సాహిత్యం వ్యాసాలు

మనిషితనంపై విశ్వాసంతో

(ఇటీవల విడుదలైన బాల సుధాకర్ మౌళి కథా సంపుటికి రాసిన ముందుమాట) కవిగా ప్రసిద్ధుడైన బాల సుధాకర్  మౌళి యిప్పుడు కథకుడిగా మన ముందుకు వస్తున్నాడు. కవిత్వం కథ ఈ రెండింటికి పోటీ పెట్టి యెక్కువ తక్కువల్ని  అంచనా వేయడం తప్పే గాని రెండు సృజనాత్మక వ్యాసంగాల్నీ ఒకే  రచయిత నిర్వహిస్తున్నప్పుడు ఆ వ్యక్తికున్న కవిత్వ అభివ్యక్తి కథనం నైపుణ్యం వొకదాన్ని మరొకటి యెలా ప్రభావితం చేసుకుంటాయి అన్న అధ్యయనం ఆసక్తి గొలుపుతుంది, విమర్శలో కొత్త ఆలోచనలకు సంవిధానానికి దారులు వేస్తుంది.  కథలో కవిత్వ చ్ఛాయలు కథకు వన్నె తెస్తాయి. అలాగే కవిత్వంలో వినిపించే అనుభూతి కథను తాకితే
వ్యాసాలు

ఆపరేషన్ కగార్‌ను ఆపాలి; వెంటనే కాల్పుల విరమణను ప్రకటించాలి

2025 ఏప్రిల్ 9 భారత రాజ్యమూ, తమ పార్టీ మధ్య శాంతి చర్చలు జరగాలని కోరుతూ సిపిఐ (మావోయిస్ట్) పార్టీ కేంద్ర కమిటీ ఒక ప్రకటన విడుదల చేసిందని 2025 ఏప్రిల్ 3 నాడు ది హిందూ వార్తా పత్రిక ప్రచురించింది. మావోయిస్టులు ముందుగా చొరవ తీసుకుని శాంతి చర్చలకు పిలుపునిచ్చినందుకు విప్లవకారులుగా, ప్రజానుకూల, ప్రజాస్వామిక దృక్పథం కలిగిన వ్యక్తులుగా మనం అభినందించాలి. శాంతి చర్చలకు పిలుపునిచ్చింది ఆపరేషన్ కగార్ కింద “దహనం చేసిన భూమి విధానాన్ని” అనుసరించాలని ఎంచుకున్న భారత రాజ్యం కాదు, "యుద్ధం చేసే" పార్టీ అనే విషయాన్ని ఇది మన దృష్టికి తీసుకువస్తుంది. (1.
వ్యాసాలు

జీవించే హక్కు కోసం శాంతి చర్చలు

మధ్యభారత ప్రాంతం ఆదివాసీల హననానికి కేంద్రంగా మారేలా భారత ప్రభుత్వం చత్తీస్ఘడ్ ప్రభుత్వాలు లక్షల సంఖ్యలో సాయుధ బలగాలను దింపి ఆదివాసులను ఆపరేషన్ కగార్ పేరుతో వేటాడి చంపేస్తున్నారు. ఆపరేషన్ కగార్ 15 నెలలుగా మధ్యభారతంలో నిరంతరాయంగా కొనసాగుతూ వందల సంఖ్యలో ఆదివాసీల ప్రాణాల్ని హరిస్తున్నారు. మావోయిస్టు పార్టీ భారత ప్రభుత్వం మావోయిస్టు పార్టీకి మధ్య యుద్ధం సమ ఉజ్జీవుల మధ్య యుద్ధం కాకపోయినప్పటికి దశాబ్దాలుగా త్యాగాలతోనే విప్లవోద్యమాన్ని విస్తరిస్తున్న నేపథ్యంలో దేశంలోని అశేష ప్రజానీకం మద్దతు సానుభూతి కూడాగట్టడంలో విజయం సాధించారు. అది విద్యార్థి, యువజన, మహిళా, కార్మిక, రైతాంగ శ్రేణుల నుంచి బలం వచ్చి చేకూరింది.
వ్యాసాలు

