సమకాలీనం

కొండల కోసం పోరాడిన మహిళా కార్యకర్తకు బెయిలు నిరాకరణ

ఒడిశాలోని రాయగడ, కలహండి జిల్లాలలో ఉన్న, తరచుగా తిజిమాలిగా పిలిచే సిజిమాలి అనే ప్రశాంతమైన గ్రామంలో, ప్రతిపాదిత మైనింగ్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా రెండేళ్లుగా ప్రతిఘటనా ఉద్యమం జరుగుతోంది. సిజిమాలి అనేది భారతదేశంలోని ఒడిశా రాష్ట్రంలో ఉన్న ఒక కొండ శ్రేణి. బాక్సైట్ నిల్వలు, స్థానిక సముదాయాల పవిత్రస్థల ప్రాముఖ్యత, జీవవైవిధ్యాల కోసం ప్రసిద్ధి చెందింది. 311 మిలియన్ టన్నుల బాక్సైట్ నిల్వ ఉన్నదని అంచనా వేసిన 1,549.022 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న సిజిమాలి బాక్సైట్ బ్లాక్‌కు 2023లో మైనింగ్ దిగ్గజం వేదాంత లిమిటెడ్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ (అభిప్రాయ పత్రం) ను తీసుకున్నది. అయితే, సెప్టెంబర్ నెల ప్రారంభంలో,
ఆర్ధికం

మందగిస్తున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ

మాంద్యం అంటే ఆర్థిక కార్యకలాపాలలో గణనీయమైన, విస్తృతమైన, సుదీర్ఘమైన తిరోగమనం, దీనిలో స్థూల దేశీయోత్పత్తి(జిడిపి)తో పాటు ఉద్యోగాల సంఖ్య, పారిశ్రామిక ఉత్పత్తి, అమ్మకాల వంటివి తగ్గుతాయి. సాధారణంగా, వరుసగా రెండు త్రైమాసికాల పాటు జిడిపిలో సంకోచం ఉంటే దాన్ని మాంద్యం అంటారు, అయితే దీనిని అమెరికాలో ''అధికారిక మాంద్యం స్కోర్‌ కీపర్‌'' అయిన నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ ఎకనామిక్‌ రీసెర్చ్‌ (ఎన్‌బిఇఆర్‌) నిర్వచిస్తుంది. మాంద్యం యొక్క ముఖ్య లక్షణాలు 1) ఆర్థిక వ్యవస్థలో మొత్తం పనితీరు తగ్గుతుంది. 2) ఉద్యోగాల సంఖ్య తగ్గి, నిరుద్యోగిత పెరుగుతుంది. 3) కంపెనీలు సరుకులను ఉత్పత్తి చేయడాన్ని తగ్గిస్తాయి. 4) ఈ ప్రభావం
మీరీ పుస్తకం చదివారా ?

ఈ కథలనెందుకు చదవాలి..?

కథ అనేది మొదట్లో కుతూహలాన్నీ, చివర ఆలోచనల్నీ కలిగించాలి. మధ్యలో చెప్పేది రక్తి కట్టిస్తూ చెప్పుకుపోవాలి.  - ఆరుద్ర ఆధునిక కథపుట్టుకకు వందేళ్ళకుపైగా చరిత్ర ఉన్నప్పటికీ గత నాలుగుదశాబ్దాల కథాప్రయాణంలో ‘కథ’ విస్తృతమైంది. కథాసాహిత్యం ఏ సాహిత్య ప్రయోజనాలకోసం ఆవిర్భవించిందో ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు కొత్తతరం కథకులు ముందుకొస్తున్నారు. వైవిధ్యమైన కథావస్తువుల్ని కథాసాహిత్యానికి పరిచయం చేస్తున్నారు. ఆధునిక కథ ఆవిర్భావం సమాజాన్ని సంస్కరించే ఉద్దేశ్యంతో కథావస్తువులు వచ్చాయి. ఇప్పుడలా కాదు  వొక ఘటననూ, వొక జాతి సంస్కృతిని దాని తాలూకూ విలువల్ని, లేదా వివక్షల్ని, వర్తమాన ఆధునిక సమాజం ఎదుర్కొంటున్ని నైతికమానవతావిలువల పతనాన్ని, నాగరిక సమాజపు పోకడల్ని కథలుగా రాయడం
కథనం

