వంచక తప్పదేమో అని గుమ్లి పాత్ర ద్వారా నాకు అనిపించింది. భర్త ఎలాంటి వాడైనా పిల్లల కోసం స్త్రీ జీవన పోరాటం చేయక తప్పడం లేదు. ఇది  ఈ సమాజంలో స్త్రీల స్థానాన్ని తెలియజేస్తుంది. గుమ్లి భర్త డొక్కోడు రెండో పెళ్లికి చెల్లించే కట్నం కూడా తానే ఇవ్వాల్సి వస్తుందేమో అని ఆమె అనుకుంటుంది. అప్పుడు భర్త రెండో పెళ్లికంటే దానికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వాల్సి వస్తుందనుకున్నప్పుడు గుమ్లి పడిన
స్పందన

ఐదు దశాబ్దాల విప్లవోద్యమ అనుభవం

తేదీ 31 మే, భారత విప్లవోద్యమ చరిత్రలో మరో తీవ్ర విషాద దినంగా నమోదైంది. కామ్రేడ్‌ ఆనంద్‌ (కటకం సుదర్శన్‌, దూలాదా) అనారోగ్యంతో 69వ ఏట కన్ను మూశాడని జూన్‌ 5 నాడు వార్తలలో చూసి నిర్ఘాంతపోయాను. ‘‘మన దేశాంలో చైనా అనుభవాలు మక్కికిమక్కి లేదా కొన్ని సవరణలతో అన్వయిస్తే సరైన ఫలితాలు రావు. మన దేశ నిర్దిష్ట పరిస్థితులపై ఆధారపడి విప్లవోద్యమాన్ని నిర్వహించాలి. మూడు రంగాలలో ఎత్తుగడలు నూతనంగానే ఉండాలి. మనం ఈ నిర్బంధంలో నిర్మించే సంఘాలు ఒక కొత్త తరహాలో ఉండాలి. గతంలో మనకు లేని ప్రయోగాలు చేయాలి’’. అనే అభిప్రాయం ఆయనకు ఉండేది. తాత్కాలిక
స్పందన

నమ్మీకోలమ్మీ..

అమ్మీ ఓలమ్మీ ఉపాధి హామీ పనికెల్లొచ్చీసినావేటి. డబ్బులెప్పుడు పడతాయో నేదో తెలీదు కానీ ఎండతోటి గునపాం పట్టుకోనేక మట్టి కాడక తవ్వీ తవ్వీ ఇసుగెత్తిపోతే‌ నెత్తి మండిపోతున్నా తట్టల్తోని మోసుకెల్లి ముగ్గేసినట్లు గట్టు తీర్సి దిద్ది‌ ఒచ్చీసినాక ఇలా‌ గెంజి తాగి సేరబడ్డానే.  ఏటో ఈమజ్జెన ఒల్లలిసిపోయొచ్చినా సరే నిద్దర కంటి మీదకి రాక‌ టీవీ సూడ్డం అలవాటయిపోయినాదే. సీరియల్లు సూడ్డం మొదలెడితే రాతిరి పది వరకు ఆపనేం. గుంట్లకొండి పోసినామా లేదో కూడా తెలీడం లేదోలమ్మి. ఆలకి సెలవులిచ్చిన కానించి ఇంటికి జేరకుండా ఈదిలో ఆటల్తోనే కాలం గడిపేత్తున్నారే. ఈ సెల్లులొకటి కదా? ఆల్నాయన ఈమజ్జెన కొన్న