 స్త్రీల కవిత్వంలో ప్రపంచ దర్శనం

(ఇటీవల విడుదలైన  ‘ప్రపంచ స్త్రీల కవిత్వం – స్వేచ్ఛానువాదం: దియా విఘ్నేష్’ పుస్తకానికి రాసిన ముందు మాట-వసంత మేఘం టీం ) ప్రపంచం నాలుగు మూలల నుండి ఒకేసారి అరవై మంది కవయిత్రులతో సంభాషణ ఎలా ఉంటుంది? ఈ ఆలోచన ఎలా వచ్చిందో కాని దానికదే ఎంత అపురూపమైనది కదా అనిపించింది ఈ పుస్తకం గురించి విన్న వెంటనే. వైవిధ్యభరితమైన సాంస్కృతిక వ్యక్తీకరణలు, ప్రాకృతిక విశేషాలు, చారిత్రక నేపథ్యాలు ఒక్క చోటికి రావడం దానంతటదే ఒక ప్రత్యేకత. అయితే ఈ కవిత్వమంతా సౌందర్యారాధన కాదు. ఒట్టి నగిషీలు చెక్కిన కళ కాదు. అలా అయితే రంగుల పుష్పగుచ్ఛంలా మన
వ్యాసాలు

సమాధి వెనుక దాగిన చరిత్ర

ఔరాంగజేబు చిన్ననాటి తరగతి గది చరిత్ర పాఠంలో విన్నపేరు. 1705 చనిపోయిన వ్యక్తి తదనంతర కాలంలో జీవిస్తున్నాడు. మరణాంతర , ఒకనాటి  పాలకుని గురించి అంచనా ఏమిటి? నిరంకుశ, దయామయుడైన పాలకుడా , లేదా, అనేది ఇవాల చర్చ ఎందుకు?  చరిత్రలో అనేక పరిశీలనలు సహజం. ఔరాంగజేబు మరణించి మూడు వందలఏళ్ల కాలం గడిచింది. 'ఒక రాణి ప్రేమ పురాణం ఇది కాదోయ్ చరిత్ర' అన్నాడు శ్రీశ్రీ.1705 కి ముందు ఏమి జరిగింది. ఔరంగ జేబు  ఇవాళ్టి భారతదేశానికి పాలకుడు కాదు. అతని రాజ్యవిస్తరణకు పరిమితి వుంది. హిందూ దేవాలయాల నేలమట్టం చేయడం, హిందుత్వ సంస్కృతిని అణిచి వేయడం
వ్యాసాలు

చీకట్లో మిణుగురులు

(డిసెంబర్లో విరసం ప్రచురించిన మిడ్కో కథల సంపుటి *మెట్లమీద *కు  రాసిన ముందుమాట ఇది . అమర యోధ రేణుక స్మృతిలో పాఠకుల కోసం .. వసంతమేఘం టీం ) మిడ్కో అంటే గోండు భాషలో మిణుగురు పురుగుఅట. అంటే చీకట్లో మెరిసే ఒక ప్రాణి. ఒక నక్షత్రం. ఒక ప్రాణి తాను చీకటిలో మెరిసి వెలుగుచూపే ఒక ప్రక•తి నిర్మాణం విచిత్రమైనది. అద్భుతమైనది. గాలిలో అడవిలో ముఖ్యంగా చీకట్లో చూసినపుడు కాని దీని విశిష్టత అర్థంకాదు. అట్లే ఒక ఆరిద్ర పురుగుంది. మ•గశిర కార్తె రాగానే పొలాల్లో బిలబిల వచ్చే కుంకుమపువ్వు వంటి ఒక పురుగు. నిజానికి
వ్యాసాలు