విప్లవ  రచయిత , పాత్రికేయుడు, బహుముఖ అనుభవ సంపన్నుడు  గౌతందా

మధ్య రీజియన్ లోని గాలికొండ నుండి తిప్పాగఢ్ వరకు, దక్షిణ బస్తర్, పశ్చిం బస్తర్, మాడ్ కొండలను, సుర్జాగడ్, దంకోడివాహి అడవులను దాటుకొని తిప్పాగఢ్ వరకు ఆరు పదులు దాటిన ఆ విప్లవకారుడు తన బాధ్యతల నిర్వహణలో భాగంగా, అలుపెరుగక గెరిల్లాలతో కాలు కలిపేవాడు. ఆగినచోట యువ గెరిల్లాలంతా పొలోమంటూ తన చుట్టూ చేరితే వారి ముందు ప్రపంచాన్ని ఆవిష్కరించేవాడు. తన అపార అనుభవాల యవనికను పరిచేవాడు. ఒక భుజానికి ఏకే తుపాకి, మరో భుజానికి కుర్చీ, నడుంకు పోచ్, వీపున కిట్టు, కిట్లో అనేక పుస్తకాలు, జబ్బ సంచిలో కంప్యూటర్, మొబైల్ ఫోన్ తో కొద్దిగా వంగి
సమకాలీనం

సొంత భూమిపై హక్కులు కోరుతున్న జేను కురుబలు

పులులకు దారి కల్పించడానికి నాగరహొళె నుండి బలవంతంగా వెళ్లగొట్టిన దశాబ్దాల తర్వాత జేను కురుబలు తమ పూర్వీకుల స్థలాన్ని తిరిగి ఆక్రమించుకున్నారు. దక్షిణ భారతదేశంలోని అడవులలో వారాంతంలో వచ్చే పర్యాటకులకు “మీరు మా ఇంట్లోకి ప్రవేశిస్తున్నారు” అనే తమ సందేశాన్ని అందించడానికి డజన్ల కొద్దీ జేనుకురుబ ప్రజలు నాగరహొళె టైగర్ రిజర్వ్ ప్రవేశద్వారం దగ్గర వర్షం కురుస్తున్నా గొడుగులు పట్టుకుని నిలబడి ఉన్నారు: నాగరహొళె పులులను చూస్తారని పర్యాటకులకు హామీ ఇచ్చే సఫారీ పర్యటనలను ఆపడం వారి లక్ష్యం;  అటవీ సంరక్షణ పేరుతో తమను తరిమికొట్టిన పూర్వీకుల స్థలాన్ని వ్యాపారానికి ఉపయోగించారని జేనుకురుబలు అంటున్నారు. కర్ణాటక అటవీశాఖ, కర్ణాటక
ఆర్ధికం

అసమానతలు పెంచుతున్నఉపాధి రహిత వృద్ధి

తొమ్మిదేళ్లుగా ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి పాలనలో రాజ్యాంగం అమలు కావడం లేదు.  సమానత్వాన్ని, లౌకిక  తత్వాన్ని తృణీకరించే మనువాద భావజాల పాలన కొనసాగుతోంది. ఈ కాలంలో ఆర్థిక అసమానతలు, సంపద కేంద్రీకరణ విపరీతంగా పెరిగింది. సామాజిక, ఆర్థిక సమానత్వ ఆదర్శం బిజెపి- కార్పొరేట్‌ ఫాసిస్టు పెట్టుబడిదారీ విధానం వల్ల బీటలు బారింది. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. సామ్రాజ్యవాదుల కనుసన్నల్లో ఉంటూ దేశ సహజ వనరులను స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు దారాదత్తం చేస్తూ మన దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టింది. సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య స్ఫూర్తిని, ప్రభుత్వరంగ అభివృద్ధి, పౌరస్వేచ్ఛ, మానవ హక్కులను తుడిచివేసే ఫాసిస్టు పాలన కొనసాగుతోంది. ఫలితంగా
మీరీ పుస్తకం చదివారా ?

