ఆర్ధికం

అస్తవ్యస్తంగా భారత ఆర్థిక వ్యవస్థ

దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తున్నామని పదేపదే ప్రగల్భాలకు పోతోంది మోడీ ప్రభుత్వం. మోడీ మాటలకు క్షేత్రస్థాయి వాస్తవాలకు భిన్నంగా దేశంలో భారీగా నిరుద్యోగం పెరుగుతోంది. ద్రవ్యోల్బణం అదుపు తప్పింది. పిల్లలకు పోషకాహారం దొరకడం లేదు. ఫారెక్స్‌ నిల్వలు హరించుకుపోతున్నాయి. వాణిజ్య లోటు పెరిగిపోతోంది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపి) ఐదు మాసాల కనిష్టానికి పడిపోయింది. 2015-2023 మధ్యకాలంలో 18 లక్షల సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు (యంఎస్‌యంఇ) మూతపడి 24 లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. శ్రామిక శక్తి గణనీయంగా తగ్గింది. రుణభారం పెరిగిపోతోంది. విదేశీ నిధులు రావడం
సమకాలీనం

వాళ్లిద్దరి విడుదల గురించీ నినదించలేమా?

చిలకలూరిపేట బస్సు దహనం కేసు చాలా మందికి గుర్తుండే ఉంటుంది. 1993 మార్చి 8న జరిగిన ఆ సంఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ కేసులో సాతులూరి చలపతిరావు, గంటెల విజయవర్ధనరావులు అరెస్ట్ అయ్యారు. వారిద్దరూ గుంటూరు కోబాల్డ్ పేట కు చెందిన దళిత యువకులు. కేవలం ఆర్ధిక అవసరాల కోసం ఇతరత్రా డబ్బులు దొరకని అప్పు పుట్టని పరిస్థితుల్లో వారు దోపిడీ చేయాలనుకున్నారు. అలాంటి ఆలోచనలకు ఆ ఇద్దరూ నెట్టివేయబడడానికి కారణం ఖచ్చితంగా సమాజమే. ఈ విషయం కన్వీనియంట్ గా మర్చిపోతాంగానీ ... ఇదే అసలు సమస్యగా గుర్తించాల్సి ఉంటుంది. బస్సు దహనం జరిగిన సందర్భంగా 23
మీరీ పుస్తకం చదివారా ?

ఫాసిస్టు రుతువులో కవి హత్య

*అత్యంత దుర్భరమైన జైలు జీవితానుభవాల తాకిడిని ఒడిసిపట్టుకొని, తన జీవన దృక్పథపు తెరచాపతో దృఢంగా నిలబడేందుకు చేస్తున్న సాహస ప్రక్రియే ఈ కవిత్వం. వాస్తవికమైన ఉద్వేగాల, విశ్వాసాల, ఆగ్రహావేశాల, కన్నీటి దుఃఖాల కాల్పనిక ప్రపంచమంతా చుట్టి వచ్చి తిరిగి జైలు గది నేల మీది నుంచి కవిత్వాన్ని సమున్నతంగా ఎత్తిపట్టే ప్రక్రియ ఇది. కాల్పనిక రూపం ధరించే మానవ విశ్వాసానికి ఎంత శక్తి వస్తుందో ఈ కవిత్వంలో చూడవచ్చు. కవిత్వమంటే సరిగ్గా ఇదే. అలవిగాని ఒంటరితనాన్ని అనంత మానవ సంబంధాల్లోకి, అతి సున్నితమైన, ఆర్ద్రమైన అనుభూతుల్లోకి, మానవులకు మాత్రమే సాధ్యమయ్యే అనుభవాల్లోకి, అంతకుమించి భవిష్యదాశలోకి మళ్లించడంకంటే కవిత్వానికి అర్థం
సమకాలీనం