విప్లవాచరణ కథలు

(డిసెంబర్లో విరసం ప్రచురించిన మిడ్కో కథల సంపుటి *మెట్లమీద *కు రాసిన ముందుమాట ఇది . అమర యోధ రేణుక స్మృతిలో పాఠకుల కోసం .. వసంతమేఘం టీం ) ముందుమాట కోసం పోస్టులో వచ్చిన పద్దెనిమిది కథలు గత అయిదు నెలలుగా చదువుతూ ఆలోచిస్తున్నాను. ఈ కథలు చదువుతూ ఉంటే మేము ఇదివరకు యువ రచయితలకు నిర్వహించిన పాఠశాలలు ముఖ్యంగా 1997 వేసవికాలంలో అరకులోయలో శ్రీ కాళీపట్నం రామారావు, ఆర్.యస్. రావుగారి లాంటివారు విచ్చేసి పదిరోజులు నడిపిన పాఠశాల గుర్తొచ్చింది. రాష్ట్రం మొత్తం నుండి వచ్చిన యువ రచయితలు, రచయిత్రులు (అర్ధ రాత్రుల దాకా చదివిన కథలు)
వ్యాసాలు

బడ్జెట్‌ 2025-26 కష్టజీవుల కడుపు కొట్టి కార్పొరేట్లకు

దేశ ఆర్ధిక పరిస్థితిని మెరుగు పరిచేందుకు, ప్రజల కొనుగోలు శక్తిని పెంచి తద్వారా డిమాండ్‌ పెరగడం మార్కెట్‌ ను ఉద్దీపన చేసెందుకై, తద్వారా కొత్త పరిశ్రమలకు అవకాశం, కొత్త ఉపాధి కల్పించడం లక్ష్యం - ఇదీ క్లుప్తంగా కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి శ్రీమతి సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పిన మాటలు. దానికి ఆమె ఎంచుకున్న మార్గం ఉన్నత మధ్యతరగతి వేతన జీవులకు పన్ను రాయితీ. ఉన్నత మధ్యతరగతిని దేశాభివృద్ధికి చోదకశక్తి గా ఆమె పొగడ్తల వర్షం కురిపించారు.   దేశాధ్యక్షులు శ్రీమతి ముర్మూ గారు  అదే పాటను పాడడం గమనార్హం.  మొత్తం కార్మిక శక్తిలో ఒక వంతుకూడా
వ్యాసాలు

ఛత్తీస్‌గఢ్‌లో ఆపరేషన్ కగార్‌

ఛత్తీస్‌గఢ్‌లో భారత రాజ్యం చేపట్టిన జాతి విధ్వంసక సైనిక ప్రాజెక్టు ఆపరేషన్ కగార్‌లో ఫిబ్రవరి 9నాడు 31 మంది మావోయిస్టులను హత్యచేసింది. సీపీఐ (మావోయిస్ట్) పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆజాద్, జర్నలిస్ట్ హేమచంద్ర పాండేల చట్టాతీత హత్యలను ఖండిస్తూ, సుప్రీంకోర్టు, "రిపబ్లిక్ తన సొంత పిల్లలను తానే చంపుకోవడానికి మేం అనుమతించలేం" అని అన్నది. తన 76వ వార్షికోత్సవ సంవత్సరంలో (2025), ‘మావోయిస్టులపై యుద్ధం’ పేరుతో  మావోయిస్టులని చెబుతూ భారత గణతంత్ర రాజ్యం ఛత్తీస్‌గఢ్‌లో ఇప్పటివరకు 81 మంది పౌరులను చంపింది. ఫిబ్రవరి 1న, బీజాపూర్‌లో ఎనిమిది మంది ఆదివాసీ గ్రామస్తులను మావోయిస్టులుగా ముద్రవేసి చంపారు. రెండు రోజుల క్రితమే
వ్యాసాలు

Windows to the Revolution

‘Viyyukka’, a word in Gondi language meaning morning star, is an anthology of stories written in Telugu by Maoist women revolutionaries over the past four decades. Some of these women were martyred in the cause of the revolution, while some are still continuing in it. Some were part of the movement for some years and were then either arrested or had come out of it due to various reasons. This