సాహిత్య మూలాలను పట్టిచూపిన విమర్శ

సాహిత్యవిమర్శ జ్ఞానవిశ్లేషణ చేసే ప్రక్రియ      -రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి వర్తమానసాహిత్యం విమర్శను కోరుకోవడం లేదు. సద్విమర్శను మాత్రమే కోరుకుంటున్నది. అందుకే తెలుగుసాహిత్యం విమర్శలో బలహీనమైందని బలంగా నమ్ముతున్నాను. ఏ పుస్తకమొచ్చినా అందులో వస్తువైఫల్యం, శిల్పవైఫల్యం లేదా ఇతర నిర్మాణపద్దతులు లోపించినపుడు విమర్శకులు ఇలా ఉంటే బాగుండేదని చెబితే సదరు కవులు ఓర్చుకునే స్థితిలోలేరు. ఇది తిరోగమనదిశకు సంకేతం. మన ద్రావిడ భాషలైన తమిళ,కన్నడ, మళయాళ కవులు విమర్శకు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. తమ పుస్తకం గూర్చి పొగడటం కంటే నాల్గు విమర్శనాత్మక సూచనలు చేస్తారని ఆశతో ఎదురు చూస్తారు. ఇలాంటి వైఖరి తెలుగు కవులలోనూ, వారు సృష్టించే సాహిత్యంలోనూ వృద్ది చెందాలి.
ఆర్ధికం

భారత్‌లో నిప్పుల కొలిమిలా నిరుద్యోగం

భారతదేశ ఆర్థిక రంగాన్ని సవాలు చేస్తున్న ఒక క్లిష్టమైన సమస్య నిరుద్యోగం. అత్యంత కీలకమైన సూచికలలో ఒకటి. ఇది దేశంలోని నిరుద్యోగిత రేటు ఉద్యోగాల లభ్యతను మాత్రమే కాకుండా వివిధ రంగాలలో(వ్యవసాయ, పారిశ్రామిక, సేవా) శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుంది. అధిక జనాభా కలిగిన వ్యవసాయక దేశాలలో ఒకటిగా, విభిన్న శ్రామిక శక్తి కలిగిన దేశంగా, నిరుద్యోగ రేట్‌ ఆర్థిక వృద్ధి, దేశ అభివృద్ధిపై విస్తృతమైన ప్రభావాన్ని చూపుతోంది. పిరియాడికల్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (పిఎల్‌ఎఫ్‌ఎస్‌) నివేదిక ప్రకారం భారతదేశ నిరుద్యోగం రేటు ఏప్రిల్‌లో 5.1 శాతం ఉండగా జూన్‌ 2025 నాటికి 5.6 శాతానికి పెరిగింది. మన
ఆర్ధికం

మాంద్యంలోకి ప్రపంచ దేశాలు

            మరోసారి ఆర్థిక సంక్షోభం రాబోతున్నదా! ప్రపంచ దేశాలు మాంద్యం బారిన పడబోతున్నవా! రష్యా-యుక్రెయిన్‌ దేశాల మధ్య యుద్ధంతో ఇప్పడికే భారీగా నష్టబోయిన ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థకు మళ్లీ చిల్లులు పడబోతున్నాయా! ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తున్నది. గత ఆరు మాసాలుగా ప్రపంచ దేశాల సెంట్రల్‌ బ్యాంకులు క్రమంగా ఒక్కొక్కటి వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకున్నదన్న సాకును చూపెడుతూ అన్ని దేశాల బ్యాంకులు వడ్డీ రేట్లను ఒక్క శాతం పైనే పెంచేశాయి. ఈ నిర్ణయాలతో మదుపరుల్లో ఆందోళన తీవ్ర స్థాయికి చేరుకున్నది. ప్రపంచ వ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. కరోనా సంక్షోభం
సమకాలీనం

ఇది  నైపుణ్య శిక్షణా? నిర్బంధమా? లొంగిపోయిన మావోయిస్టుల పేరుతో హింస

ఫోటోలో హోంమంత్రి అమిత్ షా మెరిసిపోతుంటే, ఆయనకు కొన్ని వరుసల వెనుక విషాద వదనంతో ప్రసన్న నిలబడి ఉన్నాడు. జూన్ 23న షా తన X హ్యాండిల్‌లో ఈ గ్రూప్ ఫోటోను పోస్ట్ చేసాడు. “నక్సలైట్లు ఎవరి చేతుల్లో తుపాకులు పెట్టారో, ఆ పిల్లలు తమ  భవిష్యత్తును ఉజ్వలంగా మార్చుకోవడానికి పుస్తకాలు ఇస్తున్నారు.” అని కింద రాసి ఉన్నది. కానీ ప్రసన్న చిన్నపిల్లవాడు కాదు. అతను యాభై ఏళ్ల వయసున్న ఆదివాసి. బీజాపూర్ జిల్లాలోని ఒక గ్రామానికి చెందినవాడు - అతని భద్రత కోసం అసలు పేరును, ఊరును, గుర్తింపును చెప్పడం లేదు- జిల్లా ప్రధాన కార్యాలయంలోని ఒక