అవార్డును తిరస్కరించిన రచయిత్రి జసింతా కెర్కెట్

పాలస్తీనాకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధ బాధితులకు సంఘీభావంగా యునైటెడ్  ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (యూ‌ఎస్‌ఎఐ‌డి), రూమ్ టు రీడ్ ఇండియా ట్రస్ట్ సంయుక్తంగా ఇచ్చిన అవార్డును స్వీకరించడానికి ఆదివాసీ కార్యకర్త, రచయిత్రి జసింతా కెర్కట్ట నిరాకరించారు. ఆమె పుస్తకం, కవితల సంపుటి అయిన జిర్హుల్, చిల్డ్రన్స్ బుక్ క్రియేటర్స్ అవార్డులలో 'రూమ్ టు రీడ్ యంగ్ ఆథర్ అవార్డు'కి ఎంపికైంది. ఈ నిర్ణయంపై అవార్డు యిచ్చేవారు ఇంకా బహిరంగంగా స్పందించలేదు. బాలల సాహిత్య అవార్డుల 2వ ఎడిషన్ వేడుక అక్టోబర్ 7న జరుగుతుందని దాని వెబ్‌సైట్ పేర్కొంది. పిల్లల కోసం పుస్తకాలు ముఖ్యమైనవి కానీ పెద్దలు
సమకాలీనం

గెస్టపోలాంటిదే ఎన్ఐఎ

వర్సైల్స్ ఒడంబడిక* లోని అవమానకరమైన నిబంధనలు జర్మన్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసాయి. ఈ ఒప్పందం దేశ సార్వభౌమాధికారాన్ని, ఆర్థిక  స్వాతంత్య్రాన్ని  అంతం చేసింది. వారు విజేతల ముందు తలవంచవలసి వచ్చింది (ట్రిపుల్ అలయన్స్). వర్సైల్స్ ఒప్పందం ప్రకారం, జర్మనీ $33 బిలియన్ డాలర్ల యుద్ధ నష్టపరిహారం చెల్లించవలసి వచ్చింది; విలువైన విదేశీ వలసలను వదులుకుంది; ఫ్రాన్స్, పోలాండ్‌లకు తన స్థానిక భూములలో విలువైన భాగాలను అప్పగించింది. జర్మన్ సైన్యం గణనీయంగా తగ్గిపోయింది; జలాంతర్గాములు లేదా వైమానిక దళం నిషేధానికి గురయింది. "మేము జర్మన్ నిమ్మకాయను దాని విత్తనాలు కేకలు వేసే వరకు పిండి పిప్పి చేస్తాం!"1 అని ఒక
సమకాలీనం

మానేసర్‌ మారుతీ ప్లాంట్‌లో కార్మికుల నిరవధిక ధర్నా

ఆటోమొబైల్ కంపెనీ మారుతీకి చెందిన మనేసర్ ప్లాంట్‌లో కార్మికుల పోరాటంలో జరిగిన  హింసాత్మక ఘటనల తర్వాత 2012లో తొలగించబడిన కార్మికులు తమ ఉద్యోగాలను తిరిగి పొందాలని డిమాండ్ చేస్తూ మనేసర్ తహసీల్ కార్యాలయం వద్ద నిరవధిక ధర్నా ప్రారంభించారు. హర్యానాలోని మానేసర్‌లోని మారుతీ సుజుకీ ప్లాంట్‌లో 2012లో యాజమాన్యం తొలగించిన 100 మందికి పైగా కార్మికులు,  సుదీర్ఘమైన 12 సంవత్సరాల తర్వాత,  2024 సెప్టెంబర్ 18 నాడు తిరిగి తమను పనిలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫ్యాక్టరీ గేటు దగ్గర నిరవధిక ధర్నాకు కూర్చున్నారు. సత్యం ఆటో యూనియన్, లుమాక్స్ మజ్దూర్ యూనియన్, ఎఎస్‌ఐ యూనియన్, బెల్సోనియా ఆటో
మీరీ పుస్తకం చదివారా ?

కాలంఒడిలో కవిత్వ ఉద్యమం

ఉద్యమకారులు గొప్పగా మాట్లాడతారు, కారణం సామాన్య ప్రజాజీవితాలతో మమేకమై తమ జీవనసరళిని కొనసాగిస్తుంటారు. పేదలకోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికోసం, కార్మిక, కర్షక సమస్యల పరిష్కారం కోసం నిరంతరం వొక యుద్దమే చేస్తుంటారు. ఉద్యమకారులకు గొప్పజీవితాలేమీ ఉండవు. ఎక్కడైనా ఉంటారు. ఏదైనా తింటారు. ఉన్నా లేకున్నా ప్రజలకోసమే పరితపిస్తారు. ఈ క్రమంలో ప్రజాపోరాటాలు చేసే ఓ కమూనిస్టుపార్టీ కార్యకర్త, నాయకుడు పోరాటాలు చేయడం వొక కోణమైతే, మరో కోణంలో మనసుచేసిన సంఘర్షణను, మనసుకు కల్గిన బాధను మదిలో పురుడుబోసుకున్న చైతన్యాక్షరాలను కవిత్వంగా రాయడం అరుదుగా కనబడుతుంది. ఈ కవి చేస్తున్నదీ అదే. ప్రసిద్ద రష్యన్‌ కవి మాయాకోవ్‌స్కీ చెప్పిన
సమకాలీనం

జంషెడ్పూర్ పౌరులు వర్సెస్ టాటా కంపెనీ

జార్ఖండ్ ప్రభుత్వం జంషెడ్‌పూర్‌ను పారిశ్రామిక పట్టణంగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ సౌరభ్ విష్ణు, జంషెడ్‌పూర్‌కు చెందిన 50 మందికి పైగా పౌరులు రాష్ట్ర హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. జంషెడ్‌పూర్ నగరాన్ని పారిశ్రామిక పట్టణంగా మార్చిన తర్వాత, నగరంలోని చాలా మంది పౌరుల హక్కులు చాలా పరిమితం అవుతాయి; టాటా కంపెనీ హక్కులు చాలా ఎక్కువైపోతాయి. జార్ఖండ్ ప్రభుత్వం 2023 డిసెంబర్ 23న నగరాన్ని పారిశ్రామిక పట్టణంగా మార్చేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ 13న, జంషెడ్‌పూర్‌ను పారిశ్రామిక పట్టణంగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిల్‌ను గౌరవ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సుజిత్ నారాయణ్ ప్రసాద్, గౌరవనీయులైన జస్టిస్ అరుణ్
మీరీ పుస్తకం చదివారా ?

దళితులంటే అంత చులకనా..?

ఆర్‌యస్‌యస్‌ నిజస్వరూపాన్ని బయటపెట్టిన ఆత్మకథ ఇటీవల విస్తృతంగా చర్చజరుగుతున్న పుస్తకం ‘నేనెందుకు హిందువును కాకుండా పోయాను?’ అని రాజస్థాన్‌కు చెందిన భన్వర్‌ మేఘ్వంశీ ఆత్మకథ రాశారు. ఆ పుస్తకం ముఖచిత్రంలోనే ఆర్‌యస్‌యస్‌ సావాసం పట్టిన ఒక దళితుని ఆత్మకథ అని రాశారు. హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ఈ పుస్తకాన్ని ప్రచురించడంలో చాలా సాహసం చేసిందనే చెప్పాలి. ఈ పుస్తకాన్ని ప్రసిద్ధ అనువాద రచయిత కె.సత్యరంజన్‌ చాలా సహజంగా తెలుగులోనే ఈ పుస్తకం వచ్చిందా అన్నంత గొప్పగా అనువాదం చేశారు. ఈ పుస్తకంలోతుల్లోకి వెళ్ళి ఆర్‌యస్‌యస్‌ ఒక అబద్దాల పుట్టఅని, దేశప్రజల్ని ఎలా మాయచేస్తుందో , కాదు కాదు ఎలా
లోచూపు

సాహిత్య విమర్శకు కొత్త పునాదులు

విరసం మిత్రుడు పాణి తో చేపట్టిన సంభాషణను 'కొలిమి'  "ఫాసిజం-విప్లవోద్యమం- సాహిత్య విమర్శ" అనే పుస్తకంగా జనవరి 2024 లో ప్రచురించింది. పుస్తకం శీర్షికలో సాహిత్య విమర్శ అనే పేరుంది గానీ ఇందులో ఎటువంటి సాహిత్య వాచక ప్రస్తావనలు లేవు. దేని గురించి అయినా రొటీన్ గా ఆలోచించే సంప్రదాయ సాహిత్యకారులు, సాహిత్య విమర్శకులు ఎవరైనా దీనిని చదివితే చాలా నిరాశ పడిపోతారు. ఇది సాహిత్య విమర్శ కానే కాదని, ఫక్తు 'రాజకీయ విమర్శ' అని పెదవి విరవొచ్చు. ఇంకా కొందరైతే 'మావోయిస్టు విప్లవ విమర్శ' అని కూడా కొట్టి పారేయవచ్చు. కానీ నిరంతరం మారుతున్న సమాజాన్ని అర్థం